-
ఈ నెలలో ప్రతి శనివారం పాస్పోర్టు ప్రత్యేక డ్రైవ్
రాంగోపాల్పేట్: పాస్పోర్టు దరఖాస్తుదారుల అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం పడుతుండటంతో డిసెంబర్ నెలలోని అన్ని శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పీఎస్కేలు, 14 పీవోపీఎస్కేల్లో ఈ డ్రైవ్లు కొనసాగుతాయని తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా దరఖాస్తుదారులకు 3200 అపాయింట్మెంట్లు అందించినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినందుకు విదేశాంగ శాఖ అధికారులు, పోలీస్, పోస్టల్ శాఖలకు దరఖాస్తుదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
Passport Drive: డిసెంబర్ 3న ప్రత్యేక పాస్పోర్టు డ్రైవ్
రాంగోపాల్పేట్: పాస్పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తుండటంతో డిసెంబర్ 3వ తేదీన ప్రత్యేక పాస్పోర్టు డ్రైవ్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని అమీర్పేట్, బేగంపేట, టోలిచౌకిలోని పీఎస్కేలు, నిజామాబాద్, కరీంనగర్ పీఎస్కేలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 14 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాల్లో డిసెంబర్ 3వ తేదీన తత్కాల్, సాధారణ పాస్పోర్టు దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు, కొత్తగా చేసుకునేవారికి కూడా స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆ ఒక్క రోజు 3,500 దరఖాస్తులను ఆయా కేంద్రాల ద్వారా సమర్పించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇందులో 70 శాతం తత్కాల్, 30 శాతం సాధారణ పాస్పోర్టు దరఖాస్తులుంటాయని వివరించారు. బుధవారం ఉదయం నుంచి పాస్పోర్టు సేవా పోర్టల్, ఎంపాస్పోర్ట్ సేవా యాప్ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా, దరఖాస్తు చేసుకున్న వారు 3వ తేదీకి ప్రీపోన్ చేసుకోవచ్చని సూచించారు. డిసెంబర్ 3న ఒక రీ షెడ్యూలింగ్, ఒక ప్రీపోన్కు మాత్రమే అవకాశం ఉంటుందని.. మరో తేదీ మార్చుకునే వెసులుబాటు ఉండదని గుర్తుంచుకోవాలని ప్రాంతీయ పాస్పోర్టు అధికారి బాలయ్య స్పష్టం చేశారు. -
సాలభంజికల సింహాసనం
గిడుతూరి సూర్యం దర్శకత్వంలో రామకృష్ణ, యస్వీరంగారావు, బాలయ్య... ప్రధాన పాత్రలు పోషించిన సినిమా (1971)లోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘విక్రమార్క మహారాజా! ఊర్వశీ రంభల నాట్యాన్ని తిలకించిననాడు మీరు ఇచ్చిన తీర్పుకి మెచ్చి మహేంద్రుడు పంపిన బహుమానం 32 సాలభంజికలు గల ఈ సింహాసనం. దేవలోక పట్టాభిషేకం నాడు పరమేశ్వరుడు మహేంద్రునికి ఇచ్చిన ఈ సింహాసనపీఠం మీకు ఇవ్వబడింది. మా అందరికీ నేత్రోత్సవంగా ఈ భద్రపీఠాన్ని అనుష్ఠించండి మహారాజా!’’ అంటూ మహారాజును ఆహ్వానించాడు భట్టి. ‘జయీభవ! విజయీభవ!’ అంటూ నినాదాలు మిన్ను ముట్టాయి. మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న సమయంలో.. ‘‘ఆగండి’’ అనే అరుపు వినిపించింది. ఎవరో విప్రుడు. ‘‘ఎవరు నువ్వు?’’ అని గట్టిగా అడిగాడు భట్టి. ‘‘నేనొక పేద విప్రుడిని. మీ నగరంలోనే ఆకలి చిచ్చుతో అలమటించిపోతున్నాను. మీరు ఆనందంగా సింహపీఠం అలంకరిస్తున్నారు. ఇది ధర్మమేనా’’ అన్నాడు ఆవేదనగా ఆ విప్రుడు. ‘‘ఏమిటి! మా రాజ్యంలో విద్యావంతులైన మీకు దారిద్య్ర బాధా? మహామంత్రి! తక్షణమే వీరికి వెయ్యి సువర్ణములు ఇప్పించండి’’ అని ఆదేశించారు మహారాజు. సంచిలో సువర్ణములు వచ్చాయి. కానీ పేద బ్రహ్మణుడి ముఖంలో వెలుగు లేదు. ‘‘మహారాజా! నాకొక నియమం ఉన్నది. కష్టార్జితమైన ధనమే నేను దానంగా స్వీకరిస్తాను’’ అన్నాడు నిర్మొహమాటంగా. ‘‘తమ శౌర్యప్రతాపాలతో దిక్కులు జయించి పరిపాలిస్తున్న మహారాజు కష్టార్జిత ధనం కాదా ఇది’’ ఆశ్చర్యపోయాడు భట్టి. విక్రమార్క మహారాజులు మాత్రం విప్రుడి మాటలకు కోపం తెచ్చుకోకపోగా ఏదో బోధపడినట్లు శాంత స్వరంతో ఇలా అన్నాడు: ‘‘నిజమే ఇది మా కష్టార్జిత ధనం కాదు. ఇది ప్రజాధనం. మా విజయ పరంపరకు కారకులు సామాన్య సైనికులు. మా ధనాగారం నిత్యం పెంపొందించినవారు చెమటోడ్చినవారు కష్టజీవులు. రెండు ఘడియల గడువు ఇవ్వండి. సామన్యపౌరుడిగా కాయకష్టం చేసి ధనం సంపాదించి మీకు ఇస్తాను’’ ‘‘ఆ రెండు ఘడియలూ సింహసనంపై కూర్చొనే అవకాశం నాకు ఇవ్వండి’’ అడిగాడు ఆస్థాన విదూషకుడు. ‘‘విదూషకా! అలాగే. నీ పరిపాలన చూసి వినోదిస్తాను’’ అన్నారు మహారాజు. ‘‘కాదు విచారిస్తారు. నా పరిపాలనలో కష్టపడి డబ్బు సంపాదించాలనుకునే మీలాంటి వారికి ఎలాంటి ఉద్యోగం లభించకూడదని శాసనం జారీ చేస్తాను. అప్పుడు ఎలా సంపాదిస్తారో నేనూ చూస్తాను’’ అన్నాడు విదూషకుడు. ‘‘నీ పరిపాలన ప్రారంభించు’’ అని విదూషకునికి సింహాసనం చూపించాడు మహారాజు. ఈలోపు ‘మహారాజా!’ అంటూ గట్టి పిలుపు వినబడింది. విప్రుడు మాయమై దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు! ‘‘దేవేంద్రా మీరా!’’ ఆశ్చర్యంగా అన్నాడు మహారాజు. ‘‘ఇంతటి ధర్మమూర్తివై నీవు ఈ భూమండలంలో జీవించి ఉన్నంత కాలం ఈ పవిత్రపీఠం అలంకరించే అర్హత నీకు తప్ప ఎవరికీ లేదు. నీ పాలన స్వయంగా పరికించి పరమానందం పొందాను. వెయ్యి సంవత్సరాలు ఈ భద్రపీఠంపై వెలుగొందు దీవెన ఇస్తున్నాను’’ అని విక్రమార్కుడికి వరం ఇచ్చాడు దేవేంద్రుడు. .... ఒంటరిగా కూర్చొని తనలో తాను బాధపడుతున్నాడు విక్రమార్కుడు. ‘‘అన్నగారూ... ఇంతటి మహదానంద తరుణంలో ఆలోచన నిమగ్నులై ఉన్నారు!’’ అడిగాడు భట్టి. ‘‘భట్టీ! నువ్వు లేని వెయ్యేండ్ల నిస్సారమైన జీవితం ఎలా గడపగలను!’’ తన మనసులో బాధను చెప్పాడు విక్రమార్కుడు. ఆ మాటకు భట్టి కదిలిపోయాడు. కళ్లలో కన్నీటి పొర. ‘‘మరణంతో మీ సేవాభాగ్యం పోగొట్టుకునే ఆ దౌర్భగ్య స్వర్గారోహణ నాకెందుకు మహారాజా! భద్రకాళిని ప్రార్థించి బహుకాలం జీవించే వరం పొంది వస్తా’’ అని బయలుదేరాడు భట్టి. ∙∙ భుజం మీద శవంతో విక్రమార్కుడు కాళీ దగ్గరకు వెళుతున్నాడు. ఎక్కడి నుంచో గొంతు వినిపించింది. ‘‘విక్రమార్కా! నేను భేతాళుడిని. ఈ దొంగసన్యాసిని వధించు. నేను నీకు వశం అవుతాను’’ ‘‘మహారాజా! దేవికి సాష్టాంగ ప్రమాణం చెయ్’’ అన్నాడు దొంగ సన్యాసి. ‘‘అదెలాగో నాకు తెలియదు. చేసి చూపించండి’’ అని తెలివిగా అడిగాడు విక్రమార్కుడు. దొంగ సన్యాసి వంగగానే మెడపై వేటు వేశాడు విక్రమార్కుడు. అప్పుడు భేతాళుడు ప్రత్యక్షమై... ‘‘క్లీం అలా క్లీం...విక్రమార్క మహారాజా! నేనే మీకు వశం అయ్యాను’’ అన్నాడు. ‘‘మంచిది భేతాళా. ప్రపంచంలోని వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు’’ అని భేతాళుడిని ఆదేశించాడు విక్రమార్కుడు. కొద్దిరోజుల తరువాత భేతాళుడు ప్రత్యక్షమై... ‘‘ఆ వీరసేనుని అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశా. దురంహకారంతో శపథం చేశాడు. సాలభంజికల పీఠాన్ని తాను అధిష్ఠించి మిమ్మల్ని శాసిస్తాడట. ఎంతటి దురహంకారం’’ అన్నాడు కోపంగా భేతాళుడు. ∙∙ వీరసేనుడు భీకరంగా తపస్సు చేస్తున్నాడు. కాళీమాత ఎంతకీ కనికరించడం లేదు. ఇక ఆగలేక కత్తితో కడుపులో పొడుచుకొని పేగుల్ని బయటకు తీసుకున్నాడు... అప్పుడు కాళీమాత ప్రత్యక్షమైంది. ‘‘ఏమి కోరి ఈ తపస్సు?’’ అని అడిగింది. ‘‘ఇంద్రజాల, మహేంద్రజాల, అంజన, ఆకర్షణ, ఉచ్ఛాటన, పరకాయప్రవేశాది సమస్త విద్యలు నా హస్తగతం కావాలి. నన్ను అనుగ్రహించి పాలించు మాతా’’ అని వేడుకున్నాడు వీరసేనుడు. ‘‘కుమరా! నీవు కోరిన దివ్యశక్తులు ప్రసాదిస్తున్నాను. దుర్వినియోగం కానంత వరకు, నా ముందు ఉన్న ఈ అఖండజ్యోతి ఆరనంత వరకు నీవు ఈ శక్తులు కలిగి ఉంటావు’’ అని వరం ఇచ్చింది మాత. వీరసేనుడిలోని గర్వం పదింతలు పెరిగింది. పట్టలేనంత ఆహంకారంతో... ‘‘ఓరీ విక్రమార్క! ఇక నీ మృత్యురూపమును ధరింతునురా’’ అని అరిచాడు. జవాబు: విక్రమార్క విజయం -
ఆటో-బైక్ ఢీ... వ్యక్తి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మల్లాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న బాలయ్య(35) మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని చిన్నారి పై పైశాచికత్వం చూపించాడో కామాంధుడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామానికి చెందిన బాలయ్య(66) ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో.. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని వృద్ధుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement