breaking news
Colombo Test
-
SL Vs IND: ముగిసిన మూడో రోజు ఆట.. లంక స్కోరెంతంటే?
Sri Lanka Vs India 2nd Test Match, Day 3: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మంగళవారం ఆట పూర్తయ్యే సరికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార 8 పరుగులతో ఉన్నాడు. ఇక మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. తద్వారా మొదటి ఇన్నింగ్స్లో భారత్ కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడే ఉంది.ముగిసిన ఆట.. భారీ ఆధిక్యంలో భారత్మరోసారి ఆటకు అంతరాయంవర్షం వల్ల ఆట నిలిచే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. సొనాల్ దినుష 85 పరుగులు, లాహిరు కుమార 8 పరుగులతో అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే శ్రీలంక ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.దినూష దూకుడుసోనాల్ దినూష (80) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం లంక 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కుమారా 7 పరుగులతో అతడికి సహకరిస్తున్నాడు. లంక మరో 245 పరుగులు వెనుకబడి ఉంది.ఎనిమిదో వికెట్ డౌన్18 పరుగులు చేసిన కెషారా నువంతా మానవ్ సుతార్ బౌలింగ్లో సారాంశ్ జైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లంక 230 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. టీ విరామం తర్వాత మొదలైన ఆటటీ విరామం తర్వాత ఆట మొదలైంది. 66 ఓవర్లు ముగిసేసరికి లంక 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దినూష (58), కెషారా (13) పరుగులతో ఆడుతున్నారు.టీ విరామం..టీ విరామ సమయానికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సోనాల్ దినూష (52) అజేయ అర్ధసెంచరీ సాధించగా, కెషారా నువంతా 13 పరుగులతో అతడికి సహకరిస్తున్నాడు. లంక మరో 287 పరుగులు వెనుకబడి ఉంది. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక45.3వ ఓవర్: సిరాజ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా (0). లంక స్కోరు 173-7. దినుష 22 పరుగులతో ఉన్నాడు. భారత్ కంటే 330 పరుగుల వెనుకంజలో శ్రీలంక. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక44.6వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్లో పసిందు సూరియబండారా బౌల్డ్. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆరో వికెట్గా వెనుదిరిగిన పసిందు. నిరోషన్ డిక్వెల్లా క్రీజులోకి రాగా.. దినుష 21 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 171-6 (45). టీమిండియా కంటే 332 పరుగుల వెనుకంజలో లంక.భారీ వెనుకంజలో శ్రీలంక137 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక భారీ వెనుకంజలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 340 పరుగులు వెనుకపడి ఉంది. రెండో సెషన్ సమయానికి (42 ఓవర్లు) శ్రీలంక స్కోర్ 163-5గా ఉంది. సోనల్ దినుషా (17), పసిందు సూరియబండార (77) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక34.5వ ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుటైన ధనంజయ (8). లంక స్కోరు: 137/5 (34.5). సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. పసిందు 68 పరుగులతో ఉన్నాడు.నిలకడగా ఆడుతున్న ధనంజయ, పసిందుధనంజయ 8, పసిందు 68 పరుగులతో ఉన్నారు.తిరిగి మొదలైన ఆట1.10 PM- 3.25 PM మధ్య రెండో సెషన్3.45 PM- 5.42 PM మధ్య మూడో సెషన్ నిర్వహణవర్షం వల్ల ఆటకు అంతరాయంవాన వల్ల లంచ్ బ్రేక్ తర్వాత ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. అయితే, 12.30 తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది కానీ.. అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటం వల్ల ఆట సాగలేదు.లంచ్ విరామం సమయానికి శ్రీలంక స్కోర్ ఎంతంటే..?మూడో రోజు లంచ్ విరామం సమయానికి శ్రీలంక స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులుగా ఉంది. పసిందు సూరియబండార (65) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (4) అతడికి జతగా క్రీజ్లో ఉన్నాడు. ప్రసిద్ద్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. సుతార్కు ఓ వికెట్ దక్కింది. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక122 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి కమిందు మెండిస్ (2) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక35 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి కమిల్ మిషారా (19) ఔటయ్యాడు. మూడో రోజు మొదలైన ఆట8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన శ్రీలంక మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఈ రోజు తొలి ఓవర్లోనే ఆ జట్టు రెండు బౌండరీలు సహా 12 పరుగులు రాబట్టింది. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో కమిల్ మిషారా రెండు బౌండరీలు బాదాడు.ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 20-2గా ఉంది. మిషారా 14, పసిందు సూరియబండార 3 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. 495 పరుగుల వెనుకంజలో శ్రీలంకకొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది.అంతకముందు మానవ్ సుతార్ బౌలింగ్లో ప్రబాత్ జయసూరియ (2) ఎల్బీగా వెనుదిరగడంతో లంక రెండో వికెట్ కోల్పోయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో విజృంభించగా; గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు. చదవండి: సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..! -
IND VS SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్
టీమిండియాకు చేదు వార్త. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటకు వర్షం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రెండో రోజు మ్యాచ్కు పలుమార్లు వర్షం, మేఘావృత వాతావరణం అంతరాయం కలిగించింది.మంగళవారం ఉదయం కొలంబోలో ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీల సెల్సియస్గా ఉండనుండగా, ఉదయం వర్షం పడే అవకాశం 82 శాతంగా ఉంది. మధ్యాహ్నం కూడా వర్ష సూచనలు కొనసాగనున్నాయి. ఆ సమయంలో వర్షం పడే అవకాశం 56 శాతంగా అంచనా వేశారు.సాయంత్రం పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 86 శాతంగా ఉండటంతో పాటు మేఘావృతం 98 శాతం, తేమ 79 శాతం వరకు ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.జురెల్ శతకంతో భారత్ భారీ స్కోరుమ్యాచ్ విషయానికొస్తే భారత్ పూర్తి ఆధిపత్యంలో ఉంది. రెండో రోజు ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో భారత్ 503/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. జురెల్ 171 బంతుల్లో 9 ఫోర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.రిషభ్ పంత్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, జురెల్తో కలిసి ఏడో వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి 8/2తో రెండో రోజు ఆటను ముగించింది.ప్రస్తుతం శ్రీలంక 495 పరుగుల భారీ లోటుతో ఉంది. భారత్ ఇప్పటికే మ్యాచ్పై పట్టు సాధించిన నేపథ్యంలో మూడో రోజు వర్షం ఎంత మేరకు ఆటను ప్రభావితం చేస్తుందన్నది కీలకంగా మారింది.పడిక్కల్ శతకంవన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ వరుసగా రెండో టెస్ట్లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్లో భారీ శతకం చేసిన అతడు.. రెండో మ్యాచ్ తొలి రోజే సెంచరీ (117) పూర్తి చేశాడు. జురెల్, పడిక్కల్ సెంచరీలతో కదంతొక్కగా.. పంత్తో పాటు కెప్టెన్ గిల్ (50) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45), రవీంద్ర జడేజా (43) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.ఆధిక్యంలో భారత్కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్ తొలి టెస్ట్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
రోహిత్ శర్మ అర్ధసెంచరీ
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో లంకపై టీమిండియాకు 243 పరుగుల ఆధిక్యం దక్కింది. 21/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కోహ్లి సేన ఆచితూచి ఆడింది. కెప్టెన్ కోహ్లి(21) తొందగానే అవుటైనా స్టువర్ట్ బిన్నీతో కలిసి రోహిత్ శర్మ పోరాడాడు. రోహిత్ అర్ధ సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అతడికిది 4వ హాఫ్ సెంచరీ. బిన్నీ 38, ఓజా 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. -
నిరాశపరిచిన విజయ్, రహానే
కొలంబో: శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 12 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా నిలబడ్డారు. మూడో వికెట్ కు వీరిద్దరూ 85 పరుగులు జోడించడంతో భారత్ కోలుకుంది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది. కోహ్లి 48, రాహుల్ 39 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ మురళీ విజయ్ డకౌటయ్యాడు. అజింక్య రహానే(4) మరోసారి నిరాశపరిచాడు. వీరిద్దరినీ ప్రసాద్ అవుట్ చేశాడు. -
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, వరుణ్ ఆరోన్ స్థానంలో మురళీ విజయ్, స్టువర్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్ జట్టులోకి వచ్చారు. శ్రీలంక జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన నవాబ్ ప్రదీప్ స్థానంలో దుషమంత చమేరాను జట్టులోకి తీసుకున్నారు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
'ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తా'
కొలంబో: తన చివరి టెస్టులో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తానని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర వెల్లడించాడు. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తమ టీమ్ ను గెలిపించేందుకు తనవంతు పాత్ర పోషించడంపైనే దృష్టి పెట్టానని వెల్లడించాడు. అయితే ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోలేదన్నాడు. చివరి టెస్టులో సెంచరీ చేయాలకుని తనకు తానుగా ఒత్తిడికి గురికాబోనని చెప్పాడు. టీమిండియాను సమర్థవంతంగా ఎదుర్కొవడంపైనే దృష్టి నిలిపానన్నాడు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో కోహ్లి సేన అనూహ్యంగా ఓటమిపాలైందని, టెస్టు క్రికెట్ సవాల్ తో కూడుకున్నదనడానికి ఇదే నిదర్శమని చెప్పాడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పడం తనకు కష్టంగానే ఉందని అన్నాడు. చివరి టెస్టు తనకు భావోద్వేగంతో కూడుకున్నదేనన్నాడు. తన టీమ్ మేనేజ్ మెంట్ తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ పూర్తి చేశానన్నాడు. రిటైర్ తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని వెల్లడించాడు. తనకు ఇచ్చిన అవకాశాలకు శ్రీలంకకు కృతజ్ఞుడినై ఉంటానని సంగక్కర ప్రకటించాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.


