-
లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
కవరాట్టి: హత్యాయత్నం కేసులో లక్ష ద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి కె.అనిల్కుమార్ తీర్పు చెప్పారు. 2009 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్ను హత్య చేయడానికి ఫైజల్ మరో ముగ్గురు ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. రాజకీయ కక్షలతోనే సాలిహ్ను హత్య చేయడానికి కుట్ర పన్నారని, అయితే అందులో వారు విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఎంపీ ఫైజల్ సహా దోషులు నలుగురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ తీర్పుతో ఫైజల్ రాజకీయ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్సీపీకి చెందిన నేత ఫైజల్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసు రాజకీయ దురద్దేశంతో కూడుకున్నదని ఫైజల్ ఆరోపించారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్టు చెప్పారు. 2009లో ఫైజల్ మరి కొంత మందితో కలిసి పదునైన ఆయుధాలతో సాలిహ్పై దాడి చేశారు. కత్తులు, కటారులు, కర్రలు, ఐరన్ రాడ్లతో కలిసి అతనిని వెంబడించి కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాలిహ్ని ప్రత్యేక హెలికాప్టర్లో ఎర్నాకులం ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలు నిలపగలిగారు. -
43 ఏళ్లు జైలులో మగ్గి ‘నిర్దోషి’గా విడుదల
పాట్నా: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. 10 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లి 53 ఏళ్ల వయసులో నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ సంఘటన బిహార్లోని బక్సర్ జిల్లాలో జరిగింది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసును కొట్టివేస్తూ బాక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు కొట్టి వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఇంతకి ఏం జరిగిందంటే? జిల్లాలోని మురార్ పోలీస్ స్టేషన్ పరిధి చౌగాయి గ్రామంలో ఓ దుకాణదారుడిపై 1979, సెప్టెంబర్లో హత్యాయత్నం జరిగింది. పలువురు దుండగులు తనను హత్య చేసేందుకు దాడి చేశారని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అందులో మున్నా సింగ్ అనే 10 ఏళ్ల బాలుడిపైనా ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బాలుడిని సెక్షన్ 148, 307ల కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణ పెండింగ్లో పడిపోయింది. 2012 నుంచి ఈ కేసును బక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు విచారిస్తోంది. జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న డాక్టర్ రాజేశ్ సింగ్ ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాలని పలుమార్లు ఫిర్యాదుదారుకు నోటిసులు పంపించారు. అయితే, ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మున్నా సింగ్ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది జిల్లా కోర్టు. ప్రస్తుతం మున్నా సింగ్ వయసు 53 ఏళ్లు. తనను నిర్దోషిగా వదిలిపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేసిన సింగ్.. దశాబ్దాల పాటు కేసును పెండింగ్లో పెట్టటంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
కుట్రకోణం ఛేదించే దిశగా..
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రకోణం ఛేదించే దిశగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇటీవలే నిందితుడు బడుగు నాగేశ్వరరావును రెండ్రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. అలాగే పలువురు టీడీపీ నేతలకు నోటీసులిచ్చి వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ మృతి చెందినప్పటి నుంచి నిందితుడు మంత్రి ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు చెబుతున్నారు. మంత్రి తన తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో, ఆ తర్వాత ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అవకాశం కోసం ఎదురుచూసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటన తర్వాత ఏం చెప్పాలి అనేది నాగేశ్వరరావును పురిగొల్పిన వారే అతనికి తర్ఫీదు ఇచ్చి ఉంటారని, అందుకే ఎన్నిసార్లు ప్రశ్నించినా సరిగా బదులిచ్చేవాడు కాదని పోలీసులంటున్నారు. ఈ ఘటనకు ముందు మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితులతో నాగేశ్వరరావు మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. కొల్లు తీరుపై పోలీసుల ఆగ్రహం సీఆర్పీసీ సెక్షన్ 91 కింద ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పకపోగా తప్పించుకునే ధోరణిలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర వ్యవహరిస్తున్న తీరుపై పోలీసులు మండిపడుతున్నారు. మాజీ మంత్రిని వెనకేసుకొస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేసు విషయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పెడితే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డీఎస్పీ రమేష్రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో భాగంగానే కొల్లుకు నోటీసులు ఇచ్చామని, అందులో తమకెలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. ఈ కేసులో కుట్రకోణం దాగి ఉందని, ఇసుక కొరతతో పనుల్లేక పోవడం అనేది సాకు మాత్రమేనని ఎస్పీ ఎం.రవీంద్రబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి విచారణకు సహకరించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. నిందితుడు టీడీపీ కార్యకర్తే.. నిందితుడు నాగేశ్వరరావుకు సంబంధించి పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులకు సన్నిహితుడని పోలీసులు గుర్తించారు. ► టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బడుగు ఉమాదేవికి నిందితుడు స్వయానా సోదరుడు. ► మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను పోలీసులు విచారించిన సమయంలో ఆయనకు మద్దతుగా నాగేశ్వరరావు కూడా స్టేషన్ వద్దకు వచ్చాడు. ► రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కొల్లు విడుదలైనప్పుడు స్వాగతం పలికిన వారిలో నిందితుడు ఉన్నాడు. మచిలీపట్నంలో కొల్లుకు స్వాగత ర్యాలీలో కూడా పాల్గొన్నాడు. ► స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ నేతలు నామినేషన్ వేసిన సమయంలో నాగేశ్వరరావు వారితో ఉన్నాడు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కొల్లుకు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. -
ప్రియుడిని గాయపర్చిన ప్రియురాలు
చల్లపల్లి(అవనిగడ్డ): ప్రియుడిపై కత్తితో దాడి చేసి ఆపై ప్రియురాలు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మచిలీపట్నంకు చెందిన మాగంటి నాగలక్ష్మి ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తుంది. గూడూరుకు చెందిన గొరిపర్తి పవన్కుమార్ పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొంత కాలంగా తనను వివాహం చేసుకోవాలని నాగలక్ష్మి ఒత్తిడి చేయడంతో ఆ ప్రతిపాదనను అతను తిరస్కరిస్తూ వచ్చాడు. ఇంట్లో ఒప్పుకోరని ప్రియుడు వాదించడంతో ఒకసారి కలిసి మాట్లాడుకుందామని చెప్పి సోమవారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం వక్కలగడ్డలోని తనకు తెలిసిన యువతి ఇంటికి తీసుకెళ్లింది. మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగింది. పవన్కుమార్ ఒప్పుకోకపోవడంతో ఒక్కసారిగా కత్తి తీసి అతనిపై దాడికి పాల్పడింది. ఆపై తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గదిలో వినిపిస్తున్న కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చల్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మినీ, గాయాలతో ఉన్న పవన్కుమార్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ ఎన్.వెంకట నారాయణ, ఎస్ఐ పి.నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కొండయ్యపై హత్యాయత్నానికి కారణం అదే..
ఒంగోలు: కందుకూరు పట్టణంలో ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన చదలవాడ కొండయ్యపై జరిగిన హత్యాయత్నం కేసుకు కారణం పాత వివాదాలేనని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. కొండయ్య కేసులో పోలీసులకు తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. జేడీబీఎం చర్చి ఎదురుగా ఉన్న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ షాపులో ఉన్న కొండయ్యపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడిలో కొండయ్యకు ఏకంగా 42 కుట్లు పడ్డాయి. లాక్డౌన్ డ్యూటీలో ఉన్నా డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్ఐలు రెండు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో లభించిన సీసీ పుటేజీ ఆధారంగా నిందితులు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇందుకు టెక్నికల్ సపోర్టు తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో చింతం రూప్కుమార్ అలియాస్ రూప్ (కావలి వైకుంఠపురం), నాదెండ్ల భాస్కర్(కావలి మద్దూరుపాడు). వీరు పూర్తి నేరస్వభావం ఉన్న వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో వ్యక్తి కొండూరి రామస్వామి అలియాస్ రాము కూడా చిన్న చిన్న వివాదాల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులు ఉపయోగించిన ఇనుప రాడ్డు, హీరో గ్లామర్ మోటారు సైకిల్, 4 సెల్ఫోన్లతో పాటు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి పులుకూరి సుజయ్కు చెందిన ప్యాంటు, బెల్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు కథ వెలుగులోకి.. కందుకూరు పట్టణంలోని జేడీబీఎం టౌన్ చర్చి నిర్వహణ విషయంలో 2015లో ఎన్నికలు జరిగాయి. దీని అనంతరం సభ్యుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పులుకూరి సుజయ్ ఒక గ్రూపుగా, చదలవాడ కొండయ్య మరో గ్రూపుగా విడిపోయారు. 2016లో పెద్ద మనుషుల సమక్షంలో రెండు కమిటీలు విడివిడిగా ప్రార్థనలు చేసుకునేలా చర్చలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 20న జేడీఎం టౌన్ చర్చి వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ వివాదం జరిగింది. ఈ క్రమంలో చర్చి కార్యదర్శి పులుకూరి కొండయ్య.. రెండో వర్గానికి చెందిన సుజయ్ వర్గంలోని మహిళలను చర్చి నుంచి బయటకు పంపాడు. దానిపై కక్ష కట్టిన సుజయ్.. ఎలాగైనా కొండయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కందుకూరుకు చెందిన తాటిపర్తి అశోక్కుమార్, దరిమడుగు శ్రీరాం, చనమల బాలాజీ అలియాస్ బాలు అనే వ్యక్తులతో కలిసి వారి ద్వారా కావలికి చెందిన చింతం రూప్కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్తో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ప్రాథమికంగా సుజయ్ నుంచి అశోక్కుమార్ రూ.50 వేలు తీసుకుని మిగిలిన మొత్తం పని పూర్తి అయిన తర్వాత తీసుకునేందుకు అంగీకరించాడు. తాను తీసుకున్న మొత్తంలో రూ.4 వేలు అశోక్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని చనుమల బాలాజీ, దరిమడుగు శ్రీరాంలకు ఇచ్చాడు. వారు చెరో రూ.3 వేలు తీసుకుని మిగిలిన రూ.40 వేలను కందుకూరులోని మెర్సీ స్కూల్ వద్ద చింతం రూప్కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్లకు అందించారు. అనంతరం ఫిబ్రవరి 29న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉన్న కొండయ్యపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో ఆయన అపస్మార్థక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం రూప్కుమార్ తన వద్ద ఉన్న రూ.40 వేలలో రామస్వామికి రూ.10 వేలు, నాదెండ్ల భాస్కర్కు రూ.6 వేలు ఇచ్చి మిగితాది రూప్కుమార్ ఉంచుకున్నాడని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వివరించారు. ఒక వైపు కోవిడ్ విధుల్లో పాల్గొంటూనే మరోవైపు హత్యాయత్నం కేసును ఛేదించిన కందుకూరు డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ ఎం.విజయ్కుమార్, టౌన్ ఎస్ఐ కేకే తిరుపతిరావు, హెడ్ కానిస్టేబుల్ ఎంఎం బేగ్, కానిస్టేబుళ్లు జి.దయానంద్, హరిబాబు, వీవీ లక్ష్మణస్వామి, ఎస్కే బాషా, ఎస్కే ముక్తార్బాషా, టి.ఆనంద్ను ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement