Australia vs Zimbabwe
-
T20 WC: ఘోర పరాభవం.. స్పందించిన ఆసీస్ కెప్టెన్
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్ దశలోనే ‘పటిష్ట’ ఆసీస్ ఇంటిబాట పట్టింది. తొలుత ఐర్లాండ్పై గెలిచినా.. అదే జోరు కొనసాగించలేకపోయిన కంగారూలు.. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయారు. ఫలితంగా సూపర్-8 చేరకుండానే నిష్క్రమించిన ఆసీస్.. లీగ్ దశలో చివరగా పసికూన ఒమన్ను ఓడించి విజయంతో ముగించింది.ఇదొక చేదు అనుభవంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ఈసారి తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని.. భారమైన హృదయాలతో ఇంటిబాట పడుతున్నట్లు వెల్లడించాడు. ‘‘సూపర్-8 చేరే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాం. మా డ్రెసింగ్రూంలో నిరాశపూరిత వాతావరణం నెలకొంది. ఇదొక చేదు అనుభవం.దురదృష్టవశాత్తూ మేము గత రెండు మ్యాచ్లలో ఓడిపోయాము. అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాము. అదే సమయంలో ప్రత్యర్థులు.. ముఖ్యంగా జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ఆ జట్టు చేతిలో ఓడిపోగానే మాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే.గుణపాఠం నేర్చుకుంటాముఇక్కడి పిచ్ పరిస్థితులను ఎంతమాత్రం నిందించలేము. అన్నింటికీ మేము సన్నద్ధమయ్యే ఇక్కడికి వచ్చాము. మిగతా జట్ల మాదిరే రెండేళ్లుగా మా జట్టు నిర్మాణం జరుగుతోంది. కానీ కీలక సమయంలో మేము వెనకపడ్డాము. ఈ చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటాము.క్రికెట్ ఆస్ట్రేలియా యాజమాన్యం ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తుంది. విఫలమైనపుడు నిరాశ సహజం. అయితే, స్వదేశానికి వెళ్లిన తర్వాత అంతా కూర్చుని లోపాల గురించి చర్చించుకుంటాము. నిజాయితిగా మా తప్పులను విశ్లేషించుకుంటాము. చాలా బాధగా ఉందిఏదేమైనా చాలా బాధగా ఉంది. నిరాశా, నిస్పృహలు కమ్ముకున్నాయి. అయితే, సానుకూల దృక్పథంతో మేము ముందడుగు వేసి తిరిగి పుంజుకుంటాము’’ అని మిచెల్ మార్ష్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కాగా పల్లెకెలె వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఒమన్పై జయభేరి మోగించింది. ఆడమ్ జంపా (4/21), మ్యాక్స్వెల్ (2/13), బార్ట్లెట్ (2/27), స్టొయినిస్ (2/16), ఎలిస్ (1/14) ఇలా... బౌలింగ్ దళమంతా కలిసి ఒమన్ బ్యాటర్లను దెబ్బకొట్టింది.మిచెల్ మార్ష్ ధనాధన్ముందుగా ఒమన్ జట్టు 16.2 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. వసీమ్ అలీ (32; 4 ఫోర్లు) రాణించాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 9.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (33 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), హెడ్ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) చెలరేగి తొలి వికెట్కు 8.1 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లే: పాంటింగ్
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన కంగారూలు.. పసికూన జింబాబ్వేతో పాటు శ్రీలంక చేతిలో ఓటమి పాలయ్యారు. ఫలితంగా కనీసం లీగ్ దశ దాటకుంటానే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ బృందంపై ఇంటా బయటా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్.. టీ20 వరల్డ్కప్ జట్టులో భాగమైన ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మాక్సీ పని అయిపోయిందని.. ఇకపై అతడు ఆసీస్ టీ20 జట్టులో ఉండబోడని జోస్యం చెప్పాడు.అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లేముఖ్యంగా లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ (LA28 Olympics)లో మాక్సీ పాల్గొనే అవకాశాలు శూన్యమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. ‘‘గ్లెన్ మాక్స్వెల్.. నాకైతే అతడి కెరీర్ చరమాంకానికి చేరుకుందని అనిపిస్తోంది. అతడు కచ్చితంగా ఒలింపిక్స్ జట్టులో మాత్రం ఉండడు’’ అని పాంటింగ్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు.దారుణంగా విఫలంఅయితే, కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రవిస్ హెడ్ మాత్రం తప్పక ఒలింపిక్స్లో ఆడతారని పాంటింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా 37 ఏళ్ల గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్ ఆల్రౌండర్. టీ20 వరల్డ్కప్-2026 టోర్నీలో మాక్సీ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 62 పరుగులే చేశాడు.ఇక గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా తొలుత ఐర్లాండ్పై గెలిచింది. ఆ తర్వాత జింబాబ్వే, శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. లీగ్ దశలో మిగిలిన నామమాత్రపు మ్యాచ్లో ఒమన్తో శుక్రవారం ఆసీస్ తలపడుతుంది. ఇందుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదిక. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్కప్ టోర్నీ ఫిబ్రవరి 7న మొదలైంది. మార్చి 8న ఫైనల్తో ముగుస్తుంది.చదవండి: విధ్వంసకర ఓపెనర్ కాదు!.. ‘డకౌట్ల’ అభిషేక్.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు -
T20 WC: అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 వరల్డ్కప్-2026 టోర్నీలో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయారంటూ సొంత అభిమానులే విమర్శిస్తున్నారు. కాగా గ్రూప్-బిలో శ్రీలంక, జింబాబ్వే, ఒమన్, ఐర్లాండ్లతో కలిసి ఉన్న ఆసీస్.. పసికూన జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడింది.తద్వారా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం కాగా.. మంగళవారం నాటి జింబాబ్వే- ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వే శ్రీలంకతో పాటు సూపర్-8లో అడుగుపెట్టింది.గాయాల బెడదకాగా టోర్నీ ఆరంభానికి ముందు నుంచే కంగారూ జట్టును గాయాల బెడద వేధించింది. ప్రధాన పేసర్లు ప్యాట్ కమిన్స్ (Pat Cummins), జోష్ హాజిల్వుడ్ (Josh Hazlewood) టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు.ఇక మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను తొలుత టీ20 వరల్డ్కప్ టోర్నీకి క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేయనేలేదు. శ్రీలంకతో మ్యాచ్కు ముందు మాత్రం అతడిని హుటాహుటిన రప్పించారు. అయితే, ఈ మ్యాచ్లో స్మిత్ను ఆడించలేదు. ఈ మ్యాచ్లో ఓడిన ఆసీస్.. సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఘాటుగా స్పందించాడు. ‘‘బహుశా స్టీవ్ స్మిత్ తాను వచ్చిన విమానంలోనే వెనుదిరిగి ఉంటాడు. ఎందుకంటే వీళ్లు (ఆసీస్) టోర్నీ నుంచి నిష్క్రమించేశారు కదా!అసలు అతడిని ముందుగానే ఎందుకు ఎంపిక చేయలేదో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బిగ్బాష్ లీగ్లో అతడు మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాదు అతడు స్పిన్ బౌలింగ్లో అద్భుతంగా ఆడగలడు. అయినప్పటికీ స్టీవ్ స్మిత్ను ముందుగానే సెలక్ట్ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా తప్పు చేసింది’’ అని మైకేల్ వాన్ విమర్శించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్కు అనుకూలించే ఉపఖండ పిచ్లపై స్మిత్ను ఆడించకుండా.. ఆసీస్ మూల్యం చెల్లించిందని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇటీవల దేశీ టీ20 టోర్నీలో సత్తా చాటిన స్మిత్.. బిగ్బాష్ లీగ్లో 299 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. స్మిత్ ఆసీస్ తరఫున చివరగా 2024 ఫిబ్రవరిలో టీ20 మ్యాచ్ ఆడాడు.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ -
పెద్దగా సంబరాల్లేవ్!.. మా లక్ష్యం అదే: జింబాబ్వే కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే, శ్రీలంక జట్ల చేతిలో ఓటమి.. కంగారూలను సూపర్-8కు దూరం చేసింది. పల్లెకెలెలో మంగళవారం జరగాల్సిన జింబాబ్వే- ఐర్లాండ్ (ZIM vs IRE) మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.లీగ్ దశలోనేపేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లిస్తూ కంగారూలు లీగ్ దశలోనే అవమానకర రీతిలో ఇంటిబాట పట్టగా.. జింబాబ్వే సగర్వంగా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (Sikandar Raza)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సమిష్టిగా రాణించి‘‘ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫైయర్స్లో మేము గ్రూప్-బిలో కెన్యా, రువాండా, టాంజానియా వంటి జట్లతో తలపడ్డాము. ఆ సమయంలో మా లక్ష్యం గెలుపు ఒక్కటే. లేదంటే జట్టు మొత్తం తమను తాము నిందించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాను.అక్కడ సమిష్టిగా రాణించి ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టాము. ఇప్పుడు సూపర్-8కు కూడా అర్హత సాధించాము. ఈ ఆనందాన్ని తప్పక సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే, పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదు.మా లక్ష్యంలో మొదటి దశను మేము దాటాము. తదుపరి మేము శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్ నామమాత్రమే అయినా గెలుపుపై గురిపెట్టాము. నేను, మా కోచ్ వారి బలాబలాల గురించి డేటాను పరిశీలిస్తున్నాం. అందుకు తగ్గట్లుగా మా వ్యూహాలు సిద్ధం చేసుకుంటాము.అండర్డాగ్గా బరిలోకిఆ మ్యాచ్లోనూ గెలిచేందుకు వందకు వంద శాతం ప్రయత్నిస్తాం. సూపర్-8కు అర్హత సాధించినంత మాత్రాన మా లక్ష్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. అండర్డాగ్గా బరిలోకి దిగి ఈ స్థాయికి చేరడం ఎవరికైనా సంతోషమే. అయితే, ప్రతిరోజూ కొత్తదే. కఠినంగా శ్రమిస్తేనే ఆశించిన ఫలితం వస్తుంది’’ అని సికిందర్ రజా పేర్కొన్నాడు.కాగా గ్రూప్-బి నుంచి ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియాలను ఎలిమినేట్ చేసి శ్రీలంక, జింబాబ్వే సూపర్-8కు చేరుకున్నాయి. ఇరుజట్లు గురువారం లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో ముఖాముఖి తలపడతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!This is what it means! 🤩Zimbabwe qualify for the Super 8s with a game to spare, knocking out Australia. Sikandar Raza leads the celebrations with the fans. 👏ICC Men’s #T20WorldCup | #SCOvNEP | LIVE NOW 👉 https://t.co/8SrC1cprbz pic.twitter.com/cqXeLv8ZtI— Star Sports (@StarSportsIndia) February 17, 2026 -
T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వే
ఊహించిందే జరిగింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. గ్రూప్-బి నుంచి ఐర్లాండ్- జింబాబ్వే మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయిపోయింది.ఆస్ట్రేలియా ఎలిమినేట్శ్రీలంకలోని పల్లెకెలెలో వర్షం తెరిపినివ్వక పోవడంతో ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో జింబాబ్వే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా... ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది.మొత్తంగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్కప్ టోర్నీలో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ వంటి పసికూనలతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి.ఐదు పాయింట్లతో అర్హత ఇక ఆది నుంచి అదరగొట్టిన శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్-బి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచిన ఆస్ట్రేలియా.. తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.మ్యాచ్ రద్దు కావడంతోమరోవైపు.. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఐర్లాండ్తో జరగాల్సిన మూడో మ్యాచ్ రద్దు కావడంతో జింబాబ్వేకు మరో పాయింట్ వచ్చింది. నెట్రన్రేటు పరంగానూ జింబాబ్వే పటిష్ట స్థితి (+1.984)లో నిలిచింది. ఫలితంగా శ్రీలంకతో కలిసి జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించగా.. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియా అవమాన భారంతో నిష్క్రమించింది.ఇక గ్రూప్-బి తదుపరి నామమాత్రపు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆఖరిగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఒమన్తో తలపడుతుంది. మరోవైపు జింబాబ్వే గురువారం శ్రీలంకను ఢీకొడుతుంది.ఆఖరి బెర్తు ఎవరిదో?ఇదిలా ఉంటే.. గ్రూప్-ఎ నుంచి టీమిండియా సూపర్-8కు చేరగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి. ఆఖరి బెర్తు కోసం గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, అమెరికా బరిలో ఉన్నాయి. కాగా గత వరల్డ్కప్ ఎడిషన్లో పాక్ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్.. ప్రపంచ రికార్డు -
T20 WC: జింబాబ్వే రైట్ రైట్.. అదే జరిగితే ఆసీస్ ఇంటికే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ గాయాల కారణంగా దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు.దీంతో కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 67 పరుగుల తేడాతో గెలుపొంది శుభారంభం అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆసీస్ అదే జోరు కొనసాగించలేకపోయింది.జింబాబ్వే చేతిలో ఓటమి.. లంక చేతిలోనూ చిత్తుతమ రెండో మ్యాచ్లో అనూహ్య రీతిలో పసికూన జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా. తద్వారా జింబాబ్వే గ్రూప్-బి నుంచి సూపర్-8 అవకాశాలు మెరగుపరచుకోగా.. కంగారూ జట్టుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో సోమవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆసీస్ సూపర్-8 అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.గ్రూప్-బి నుంచి శ్రీలంక మూడింటికి మూడు గెలిచి సూపర్-8కు చేరగా.. జింబాబ్వే రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్రన్రేటు (+1.984).పటిష్టస్థితిలో జింబాబ్వే.. అదే జరిగితే ఆసీస్ ఇంటికేమరోవైపు ఆస్ట్రేలియా మూడు ఆడి కేవలం ఒక్కటే గెలిచి.. 2 పాయింట్లతో ఉంది. నెట్రన్రేటు (+0.414) తదుపరి ఒమన్తో ఆసీస్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే ఆసీస్ సూపర్-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి.అయితే, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆస్ట్రేలియాను వర్షం గండం వెంటాడుతోంది. ఆసీస్ కంటే పాయింట్లు, నెట్రన్రేటు పరంగా జింబాబ్వే పటిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో మంగళవారం ఐర్లాండ్తో మ్యాచ్లో గెలిస్తే జింబాబ్వే ఆరు పాయింట్లతో నేరుగా సూపర్-8 చేరితే ఆసీస్ ఇంటి బాటపడుతుంది.ఒకవేళ ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడితే ఆసీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, ఐర్లాండ్- జింబాబ్వే మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలెలో వర్షం పడుతున్న కారణంగా ఇరుజట్ల మధ్య మ్యాచ్కు టాస్ ఆలస్యమైంది. ఒకవేళ వర్షం తెరిపినివ్వకపోతే మ్యాచ్ రద్దైపోతుంది.ఓడినా మరో అవకాశం కూడా!అదే జరిగితే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు జింబాబ్వే ఖాతాలో పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. తద్వారా ఆటోమేటిక్గా జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఆసీస్ టోర్నీ నుంచి ఘోర పరాభవంతో లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది. అన్నట్లు జింబాబ్వేకు మరో మ్యాచ్ కూడా మిగిలి ఉంది. శ్రీలంకతో గురువారం జింబాబ్వే తలపడుతుంది. ఐర్లాండ్తో మ్యాచ్లో ఫలితం తేడాగా వచ్చిన జింబాబ్వేకు ఇంకో అవకాశం మిగిలే ఉంటుందన్నమాట. UPDATE: T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వేచదవండి: గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై? -
ఆసీస్కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్!
ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జింబాబ్వే బౌలర్ బ్లెసింగ్ ముజరబానీకి బంపరాఫర్ వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో వెస్టిండీస్ స్టార్ పేసర్ షమార్ జోసెఫ్ స్థానాన్ని ముజరబానీ భర్తీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. షమార్ జోసెఫ్పై వేటుకాగా మార్చి 26న పాక్ సూపర్ లీగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. రూ. 1.1 కోట్లకు (పాక్ కరెన్సీలో) కొనుగోలు చేసి షమార్ జోసెఫ్పై వేటు వేసింది. ఈ విండీస్ పేసర్ స్థానంలో జింబాబ్వే స్టార్ ముజరబానీని చేర్చుకుంది. అయితే, టెక్నికల్ కమిటీ నుంచి ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. షమార్ జోసెఫ్ను జట్టు నుంచి తొలగించడం పట్ల ఇస్లామాబాద్ యునైటెడ్ నోరు విప్పలేదు. అటు జోసెఫ్ సైతం మౌనంగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర అంగీకారంతోనే అతడు తప్పుకొన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది.కారణం అదేనా?కాగా 2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టెస్టుల్లో అరంగేట్రం చేసి.. సత్తా చాటిన షమార్ జోసెఫ్ వ్యక్తిగత ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డాడు. అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్కు షమార్ ఆడటాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ అతడితో బంధం తెంచుకోవడం గమనార్హం.ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన ముజరబానీఇక జింబాబ్వే రైటార్మ్ పేసర్ బ్లెసింగ్ ముజరబానీకి పాకిస్తాన్ సూపర్ లీగ్ కొత్తేమీ కాదు. 2021లో టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. అయితే, గత కొంతకాలంగా అతడు పేలవ ప్రదర్శనతో సతమతమయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో ముజరబానీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మ్యాచ్లో ముజరబానీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి.. నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్ ఇంగ్లిస్ (8), టిమ్ డేవిడ్ (0), మ్యాట్ రెన్షా (65), ఆడం జంపా (2) వికెట్లు తన ఖాతాలో వేసుకుని జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఆసీస్పై గెలిచిన జింబాబ్వే.. 2007 తర్వాత టీ20 వరల్డ్కప్ తర్వాత రెండోసారి కంగారూ జట్టును ఓడించింది.చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాదే వరల్డ్కప్..!
టీ20 వరల్డ్కప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.వాస్తవానికి టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లోనే (2007) జింబాబ్వే ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచకప్ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది కూడా తొలిసారి కాదు. 1983 వన్డే ప్రపంచకప్లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్కప్లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్కు షాకిచ్చింది.అయితే జింబాబ్వే ఆసీస్పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్పై విజయం సాధించిన సందర్భంలో భారత్ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.ప్రస్తుత ప్రపంచకప్లో ఈ సెంటిమెంట్ రిపీటైతే, భారత్ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్లో ఆసీస్పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ సెంటిమెంట్కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్కు ఈ రెండు కలిస్తే భారత్కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. పై ఫ్యాక్టర్స్ అన్నీ వర్కౌటై భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్ గెలవలేదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. -
ఆసీస్పై సంచలన విజయం.. జింబాబ్వే బౌలర్ సెంచరీ
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కీలక ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మ్యాట్ రెన్షా, ఆడమ్ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్ వేరియేషన్స్తో పట్టిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్లో తన చివరి వికెట్తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా, ఓవరాల్గా 35 బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు). మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్వెల్ (31) విఫలయత్నం చేశారు. -
T20 WC: ఆసీస్కు షాకిచ్చిన పసికూన.. సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్లో తలపడ్డాయి.ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.రజా మెరుపు ఇన్నింగ్స్వన్డౌన్లో వచ్చిన ర్యాన్ బర్ల్ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.చెలరేగిన ముజర్బానీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్ ముజర్బానీ జోష్ ఇంగ్లిస్ (8)ను.. బ్రాడ్ ఎవాన్స్ కెప్టెన్ ట్రవిస్ హెడ్ (17)ను వెనక్కి పంపించారు.వన్డౌన్లో వచ్చిన గ్రీన్ను ఎవాన్స్ డకౌట్ చేయగా.. ముజర్బానీ సైతం టిమ్ డేవిడ్ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు పంపాడు. పవర్ హిట్టర్లు ఇద్దరూ డకౌట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్ మాక్స్వెల్ (31)తో కలిసి మ్యాచ్ రెన్షా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.HISTORY MADE IN COLOMBO! 🤯🔥Composure. Belief. Zimbabwe have beaten Australia! 👏💥ICC Men’s #T20WorldCup | #CANvUAE | LIVE NOW 👉 https://t.co/xRf3Nc9OQ0 pic.twitter.com/1BXNa0ftxS— Star Sports (@StarSportsIndia) February 13, 2026ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్బానీ బౌలింగ్లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.146 పరుగులకే ఆలౌట్అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్ బౌలింగ్లో తొలి బంతికే నాథన్ ఎల్లిస్ ఫోర్ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్ ఆసీస్ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్ రనౌట్ (0) కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్ మూడు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్ బర్ల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో తొలి ఎడిషన్ 2007లో ఆసీస్ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్పై గెలుపొందడం ఇదే మొదటిసారి.చదవండి: టీ20 ప్రపంచకప్లో సంచలనం.. నేపాల్పై ఇటలీ గెలుపుAND ANOTHER ONE GONE! 🔥Head pushes at it and chops it back onto his stumps! 🎯💥The SIUUU celebration is out in Colombo as Zimbabwe tighten their grip early! 🙌 Is there an upset on the cards?ICC Men’s #T20WorldCup | #AUSvZIM | LIVE NOW 👉 https://t.co/WBa4qbbxs0 pic.twitter.com/kzJ8M8j5ut— Star Sports (@StarSportsIndia) February 13, 2026


