breaking news
Chief Minister designation
-
అన్నీ చేస్తా.. ఇప్పుడే కాదు
* హామీలు నెరువేరుస్తానంటూనే ఇబ్బందులున్నాని చెప్పిన సీఎం * రుణమాఫీపై నిలదీసిన ప్రజలు * ఆదాయం పెంచేందుకు అధికారుల నుంచి సూచనల స్వీకరణ * జిల్లాలో ముగిసిన చంద్రబాబు రెండు రోజుల పర్యటన సాక్షి, ఏలూరు : ‘ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నా. రాష్ట్ర విభజన జరగటంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు అప్పులు మిగి లాయి. వనరులు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అన్నీ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తా. దానికి మీరందరూ సహకరించాలి’ అని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం జిల్లా అధికారులతో జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో సమీక్ష జరిపారు. ఆర్థిక వనరుల పెంపుదలకు అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. పర్యాటక పరంగా అభివృద్ధి చేయడంతోపాటు గోదావరిలో ఇసుక మేటలు తొలగించడం, వరి విత్తనాలు జిల్లాలోనే తయారు చేసుకోవడం, బీచ్ల అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు అవలంభించడం వంటి అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం సమీక్ష ముగించారు. తరువాత అనారోగ్యానికి గురైన చింతలపూడి నియోజకర్గ టీడీపీ కన్వీనర్ మండవ లక్ష్మణరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మరణించిన ఏఎంసీ మాజీ చైర్మన్ నందిన హరిశ్చంద్ర నివాసానికి వెళ్లి అతని కుమారుడు సతీష్ను ఓదార్చారు. నరసన్నపాలెం నుంచి రోడ్ షో ప్రారంభించిన చంద్రబాబు అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గిరిజన హక్కుల్ని కాపాడటంతోపాటు గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యపై రైతులు వివరించడంతో ఆ శాఖ ఎస్ఈని పిలిచి పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ప్రతి ఫీడర్ వద్ద మీటర్లు పెట్టి ఏ ఫీడర్లో ఎంత విద్యుత్ వినియోగం జరిగిందో తానెక్కడుంటే అక్కడ తెలిసే ఏర్పాటు చేస్తున్నానని వివరించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కావాలనే కొందరు రాజకీయం చేశారని అయినప్పటికీ దానిని పూర్తి చేసేందుకు.. ముంపు మండలాలపై ఆర్డినెన్స్ తీసుకువచ్చేలా కృషి చేశామని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా రాష్ట్ర విభజన చేయడం వల్ల అప్పులే మిగిలాయని, కనీసం ఇంటికో రుణమైనా మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. దీనిపై ఆర్బీఐతో మాట్లాడుతున్నానన్నారు. దేశంలోనే అత్యున్నత రాజధానిని నిర్మిస్తానని చెప్పారు. ఈ సమయంలో ఓ రైతు కల్పించుకుని ‘రాజధాని సంగతి తర్వాత, ముందు రైతులను పట్టించుకోండి, పంటకు గిట్టుబాటు ధర రావడం లేద’నడంతో ప్రత్యేక నిధి సమకూర్చి ధరలను క్రమబద్దీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీతంపేట, బయ్యనగూడెంలో మహిళలు డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చేస్తానని, కొంత సమయం ఇవ్వాలని చెప్పిన చంద్రబాబు ముందుకు సాగారు. బయ్యనగూడెం సెంటర్లో మాట్లాడుతూ సెల్ఫోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలని సూచించారు. రౌడీలుంటే తోకలు కట్ చేస్తానని, వారికి రాష్ర్టంలో ఉండే హక్కులేదని చంద్రబాబు హెచ్చరించారు. అక్కడి నుంచి పొగాకు బోర్డు కార్యాలయూనికి చేరుకుని పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ర్టంలోనే నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసే జిల్లా ఇదేనని అన్నారు. సాయంత్రం 4 గంటలకు కనకాద్రిపురం (ఆరిపాటి దిబ్బల) గ్రామంలో డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. డ్వాక్రా రుణమాఫీ కచ్చితంగా చేసితీరుతానన్నారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్లో కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. వెల్డన్ సుజాత మంత్రి పీతలకు సీఎం ప్రశంస సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వెల్డన్ సుజాత. జిల్లా టూర్ బాగానే జరిగింది. అందరూ..పాజిటివ్ మైండ్స్తో ఉన్నారు. జిల్లాకు మంచి చేద్దాం. ఇక్కడ వనరులను మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ దిశగా దృష్టి కేంద్రీకరించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గనులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతను అభినందిస్తూ సూచనలు చేశారు. సీఎం రెండురోజుల పర్యటన మొత్తం దాదాపుగా మంత్రి సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గం, సమీప గ్రామాల్లోనే సాగింది. తొలిరోజు బుధవారం గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనం అనంతరం చంద్రబాబు చింతలపూడి పరిధిలోని తాడిచర్ల, కామవరపుకోట, ఉప్పలపాడు, రావికంపాడు, దేవులపల్లి, గుర్వాయిగూడెం, జంగారెడ్డిగూడెంలో పర్యటించి రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఇక్కడెక్కడా రైతులు, మహిళలతో ఇబ్బంది లేకుండా సుజాత జాగ్రత్తలు తీసుకున్నారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిన చంద్రబాబుకు ప్రజల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించినప్పటికీ జిల్లాలో తన రెండురోజుల భారీ షెడ్యూల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగడంతో ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
వచ్చారు.. ఏమిచ్చారు
ఎన్నికల వేళ ‘వస్తున్నా.. మీ కోసం’ అంటూ చంద్రబాబు నాయుడు ఊరూవాడా తిరిగారు. ఎన్నెన్నో హామీలు కురిపించారు. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చారు. ఊరూరా పర్యటించారు. అన్ని స్థానాలను టీడీపీకి కట్టబెట్టిన మన జిల్లాకు ఆయన రాకతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు సామాన్య ప్రజలు సైతం ఆశగా ఎదురుచూశారు. అయితే, జిల్లా అభివృద్ధి విషయంలో చంద్రబాబు కనీసం నోరు మెదపకపోవడంతో వారంతా నిశ్చేష్టులయ్యూరు. ‘ఆ జిల్లాకు ఎయిమ్స్.. పక్క జిల్లాకు ఎయిర్పోర్టు.. మరో జిల్లాకు పెట్రో కారిడార్.. ఆ శివారు జిల్లాకు ఐటీ హబ్.. ఇంకో జిల్లాకు యూనివర్సిటీ’ అంటూ ఇతర జిల్లాల అభివృద్ధి విషయంలో ప్రకటనలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి మన జిల్లాకు అలాంటివేమీ ప్రకటించకుండానే వెళ్లిపోయూరు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని రైతులు, డ్వాక్రా మహిళలు అడిగితే డబ్బుల్లేవన్నారు. ‘మేం అడక్కుండానే రుణమాఫీ హామీ ఇచ్చారుగా..’ అని నిలదీస్తే ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయూ..’ అంటూ అసహనంతో ఊగిపోయూరు. ‘ఇదేంటి బాబూ..’ అని అడిగిన రైతును ‘నీ సంగతి తేలుస్తా’నంటూ హుంకరించారు. మీ చావు మీరు చావండన్నట్టు జిల్లాను అభివృద్ధి చేయూల్సిన బాధ్యత అధికారులదేనంటూ హితబోధ చేశారు. మొత్తానికి ఊరడింపులు.. ఈసడింపుల నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండురోజుల పర్యటన సాఫీగా సాగిపోరుుంది. జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు * పొరుగు జిల్లాలకు వరాలు * ‘పశ్చిమ’కు మాత్రం నిండు సున్నాలు * కొత్త ప్రాజెక్టులపై నోరు మెదపని సీఎం * ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నేతల్లో నిరాశ * రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో * రైతులు, డ్వాక్రా మహిళల్లో నిస్పృహ సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనపై గంపెడాశలు పెట్టుకున్న జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. సీఎం రెండురోజుల పర్యటన సందర్భంగా జిల్లాకు కీలక ప్రాజెక్టులు ఏమైనా వస్తాయని ఆశించిన వారికి భంగపాటే ఎదురైంది. బుధ, గురువారాల్లో గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరి దిలోని గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు జిల్లాకు కొత్తగా ఏదైనా ప్రాజెక్టు ఇస్తున్నామని గాని, అభివృద్ధికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని గాని ప్రకటన చేయకుండానే గురువారం సాయంత్రం హైదరాబాద్కు పయనమయ్యూరు. ‘ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది. టీడీపీ అధికారంలోకి రావటానికి ఇక్కడి ఫలితాలే కీలకం. అందుకే రాష్ట్రంలో తొలి పర్యటనను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాను. జిల్లాను నంబర్-1 చేస్తా’నని తొలిరోజు చెప్పిన చంద్రబాబు జిల్లా ప్రజల్లో ఆశలు రేపారు. ఇందుకు సంబంధించి గురువారం ఏదైనా ప్రకటన చేస్తారని జిల్లా ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నేతలు ఆశించారు. అయితే గురువారం అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జంగారెడ్డిగూడెంలో సమీక్ష నిర్వహించిన ఆయన జిల్లా అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు చేశారే కానీ.. కొత్త ప్రాజెక్టుల ఊసెత్తలేదు. ఇక్కడ అపారంగా ఉన్న సహజ, శక్తి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారేగాని ఇదిగో ఈ ప్రాజెక్టు ఇస్తున్నాం లేదా త్వరలో ఇస్తాం అనే దిశగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీనిపై టీడీపీ నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది. దీనిపై ఏలూరు ఎంపీ మాగంటి బాబు లోలోన మదనపడుతూనే పైకి మాత్రం ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని విలేకరుల ఎదుట చెప్పుకొచ్చారు. రైతుల ధర్మాగ్రహం రుణమాఫీపై ఈ జిల్లాలోనే స్పష్టత వస్తుందని.. కనీసం ఆశావహ ప్రకట నైనా చేస్తారని ఎదురుచూసిన రైతులు తొలిరోజు అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో గురువారం ఒక్కసారిగా చంద్రబాబుపై తిరగబడ్డారు. గురువారం నాటి పర్యటనలో అడుగడుగునా ఆయనకు నిరసన ధ్వనులే వినిపించాయి. నరసన్నపాలెం, బయ్యనగూడెం, కొయ్యలగూడెంలలో రైతులు రుణమాఫీ జాప్యంపై నిరసన వ్యక్తం చేశారు. ముఖాముఖి చర్చల్లో నేరుగా చంద్రబాబును నిలదీశారు. వీలైనంత త్వరగా రుణమాఫీ విషయం తేల్చాలని గట్టిగా అడిగారు. మలి రోజు కానరాని జోష్ తొలిరోజు పర్యటనలో చంద్రబాబు ఆగిన ప్రతిచోటా వందలాదిగా కనిపించిన జనం గురువారం మాత్రం పదుల సంఖ్యలోనే కనిపించారు. కొయ్యలగూడెం మెయిన్ సెంటర్లో సైతం వందమందికి మించి జనం కనిపించలేదు. దీంతో బాబు కూడా ఒకింత అసహనానికి గురయ్యారు. తొలిరోజు బాబు వెంట కనిపించిన మంత్రులు, సీనియర్ నాయకులు కూడా గురువారం నాటి పర్యటనలో కానరాలేదు.