breaking news
Devotees Tirumala
-
తిరుమల క్యూలైన్లలో గందరగోళం..!
తిరుమలలో భక్తులకు నిన్న(గురువారం, డిసెంబర్ 25) అధికారులు చుక్కలు చూపించారు. తలా ఒక ఉచిత సలహాలిచ్చి.. నిలబడ్డ క్యూలోనే.. మరోసారి వేచిచూసేలా చేశారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేయలేకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొందని పలువురు భక్తులు ‘సాక్షి’తో వాపోయారు. గురువారం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలిపిరి వద్ద కూడా క్యూలైన్లలో ఉన్న భక్తులపై లాఠీఛార్జీ జరిగిన విషయం తెలిసిందే..! తిరుమల క్యూలైన్లలోనూ గందరగోళం నెలకొన్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కల్యాణోత్సవంలో..గురువారం రద్దీ పెరగడంతో.. సుపథం ఎంట్రీ వద్ద సిబ్బంది కల్యాణోత్సవం భక్తులను నియంత్రించలేకపోయారు. దీంతో.. కొందరు టీటీడీ సిబ్బంది భక్తులను తప్పుదోవ పట్టించారు. ‘ఉదయం 10 గంటలకు సుపథం వద్ద క్యూలైన్లో నిలబడ్డాం. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. సెలవు రోజు, భక్తుల రద్దీని అంచనావేయలేకపోయిన టీటీడీ తొలుత ఒక్కరితోనే కల్యాణోత్సవం టిక్కెట్లు, ఆధార్ కార్డుల పరిశీలనకు నియమించింది. భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వచ్చారా? లేదా? అని తనిఖీ చేసేందుకు ఓ మహిళా వలంటీర్.. రద్దీ నియంత్రణకు విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించింది. 11 గంటల వరకు కూడా మేము సగం లైన్ వరకు వచ్చాయం. వెనక్కి తిరిగి చూస్తే.. క్యూ ఇంకా పెద్దగానే ఉంది. అంతలో మెడలో టీటీడీ ఐడీకార్డు వేసుకున్న ఓ వ్యక్తి మా దగ్గరకు వచ్చి.. కల్యాణోత్సవం కోసం వేచిచూసేవారికి నేరుగా లోనికి అనుమతి ఉంటుందని చెప్పాడు. అంతే.. క్యూలైన్లో సగం వరకు ఉన్న మేము, మా వెనకాల నిలబడ్డ వారు కూడా అటుగా పరుగులు తీశారు.తీరా అక్కడికి వెళ్తే.. కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. టీటీడీ వాళ్లు నేరుగా చెప్పొచ్చన్నారని పేర్కొనగా.. వారినే అడిగి లోనికి వెళ్లండని సమాధానం ఇచ్చాడు’ అని ఓ భక్తుడు ‘సాక్షి’తో వాపోయారు. తమతో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ వృద్ధురాలు ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత భక్తులంతా తిరిగి క్యూలైన్లోకి రాగా.. మధ్యవరకు ముందు నిలబడ్డ భక్తులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో తాము రెండుసార్లు క్యూలో నిలబడాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు.ఉదయం 11.30 కావొస్తున్నా.. కల్యాణం క్యూలైన్ తగ్గకపోవడం.. ఆ సమయానికల్లా క్యూకట్టాల్సిన ఊంజాల్ సేవ, చిన్నారులతో వచ్చేవారు సుపథం వద్ద గుమికూడారు. దాంతో.. అధికారులు నేరుగా అనుమతిస్తామని ప్రకటించారు. ఈ చర్య వల్ల ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్లో ఉన్న తాము చాలా ఆలస్యంగా లోనికి వెళ్లాల్సి వచ్చిందని హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఊంజాల్ భక్తులకూ అంతే..!షెడ్యూల్ ప్రకారం ఊంజాల్ సేవ టికెట్ ఉన్న భక్తులు ఉదయం 11.30 నుంచి సుపథం వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఓ వైపు కల్యాణం టికెట్ భక్తులు లైన్లో ఉండగానే.. ఊంజాల్ సేవ వారు కూడా క్యూకట్టేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ‘కేవలం కల్యాణ సేవ భక్తులే క్యూలో ఉండాలి’ అని అనౌన్స్ చేసేవారు కూడా అక్కడ లేకపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది. ‘మేము లైన్లో ఉండగానే.. మమ్మల్ని లోనికి పంపకుండా.. క్యూని ఆపేశారు. సుప్రభాతం టికెట్ ఉన్నవారు పక్కనుంచి రావాలని కోరారు.ఒకసారి మోసపోయాం. ఈసారి కూడా అంతే అనుకుని క్యూలోనే ఉన్నాం. అయితే.. ఊంజాల్ సేవ వారు ముందు ఉండడంతో.. మేము అటు ముందుకు.. ఇటు వెనక్కి కదలలేకపోయాం’ అని అనంతపురానికి చెందిన మరో భక్తుడు ‘సాక్షి’కి వివరించారు. కల్యాణం భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. టికెట్ వెరిఫికేషన్ చేసే సిబ్బంది సంఖ్యను అప్పటికప్పుడు మూడుకు పెంచి.. భక్తులను లోనికి పంపారు. అయితే.. ఈ ఆలస్యం ప్రభావం తదుపరి సేవలపై తీవ్రంగా పడింది. ఊంజాల్ సేవ భక్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి లోనికి అనుమతించారు.అయితే.. ఎలాంటి ప్రకటన లేకుండానే.. ఊంజాల్ సేవకు పంపకుండానే.. ఆ లైన్లో ఉన్న భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి తరలించారని హైదరాబాద్ శివార్లలోని బీరంగూడకు చెందిన భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడు నెలల క్రితమే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా.. సాధారణంగా దర్శనానికి పంపారు. మాకు ఊంజాల్ సేవ మొక్కు ఉండగా.. దాన్ని తీర్చుకోలేకుండా టీటీడీ అధికారులు చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సెల్ఫోన్ డిపాజిట్కు మరోసారి..ఊంజాల్ సేవ భక్తులకు టికెట్ వెరిఫికేషన్, సెక్యూరిటీ చెకింగ్ వరకు సెల్ఫోన్ వెంట తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. చెకింగ్ వద్ద సెల్ఫోన్లను డిపాజిట్ చేయాలి. అయితే.. ఊంజాల్ భక్తులను నేరుగా దర్శనానికి పంపిన అధికారులు భయట క్యూలైన్ వద్ద ఉన్న కౌంటర్లోనే సెల్ఫోన్ డిపాజిట్ చేయాలంటూ హుకుం జారీ చేశారు. దాంతో షాక్ తిన్న భక్తులు.. చేసేది లేక.. మళ్లీ బయటకు వచ్చి, 40 నిమిషాలు సెల్ఫోన్ డిపాజిట్ కోసం క్యూకట్టాల్సి వచ్చింది. కనీసం ఇలాంటి వారిని నేరుగా లోనికి పంపించలేదని మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ భక్తురాలు ‘సాక్షి’తో తెలిపారు.ఇక చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు కల్పించే స్పెషల్ దర్శనం క్యూ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా.. దాన్ని కూడా ఆలస్యంగా మొదలు పెట్టడంతో.. చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రక్తదానం డోనర్ల దర్శనంలోనూ ఇలాంటి లోటుపాట్లే కనిపించాయని భక్తులు వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రద్దీ సమయాల్లో సమర్థులైన సిబ్బందిని సుపథం క్యూకౌంటర్ల వద్ద నియమించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.- సాక్షి వెబ్ డెస్క్ -
తిరుమలలో భక్తుల రద్దీ ఇలా.. దర్శనం కోసం ఎన్ని గంటలంటే..
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 75,188 మంది భక్తులు దర్శించుకున్నారు. పండుగల వేళ భక్తుల సంఖ్య పెరగడంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంట సమయం పడుతోంది.ఇక, తిరుమలలో నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,640 మందిగా ఉంది. గురువారం స్వామివారి హుండీ ఆదాయం 2.66 కోట్లుగా టీటీడీ తెలిపింది. మరోవైపు.. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంట సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 6 గంటలు.. ఇక, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
తిరుమల సమాచారం ఇలా.. నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్ల విడుదల
సాక్షి, తిరుమల: తిరుమలకు సంబంధించి నేటి సమాచారం ఇలా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి 15 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 56,225లుగా ఉండగా.. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,588. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది.మరోవైపు.. నేడు ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను కూడా విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.ఇదిలా ఉండగా.. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరాకామణి సేవ కోటాను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యధా ప్రకారం విడుదల చేస్తారు. కాగా, https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. -
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
తిరుమలలో టీడీపీ కార్యకర్త ఓవరాక్షన్.. భక్తుల ఆగ్రహం
సాక్షి, తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ అయ్యాక టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు జైలులో ఉండటంతో ఎల్లో బ్యాచ్కు మైండ్ బ్లాంక్ అయిపోయి తాము ఏం చేస్తామో అనేది తెలియక.. పిచ్చి వేషాలు వేస్తున్నారు. తాజాగా టీడీపీ కార్యకర్తలు తిరుమలలో టీడీపీ జెండాతో ఓవరాక్షన్ చేశారు. వివరాల ప్రకారం.. పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు ఒకరు బరితెగించాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద టీడీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలు ప్రదర్శించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఎల్లో బ్యాచ్ అపవిత్ర కార్యక్రమాలకు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పార్టీ జెండాను ప్రదర్శించడంపై సీరియస్ అవుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ను ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో, కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు పిచ్చెక్కిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ టీడీపీ జెండాలను ప్రదర్శిస్తున్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ -
తిరుమల ఆలయంలోకి సెల్ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
మరో నకిలీ టీడీడీ వెబ్సైట్పై ఎఫ్ఐఆర్ నమోదు
-
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 67,681 మంది దర్శించుకున్నారు. 31,738 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.54 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. -
చురుగ్గా శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుమల: వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలో ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానంగా వాహన సేవల ఊరేగింపు ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో భక్తులు వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బారికేడ్ల నిర్మాణం సాగుతోంది. గరుడ సేవలో సుమారు 3 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బారికేడ్లు నిర్మిస్తున్నారు. తూర్పుమాడ వీధిలో కొంతభాగం, దక్షిణ, ఉత్తరమాడ వీధుల్లో పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంతోపాటు మంటపాలకు వెల్లవేసే పనులు కూడా సాగుతున్నాయి. పురవీధుల్లో ఊరేగించే వాహనాలకు మరమ్మతులు పూర్తి చేశారు. వాహనాలు హారతులు అందుకునే ప్రాంతాల్లో చలువ పందిళ్లు నిర్మిం చారు. ఇప్పటికే శ్రీవారి పుష్కరిణి నీటిని తొల గించారు. ఈ నెలాఖరుకు పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యుత్ దీపాలతో దేవతా ప్రతిమలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఏర్పాట్లన్నీ ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. తిరుమలలో కుండపోత వర్షం తిరుమలలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆలయ పరిసరాల్లో వాన నీరు నిలిచింది. తిరుమల రెండు ఘాట్రోడ్లలోని జలపాతాల్లో నీటి ప్రవాహం కనిపించింది. తిరుమల సమీపంలోని రెండో మలుపు వద్ద భారీ కొండచరియ విరిగిపడింది. చివరి నాలుగు మలుపుల్లోనూ కొండచరియలు కూలేలా ఉన్నాయి. వీటిపై టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా రోడ్డుపై పడిన బండరాళ్లను ఎప్పటికప్పుడు తొలగించే పని చేపట్టారు.


