Black Hawk helicopter
-
రెండు ఫైటర్ జెట్ల కూల్చివేత
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఒక్క రోజే రెండు అత్యాధునిక యుద్ధ విమానాలను కోల్పోయింది. ఇరాక్లో ఒక బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా కోల్పోయినట్టు సమాచారం! అత్యాధునిక ఎఫ్–35, ఎఫ్–15ఇ యుద్ధ విమానాలను తమ గగనతలంపై కూల్చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఎఫ్–35 పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేనట్టేనని పేర్కొంది. ఎఫ్–15ఇ పైలట్తో పాటు గన్నర్ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం. వారు ఇరాన్ భూభాగంపై సురక్షితంగా దిగినట్టు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. దాంతో వారిని కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కమాండో దళాలు, బంధించేందుకు ఇరాన్ సైన్యాలు ముమ్మరంగా గాలింపు చర్యలకు దిగాయి. వారిలో ఒకరిని అమెరికా దళాలు సురక్షితంగా కాపాడి ఇరాన్ బయటికి తరలించినట్టు ఇజ్రాయెల్కు చెందిన చానల్ 12 పేర్కొంది. రెండో వ్యక్తి విషయమై గందరగోళం నెలకొంది. అతను ఇప్పటికే ఐఆర్జీసీకి చిక్కినట్టు ఇరాన్కు చెందిన టాస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. అదేమీ లేదని, అతన్ని కూడా కాపాడేందుకు అమెరికా ప్రత్యేక దళాలు ఇంకా ప్రయత్నిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఐబీ కూడా సదరు ‘అమెరికా సైనికుడు’కనిపించిన వెంటనే కాల్చేయాల్సిందిగా స్థానిక ప్రజలకు పిలుపునిచ్చింది. కాసేపటికే, ‘‘అతన్ని ప్రాణాలతో పోలీసులకు పట్టించండి. అందుకు భారీ బహుమానం కూడా ఉంటుంది’’అంటూ ప్రకటించింది! రెస్క్యూ ఆపరేషన్లో బాగంగా ఘటనా స్థలిపై అమెరికా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలను కూడా ప్రసారం చేసింది. అమెరికా యుద్ధ విమానం తాలూకు శకలాలను ఇరాన్ సైన్యం ట్రక్కుల్లో తరలిస్తున్న దృశ్యాలు ఇరాన్ వార్తా చానళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ దర్శనమిచ్చాయి. మరోవైపు అమెరికాకు చెందిన యూహెచ్–60 బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా ఇరాక్లో నేలకూల్చినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాక్ వర్గాలను ఉటంకిస్తూ టాస్నిం వార్తా సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. ఎఫ్–15ఇ యుద్ధ విమానం కూల్చివేత గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నివేదించినట్టు వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు తెలిపారు. ఎఫ్–35, బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా కోల్పోయామన్న వార్తలపై మాత్రం అమెరికా అధికారికంగా స్పందించలేదు. ఒక్కో విమానం రూ. 940 కోట్లు! ఎఫ్–35, ఎఫ్–15ఇ యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికాకు సైనికంగానే గాక ఆర్థికంగా కూడా ఎదురు దెబ్బే. ఇవి ఐదో తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు. ఒక్కదాని ఖరీదు 10 కోట్ల డాలర్ల (రూ.940 కోట్ల) దాకా ఉంటుంది! ఎఫ్–35 యుద్ధ విమానాన్ని శుక్రవారం ఉదయమే సెంట్రల్ ఇరాన్లో కూల్చేసినట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ అధునాతన డిఫెన్స్ సిస్టం దన్నుతో అత్యంత కచ్చితత్వంతో పని పూర్తి చేసినట్టు పేర్కొంది. సదరు విమానం లాకెన్హీత్ స్క్వాడ్రన్కు చెందినదని కూడా తెలిపింది. ‘‘మా దాడిలో విమానం పూర్తిగా దెబ్బ తిని కుప్పకూలింది. పైలట్ సురక్షితంగా బయట పడే అవకాశం లేనట్టే’’అని చెప్పుకొచ్చింది. మార్చి 19న కూడా ఒక అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం తెలిసిందే. దాంతో ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటికే రెండు ఎఫ్–35లను నష్టపోయింది. ఇక ఎఫ్–15ఇ యుద్ధ విమానం దక్షిణ ఇరాన్లోని పర్వతమయ కోహ్కిలోయే, బోయర్–అహ్మద్ ప్రాంతంలో నేలకూలినట్టు సమాచారం. ఇది రాజదాని టెహ్రాన్కు 500 కి.మీ. దూరంలో ఉంటుంది. పొరుగునున్న చహర్మహల్, భక్తియారీ ప్రావిన్స్లో కూడా శత్రు పైలట్ కోసం వెదకాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. యుద్ధంలోకి ఇరానీ బాలలు బాలలను కూడా ఇరాన్ యుద్ధ రంగంలోకి పంపుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘12 ఏళ్ల పసివాళ్లకు కూడా రివల్యూషనరీ గార్డ్, బసిజ్ ఫోర్స్ తదితర విభాగాల్లో చేర్చుకుంది. వారి చేతికి ఆయుధాన్నిచ్చి కీలక ప్రాంతాల్లో పహారా విధుల్లో నియమించింది’’ అని పేర్కొంది.మొసాద్ భవనం ధ్వంసంఇజ్రాయెల్ నిఘా విభాగమైన మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం నాటి దాడుల్లో నేలమట్టం చేసినట్టు ఇరాన్ పేర్కొంది. టెల్ అవీవ్లో మంటల్లో కాలిపోతున్న భవనం తాలూకు ఫుటేజీని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ విడుదల చేసింది. దానిపై ఇరాన్ సైన్యం అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడి జరిపినట్టు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు.జోర్డాన్లోనూ అమెరికా యుద్ధ విమానాలపై దాడిజోర్డాన్లోని అల్ అజ్రాక్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా యుద్ధ విమానాలపై భారీగా దాడులు జరిపినట్టు ఇరాన్ ప్రకటించింది. గురువారం రాత్రి వాటిపై డ్రోన్లతో విరుచుకుపడ్డట్టు పేర్కొంది. ఈ దాడిలో విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందీ వెల్లడించలేదు. అమెరికా నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. యూఎస్ రాడార్ ధ్వంసం! ఇరాన్ దాడుల్లో అత్యంత ఖరీదైన ఏఎన్/టీపీవై–2 రాడార్ను అమెరికా నష్టపోయినట్టు తెలుస్తోంది. గత నెలలో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఇ–3 విమానం, మరో రీ ఫ్యూయలింగ్ విమానంతో పాటు ఈ రాడార్ కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ రాడార్ అభివృద్ధికి అమెరికా 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,200 కోట్లు) వెచ్చించింది. భారతీయులకు గాయాలు అబుదాబిలోని అజ్బాన్ ప్రాంతంలో సహజవాయు క్షేత్రంపై ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు దిగింది. వాటి శకలాలు తగిలి ఐదుగురు భారతీయులు, ఆరుగురు నేపాలీలు స్వల్పంగా గాయపడ్డారు. మరో నేపాలీ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు అబుదాబి మీడియా ఎక్స్ పోస్టులో వెల్లడించింది. రంగంలోకి జెరాల్డ్ ఫోర్డ్ అమెరికా విమానవాహక యుద్ధ నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మళ్లీ యుద్ధ విధుల్లో చేరినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మార్చిలో జరిగిన అగ్నిప్రమాదంలో నౌక పాక్షికంగా దెబ్బ తినడం తెలిసిందే. దాంతో మరమ్మతుల నిమిత్తం దాన్ని గ్రీస్కు తరలించారు. హార్మూజ్ దాటిన ఫ్రెంచి నౌక ఫ్రాన్స్కు చెందిన ఒక కంటైనర్ నౌక శుక్రవారం హార్మూజ్ జలసంధిని దాటింది! యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ జలసంధిని దాటిన తొలి యూరప్ నౌకగా ఇది నిలిచింది. ఇరాన్లో బ్రిడ్జి పేల్చివేత ఉత్తర ఇరాన్లో అల్బోర్జ్ ప్రావిన్స్లోని కరాజ్లో నిర్మాణంలో ఉన్న భారీ బ్రిడ్జిపై అమెరికా, ఇజ్రాయెల్ రెండు దఫాలుగా దాడులు జరిపాయి. దాంతో బ్రిడ్జి తీవ్రంగా దెబ్బ తింది. ఎనిమిది మంది మరణించారు. ఇందుకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని కీలక బ్రిడ్జిలను నేలమట్టం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే 8 బ్రిడ్జిలను హిట్లిస్ట్లో చేర్చినట్టు ప్రకటించింది. వీటిలో షేక్ జబార్ అల్ అహ్మద్ సీ బ్రిడ్జి (కువైట్), కింగ్ ఫాద్ కాజ్వే (సౌదీ–బహ్రెయిన్ లింక్), షేక్ జాయేద్ బ్రిడ్జ్, షేక్ ఖలీఫా, బ్రిడ్జి (యూఏఈ); కింగ్ హుసేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్, అబ్దౌన్ బ్రిడ్జ్ (జోర్డాన్) ఉన్నాయి. బ్రిడ్జిపై దాడి తాలూకు వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. ‘‘సమయం మించిపోకముందే తమతో ఒప్పందానికి రండి. లేదంటే ఇలాంటి భారీ దాడులను మరింతగా చవిచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఇరాన్ను హెచ్చరించారు. -
ఆర్మీ హెలికాప్టర్లు ఢీకొని..9 మంది మృతి
ఫోర్ట్కాంప్బెల్(అమెరికా): కెంటకీలో అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్బెల్కు 30 మైళ్లదూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. 101 ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన హెచ్హెచ్–60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు రెండూ రాత్రి వేళ జరుగుతున్న రోజువారీ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంత అటవి, కొంతమైదానం ఉన్నాయని కెంటకీ గవర్నర్ ఆండీ చెప్పారు. -
హెలికాప్టర్ కూలి 14 మంది మృతి: నార్కో టెర్రరిస్టు అరెస్టే కారణమా?
మెక్సికో : సినాలోవాలో మెక్సికన్ నేవీ హెలికాప్టర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది. ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో బ్లాక్ హాక్ మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో 14 మంది మరణించారని, మరొకరు గాయపడ్డారని మెక్సికన్ నేవీ శుక్రవారం తెలిపింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. నావీ మోస్ట్ వాంటెడ్ నార్కో టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే ఈ క్రాష్ జరిగి ఉంటుందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. సినాలోవాలో 69 ఏళ్లడ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరో మాక్స్ అనే మిలిటరీ-శిక్షణ పొందిన ఫీమేల్ బ్లడ్హౌండ్కి పట్టుబడ్డాడని నేవీ శుక్రవారం తెలిపింది. అతని అరెస్టు తరువాత హెలికాప్టర్ క్రాష్ కావడం చర్చకు దారితీసింది. అయితే అతని అరెస్టకు ఈ ప్రమాదానికి సంబంధం ఉందన్న సమాచారం ఏమీ లేదని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. 1985లో అమెరికాలోడ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మి నిస్ట్రేషన్ ఏజెంట్ "కికి" కమరేనాను కిడ్నాప్ చేసి. చిత్ర హింసలకు గురిచేసి, హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కరుడుగట్టిన డ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరోను నావికాదళం అరెస్ట్ చేసింది. కమరేనా హత్యకు క్వింటెరోకు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, 28 ఏళ్ల శిక్ష తరువాత 2013లో, మెక్సికన్ న్యాయస్థానం అతనిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇది అమెరికా అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మెక్సికో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని రద్దు చేసే సమయానికి, కారో క్వింటెరో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇరు దేశ దౌత్య సంబంధాలను దెబ్బ తీసింది. ఆ తరువాత సినాలోవా కార్టెల్కు తిరిగి వచ్చి డ్రగ్ దందా మొదలు పెట్టాడు క్వింటెరో. ఎఫ్బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్ల జాబితాలో ఉన్న అతనిపై 20 మిలియన్ల యూఎస్ డాలర్ల బహుమతికూడా ఉంది. ఇది డ్రగ్ ట్రాఫికర్గా రికార్డు. మరోవైపు క్వింటెరో అరెస్టును అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్, కారో క్వింటెరోను తక్షణమే అప్పగించాలని కోరనున్నట్లు తెలిపారు."ఇది చాలా పెద్దవిషయం" అని వైట్ హౌస్ సీనియర్ లాటిన్ అమెరికా సలహాదారు జువాన్ గొంజాలెజ్ ట్వీట్ చేశారు. క్వింటెరో కారో అరెస్ట్తో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అమెరికా, మెక్సికో మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. -
పైలట్ లేకుండా నింగిలోకి..
మనం డ్రైవర్రహిత కార్లు చూశాం. అయితే అమెరికాలో మొదటిసారి పూర్తిస్థాయిలో పైలట్రహిత హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగిరింది. మరి దీన్ని యుద్ధక్షేత్రాల్లో కూడా వినియోగించ వచ్చా? దాని విశేషాలు ఏంటి? ఓ లుక్కేద్దాం! –సాక్షి, సెంట్రల్ డెస్క్ 4వేల అడుగుల ఎత్తులో.... బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఈనెల 5న అమెరికా కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్బెల్ నుంచి పైలట్ లేకుండా టేకాఫ్ అయింది. యూహెచ్–60ఏ బ్లాక్హాక్ అనే ఈ హెలికాప్టర్ ప్రయోగ సమయంలో 30 నిమిషాలపాటు గగనతలంలో చక్కర్లు కొట్టింది. 4వేల అడుగుల ఎత్తులో గంటకు 115–125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. అమెరికా రక్షణ పరిశోధన సంస్థకు చెందిన ‘అలియాస్’ అనే సాంకేతికతను వినియోగించి అందులో పైలట్ లేకుండాహెలికాప్టర్ను ఆపరేట్ చేశారు. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు.. పైలట్ దాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చినప్పుడు స్వయంప్రతిప్రత్తి వ్యవస్థకు అనుసంధానించేలా దీన్ని రూపొందించారు. అంటే పైలట్ బదులు ‘కంప్యూటర్ బ్రెయిన్’ దీన్ని నియంత్రిస్తుంది. అమెరికా రక్షణ ఆయుధాల పరిశోధన ప్రాజెక్టుల సంస్థ (డీఏఆర్పీఏ), లాక్హీడ్ మార్టిన్ సికోర్స్కీ అనే వైమానిక సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. మనుషుల ప్రాణాలను కాపాడొచ్చు... ‘ఎయిర్క్రూ లేబర్ ఇన్–కాక్పిట్ ఆటోమేషన్ సిస్ట మ్ (అలియాస్)’ అనే సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ప్రయాణ సమయంలో ఆటంకాలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని కూడా ఈ ప్ర యోగంలో పరీక్షించారు. మానవరహిత హెలికాప్ట ర్ నేలమీద ల్యాండ్ అయి దాని బ్లేడ్లు తిరగడం ఆగి న తర్వాత ఇద్దరు పైలట్లు అందులోకి వెళ్లి దాన్ని మానవ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం దాన్ని బేస్లోకి తీసుకెళ్లారు. పైలట్కు ఎలాం టి అపాయం కలగకుండా ఉండేందుకు ఈ అటానమస్ హెలికాప్టర్ను యుద్ధక్షేత్రాల్లోకి కూడా పంపవచ్చని అంటున్నారు. యుద్ధానికి అవసరమైన సా మగ్రిని దీని ద్వారా తరలించవచ్చని చెబుతున్నారు. విమానం గగనతలంలో ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా దృశ్యస్పష్టత తగ్గినప్పుడు పైలట్ ఈ సాంకేతికతను ఉపయోగించి అటానమస్ మోడ్కు అనుమతించి ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చని అంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో పైలట్లు ఎలాంటి సంకోచం లేకుండా పూర్తి విశ్వాసంతో అటానమస్ మోడ్కు అనుసంధానించవచ్చని ఫోర్ట్ క్యాంప్బెల్కు చెందిన లీడ్ పైలట్ బెంజమిన్ విలియమ్సన్ చెప్పారు. ‘ఎప్పుడు అవసరమైతే అప్పుడు అటానమీ మోడ్కు, పైలట్ మోడ్కు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ప్రమాదకర పరిస్థితులను గుర్తించడంలో, వాటిని అధిగమించడంలో ఈ సాంకేతికత ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రమాదాలను కూడా నివారించి మనుషుల ప్రాణాలను కాపాడవచ్చు’ అని పేర్కొన్నారు. సురక్షితంగా ల్యాండింగ్... ‘అలియాస్’ అనే సాంకేతికతను బ్లాక్హాక్ హెలికాప్టర్లోగానీ, విమానంలో గానీ వినియోగించడం మొదటిసారి కాదని, మానవరహితంగా గాల్లోకి ఎగరడం, ల్యాండ్ అవడం మాత్రం ఇదే మొదటిసారని సంబంధిత వర్గాలు చెప్పాయి. సాధారణంగా ఎక్కువ విమానాల్లో అటానమస్ సాంకేతికతను పైలట్లకు సహాయకారిగా వాడతారు. అదికూడా చిన్నచిన్న టాస్క్ల కోసమే వినియోగిస్తారు. కానీ సంక్లిష్టమైన, ఊహించని పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ పైలట్లకే వదిలేస్తారు. కానీ బ్లాక్హాక్లో వినియోగించిన ‘అలియాస్’ అనేది మానవప్రమేయం లేకుండా పూర్తిగా అటానమస్ వ్యవస్థమీద ఆధారపడి పనిచేస్తుంది. చిన్నచిన్న పనులే కాకుండా అన్ని రకాల వ్యవహారాలను చక్కపెడుతుంది. అత్యవసర సమయాల్లో కూడా సురక్షితంగా ల్యాండ్ చేసే నైపుణ్యం దీని సొంతం. ఒకవేళ గాల్లో ఎగురుతున్నప్పుడు ఉన్నట్టుండి రెండు ఇంజన్లు కూడా ఫెయిలైతే అప్పుడు కూడా మానవప్రమేయం లేకుండా సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. ఇది పైలట్లు ఉన్నా లేకున్నా కూడా సైనికులకు రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్నివేళలా సహాయకారిగా ఉంటుందని అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ వెల్లడించారు. -
తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!
Helicopter Flew Without Pilot: ఇక నుంచి హెలికాప్టర్లను నడపటానికి ఫైలెట్లు అవసరం ఉండదట. పైగా వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే గలిగే ఫైలెట్ రహిత హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ప్రత్యక సాంకేతికతో రూపొందించిన ఈ చాపర్ 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించి చివరికి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైగా దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో గంటకు 115 నుంచి 125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ఈ విమానం స్వయం ప్రతిపత్తితో పయనించే హెలికాప్టర్. ఇది అలియాస్ అనే యూఎస్ డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్లో భాగంగా పూర్తిగా కంప్యూటర్-ఆపరేటెడ్ హెలికాప్టర్. కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్బెల్ నుంచి ఈ ట్రయల్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లలో పనితీరు ముగిసిన వాటిని తొలగించి, వాటి స్థానంలో అలియాస్ ఈ ఆటోమేటడ్ ఫైలెట్ రహిత హెలికాప్టర్లను భర్తీ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ మేరకు అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ మాట్లాడుతూ..."ఈ రకమైన స్వయంప్రతిపత్త హెలికాప్టర్ సాంకేతికతకు మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది భద్రత తోపాటు భూభాగంలోకి దూసుకెళ్లడం, విపత్తులను నివారించడం. రెండవది హెలికాప్టర్ సహాయకారి. మూడవది ఖర్చు తగ్గింపు. అని పేర్కొన్నాడు. ఇది ఆర్మీకి కార్యాచరణ సౌలభ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇది తప్పనిసరిగా పగలు లేదా రాత్రి అన్ని సమయాల్లో ఈ పైలట్ రహిత హెలికాప్టర్ సులభంగా పయనించడమే కాక క్లిష్టమైన దృశ్యమన రహిత వాతావరణ పరిస్థితిల్లోనూ, విభిన్న క్లిష్ట పరిస్థితిలోనూ సులభంగా పయనించగలిగే వెసులుబాటుని కల్పిస్తోంది. WATCH: A Black Hawk helicopter flew for the first time without pilots in Kentucky. The aircraft flew for 30 minutes through a simulated cityscape avoiding imagined buildings before performing a perfect landing pic.twitter.com/SD01LWhUZe — Reuters Asia (@ReutersAsia) February 12, 2022 (చదవండి: రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక... వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే..) -
యెమెన్లో కూలిన అమెరికా చాపర్
వాషింగ్టన్: అమెరికా సైన్యానికి చెందిన యూహెచ్ 60- బ్లాక్హాక్ హెలికాప్టర్ ఒకటి యెమెన్లో కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్ సహా ఆరుగురు సైనికులు ఉన్నారని, వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఒకరు మాత్రం గల్లంతయ్యారని యూఎస్ ఆర్మీ ప్రకటించింది. యెమెన్ దక్షిణ తీరంలో ఆరుగురు సభ్యులతో కూడిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ను శుక్రవారం సిబ్బంది శిక్షణలో వినియోగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం వెనుక ఉగ్రకోణం దాగున్నది, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు.


