-
జాలీ రైడ్
బాలీవుడ్ హిట్ మూవీ ఫ్రాంచైజీలో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘జాలీ ఎల్ఎల్బీ’, ‘జాలీ ఎల్ఎల్బీ 2’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా రానుంది. ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీలోని తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన సుభాష్ కపూరే మూడో భాగాన్నీ తెరకెక్కిస్తున్నారు.అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో సౌరభ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తాజాగా ఈ సినిమా సెట్స్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ‘‘ఒరిజినల్ ఎవరో, డూప్లికేట్ ఎవరో తెలియడం లేదు. కానీ ఈ సినిమా మాత్రం ఓ జాలీ రైడ్గా ఉండబోతోంది’’ అంటూ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా షూటింగ్లో తాను పాల్గొంటున్నట్లుగా వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. నకిలీ లాయర్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. -
యూట్యూబర్లూ బీ కేర్పుల్: నటుడికి, ఆయన భార్యకు సెబీ షాక్
సాక్షి, ముంబై: షేర్ మార్కెట్ , స్టాక్ సంబంధిత అంశాలపై తప్పుడు సమాచారంతో మోసం చేస్తున్న యూ ట్యూబర్లకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాకిచ్చింది. సోషల్ మీడియా ద్వారా మార్కెట్ మానిప్యులేషన్కు పా ల్పడుతున్న సాధన బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లతో సహా, 31 యూట్యూబర్లను గురువారం బ్యాన్ చేసింది. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ చర్య తీసుకుంది. అమాయక పెట్టుబడిదారులను మోసంచేస్తూ యూట్యూబర్లు కుమ్మక్కయ్యారని మండిపడింది. ముఖ్యంగా యూట్యూబ్లో తప్పుదోవ పట్టించే వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను మానిప్యులేట్ చేశారంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టిని కూడా మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధించింది. అర్షద్ వార్సీ రూ.29.43 లక్షలు, ఆయన భార్య రూ.37.56 లక్షల లాభం ఆర్జించారని సెబీ పేర్కొంది. అంతేకాదు ఆయా సంస్థలనుంచి రూ. 41.85 కోట్ల అక్రమ లాభాలను రెగ్యులేటర్ స్వాధీనం చేసుకుంది. షేర్ పంప్ అండ్ డంప్ స్కీమ్లో అర్షద్తో సహా 45 మంది యూట్యూబర్లను సెబీ దోషులుగా గుర్తించింది. నిందితుడు అర్షద్ వార్సీతో సహా చాలా మంది యూట్యూబర్లు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం ద్వారా వారి వాల్యూమ్ను పెంచుతున్నారని తద్వారా ప్రతి నెలా రూ.75 లక్షల వరకు సంపాదిస్తున్నారని సెబీ తెలిపింది. యూట్యూబ్ క్రియేటర్లతో కలిసి స్టాక్లను షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ షేర్ల మానిప్యులేషన్స్కు పాల్పడుతున్నారంటూ 24 ఎంటిటీలను కూడా స్టాక్ మార్కెట్ నుండి సెబీ నిషేధించింది. షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ స్క్రిప్లో ఏప్రిల్ నుండి ఆగస్టు 2022 వరకు తప్పుడు వాల్యూమ్లకు దారితీసిందనీ, దీంతో కొంతమంది వాటాదారులు భారీ లాభాలను బుక్ చేసుకున్నారని , ఇది ట్రేడ్ ప్రాక్టీస్ నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది. సాధనా బ్రాడ్కాస్ట్కి సంబంధించి ఏప్రిల్ 27, 2022 నుండి సెప్టెంబర్ 30, 2022, షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ ఏప్రిల్ 12, 2022 నుండి ఆగస్టు 19, 2022 మధ్య లావాదేవీలను సెబీ విచారించింది. సెబీ తన రెండు మధ్యంతర ఉత్తర్వుల్లో, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నేరస్తులందరినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానైనా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా డీల్ చేయకుండా నిరోధించింది. అలాగే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్లలో వారు ఏదైనా ఓపెన్ పొజిషన్లు ఉంటే ఈ ఆర్డర్ తేదీ నుండి లేదా అటువంటి కాంట్రాక్టుల గడువు ముగిసే మూడు నెలలలోపు, ఏది ముందుగా అయితే, అటువంటి పొజిషన్లను మూసివేయవచ్చు/స్క్వేర్ ఆఫ్ చేయాలని కూడా ఆదేశించింది. కాగా సెబీ చాలా కాలంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించేందుకు సిద్దమవుతోంది. రెండేళ్ల క్రితమే ఈ విషయంలో నిబంధనల రూపకల్పన కసరత్తు మొదలైంది. -
లక్ష బిల్లు.. గొల్లుమన్న యాక్టర్!
ముంబై: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి కరెంటు బిల్లు షాకిచ్చింది. అదానీ ఎలక్ట్రిసిటీ 1,03,564 రూపాయలు బిల్లుగా పంపడంతో ఆయన బిత్తరపోయారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. అదానీ ఆయనకు లక్ష రూపాయలు బిల్లు వేసిందని, ఎవరైనా తన పెయింటింగ్స్ కొని డబ్బిస్తే ఆ బిల్లు కడతానన్నారు. తన పెయింటింగ్స్పై వచ్చిన న్యూస్ ఆర్టికల్ను ఆ ట్వీట్కు జోడించారు. (కరోనాతో హాలీవుడ్ నటుడు మృతి) వచ్చే నెలలో కూడా ఇలానే బిల్లు వస్తే ఇక కిడ్నీలు అమ్ముకోవాల్సిందేనంటూ జోక్ చేశారు. కొద్దిసేపటికి అదానీ తన బిల్లును సరి చేసిందంటూ మరో ట్వీట్ చేశారు. జూన్ నెలలో చాలా సినీ తారలకు, సామాన్యులకు కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయి. వీరిలో తాప్సీ పన్ను, రేణుకా షాహానే, హుమా ఖురేషి, నిమ్రత్ కౌర్, సోహా అలీ ఖాన్, అమైరా దస్తూర్, డినో మోరియా, కామ్యా తదితరులున్నారు. (పబ్జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు) -
టవర్ సే నహీ పవర్ సే!
పేరు వైఫై భాయ్. ఇతని నెట్వర్క్ టవర్ నుంచి కాదు... అతని పవర్తో నడుస్తుందట. ఈ పవర్ సిగ్నల్స్కి ముందుగా రాజ్ కిషోర్, సంజనలు స్పందిస్తారు. మరి.. తన పవర్తో వైఫై భాయ్ ఏమేం పనులు చేశారో వెండితెరపై చూడాల్సిందే. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఇలియానా, జాన్ అబ్రహాం, అర్షద్ వార్షి ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్ పంతీ’. పుల్కిత్ సామ్రాట్, కృతీ కర్భందా, ఊర్వశీ రౌతేలా, సౌరభ్ శుక్లా కీలక పాత్రధారులు. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారుల లుక్స్ను విడుదల చేశారు. వైఫై భాయ్ పాత్రలో అనిల్ కపూర్, సంజన పాత్రలో ఇలియానా, రాజ్ కిషోర్ పాత్రలో జాన్ అబ్రహాం కనిపిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 22న విడుదల చేయాలనుకుంటున్నారు. -
పనికి మాలినోళ్లతో బిగ్ బాస్
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఖాన్ హోస్ట్గా నడుస్తున్న ప్రస్తుత సీజన్ చాలా చాలా పేలవంగా ఉందని వార్సి చెబుతున్నాడు. కేవలం వివాదాల ద్వారా టీఆర్పీ పెంచుకునేందుకు వాళ్లు(ఛానెల్ నిర్వాహకులు) యత్నిస్తున్నారు అంటూ ఈ విలక్షణ నటుడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం 11వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మొన్నీమధ్యే జుబైర్ ఖాన్ వ్యవహారం సంచలనంగా మారింది. సల్మాన్ తిట్టడంతో.. కలత చెందిన జుబైర్ ఆత్మహత్యకు యత్నించటం.. ఆ తర్వాత సల్మాన్పై కేసు పెట్టడం విదితమే. అయితే ఇలా వివాదాలతో షోను నడిపించటం మంచిది కాదని అర్షద్ సలహ ఇస్తున్నాడు. ‘‘నేనేం షోను చూడట్లేదు. కానీ, నేను విన్నదాన్ని బట్టి ఇందులో అంతా పనికి మాలిన వాళ్లే ఉన్నారనుకుంటున్నా. ప్రజలకు వినోదం పంచటం అంటే వ్యాపారం కాదు. ఇలాంటివి ఛానెళ్లు మానుకుంటే మంచిది’’ అని అర్షద్ చెబుతున్నారు. మరోవైపు టీఆర్పీ కూడా దారుణంగా పడిపోవటం ఛానెల్ నిర్వాహకులను కలవరపెడుతోంది. అయితే రానున్న రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందని వాళ్లు భావిస్తున్నారు. 2006లో ప్రారంభమైన బిగ్ బాస్ షో మొదటి సీజన్కు అర్షద్ వార్సి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. త్వరలో గోల్ మాల్ అగెయిన్ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement