-
ఇక అన్ని స్కూళ్లలో ‘ఫేషియల్ రికగ్నిషన్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలని భావిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు. కాగా, ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే, ఈ విధానాన్ని దాదాపు ఏడాదికిందటే ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకూ 40 శాతం స్కూళ్లలో కూడా అమలు కావడం లేదు. ఇంతకాలం ఎన్నికల విధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఉండటం వల్ల ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఇక నుంచి ఈ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తప్పుడు హాజరుకు చెక్ ఇప్పటి వరకూ ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు హాజరు తీసుకునే విధానం ఉండేది. ప్రతీ నెల చివరి తేదీలో తరగతుల వారీగా హెచ్ఎంలు విద్యార్థుల హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపేవాళ్లు. అయితే ఈ వివరాలకు విద్యార్థులకు అందించే భోజనం, దుస్తులు, పుస్తకాల లెక్కకు సరిపోవడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. అలాగే పాఠశాల నిర్వహణ నిధులను కూడా కచ్చితంగా లెక్కగట్టలేపోతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి 30 లోపు ఉన్న స్కూలుకు రూ. 5 వేలు, 31కి మించి ఉన్న స్కూలుకు రూ. 10 వేల చొప్పున నిర్వహణ నిధులు ఇస్తున్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల హాజరును తప్పుగా చూపించి, నిధులు ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్లోని చాలా స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును అసలు అమలు చేయడం లేదు. దీనికి అనేక రకాల సాంకేతిక కారణాలు చెబుతున్నారు. ముందు నెట్ ఇవ్వాలి –– పి.రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు విషయంలో అధికారులు సాంకేతిక ఇబ్బందులను పరిశీలించాలి. చాలా స్కూళ్లలో నెట్ సదుపాయం లేదు. ఈ హాజరు విధానం కోసం పక్క వాళ్ల నెట్ తీసుకోవడం రోజూ సాధ్యం కాదు. హెచ్ఎంల మొబైల్ నెట్ కొన్ని సార్లు పనిచేయడం లేదు. ఫేషియల్తో పాటు స్కూల్లో రికార్డు కోసం మ్యాన్యువల్గా హాజరు తీసుకోవడం కూడా బోధన సమయానికి ఇబ్బందే. మొదటి పీరియడ్లో చాలా సమయం హాజరుకే పోయే అవకాశం ఉంది. దీనిపై క్షేత్రస్థాయి సమస్యలు పరిశీలించాలి. నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలి. -
బయోమెట్రిక్ బదులు ఇక ‘ఫేషియల్’
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్’ విధానం స్థానంలో ‘ఫేషియల్ అథంటికేషన్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్లో వేలిముద్రల ఆధారంగా కాకుండా ముఖం ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా.. ముందుగా ఆయా పథకాల లబ్ధిదారుల అందరి నుంచి వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుని ఆధార్ నమోదు సమయం నాటి వేలిముద్రలతో పోల్చి ధృవీకరించుకుంటారు. అదే ఫేషియల్ ఆథంటికేషన్ విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని, అతడి ఆధార్లోని ముఖకవళికలతో పోల్చి ధృవీకరించుకుంటారు. ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసేవాళ్ల వేలిముద్రలు అరిగిపోతుండడంతో బయోమెట్రిక్ సమయంలో సమస్యలొస్తున్నాయి. బయోమెట్రిక్కు బదులు ఐరిష్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితో సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉదా.. పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతీనెలా దాదాపు రెండు లక్షల మందికి ఆధార్తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి వారి ఫొటోలు ముందుగా యాప్లో నమోదు చేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబ్ధిదారుని ఫొటోతో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. ఇందులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. దీంతో ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్వహణ ఖర్చుల్లోనూ ఆదా.. ఇక సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. అవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అదనంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగా, అది ఆధార్కు అనుసంధానమై లబ్ధిదారుని సమాచారంతో సరిపోల్చుకుంటుందన్నారు. కేంద్రం, యూఏడీ అనుమతి తప్పనిసరి ఈ రెండూ విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందలన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు ఆధార్ డేటా మొత్తం అనుసంధానమై ఉండే యూఏడీ విభాగం అనుమతి తప్పనిసరి. ఇక దేశంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుచేసే తొలి రాష్ట్రం మన ఏపీయే కావడం గమనార్హం. కనీసం 150 మందిపై పరిశీలన తర్వాతే.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఏడీ ఈ ఫేషియల్ అథంటికేషన్ విధానాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలుకు అనుమతి తెలపడంతో.. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో మొదటగా అమలుచేస్తున్నారు. ఐదు రోజులుగా ఉద్యోగుల హాజరును ఫేషియల్ అథంటికేషన్ విధానంలో అమలుచేస్తున్నారు. మొదట ఐదుగురు ఉద్యోగుల హాజరును పరిశీలిస్తున్నారు. తర్వాత కార్యాలయంలోని మొత్తం 150 మంది సిబ్బంది హాజరును పరిశీలించాక.. మంత్రిత్వ శాఖ, యూఏడీ విభాగం తుది ఆమోదం కోసం నివేదిక సమర్పిస్తారు. ఆ తర్వాతే అన్ని సంక్షేమ పథకాల అమలులో ఈ విధానం ప్రవేశపెట్టేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. -
చైనాపై భారత్ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..
సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు దిగుతోంది! లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లలో... చడీచప్పుడు లేకుండా బలగాలను మోహరించడం... రోడ్లు, వంతెనలు మాత్రమే కాదు.. రాత్రికి రాత్రి డజన్ల కొద్దీ నిర్మాణాలను కూడా కట్టేస్తూ ఇబ్బంది పెట్టేస్తోంది! ఈ నేపథ్యంలో రోజురోజుకూ క్లిష్టతరమవుతున్న సరిహద్దుల రక్షణకు... భారత ప్రభుత్వం కృత్రిమ మేధను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది!! వాస్తవాదీన రేఖకు ఆవల.. చీమ చిటుక్కుమన్నా గుర్తించేందుకు... అందుకు తగ్గట్టుగా ప్రమాదాన్ని అంచనా వేసేందుకూ మనుషుల్లా ఆలోచించే సాఫ్ట్వేర్లు 24 గంటలూ పనిచేయనున్నాయి!! సాక్షి, హైదరాబాద్: చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకవైపు సరిహద్దుల్లో రోడ్లు వంతెనలు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను పెంచుకుంటూనే... ఇంకోవైపు అత్యాధునిక టెక్నాలజీల సాయంతో శత్రువు ఆనుపానులు పసిగట్టే ప్రయత్నాలనూ వేగవంతం చేసింది. ఇటీవలి కాలంలో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో దేశం తూర్పు విభాగంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది. జంతువుల కదలికలూ గుర్తించేలా... వాస్తవాదీన రేఖ వెంబడి నిఘా పెట్టేందుకు మానవరహిత విమానాలు, రాడార్లు అమర్చిన హెలికాప్టర్లు ఇప్పటికే పని చేస్తున్నాయి. వీటితోపాటు ఉపగ్రహాల నుంచి అందే ఛాయాచిత్రాలు, నేలపై వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సర్లు అన్నీ ఎప్పటికప్పుడు చైనా సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా అందే సమాచారాన్ని అరుణాచల్ ప్రదేశ్లోని ‘రూపా’లో ఏర్పాటు చేసిన నిఘా కేంద్రంలో విశ్లేషిస్తుంటారు. కృత్రిమమేధ సాయంతో వీడియోలను, ఛాయాచిత్రాలను కలిపి కదలికలను స్పష్టంగా గుర్తిస్తున్నారు. ఈ శ్రమ వృథా పోవడం లేదు. చైనా సైన్యంలో ఎంత మంది ఉన్నారు? ఏ రకమైన వాహనాలు వాడుతున్నారు? సరిహద్దుల వెంబడి ఎలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగిందన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. వీటి ఆధారంగా చైనా దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లభిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సరిహద్దులకు అవల సైనికుల రవాణా జరగుతోందా? లేక గొర్రెలు, ఆవుల్లాంటి జంతువులు కదులుతున్నాయా? అన్నది కూడా కృత్రిమ మేధ సాయంతో పనిచేసే నిఘా సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోగలగడం!! డీఆర్డీవో ప్రయత్నాలూ ముమ్మరం... భవిష్యత్తు యుద్ధాలన్నీ సైబర్ యుద్ధాలే అన్న అంచనా రూఢీ అవుతున్న నేపథ్యంలో దేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను అన్ని స్థాయిల్లో వాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యుద్ధరంగంలో కృత్రిమ మేధ ఆధారిత ఆయుధ వ్యవస్థలను దింపడం చాలా సులువు. శత్రు భయంకరం కూడా. కంటికి కనిపించకుండానే శత్రువుకు విపరీతమైన నష్టాన్ని కలుగచేస్తాయి. ఇదంతా జరిగేందుకు కేవలం మూడు నాలుగేళ్లు సరిపోతుందని... అయితే ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందంటున్నారు మిలటరీ నిపుణులు. డీఆర్డీవోకు చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ దాదాపు 150 మంది ఇంజినీర్ల సాయంతో ఏఐ రోబోటిక్స్, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. శత్రువులకు చిక్కకుండా రహస్యంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన నెట్వర్క్లూ ఇందులో ఉన్నాయి. ఫేషియల్ రికగ్నిషన్కూ... ఏఐ! బస్టాండ్లు మొదలుకొని విమానాశ్రయాల వరకూ చాలాచోట్ల ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్లతో కూడిన కెమెరాలు సహజంగానే ఉం టాయి. కానీ.. మిలటరీ విషయానికి వచ్చేసరికి వీటి పాత్ర పరిమితమైంందే! ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధను ఉపయోగించుకుని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్ ఒకదాన్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్సాం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇజ్రాయెల్ సంస్థ కోర్సైట్ ఏఐలు కలిసికట్టుగా కొత్త సాఫ్ట్వేర్ను సిద్ధం చేయనున్నాయి. ఈ సాఫ్ట్వేర్తో వెలుతురు బాగా తక్కువగా ఉన్న చోట్ల మాత్రమే కాదు... అతిక్లిష్టమైన కోణాల్లోంచి.. వేగంగా కదులుతున్నా, గుంపులో కొందరిని మాత్రమే కూడా గుర్తుపట్టి ఫొటోలు తీయవచ్చు. అంతేకాకుండా.. ముఖంలో సగం కప్పి ఉంచుకున్నా గుర్తించేలా ఈ కొత్త సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారు. మానవ రహిత వాహనాలు డీఆర్డీవో సంస్థలు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు కొన్నింటిని ఇప్పటికే తయారు చేశాయి. వీటిల్లో శత్రుస్థావరాల పరిశీలన, నిఘా పెట్టే ఓ రోబో ఉంది. గోడలెక్కే, నాలుగు, ఆరు కాళ్లతో నడవగలిగిన రోబోలూ రెడీగా ఉన్నాయి. యుద్ధం లేదా ఘర్షణల్లో గాయపడ్డ సైనికులను వేగంగా యుద్ధభూమి నుంచి బయటకు తరలించేందుకు స్మార్ట్ వీల్చె యిర్లు, ఇంటర్నెట్ ట్రాఫిక్పై నిఘా పెట్టేందుకు నెట్వర్క్ ట్రాఫిక్ అనాలసిస్ (నేత్ర) వ్యసవ్థలను కూడా సిద్ధం చేసింది డీఆర్డీవో. గత ఏడాది జనవరిలో లక్నోలో జరిగిన ‘డిఫెన్స్ ఎక్స్పో’లో వీటిని ప్రదర్శించారు కూడా. -
Facebook: ‘మనుషుల్ని కోతుల్లాగా..’! ఫేస్బుక్లో దుమారం
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ఫామ్ ఫేస్బుక్ వివాదంలో చిక్కుకుంది. రేసిజం సంబంధిత ఫీచర్ను ఎంకరేజ్ చేయడం ద్వారా నెటిజన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే నష్టనివారణ కోసం క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్స్ ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. విషయం ఏంటంటే.. ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్కు చెందిన వీడియో(జూన్ 2020లోది) ఒకటి ఈ మధ్య ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నల్ల జాతీయులను ఉద్దేశించి.. ‘ఇలాంటి కోతుల వీడియోలు మరిన్ని కోరుకుంటున్నారా?’ అంటూ యూజర్లను కోరింది ఫేస్బుక్. అంతే.. ఇది జాత్యంహాకార వ్యవహారమేనంటూ ఫేస్బుక్ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు కొందరు. ఇది కచ్చితంగా పొరపాటే. జరిగిన దానికి క్షమాపణలు చెప్తున్నాం అని ఫేస్బుక్ ప్రకటించింది. ఆ టాపిక్ను డిసేబుల్ చేయడంతో పాటు పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై దర్యాప్తు చేయిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్పై మేధావులు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రైమేట్స్లో కోతులు, చింపాంజీలు, గొరిల్లాతో పాటు మనుషులు కూడా ఉంటారని, బహుశా ఆ ఉద్దేశంతో అలా రికమండేషన్ వచ్చి ఉంటుందని కొందరు టెక్నికల్ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇది ముమ్మాటికీ రేసిజం వ్యవహారామేనని ఫేస్బుక్పై దావాకి సిద్ధం అవుతున్నారు మనోభావాలు దెబ్బతిన్న కొందరు. చదవండి: భారత్ కొత్త ఐటీ చట్టాలపై పోరుకు రెడీ -
