Catholic Church
-
దైవం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి
వాటికన్ సిటీ: కొత్తగా ఎన్నికైన పోప్ లియో 14 తన మొదటి ప్రార్థనను నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దైవం పట్ల విశ్వాసాన్ని కలిగించాలని, విశ్వాసం లేకపోవడాన్ని తీవ్రంగా ఎదుర్కోవాలని కాథలిక్ చర్చికి పిలుపునిచ్చారు. చర్చిలు ఈ ప్రపంచంలోని చీకటి రాత్రులను ప్రకాశవంతం చేసే దీపస్తంభాలని, నిర్వహణలో విశ్వసనీయంగా ఉంటానని చెప్పారు. 267వ పోప్గా ఎన్నికైన మరుసటి రోజు ఆయన కార్డిన్సల్ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు విశ్వాసానికి దూరమై, సాంకేతికత, డబ్బు, విజయం, అధికారం, ఆనందం వైపు మొగ్గచూపుతున్న ఈ సమయంలో విశ్వాసాన్ని అసంబద్ధంగా భావించే ప్రమాదముందని హెచ్చరించారు. ఇందుకు ప్రచారం అవసరమని గుర్తు చేశారు. ‘విశ్వాసం లేకపోవడమంటే జీవితం అర్థాన్ని కోల్పోవడం, దయను విస్మరించడం, మానవ గౌరవాన్ని ఉల్లంఘించడం, కుటుంబ సంక్షోభమని.. ఇది సమాజానికి చెడు గాయాలను చేస్తుందని ఇటాలియన్లో ప్రసంగించారు. 69 ఏళ్ల పోప్ లియో బంగారంతో అలంకరించిన తెల్లటి పాపల్ వ్రస్తాన్ని ధరించి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాటికన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. మే 18న అధికారిక ప్రమాణ స్వీకారం నూతన పోప్ లియో14 మే 18న అధికారికంగా పోప్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన సెయింట్ పీటర్స్ స్క్వేర్లో మొదటి బహిరంగ ప్రార్థన నిర్వహిస్తారు. ఆ తరువాత మొదటి సాధారణ సమావేశం మే 21న జరగనుంది. అయితే.. పోప్ ఫ్రాన్సిస్ మరణంతో సాంకేతికంగా ఉద్యోగాలు కోల్పోయిన వాటికన్ సంస్థల అధిపతులు, సభ్యులందరూ తదుపరి నోటీసు వచ్చేవరకు పదవిలో ఉండాలని లియో కోరారు. పోప్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ పోప్ లియో 14కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘పోప్ లియో 14కు భారత ప్రజల నుంచి హృదయపూర్వక అభినందనలు. శుభాకాంక్షలు. శాంతి, సామరస్యం, సంఘీభావం, సేవ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో కాథలిక్ చర్చి నాయకత్వం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన భాగస్వామ్య విలువలను పెంపొందించడానికి హోలీ సీతో నిరంతర చర్చలకు భారతదేశం కట్టుబడి ఉంది’’అని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. పోప్కు రాహుల్గాంధీ అభినందనలు 2వేల ఏళ్ల చరిత్ర కలిగిన కాథలిక్ చర్చికి మొట్టమొదటి అమెరికన్ పోప్గా ఎన్నికైన కార్డినల్ రాబర్ట్ ప్రెవోస్ట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం అభినందించారు. ‘పోప్ లియో 14కు అభినందనలు. ఆయన నాయకత్వంలో శాంతిని, కరుణను, మానవాళికి సేవను పెంపొందించాలి. ఈ సంతోషకరమైన సందర్భంలో ప్రపంచ కాథలిక్ కమ్యూనిటీకి నా శుభాకాంక్షలు’’అని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. -
మానవీయ మతగురువు
నేను ఒకసారైనా పోప్ ఫ్రాన్సిస్ని కలిసి ఉండాల్సింది. ఆయన విషయంలో తప్ప, ఇతర ప్రముఖుల గురించి ఎప్పుడూ ఇలా అనుకోలేదు. పోప్ ముఖంలో ఎప్పుడూ కరుణ, ఆప్యాయత, ఆనందం ఉట్టిపడుతూ ఉండేవి. ఆయన నవ్వుతూ ఉండేవారు. నవ్విన ప్రతిసారీ ఆ కళ్లు వెలుగులు ప్రసరించేవి. అది పెదవుల మీద చిందే మామూలు మందహాసం కాదు. గుండె లోతుల్లోంచి వచ్చినట్లుంటుంది. సహజమైనది. చిన్నారుల పట్ల ఆయన ఎంతో వాత్సల్యం ప్రదర్శించేవారు. అందులోనూ నిజాయతీ కనిపించేది. పోప్ మరణం తర్వాత నేను ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వాటితోనే నాకాయన ఎంతో ప్రేమాస్పదుడు అయ్యారు.క్యాథలిక్ చరిత్రలో పరమ పూజ్యుడిగా గుర్తింపు పొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పేరును పోప్ తన ‘పాపల్ నేమ్’గా స్వీకరించారు. ఆ ఇటాలియన్ మార్మికుడి మాదిరిగానే పోప్ అతి నిరాడంబరంగా జీవించారు. పోప్ అధికారిక నివాసమైన వ్యాటికన్ ప్యాలెస్ను (దీన్నే గ్రాండ్ పాపల్ హోమ్ అంటారు) కాదని అక్కడి అతిథి గృహంలోని ఓ చిన్న రెండు గదుల అపార్టుమెంటులో ఉన్నారు. ఆయన ఎంత సాదాసీదాగా ఉండేవారంటే, తను వేసుకునే బ్రౌన్ కలర్ షూస్ బాగా నలిగిపోయి ఉండేవి. గార్డులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం ఆయనకు పరిపాటి. కార్మికులు తినే క్యాంటిన్లోనే తరచూ భోజనం చేసేవారు. ప్రీస్ట్ కావటానికి ముందు బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)లో ఫ్రాన్సిస్ ఒక బౌన్సర్ ఉద్యోగం చేశాడంటే నమ్మగలరా? ఇతర ప్రీస్టుల కంటే భిన్నంగా ఉండటా నికి బహుశా అదొక కారణం అయ్యుంటుంది. పేదల పక్షం ఉండటమే ఈ పోప్ తత్వం. వారి కళ్లలో ఆయనకు చర్చి కనబడేది. కాబట్టే ఆయన్ను మురికివాడల బిషప్పు అని పిలుచుకునేవారు.2023 అక్టోబరులో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైనప్పటి ఉదంతమిది: గాజాలో హోలీ ఫెయిత్ చర్చి ఉంది. ఆ ఏకైక క్యాథలిక్ చర్చిలోనే క్రైస్తవులు, ముస్లిములు తల దాచుకున్నారు. వారి కోసం ప్రార్థించడానికి, వారికి ఊరడింపుగా ఉండటానికి పోప్ రాత్రి సమయాల్లో వాటికన్ నుంచి ఫోన్ చేసేవారు. ప్రపంచానికి తెలియని ఇలాంటి ఎన్నో అద్భుతమైన పనులు ఆయన చేశారు. వాటిలో ఇదొకటి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా తాను అనుకున్నది చేయడం సెయింట్ ఫ్రాన్సిస్ స్వభావం. అలా ఉండటానికే పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇష్టపడేవారు. ఈ విషయాలు తెలిసిన ఆయన సన్నిహితులు సైతం వాటిని అందరి దృష్టికీ తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. స్వలింగ సంపర్కం పట్ల క్యాథలిక్ చర్చి వైఖరి కఠినంగా ఉంటుంది. ఈ కాఠిన్యాన్ని సడలించిన మొట్ట మొదటి పోప్... ఫ్రాన్సిస్సే! తన విమర్శకులను ఉద్దేశించి, మంచో చెడో ‘‘తీర్పు చెప్పడానికి నేనెవరిని?’’ అని ప్రశ్నించారు. విడాకులు తీసుకున్నవారు, పునర్వి వాహం చేసుకున్నవారు ‘సాక్రమెంటు’ స్వీకరించడంలో తప్పు లేదని చెప్పిన మొదటి పోప్ కూడా ఆయనే. నలుగురు మితవాద కార్డినల్స్ బాహాటంగా వ్యతిరేకించినప్పటికీ పోప్ తన అభిమతం మార్చుకోలేదు.గర్భనిరోధం, గర్భస్రావం, స్వలింగ వివాహాలు, ట్రాన్స్జెండర్లకు గుర్తింపు వంటి అంశాల్లో ఆయన సంప్రదాయానికి లోబడి వ్యవహరించారు. ఏదేమైనా, ఆనవాయితీలను అధిగమించి నూతన భావనలు ప్రవేశపెట్టడాన్నే ఆయన ఇష్టపడేవారు. ఎంత తిరిగినా మళ్లీ అక్కడకే వస్తాం... పోప్ ఫ్రాన్సిస్ సామాన్య జనం గురించి తపన పడేవాడు. వలసదారులు, శరణార్థుల సమస్యపై ఆయన తీసుకున్న వైఖరి దీన్ని రుజువు చేస్తుంది. పోప్ హోదాలో తన తొలి పర్యటనకు ల్యాంపెడుజా అనే ఇటలీ ద్వీపాన్ని ఎంచుకున్నారు. ఉత్తర అమెరికా అక్రమ వలసదారు లను కలిసి వారి సమస్య పరిష్కరించడమే ఈ పర్యటన ఉద్దేశం. తాను జబ్బు పడటానికి కొన్ని వారాల ముందు కూడా, అక్రమ వలసదారులను నేరస్థులుగా పరిగణిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన విధానాలను పోప్ విమర్శించారు. మరే ఇతర దేశాధిపతీ ఇంతగా తెగించి ఉండడని వ్యాఖ్యానించారు. ఇస్లాంతో అధికారికంగా చర్చ జరిపిన మొట్ట మొదటి పోప్ కూడా ఆయనే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆయన బహిరంగ ‘మాస్’ నిర్వ హించారు. అరబ్ ద్వీపకల్పంలో ఇలా చేయడం ఇదే ప్రథమం. ఈ మతాంతర సౌభ్రాతృత్వ చర్యల మీద మితవాదులు దాడి చేశారు. వారిని ఆయన అసలు పట్టించుకోలేదు. పోప్ జీవితంలో వైఫల్యాలు లేవని చెప్పలేం. ముఖ్యంగా వాటికన్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించలేక పోయారు. ఈ కేసులో కార్డినల్ ఏంజెలో బెచూ మీద ఆరోపణలు రుజువు అయ్యాయి. 2023లో జైలు శిక్ష కూడా పడింది. అంతిమంగా, పోప్ ఈ సమస్యను విస్తృత స్థాయిలో ఎదుర్కోలేక పోయారనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ముందున్న వారెవరూ ఆయన కంటే సమర్థులు కారు. ఏమైనప్పటికీ, ఫ్రాన్సిస్ తన తర్వాత కూడా క్యాథలిక్ చర్చ్ తన ఆకాంక్షలకు అనుగుణంగా నడిచేలా జాగ్రత్తపడ్డారు. ఆయన వారసుడిని ఎన్నుకునే అర్హత 135 మంది కార్డినల్స్కు ఉంటుంది. వారిలో 108 మందిని తనే నియమించారు. అందులో యూరోపి యన్లు 53 మంది కాగా, 82 మంది ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, ఓసియానియా (ఆస్ట్రేలియా సహా అనేక ఇతర పసిఫిక్ దీవులు) ప్రాంతాల వారే! అంటే, ఆయన వారసుడు మరో యూరపే తరుడు అవుతాడా? అవకాశాలు అలానే ఉన్నాయి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చర్చిలో కాల్పులు.. ఆరుగురు మృతి
ఔగడొగొ: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోకు ఉత్తరాన ఉన్న డాబ్లో నగరంలోని ఓ క్యాథలిక్ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ మత బోధకుడు సహా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రార్ధనలు జరుగుతుండగా సాయుధులైన కొందరు చర్చిలోకి చొరబడ్డారని డాబ్లో నగర మేయర్ ఉస్మానె జోంగో చెప్పారు. చర్చిలో ఉన్నవారు పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు కాల్పులు జరిపారని చెప్పారు. అనంతరం చర్చికి, పలు దుకాణాలకు నిప్పు పెట్టారని జోంగో వివరించారు. స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని దోపిడీ చేశారని, చీఫ్ నర్స్ వాహనాన్ని తగులబెట్టారని చెప్పారు. దేశంలో క్రైస్తవ, ముస్లిం మత గురువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్లో 2015 నుంచి ఇప్పటివరకు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. -
చర్చి లక్ష్యంగా పేలుళ్లు
మనీలా: బాంబు పేలుళ్లతో ఫిలిప్పీన్స్ దేశం దద్దరిల్లింది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని కేథలిక్ చర్చ్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆప్రాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 15 మంది పౌరులు, ఐదుగురు భద్రతాసిబ్బంది ఉన్నారు. సైనిక బలగాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఆదివారం చర్చి ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. తొలిబాంబు పేలుడుతో చర్చి ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. నిమిషం వ్యవధిలో మరో బాంబుపేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండో బాంబును చర్చివద్ద నిలిపివున్న బైక్కు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం ముందు జాగ్రత్తగా అధికారులు సెల్ఫోన్ సిగ్నల్స్ను ఆపివేశారు. ‘ఇది దేశ విద్రోహుల చర్య, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు. ముష్కరులకు తగిన బుద్ధి చెబుతాం’అని దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుతెరో ప్రకటించారు. అబూ సయ్యఫ్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొద్దికాలంగా బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నారు. అమెరికాలో ఐదుగుర్ని చంపిన ఉన్మాది న్యూఆర్లిన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో డకోటా థిరియట్(21) అనే ఉన్మాది రెచ్చిపోయాడు. సొంత తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిని కూడా హ్యాండ్గన్తో కాల్చిచంపాడు. అనంతరం ఓ కారులో పరారయ్యాడు. లూసియానాలోని అస్కెన్షన్ ప్రాంతానికి చెందిన థిరియట్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం(స్థానిక కాలమానం) ప్రియురాలు సమ్మర్ ఎర్నస్ట్(20) ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమెతో పాటు యువతి తండ్రి బిల్లీ(43), తమ్ముడు టానర్(17)ను చంపేశాడు. అనంతరం అక్కడే ఉన్న కారులో లివింగ్స్టన్లో ఉంటున్న తల్లిదండ్రులు కీత్(50), ఎలిజబెత్(50) వద్దకు చేరుకుని వారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న డకోటా థిరియట్ కోసం గాలింపును ప్రారంభించారు. ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. -
పోప్ పాల్ Vఐకు సెయింట్ గౌరవం
వాటికన్ సిటీ: 1960ల్లో క్యాథలిక్ చర్చిలో రెండవ వాటికన్ మండలి ద్వారా సమూల మార్పులు తీసుకొచ్చిన పోప్ ఆరవ పాల్ను సెయింట్గా గుర్తించి గౌరవించనున్నట్లు వాటికన్ బుధవారం ప్రకటించింది. శాన్ సాల్వడార్లో క్రైస్తవ ప్రధాన మతగురువుగా పనిచేస్తూ 1980ల్లో సామాజిక న్యాయం, ప్రజల అణచివేతలపై ప్రశ్నించి హత్యకు గురైన ఆస్కార్ రొమెరోకు కూడా సెయింట్హుడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పోప్ ఫ్రాన్సిస్ మంగళవారమే సంతకం చేశారు. -
చర్చ్ సభ్యులపై పోప్ ఆగ్రహం
సంస్కరణలు అడ్డుకుంటున్నారని ధ్వజం వాటికన్ సిటీ: వాటికన్ చర్చ్లో సంస్కరణల అమలులో ఎదురవుతున్న వ్యతిరేకతను పోప్ ఫ్రాన్సిస్ గురువారం తీవ్రంగా తప్పుపట్టారు. ఆ వ్యతిరేకతలో కొన్ని దైవదూత వలే వేషం వేసుకున్న దుష్ట శక్తి ప్రోద్బలంతో జరుగుతున్నాయన్నారు. గురువారం క్రిస్మస్ శుభాకాంక్షల సందేశంలో భాగంగా... తన బృందంలోని సభ్యులు క్యాథలిక్ చర్చ్ కోసం పనిచేయాలంటే కచ్చితంగా శాశ్వత పరిశుద్ధులుగా ఉండాలన్నారు. వరుసగా మూడో ఏడాది కూడా పోప్ వాటికన్ అధికార యంత్రాగం తీరుపై విమర్శలు గుప్పించారు. 2013లో తాను ఎన్నుకున్న సంస్కరణల ప్రకియ లక్ష్యం వాటికన్ చర్చ్లో పైపై మార్పుల కోసం కాదని... తన సహచరుల్లో పూర్తి స్థాయి మానసిక మార్పే లక్ష్యమని పేర్కొన్నారు. ‘ప్రియ సహోదరులారా... చర్చికి ఏర్పడ్డ ముడతల కోసం కాదు... మరకల గురించి మీరు భయపడాలి’ అని సందేశమిచ్చారు. -
కేథలిక్ చర్చిలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: నగరంలోని ఓ కేథలిక్ చర్చిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం గం 7.15 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తూర్పు ఢిల్లీలోని దిల్షాద్గార్డెన్ ప్రాంతంలోగల సెయింట్ సెబాయిస్టియన్ చర్చిలో ఉదయం ఉదయం గం 7.15 నిమిషాలకు పొగలు రావడాన్ని చౌకీదార్ గమనించాడు. దీంతో అతను ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖతోపాటు చర్చి నిర్వాహకులకు చేరవేశాడు. ఈ సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ నాలుగు వాహనాలతో అక్కడి కి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వారికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ఈ విషయమై చర్చి ఫాదర్ స్టాన్లీ మాట్లాడుతూ తొలుత ప్రార్థనా మందిరంలో మొదలైన మంటలు ఆ తరువాత రెండో అంతస్తుకు వ్యాపించాయన్నారు. ఈ చర్చిలో సర్వం దగ్ధమైందని, అసలేమీ మిగలలేదని అన్నారు. కాగా ఈ చర్చి హిందువులు, కైస్త్రవులు కలగలిసి జీవనం సాగించే ప్రాంతంలో ఉంది. ఈ చర్చి సంరక్షుడొకరు మాట్లాడుతూ 2001లో ఐదువేల మంది క్రైస్తవులు ఇక్కడ నివసించేవారన్నారు. ఇదే విషయమై డీసీపీ ఆర్.ఎ.సంజీవ్ మాట్లాడుతూ కిటికీ అద్దాలు పగిలిపోయి కనిపించాయన్నారు. అంతేకాకుండా త్వరగా కాలిపోయే స్వభావం కలిగిన వస్తువులు కూడా ఇక్కడ తమకు లభించాయన్నారు. అంటే దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే విషయం స్పష్టమవుతోందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు. షార్ట్సర్క్యూట్కూ అవకాశం లేకపోలేదన్నారు. కాగా ఈ ఘటనకు నిరసనగా ఐటీఓ ప్రాంతంలోని పోలీస్స్టేషన్ ఎదుట కొన్ని క్రైస్తవ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. చర్చిని సందర్శించిన ఆప్ నేత అరవింద్: అగ్నిప్రమాదం చోటుచేసుకున్న తూర్పు ఢిల్లీలోని దిల్షాద్గార్డెన్ ప్రాంతంలోగల సెయింట్ సెబాయిస్టియన్ చర్చిని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు.