breaking news
Fauzi Movie
-
హీరోయిన్ కోసం ప్రభాస్ స్పెషల్ ట్రీట్
డార్లింగ్ ప్రభాస్ భోజనప్రియుడు. ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. తను తినడమే కాదు చుట్టూ ఉన్నవారికి సైతం ఫుడ్డు పెట్టి చంపేస్తాడు. ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే ఇంటి నుంచి తెప్పించి మరీ తోటి నటీనటులకు, చిత్రయూనిట్కు భోజనం తినిపిస్తాడు. కొన్నిసార్లు అందరి కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాడు. అలా ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా చెన్నై నుంచి ముంబైకి భోజనం తెప్పించాడు.హీరోయిన్ కోసం స్పెషల్ ఫుడ్తాజాగా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వికి ఇలాగే ఫుడ్ ట్రీట్ ఇచ్చాడు. స్టార్టర్ దగ్గరినుంచి బిర్యానీ, స్వీట్స్ వరకు.. అన్నింటినీ పార్శిల్ చేసి పంపించాడు. వాటిన్నింటినీ టేబుల్ ముందు పెట్టుకున్న ఇమాన్వి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇంత రుచికరమైన భోజనం పంపింనందుకు ప్రభాస్కు కృతజ్ఞతలు చెప్పింది.సినిమాఫౌజీ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 దసరాకి విడుదల కానుంది.చదవండి: బాఫ్టా అవార్డులు.. తొలిసారి భారత్ మూవీకి అవార్డ్ -
ఫౌజి షూటింగ్లో..
వరుస పాన్ ఇండియన్ ఫిల్మ్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఫౌజి’ ఒకటి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ సీన్స్ తెరకెక్కిస్తుండగా అదుపు తప్పి ప్రభాస్ కింద పడటంతో చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయట. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘‘ఏదైనా సినిమా షూటింగ్స్లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమే. ప్రభాస్కి పెద్ద గాయాలు కాలేదు.ఆయన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడింది. అది కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. అభిమానులు కంగారుపడొద్దు’’ అంటూ పేర్కొనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజి’ విడుదల కానుంది. కాగా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘స్పిరిట్, కల్కి 2898 ఏడీ 2’ వంటి సినిమాలున్నాయి. -
'ప్రభాస్'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్
ఫౌజీ మూవీ షూటింగ్లో హీరో ప్రభాస్ గాయపడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ ప్రకటించింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్లో ప్రమాదం జరిగినట్లు సోషల్మీడియాతో పాటు ప్రధాన వెబ్సైట్స్లలో కూడా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే మన డార్లింగ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సినిమా సెట్స్ లో ప్రభాస్కు ఎలాంటి గాయం కాలేదని చెప్పింది. ఈరోజు కూడా షూటింగ్లో పాల్గొన్నారని తెలిపింది. మూవీ సెట్స్లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమని తన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడినట్లు పేర్కొంది. ఆ గీటు కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చింది. అభిమానులు ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని ప్రభాస్ టీమ్ వెల్లడించింది.‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
'ఫౌజీ' షూటింగ్లో ప్రమాదం.. ప్రభాస్కు గాయం!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ షూటింగ్లో గాయపడినట్లు తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూవీలో భాగంగా కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కిందపడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన చేతికి గాయమైందని సోషల్మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే, అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదని గాయం చిన్నదేనని తెలుపుతున్నారు. ఈ విషయంపై సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూస్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రభాస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు హను రాఘవపూడి. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలో విడుదల కానుంది. -
డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దసరాకి ఫౌజీ..!
-
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలివే.. ‘స్పిరిట్’ ఏ స్థానంలో ఉందంటే..
సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ).. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా మోస్ట్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా తీసిన ఈ లిస్ట్ను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్లో టాప్ పొజిషన్లో షారుఖ్ఖాన్ కింగ్ సినిమా ఉండగా.. ప్రభాస్-సందీప్రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే ప్రభాస్ మరో చిత్రం పౌజీ పదో స్టానంలో ఉంది. ఇక రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది 13వ స్థానం దక్కించుకుంది. మొత్తంగా టాప్ 20లో 5 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. ఐఎండీబీ ప్రకటించిన టాప్ 20 సినిమాలివే...1) కింగ్ (హిందీ) :‘పఠాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రమింది. ఇందులో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్త్ననారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు.2) రామాయణ (హిందీ)రణ్బీర్ ప్రధాన పాత్రలో నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ‘రామాయణ’ రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.2027లో రెండో భాగం విడుదల కానుంది. ఇందులో రణ్బీర్ రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రని పోషించింది. కన్నడ స్టార్ హీరో యశ్.. రావణుడిగా కనిపించబోతున్నాడు.3) జననాయగన్(తమిళ్)తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.4) స్పిరిట్(తెలుగు)ప్రభాస్ హీరోగా సందీప్రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటించగా,.బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.5) టాక్సిక్(కన్నడ)యశ్ హీరోగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.6) బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్సల్మాన్ఖాన్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. ఇందులో సల్మాన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.7) ఆల్ఫా(హిందీ)అలియా భట్. శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. యశ్రాజ్ ఫిల్మ్స్లో రాబోతున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు.8) దురంధర్ 2 (హిందీ)బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.9) బోర్డర్ 2 (హిందీ)1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న చిత్రమిది. ఈ సీక్వెల్లో సన్నీ డియోల్తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.10) ఫౌజీహను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతన్న చిత్రమిది. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.11) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) (తమిళ్) : ప్రదీప్ రంగనాథన్(హీరో)12) ది ప్యారడైజ్(తెలుగు) : నాని13) పెద్ది(తెలుగు): రామ్ చరణ్14) డ్రాగన్(తెలుగు): ఎన్టీఆర్15) లవ్ అండ్ వార్(హిందీ): రన్బీర్ కపూర్16) బూత్ బంగ్లా(హిందీ): అక్షయ్ కుమార్17) బెంజ్(తమిళ్): లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి రాబోతున్న చిత్రమిది.18) శక్తి శాలిని(హిందీ): హారర్-కామెడీ ఫ్రాంచైజీ19) ‘పేట్రియాట్ (మలయాళం) - మమ్మూట్టీ, మోహన్లాల్20) ఓ రోమియో (హిందీ): షాహిద్ కపూర్ -
డబుల్ ధమాకా
హీరో ప్రభాస్.. తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘బాహుబలి’ చిత్రం రెండు భాగాలుగా విడుదలైంది. అదేవిధంగా ‘సలార్, కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలకు కూడా రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫౌజి’ మూవీ కూడా టుపార్ట్స్గా ఆడియన్స్ ముందుకు రానుంది. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజి’లో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేశభక్తి అంశాలతో పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే...‘ఫౌజి’ రెండు భాగాలుగా విడుదలకానుంది. ఈ విషయాన్ని హను రాఘవపూడి ఇటీవల స్పష్టం చేశారు.‘‘ఫౌజి’ తొలి భాగంలో ప్రభాస్పాత్ర తాలూకు ప్రపంచాన్ని చూస్తారు. రెండో భాగంలో(ప్రీక్వెల్) ఆయనపాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర సమర యోధుల కథలను, నిజ జీవితంలో నాకు స్ఫూర్తినిచ్చిన వాస్తవ ఘటనలను ప్రీక్వెల్లో చూస్తారు’’ అన్నారు హను రాఘవపూడి. 2026 ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్. -
'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత ప్రభాస్ నుంచి వరస సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈయన చేసిన సలార్, ఫౌజీ చిత్రాల్లో తనకు అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాయని తెలుగు యంగ్ హీరో తిరువీరు చెబుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')'ప్రభాస్ 'సలార్' కాటేరమ్మ ఫైట్లో విలన్గా నేనే చేయాలి. కానీ డేట్స్ సమస్య కారణంగా అది మిస్ అయింది. అలానే 'ఫౌజీ'లోనూ మంచి ఆఫర్ వచ్చింది. కానీ వేరే సినిమాలు, లుక్ కంటిన్యూటీ కారణంగా వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తిరువీర్ చెప్పుకొచ్చాడు.టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో లీడ్ రోల్స్ చేశాడు. జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్గా ఆకట్టుకున్నాడు. త్వరలో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే మూవీతో రాబోతున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగానే మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాలు వల్ల ప్రభాస్ సలార్, ఫౌజీలో అవకాశాలు మిస్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?)