ఫేక్ ఓటర్లకు ‘ఫేషియల్’ చెక్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు తెలంగాణ వేదిక కానుంది. ఎన్నికల్లో దొంగ ఓట్లు, బోగస్ ఓట్లకు అడ్డుకట్ట వేయడం అనేది ఒక సమస్యగా మారిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పరిమితంగా కొన్ని పోలింగ్ బూత్ల్లో అర్హులైన ఓటర్ల గుర్తింపునకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నా లజీ ఉపయోగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిర్ణయించింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి మున్సిపాలిటీలోని పది పోలింగ్స్టేషన్లలో పోలింగ్ సందర్భంగా ఈ టెక్నాలజీని ఎస్ఈసీ పైలెట్ ప్రాజెక్టు కింద అమలుచేయనుంది. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి భవిష్యత్లో జరిగే వివిధ ఎన్నికల్లో ఈ సాంకేతికను ఉపయోగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏం చేస్తారు? పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న కొంపల్లి మున్సిపాలిటీల్లోని ఎంపిక చేసిన 10 వార్డుల్లోని ఫొటో ఓటర్ల జాబితాలను డౌన్లోడ్ చేసుకుని అందుబాటులో పెట్టుకుంటారు. ఓటేసేందుకు వచ్చే వారిని స్మార్ట్ఫోన్ లేదా ట్యాబ్తో ఫొటో తీస్తారు. అనంతరం ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ యాప్లో ఈ ఫొటోలను ఓటర్ల డేటాబేస్తో సరిచూస్తారు ఓటర్ ఫొటో దానితో మ్యాచ్ అయితే ఓటేసేందుకు అనుమతిస్తా రు. ఈ పైలెట్ ప్రాజెక్టు కోసం పది బూత్ల ఎంపికతో పాటు పదిమంది పోలింగ్ ఆఫీసర్లకు ఈ సాంకేతికతను ఉపయోగించేందుకు శిక్షణ ఇస్తామని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ సాక్షికి తెలిపారు. మూడు సాంకేతికతల కలబోత... ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మెషిన్ లెర్నిం గ్ అండ్ డీప్ లెర్నింగ్’లను ఉపయోగించి ఈ మొబైల్ యాప్ను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఈ యాప్ను రూపొందించింది. సెల్ఫీ లేదా లైవ్ ఫొటో తీసుకోవడం ద్వారా లైవ్ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్ వివరాలతో, డేటాబేస్లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫొటోతో మ్యాచ్ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అనే అథెంటికేషన్ వస్తుంది. ఈ విషయంలో మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది. మూడు సంస్థలు వేర్వేరుగా రూపొందించిన సాంకేతికతలను ఒకచోట చేర్చి వాటిని టీఎస్టీఎస్ ఆధ్వర్యంలో మొబైల్యాప్తో అనుసంధానించారు. ప్రస్తుతం దీనిని కొంతమేరకు ట్రెజరీ విభాగం రిటైరైన ఉద్యోగుల పెన్షన్ విషయంలో లైవ్ అథెంటికేషన్ కోసం ఉపయోగిస్తుండగా, ఈ విభాగంలో మరింత విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించారు. తాజాగా ఆసరా పింఛన్ల విషయంలోనూ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించారు. కొన్ని నెలల క్రితం సంగారెడ్డి జిల్లా కందిమండలం ఎద్దుమైలారం గ్రామంలో ఈ మొబైల్యాప్ను ఒక పైలెట్ ప్రాజెక్టు రూపంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ పైలెట్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో ఆసరా పింఛన్ల చెల్లింపునకు దీనిని విస్తృతస్థాయిలో ఉపయోగించాలనే ఆలోచనతో పంచాయతీరాజ్ శాఖ ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement