-
‘ప్రొఫెసర్’ కన్నుమూత
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత డీన్ మెర్విన్ జోన్స్ (59) గురువారం హఠాన్మరణం చెందాడు. ఐపీఎల్ వ్యాఖ్యాతల బృందంలో సభ్యుడిగా ఉన్న జోన్స్ ముంబైలోని ఒక హోటల్లో బస చేస్తున్నాడు. బుధవారం రాత్రి ముంబై, కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహిరించిన అతను చనిపోవడానికి ముందు కూడా స్టార్ స్పోర్ట్స్వారి ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో పాల్గొన్నాడు. మధ్యాహ్న భోజనానికి ముందు తీవ్ర గుండెపోటు కారణంగా హోటల్ గదిలోనే మరణించినట్లు సమాచారం. లంచ్కు వెళ్లటం గురించి జోన్స్తో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో గదికి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం తెలిసింది. బ్రెట్ లీ కొద్ది సేపు ‘సీపీఆర్’ చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే చనిపోయినట్లు అర్థమైంది. ఆటగాడిగా క్రికెట్ గుడ్బై చెప్పిన తర్వాత జోన్స్ కోచ్గా, కామెంటేటర్గా మళ్లీ తన అనుబంధాన్ని కొనసాగించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో 2015నుంచి 2019 వరకు ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్కు జోన్స్ కోచ్గా వ్యవహరించాడు. ఆటగాడిగా పలు ఘనతలు సాధించడంతో పాటు సునిశీత పరిశీలన, క్రికెట్ పరిజ్ఞానం, వ్యూహాలపై అతని విశ్లేషణలకు క్రికెట్ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే జోన్స్ను ‘ప్రొఫెసర్’ అని కూడా అతని సన్నిహితులు పిలుస్తారు. డీన్ జోన్స్ మృతి పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అతని ఘనతలను ప్రశంసిస్తూ నివాళులు అర్పించారు. మద్రాస్ స్పెషల్ డీన్ జోన్స్ పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు ఉన్నాయి. ఆస్ట్రేలియా సాధించిన అనేక విజయాల్లో అతను భాగంగా నిలిచాడు. 1987 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసీస్ జట్టులో కీలక పాత్ర (314 పరుగులు) పోషించిన డీన్ జోన్స్ కెరీర్లో 1989 యాషెస్ సిరీస్ ప్రదర్శన మరో మైలురాయి. ఆసీస్ 4–0తో నెగ్గిన ఈ సిరీస్లో జోన్స్ 566 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్ ఊపందుకుంటున్న సమయంలో జోన్స్ అందరికన్నా ప్రత్యేకంగా నిలిచాడు. వేగవంతమైన బ్యాటింగ్ శైలి, మైదానంలో చురుకైన ఫీల్డింగ్ కలగలిపి అసలైన వన్డే క్రికెటర్గా ఎదిగాడు. వికెట్ల మధ్య చురుకైన సింగిల్స్, వికెట్లకు అడ్డంగా వెళ్లి లెగ్సైడ్ వైపు షాట్లు ఆడటం, పేసర్ల బౌలింగ్లో కూడా క్రీజ్ వదలి ముందుకు దూసుకొచ్చి పరుగులు రాబట్టడం...టి20 క్రికెట్లో ఇప్పుడు చూస్తున్న ఇలాంటి శైలి ఆటను జోన్స్ 80వ, 90వ దశకాల్లోనే వన్డేల్లో చూపించాడు. నాటి రోజుల్లోనే అతను సుమారు 45 సగటుతో పరుగులు చేయడం విశేషం. అయితే జోన్స్ కెరీర్ మొత్తానికి హైలైట్గా నిలిచిన ఇన్నింగ్స్ 1986లో మద్రాసులో భారత్తో జరిగిన చారిత్రాత్మక ‘టై’ టెస్టులో వచ్చింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోత మధ్య ఏకంగా 502 నిమిషాలు క్రీజ్లో నిలిచిన జోన్స్... 330 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లతో 210 పరుగులు చేయడం అతడిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఆట ముగిసిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లి జోన్స్కు సెలైన్లు ఎక్కించాల్సి వచ్చింది. -
బ్రెట్ లీ ఉన్నా సేవ్ చేయలేకపోయాడు!
ముంబై: ప్రముఖ వ్యాఖ్యాత, ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ గుండె పోటుకు గురై ఈరోజు(గురువారం) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే డీన్ జోన్స్కు గుండె పోటు వచ్చిన సమయంలో ఎవరూ ఆయన వద్ద లేరా అని ఇప్పటివరకూ అభిమానుల్లో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంది. కాగా, జోన్స్ వెంట ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఉన్నాడట. వీరిద్దరూ కలిసి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ లాబీలో ఉన్నారట. (చదవండి: జోన్స్ ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే) వీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చిన కాసేపటికి జోన్స్ కు హార్ట్ ఎటాక్ గురయ్యారు. జోన్స్ను కాపాడటానికి లీ చేసిన ప్రయత్నం ఫలిచం లేదు. సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్-శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ) చేసినా జోన్స్ ను కాపాడలేకపోయాడు. సీపీఆర్ చేసినా జోన్స్ను కాపాడలేకపోయాననే పశ్చాత్తాపం బ్రెట్లీలో కనబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ల్లో భాగంగా బ్రాడ్కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. జోన్స్తో పాటు బ్రాడ్ కాస్టింగ్ కామెంటరీ చేస్తున్నాడు. కాగా, మధ్యాహ్నం గం.11.30 నుంచి గం 12.00 మధ్యలో డీన్ జోన్స్ తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో తుదిశ్వాస విడిచారు. ఆసీస్ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్ ఆడారు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కామెంటేటర్గా అవతారమెత్తారు. (చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్జోన్స్ ఇకలేరు..) -
జోన్స్ ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ కన్నుమూశారనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. ఐపీఎల్-13 సీజన్లో భాగంగా ముంబైలో ఉండి బ్రాడ్కాస్టింగ్ కామెంటరీ అందిస్తున్న జోన్స్.. ఈ రోజు(గురువారం) మధ్యాహ్న ఒంటి గంట ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. గుండె పోటుకు గురైన జోన్స్ మృతి చెందడంపై క్రీడాలోకం ఘనంగా నివాళులు అర్పిస్తోంది. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్లతో పాటు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్లు జోన్స్కు నివాళులు అర్పించారు. ఈ మేరకు తమ ట్వీట్ల ద్వారా సానుభూతి తెలిపారు.(చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్జోన్స్ ఇకలేరు..) ఉదయం బానే ఉన్నారు..: ఇర్ఫాన్ ‘జోన్స్ లేరనే వార్త షాక్కు గురి చేసింది. చాలా కలత చెందా. ఆయన ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే ఈ చేదు వార్త వినాల్సి వచ్చింది. నేను రెండు రోజుల క్రితం జోన్స్ కుమారుడితో మాట్లాడా. అప్పటికి ఆయనకు ఎటువంటి సమస్య లేదు. అంతా నార్మల్గానే ఉంది. జోన్స్ మృతిచెందారనే వార్తను నమ్మలేకపోతున్నా’ అని ఇర్ఫాన్ సంతాపం వ్యక్తం చేశాడు. షాక్కు గురయ్యా..: కోహ్లి ‘జోన్స్ చనిపోయారనే వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబానికి, ఆయన స్నేహితులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం’ అని కోహ్లి తన ట్వీట్లో సంతాపం తెలిపాడు. మిమ్మల్ని మిస్సవుతున్నాం..: వార్నర్ ‘ఈ వార్తను నమ్మలేకపోయా. చాలా బాధాకరం. జోన్స్ ఆత్మకు శాంతి చేకూరాలి. డీయోనో.. నిన్ను మిస్సవుతున్నాం’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. అతని కామెంటరీని ఎంజాయ్ చేసేవాళ్లం: కైఫ్ ‘జోన్స్ కామెంటరీనీ ఎంజాయ్ చేసేవాళ్లం. మీ అసాధారణ బ్యాటింగ్, ప్రొఫెషనల్ అనాలిసిస్ ఎప్పుడూ అద్భుతమే. మిమ్మల్ని టీవీలో చూసే అవకాశాన్ని మిస్సవుత్నున్నాం. మీతో కలిసి క్రికెట్ విశ్లేషణ ఇక ఉండదు అనేది జీర్ణించుకోలేకపోతున్నాం’ అని కైఫ్ పేర్కొన్నాడు. -
ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్జోన్స్ ఇకలేరు..
-
ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్జోన్స్ ఇకలేరు..
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్(59)ఇకలేరు. ఈరోజు గుండె పోటుకు గురైన డీన్జోన్స్ కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ల్లో భాగంగా బ్రాడ్కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుకు గురైన జోన్స్ తుదిశ్వాస విడిచారు. ఆసీస్ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్ ఆడారు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కామెంటేటర్గా అవతారమెత్తారు. 1984-1992 మధ్య కాలంలో ఆసీస్ తరఫున క్రికెట్ ఆడారు జోన్స్. టెస్టు క్రికెట్లో 3,631 పరుగుల్ని జోన్స్ సాధించగా, అందులో 11 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు కెరీర్లో రెండు డబుల్ సెంచరీలు జోన్స్ సాధించాడు. ఇక వన్డే కెరీర్లో 7 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 6,068 పరుగులు సాధించారు. వన్డేల్లో జోన్స్ సగటు 44. 61గా ఉంది. 1986లో భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్లో జోన్స్ డబుల్ సెంచరీ సాధించారు. ఆ టెస్టు టైగా ముగిసింది. జోన్స్ వీరోచిత బ్యాటింగ్తో ఆసీస్ ఓడిపోయే టెస్టు మ్యాచ్ను టైగా ముగించింది. జోన్స్ తన ఫస్టక్లాస్ కెరీర్లో 51.85 సగటుతో 19,188 పరుగులు సాధించారు. ఆయన ఫస్ట్క్లాస్ కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 324 నాటౌట్. చాంపియన్ కామెంటేటర్ జోన్స్ మృతిని ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధృవీకరించింది. ‘ జోన్స్ ఇకలేరు. ఇది చాలా విషాదకరమైన ఘటన. ఈ వార్తను షేర్ చేయడం కలిచి వేస్తోంది. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో జోన్స్ ప్రాణాలు విడిచారు. ఆయన మృతికి నివాళులర్పిస్తున్నాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేము ఆస్ట్రేలియా హై కమిషన్తో టచ్లో ఉన్నాం. జోన్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దక్షిణాసియాలో క్రికెట్ అభివృద్ధి చెందడానికి జోన్స్ ఎంతో కృషి చేశారు. ఈ గేమ్కు ఆయనొక గొప్ప అంబాసిడర్. ఆయనకు క్రికెట్ అంటే ప్రాణం. ఎప్పుడూ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుండే వారు. కామెంటరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఒక చాంపియన్ కామెంటేటర్. జోన్స్ కామెంటరీకి లక్షలాది అభిమానులున్నారు. ఆయన్ని మాతో పాటు ఫ్యాన్స్ కూడా మిస్సవుతున్నందుకు చింతిస్తున్నాం’ అని స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు
డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement