-
ప్రెసిడెంట్ పోలీసు అవార్డు గ్రహీతలకు అభినందనలు: డీజీపీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రతిష్టాత్మక అవార్డులను సోమవారం ప్రకటించారు. ప్రెసిడెంట్ పోలీసు అవార్డు గ్రహీతలకు డీజీపీ అనురాగ్ శర్మ అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్ అవార్డులకు ఎంపికైన వారిలో.. హైదరాబాద్ అడిషినల్ సీపీ అంజనీ కుమార్, జాయింట్ సీపీ శివ కుమార్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సూర్యనారాయణ ఉన్నారు. గ్యాలన్ట్రీ అవార్డుకు కోటగిరిధర్, నలుపుల రవీందర్ ఎంపిక అయ్యారు. పోలీసు సేవా పతకానికి.. గ్రేహౌండ్స్ డీఐజీ స్టీఫెన్ రవీంద్ర, అడిషినల్ ఎస్పీ పల్లా రవీందర్ రెడ్డి, కరీంనగర్ డీఎస్పీ, ఎం భీమరావు, కొట్టం శ్యాం సుందర్, కటకం మురళీధర్, కొమ్మెర శ్రీనివాసరావు, పోలు రవీందర్, వై. వల్లి బాబా, మారుతీరావు, మహ్మద్ జాఫర్, డబ్బికర్ కిషన్జీ, ఎ. వేంకటేశ్వర్ రెడ్డి ఎంపిక అయ్యారు. -
పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్న ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పోలీసులకు అపార్ట్మెంట్ల నిర్మాణంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ప్రభుత్వ స్థలాలను కేటాయించనున్నట్లు తె లిపారు. ఆయన సోమవారం పోలీసు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. మరో పదిహేను రోజుల్లో వీటికి సంబంధించిన శంకుస్థాపన పనులు ప్రారంభిచనున్నట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు. -
28 మంది డీఎస్పీలకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 28 మంది డీఎస్పీలకు కొత్తగా పోస్టింగ్లిస్తూ డీజీపీ అనురాగ్శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరందరికీ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా పదోన్నతులిచ్చారు. అనంతరం వీరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమని చెప్పారు. కాగా, మంగళవారం డీజీపీ అనురాగ్శర్మ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశమై వీరికి కొత్తగా పోస్టింగులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో హైదరాబాద్లో 24 మందికి పోస్టింగులివ్వగా, మురళి మనోహర్కు సీసీఎస్ మహబూబ్నగర్ డీఎస్పీగా, గోవర్ధన్కు నాగర్కర్నూల్ డీఎస్పీగా, షేక్ అలీకి సంగారెడ్డి డబ్ల్యూపీఎస్గా, తిరుపతన్నకు సంగారెడ్డి డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. -
వారానికి ఐదు రోజులు యూనిఫాం తప్పనిసరి
* అదనపు డీజీలు మొదలుకొని ఎస్పీల వరకు.. * డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు సాక్షి,హైదరాబాద్: ఇకపై వారానికి ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పనిసరిగా ధరించాలని తమ హెడ్క్వార్టర్స్లోని అధికారులకు రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ సోమవారం ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం డీజీపీ కార్యాలయంలోని కొందరు అధికారులు మినహా మిగతా వారు యూనిఫాం ధరిం చి రాకపోవడం డీజీపీ దృష్టికి వచ్చింది. అదనపు డీజీలు మొదలుకుని ఎస్పీ స్థాయి అధికారుల వరకు సివిల్ దుస్తుల్లోనే కా ర్యాలయానికి రావడం వలన క్రమశిక్షణ దెబ్బతింటున్నదని ఆ యన భావించినట్లు తెలిసింది. దీంతో ఇకపై సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పని సరిగా ధరించి రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
పదో రోజూ నిరాశే
* తెలియని హిమాచల్ బాధితుల జాడ * 700 మంది గాలించినా దక్కని ఫలితం సాక్షి, హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్లో బియాస్ దుర్ఘటనలో ఇంకా ఆచూకీ చిక్కని 17 మంది జాడ కోసం చేస్తున్న ప్రయత్నాలు పదో రోజు కూడా ఏమాత్రమూ ఫలించలేదు. నదిలో ప్రమాదస్థలికి ఎగువనున్న లార్జి, దిగువనున్న పండో డ్యాముల మధ్య మంగళవారం ఏకంగా 700 మంది సిబ్బంది జల్లెడ పట్టినా ఒక్క విద్యార్థి ఆచూకీ కూడా లభించలేదు. లైడర్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, సైడ స్కాన్ సోనార్ వంటి అత్యాధునిక పద్ధతులతో గాలింపు జరిపినా లాభం లేకపోరుుంది. రుతుపవనాల ప్రభావంతో హిమాచల్లో అతి త్వరలో ఎడతెరిపి లేని వర్షాలు ప్రారంభం కానుండటం మరింత ఆందోళనకు దారితీస్తోంది. హైదరాబాద్ నుంచి విహారయూత్రకు వెళ్లిన 24 మంది విజ్ఞాన్జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ హఠాత్తుగా ముంచెత్తిన బియూస్ ప్రవాహంలో కొట్టుకుపోవడం తెలిసిందే. జూన్ 8న జరిగిన ఈ ఘోరానికిసంబంధించి తొలి నాలుగు రోజుల్లో 8 మంది మృతదేహాలు లభించారుు. తెలంగాణ హోం మంత్రి నారుుని నర్సింహారెడ్డి స్థానంలో రవాణా మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఇప్పటికే హిమాచల్ వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా, మంగళవారం రాష్ట్ర డీజీపీ అనురాాగ్శర్మ కూడా అక్కడికి చేరుకుని గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. విద్యార్థుల కోసం గాలింపు చర్యలను చివరికంటా చేపడతామని ఆయనన్నారు. మృతదేహాల జాడ లార్జి-పండో డ్యాముల మధ్యలో అరుుతే దొరకడం కొంత సులువే గానీ పండోను కూడా దాటి వెళ్లి ఉంటే కనిపెట్టడం చాలా కష్టమని అక్కడి అధికారులు వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement