Baloch activists
-
భారత్తో టెన్షన్ వేళ పాక్కు షాక్.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్ఏ
క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్ తగిలింది. పాక్ సైన్యానికి సవాల్ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్ చేసిన బీఎల్ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.బలుచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్ఏ దాడుల్లో వందలాదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్ని హైజాక్ చేసిన బీఎల్ఏ.. పాక్ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్ఏ పాక్ సైన్యం కాన్వాయ్పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG— Char (@cqc_coffee_guns) May 3, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాక్లో ఒక ప్రావిన్స్గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్లో అతి పెద్ద ప్రావిన్స్గా బలూచిస్తాన్ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది.అలాగే ఆ ప్రావిన్స్లో పాక్ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్ఏ యాక్టివ్గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో బీఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది. -
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. పది మంది సైనికులు మృతి
ఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. బెలుచిస్తాన్లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army-BLA)దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.🚨 The Baloch Liberation Army (BLA) has taken responsibility for an improvised explosive device (IED) attack on a Pakistani Army convoy in Margat, near Quetta, on April 25, 2025. According to BLA spokesperson Jeeyand Baloch, the attack was carried out using a remote-controlled… pic.twitter.com/9SmHRfTcyr— The Tradesman (@The_Tradesman1) April 26, 2025ఇక, ఈ దాడితో పాటు బీఎల్ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం.. అంటూ వారు ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.Always a big fan of video editing skills of Baloch Liberation Army 😉https://t.co/LFu7OiouoD— Kriti Singh (@kritiitweets) April 25, 2025ఇదిలా ఉండగా.. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని నెలలుగా BLA కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. తాజా దాడి నేపథ్యంలో ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.10 🐖 s gone! Well done Baloch Liberation Army #Pakistan #PahalgamTerroristAttack #TerrorAttack #Baloch #Kashmir pic.twitter.com/ZavhIoEBjx— Adri chatterjee (@stay_fit_mate) April 26, 2025 -
పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. 10 మంది సైనికులు మృతి!
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో దారుణ ఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్ సైనికుల కాన్వాయ్ను టార్గెట్ చేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడి చేసింది. ఈ క్రమంలో 10 మంది సైనికులు మృతిచెందగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్థాన్లోని క్వెట్టా నుండి టఫ్తాన్కు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. ఎనిమిది ఆర్మీ సిబ్బంది బస్సులు వెళ్తున్న సమయంలో బలూచ్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక బస్సుపై ఆత్మహుతి దాడి చేసింది. ఈ దాడిలో పది మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. పాకిస్తాన్లోని నోష్కి సమీపంలో ఈ దాడి జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ అధికారులు సైతం ధృవీకరించారు. మరోవైపు.. ఈ దాడిని తామే చేసినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. ఈ దాడిలో 90 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఇదిఆ ఉండగా.. ఈ ఘటనలో కేవలం ఏడుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #UPDATE The Baloch Liberation Army has claimed that its "self-sacrificing" squad, the Majeed Brigade, carried out a "Fidayee" attack on a #Pakistan Army convoy consisting of 8 buses in #Noshki.#balochistan #quetta #islamabad #Baloch https://t.co/M5Qczo5bAB pic.twitter.com/LM81CJR69Y— Shekhar Pujari (@ShekharPujari2) March 16, 2025 BREAKING!! 🚨‼️‼️At least 10 #PakistaniSoldiers Killed, 26 Injured in Noshki Ambush when a Frontier Corps (FC) bus was attacked on the N-40 highway in Noshki, #Balochistan. It came under attack while moving from Quetta to Taftan,Baluchistan.#Balochistanattack pic.twitter.com/kJDLQxD8QN— सदप्रयास (@sadprayas) March 16, 2025 -
పాక్ రైలు హైజాక్.. కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలు జాఫర్ ఎక్స్ప్రెస్(Jaffar Express)పై దాడికి దిగి, హైజాక్ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని హతమార్చారు. అయితే రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు.. కౌంటర్ ఆపరేషన్లో మిలిటెంట్లను మట్టు పెట్టాయి. తాజా సమాచారం ప్రకారం.. సైన్యం జరిపిన కాల్పుల్లో 16 మంది రెబల్స్ మరణించారు. ప్రయాణికుల్లో 104 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులతో పాక్ సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మిగిలిన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు మంగళవారం ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’ అని పేర్కొంది. దీంతో, బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.🚨 TRAIN HIJACK IN PAKISTAN.Jaffar Express from Quetta to Peshawar HIJACKED after IED blast by Baloch rebels pic.twitter.com/d9HWcmP2PO— akhilesh kumar (@akumar92) March 12, 2025ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది.బలూచిస్తాన్తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నారు.#TrainHijack Jaffer Express hijack in Pakistan 🇵🇰 The Train 🚂 was on its way from Quetta to Peshawar when it was attached by the Beloch rebels about 150 passengers & 6 military 🎖️ personnel were made hostages #TrainHijack #TRAIN #Balochistan #PakistanTrainHijack #TrainHijack pic.twitter.com/h4rbGREMQT— X highlight*️⃣ (@Abu_officl) March 12, 2025గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటే లక్ష్యంపాకిస్థాన్లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్లో సోవియట్ యూనియన్ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యార్ ఖాన్ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్ నేషనల్ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్తోపాటు అమెరికా, బ్రిటన్ బీఎల్ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఇలా జరిగింది..దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అధీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించారు. ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది. -
బలూచ్ కార్యకర్త మృతి.. పాక్పై అనుమానం
టొరంటో: ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరీమా బలూచ్ మృతదేహాన్ని టొరంటోలో కనుగొన్నారు. 2016లో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని వెళ్లిన కరీమా ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. కెనడా పోలీసులు లేక్షేర్ ప్రాంతంలో ఓ ద్వీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇక కరీమా పాక్ సైన్యం, బలుచిస్తాన్ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో టొరంటో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘కరీమా మరణం వెనక పాక్ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టొరంటో పోలీసులు, కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్ఐఎస్ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల బారి నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. (చదవండి: ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ ) పాకిస్తాన్ ఆక్రమణ నుంచి బలుచిస్తాన్ వేరుపడి స్వేచ్ఛ పొందాలని కరీమా బలంగా కోరుకునేది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో స్థిరపడటాన్ని వ్యతిరేకించే కరీమా ఈ విషయంలో వారిపై పదునైన విమర్శలు చేసేంది. అంతేకాక కరీమా ఎంతో ధైర్య సాహసాలు గల మనిషి. కెనడాలో ఐఎస్ఐ ఆపరేషన్లకు ఆమె అడ్డంకిగా మారింది. ఇక కరీమా మృతికి సంతాపంగా బలోచ్ నేషనల్ మూవ్మెంట్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించకూడాని నిర్ణయించింది. ఇక ‘కెనడాలో ప్రవాసంలో నివసిస్తున్న బీఎస్ఎం నాయకురాలు, బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (బీఎస్ఓ) మాజీ చైర్పర్సన్ కరీమా బలిదానం బలూచ్ దేశానికి, జాతీయ ఉద్యమానికి తీరని నష్టమని’ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ కార్యదర్శి తెలిపారు. "బానుక్ కరీమా మరణంతో, మేము ఒక దూరదృష్టిగల నాయకురాలిని, జాతీయ చిహ్నాన్ని కోల్పోయాము. శతాబ్దాల పాటు పూడ్చలేని నష్టం ఇది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!) ఇక నాలుగేళ్ల క్రితం అంటే 2016లో కరీమా ప్రధాని నరేంద్ర మోదీకి రక్షాబంధన్ సందేశం పంపారు. అదే ఏడాది ఆమె పాక్లో తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో కొందరు స్నేహితులు, కార్యకర్తల సాయంతో దేశం విడిచి పారిపోయారు. ఇక అదే ఏడాది బీబీసీ వెలువరించిన 100మంది అత్యంత ప్రభావవంతైన మహిళల జాబితాలో కరీమా చోటు దక్కించుకున్నారు. -
ముషారఫ్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాది
వాంకోవర్ (కెనడా) : పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని వరల్డ్ బలూచ్ ఉమెన్ ఫోరమ్(డబ్ల్యూబీడబ్య్లూఎఫ్) డిమాండ్ చేసింది. ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న ముషారఫ్ పాకిస్తాన్ న్యూస్ చానల్తో మాట్లాడిన విషయాలను ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుని.. ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డబ్ల్యూబీడబ్య్లూఎఫ్ నాయకురాలు ప్రొఫెసర్ నీలా ఖాద్రి బలూచ్ డిమాండ్ చేశారు. కశ్మీర్లో మారణహోమాన్ని సృష్టిస్తున్న లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవా సంస్థలంటే అభిమానమని.. అలాగే హఫీజ్ సయీద్కు మద్దతుదారుడినని చెప్పడం ద్వారా ముషారఫ్ ఉగ్రవాదాన్ని సమర్థించారని ఆమె అన్నారు. ముషారఫ్ మాట్లాడిన మాటలను సాక్ష్యాలుగా తీసుకుని లష్కరో తోయిబా, జమాతే ఉద్ దవాను ఉగ్రసంస్థలుగా ప్రకటించడంతో పాటు.. ముషారఫ్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఆమె అమెరికాను కోరారు. లష్కరే తోయిబా ఏర్పాటు, విస్తరణ, రిక్రూట్మెంట్లు, ఉగ్రదాడులకు ముషారఫ్ అందించిన సహకారంపై అమెరికా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆమె అమెరికాను కోరారు. ఇదిలా ఉండగా ముషారఫ్ వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. -
'క్రిమినల్ దేశంతో చైనా చేతులు కలపొద్దు'
వాంకోవర్: భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్వేగభరిత ప్రసంగం బలూచిస్థాన్ పౌరులకు గట్టి ధైర్యాన్ని ఇచ్చినట్లుంది. మొన్నటి వరకు స్థానికంగా, ఇటీవల ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించిన ఆ ప్రాంతపౌరులు ఇప్పుడు ఏకంగా పాక్ తో సంబంధంపెట్టుకుంటున్న దేశాల్లో కూడా నిరసనలకు దిగుతున్నారు. తమ పరిస్థితి చూసి కూడా పాక్ తో సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం ముమ్మాటికి తమ హక్కులను ఉల్లంఘించడమే అని వారు నినదిస్తున్నారు. త్వరలోనే వరుసగా మూడు రోజులపాటు కెనాడలోని బలూచిస్థాన్ వాసులు చైనా విదేశాంగ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగనున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఆందోళనలో పాక్తో చైనా సంబంధం పెట్టుకోవడాన్ని నిలదీయనున్నారు. ఈ ఏడాది జులైలో ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ పాక్ లో ఉన్న బలూచ్ వాసులు అష్టకష్టాలుపడుతున్నారని, వారు చిత్ర హింసలకు గురవుతున్నారని, వారికి స్వాతంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు పాక్ పై పీకల్లోతూ కోపంగా ఉన్న బలూచ్ వాసులు తమ గొంతును ప్రపంచానికి వినిపించడం మొదలుపెట్టారు. కెనాడాలోని చైనా కాన్సులేట్ ముందు నిర్వహించే ధర్నాలో 'బలూచ్ ప్రాంతంలో నేరాలు చేస్తున్న పాకిస్థాన్ భాగస్వామిగా ఉండటం చైనా మానుకోవాలి' అని తీర్మానం చేయనున్నారు. బలూచ్ ప్రాంతంలో పాక్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మానవత్వాన్ని హత్య చేస్తుందని, హింసాకాండను కొనసాగిస్తోందని వారంతా ఆందోళన చేస్తున్నారు. 'ది ప్రీ బలూచిస్థాన్ మూమెంట్(ఎఫ్బీఎం) అనే సంస్థ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది. -
పాక్ నుంచి కాపాడండి : బలుచిస్తాన్ వాసులు
న్యూయార్క్ : పాకిస్తాన్లో మానవ హక్కులు మంటగలిసిపోతున్నాయని నినదిస్తూ బలూచిస్తాన్ వాసులు బుధవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బలుచిస్తాన్పై పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న బాంబు దాడులను ఆపాలంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్య్రం కావాలంటూ బలుచిస్తాన్ వాసులు డిమాండ్ చేశారు. బలూచ్ ఫ్రీడం కార్యకర్తలు, మానవహక్కుల కార్యకర్తలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.పాకిస్తాన్లో పశ్చిమ భూభాగంగా ఉన్న ఈ ప్రాంతంపై ఆ ప్రభుత్వం వివక్ష చూపుతూ వారి హక్కులను కాలరాస్తున్న క్రమంలో, బలుచిస్తాన్ వాసులు స్వాతంత్య్ర హక్కుల కోసం గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. పాక్ తమపై చేస్తున్న దాడులనుంచి రక్షించాలని వారు కోరుతున్నారు. అంతర్జాతీయ వ్యవహారమని బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నాయకుడు మజ్దాక్ దిల్షాన్ బలూచ్ పేర్కొన్నారు. అరబ్ ప్రపంచం, యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా లాంటి బలమైన దేశాలు, కూటములు బలూచిస్తాన్ విషయంలో పాక్పై ఆంక్షలను విధించాలని దిల్షాన్ కోరుతున్న సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం చేస్తున్న ఈ వివక్షపూర్వక చర్యలపై బలుచిస్తాన్ ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. -
జర్మనీలో బలూచ్ కార్యకర్తలు ఆందోళన