-
స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు. ‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు. వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది. భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. ‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు. ‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు. — సాంఖ్యాయన ఇవి చదవండి: నా స్టూడెంట్ టీచర్ అయింది! -
'బాతే కదా' అని ఇలా చేశారో.. ఇక జైలుకే..!
రంగారెడ్డి: ఎయిర్గన్తో బాతును చంపిన వ్యక్తులపై పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి గ్రామ శివారులోని హుస్సేన్ ఫాం హౌస్లో వాచ్మెన్ అహ్మద్ బాతులు, చిలుకలను పెంచుతున్నాడు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఫలక్నుమాకు చెందిన మహ్మద్ ఫహద్(27), రక్షాపురంకు చెందిన మహ్మద్ అజ్మలుద్దీన్ (35) ఫాంహౌస్లోకి వచ్చి ఎయిర్గన్తో షూటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటామని అడిగారు. ఈ క్రమంలోనే రోటెక్స్ ఆర్ఎం–8 ఎయిర్గన్తో బాతును షూట్ చేసి చంపేశారు. ఇది గమనించిన వాచ్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎయిర్గన్ను స్వాధీనం చేసుకున్నారు. -
రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్మైండ్!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. శనివారం సీఎస్కేతో మ్యాచ్లో రోహిత్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ రోహిత్ డకౌట్ గాకా.. గత నాలుగు మ్యాచ్ల్లో హిట్మ్యాన్ వరుసగా 2,3,0,0 పరుగులు చేసి విఫలమయ్యాడు. కాగా సీఎస్కేతో మ్యాచ్లో రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్మైండ్ ఉందని అభిమానులు పేర్కొనడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ దీపక్ చహర్ వేశాడు. రోహిత్తో ధోని మైండ్గేమ్ ఆడాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా బ్యాక్వర్డ్ పాయింట్, స్లిప్, థర్డ్మన్లో ఫీల్డింగ్ను సెట్ చేశాడు. ఆ తర్వాత చహర్ బంతి వేయడానికి ముందే ధోని స్టంప్స్ దగ్గరకు వచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలింగ్ వేసేటప్పుడు వికెట్ కీపర్ వికెట్లకు కాస్త దూరంగా ఉంటాడు. కానీ ధోని మాత్రం బంతి వేయడానికి ముందే స్టంప్స్ దగ్గరకు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. కానీ ఊహించినట్లుగానే చహర్ స్లోబాల్ వేశాడు. ఇక రోహిత్ ల్యాప్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి బ్యాట్ ఎడ్జ్కు తాకి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లడం.. అక్కడే ఉన్న జడ్డూ సింపుల్ క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. ఇలా ధోని మైండ్గేమ్తో రోహిత్ను బుట్టలో వేసుకొని ఫలితం రాబట్టాడు. రోహిత్ ఔట్ను కామెంటేటర్లో ఎయిర్లో.. ధోని మాస్టర్మైండ్.. మంత్రం ఫలించింది అంటూ కామెంట్ చేయడం ఆసక్తి కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 👉MSD comes up to the stumps 😎 👉Rohit Sharma attempts the lap shot 👉@imjadeja takes the catch 🙌 Watch how @ChennaiIPL plotted the dismissal of the #MI skipper 🎥🔽 #TATAIPL | #MIvCSK pic.twitter.com/fDq1ywGsy7 — IndianPremierLeague (@IPL) May 6, 2023 చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా? -
ముంబై ఇండియన్స్ తరపున 200వ మ్యాచ్.. చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరిగాడు. రిషి ధావన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడో బంతిని స్క్వేర్లెగ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న థర్డ్మన్ ఫీల్డర్ మాథ్యూ షార్ట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గత మూడు మ్యాచ్ల్లో రోహిత్ వరుసగా 2,0,0.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాడు. సీజన్లో ఒక్క మ్యాచ్లోనూ తన ఇంపాక్ట్ చూపలేకపోయాడు. ఇక రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ తరపున ఇది 200వ మ్యాచ్ కావడం విశేషం. అలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పంజాబ్తో మ్యాచ్లో డకౌట్ అయిన రోహిత్కు ఐపీఎల్లో ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన జాబితాలో రోహిత్ చోటు సంపాదించాడు. 15 డకౌట్లతో దినేశ్ కార్తిక్, సునీల్ నరైన్, మణిదీప్ సింగ్లతో కలిసి రోహిత్ సంయుక్తంగా నిలిచాడు. Most ducks in IPL history: 15 - Dinesh Karthik 15 - Sunil Narine 15 - Mandeep Singh 15 - Rohit Sharma — CricTracker (@Cricketracker) May 3, 2023 చదవండి: అర్జున్ నయం.. ఆర్చర్ను నమ్మి తప్పు చేశాడా! -
ఎవరికి చిక్కని బట్లర్.. ఏడేళ్లలో రెండోసారి మాత్రమే
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ డకౌట్గా వెనుదిరిగాడు. ఐపీఎల్ కెరీర్లో బట్లర్కు ఇది రెండో డకౌట్ మాత్రమే కావడం విశేషం. తొలి డకౌట్ అతని ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్లో వచ్చింది. 2016లో రైజింగ్ పుణేతో మ్యాచ్ బట్లర్కు తొలి ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఆ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో రెండో డకౌట్ నమోదు చేశాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్లో బట్లర్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. T. I. M. B. E. R! Huge Wicket for @gujarat_titans! 👏 👏@MdShami11 with his first wicket of the match! 👍 👍#RR 2 down as Jos Buttler departs. Follow the match 👉 https://t.co/nvoo5Sl96y#TATAIPL | #GTvRR pic.twitter.com/DBspi43pRo — IndianPremierLeague (@IPL) April 16, 2023 చదవండి: గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఖాతాలో అరుదైన రికార్డు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement