-
బాలాజీ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ కెరీర్లో ఆరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ను సాధించాడు. చైనీస్ తైపీలో ఆదివారం ముగిసిన సాంతైజి ఓపెన్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో బాలాజీ–ఎల్రిచ్ జోడీ 6–3, 6–2తో సాండెర్ ఆరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్బార్న్ (ఆస్ట్రియా) జంటపై విజయం సాధించింది. టైటిల్ నెగ్గిన బాలాజీ జోడీకి 9,300 డాలర్ల (రూ. 6 లక్షల 43 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో బాలాజీ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్–100లోకి వచ్చే అవకాశముంది. -
ఫైనల్లో పేస్ జోడీ
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ సీజన్లో ఆరోసారి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్– వరేలా (మెక్సికో) ద్వయం టైటిల్కు విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్–వరేలా జోడీ 7–5, 7–6 (7/5)తో సిమోన్ బొలెలీ–బ్రాకియాలి (ఇటలీ) ద్వయంపై గెలిచింది. -
వియత్నాం ఓపెన్ విజేత సాకేత్ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. హోచి మిన్ సిటీలో ఆదివారం జరిగిన వియత్నాం ఓపెన్ టోర్నమెంట్లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–విజయ్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గో సొయెదా–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ ద్వయం నాలుగు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ కెరీర్లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–విజయ్ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పేస్ జంటకు టైటిల్
ఇల్క్లే (బ్రిటన్): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ను సాధించాడు. శనివారం ముగిసిన ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో తన భాగస్వామి ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 2–6, 6–2, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. 45 ఏళ్ల పేస్ ఈ సీజన్లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
16 ఏళ్ల తర్వాత పేస్ ఖాతాలోఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ బుసాన్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన బుసాన్ ఓపెన్లో తన భాగస్వామి సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ పేస్-గ్రోత్ ద్వయం 4-6, 6-1, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో సంచాయ్-సొంచాట్ రటివటినా (థాయ్లాండ్) జోడీపై విజయం సాధించింది. 2000లో జాన్ సిమిరింక్ (నెదర్లాండ్స్)తో కలిసి చివరిసారి పేస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ (బెర్ముడా ఓపెన్) సాధించాడు. ఏటీపీ సర్క్యూట్లో చాలెంజర్ టోర్నీలనేవి ద్వితీయ శ్రేణికి చెందినవి. ఒకప్పుడు డబుల్స్లో ప్రపంచ నంబర్వన్గా నిలిచిన పేస్ ప్రస్తుతం 57వ ర్యాంక్లో ఉన్నాడు. దాంతో తన ర్యాంక్ మెరుగుపర్చుకునేందుకు పేస్ చాలెంజర్ టోర్నీల్లో ఆడుతున్నాడు. 42 ఏళ్ల పేస్కు ఇది 12వ చాలెంజర్ టైటిల్ కాగా... ఓవరాల్గా 66వ టైటిల్ కావడం విశేషం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement