breaking news
Amma theaters
-
అమ్మ సంతలు
జైలు, బెయిల్తో సతమతమవుతున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వెనక్కుతగ్గక తప్పదని భావించిన వారికి అధికార పార్టీ ఝలక్ ఇచ్చిం ది. అమ్మపేరుతో సంతలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాల్లో పడింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే, డీఎంకేలు ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని పంచుకునే విధానానికి స్వస్తి పలకాలని అమ్మ ఆశిస్తోంది. భారీ పథకాల ద్వారా కొందరికే అందుబాటులో ఉండకుండా సామాన్యునికి చేరవయ్యేలా పథకాలను రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమ్మ (జయలలిత) పేరిట తమిళనాడులో అనే క పథకాలు వెలిశాయి. అతి స్వల్ప ధరకే టిఫిన్, భోజనం అందించే అమ్మ క్యాంటీన్ అత్యంత ప్రజాదరణ చూరగొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సైతం అమ్మ క్యాంటీన్ను అనుసరించాయి. దీంతోపాటూ అమ్మ ఫార్మశీ, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, అమ్మ స్టోర్లు ఇలా అనేక పథకాలు ప్రజలకు చేరువయ్యూయి. ఆహారం, ఆరోగ్యంతోపాటూ వినోదం కూడా పంచాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఆఖరుకు చెన్నైలో అమ్మ థియేటర్లు సిద్ధమవుతున్నాయి. అతితక్కువ ధరకు ఐమాక్స్ స్థాయి థియేటర్లను పేద ప్రేక్షకుల కోసం నిర్మిస్తున్నారు. వరుసగా ప్రజలకు పరిచయం అవుతున్న ఈ పథకాలను ప్రవేశపెట్టేపుడు జయ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు జైలు శిక్షపడటం, ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం, బెయిల్పై వచ్చి ఇంటికే పరిమితం కావడంతో అమ్మ పథకాలు ఆగిపోయాయని ప్రతిపక్షాలు భావించాయి. అయితే అమ్మ థియేటర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఇటీవలే ప్రకటించిన చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరస్వామి అమ్మ సంతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. కార్పొరేషన్ పరిధిలో 15 చోట్ల అమ్మ సంతలను నిర్వహించాలని నిర్ణయించినట్లు గురువారం ప్రకటించారు. కూరగాయలు, వస్త్రాలు, ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు ఇలా మొత్తం 1256 రకాల వస్తువులను 50 శాతం ధరకే సంతలో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో లభ్యమయ్యే వస్తువులతోపాటూ దేశం నలుమూలల నుంచి విశేషమైన వస్తువులను అమ్మకానికి పెడతామని తెలిపారు. రాష్ట్రంలోని 16,564 గ్రామాల ద్వారా వ్యాపారులు దుకాణాలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంతలో దుకాణాలు పెట్టేందుకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే వ్యాపారస్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. వ్యాపారులకు ఉచిత పాస్లు అందజేస్తారు. ఒక్కో దుకాణాన్ని 100 చదరపు అడుగులకు సిద్ధం చేస్తూ మొత్తం 200 దుకాణాలు అమరేలా నిర్ణయించారు. తొలి దశలో ఆరుంబాక్కం, సాలిగ్రామం, వలసరవాక్కం, ఆర్కాడురోడ్డు, టైడల్పార్క్ సమీపం, నందంబాక్కం ఈ 6 చోట్ల సంతలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంతల ఏర్పాట్ల కోసం చెన్నై కార్పొరేషన్ రూ.11 కోట్ల బడ్జెట్ కేటాయించింది. వస్తువుల అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.3,600 కోట్ల టర్నోవర్ను అంచనావేశారు. చెన్నై కార్పొరేషన్ నిర్వహించే ఈ సంతలకు 41 ప్రభుత్వ శాఖల నుంచి సహకారం అందుతుంది. -
త్వరలో ‘అమ్మ’ థియేటర్లు
చెన్నై: నిరు పేదలకు సినిమా వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ‘అమ్మ థియేటర్లు’ ఈ ఏడాది డిసెంబరులోగా చెన్నై వాసులకు కనువిందు చేయనున్నాయి. తొలిదశలో చెన్నై కార్పొరేషన్ పరిధిలో 15 అమ్మ థియేటర్లను నిర్మించనున్నారు. రూ.25 లోపు ధరకే ఏసీ, డిజిటల్ టెక్నాలజీతో కూడిన థియేటర్లను నిర్మించనున్నామని, త్వరలో టెండర్లు పిలిచి డిసెంబరులోగా ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నట్లు మేయర్ సైదై దొరస్వామి గురువారం తెలిపారు. -
డిసెంబరులోగా ‘అమ్మ’ థియేటర్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి జయలలితకు ప్రజలు ప్రేమతో పెట్టుకున్న పేరు ‘అమ్మ’. ఈ పేరుతో ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ అముదం స్టోర్లు, అమ్మ వాటర్ బాటిళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. నగరంలోని షాపింగ్ మాల్స్ సంప్రదాయం పెరిగిపోగా, అక్కడి వాణిజ్య సముదాయంలో నిర్మించిన సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధర పేదలకు అందుబాటులో లేదు. సగటుజీవి ఏకైక వినోద సాధనమైన సినిమాను నిరుపేదలకు సైతం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అన్నాడీఎంకే ప్రభుత్వం అమ్మ థియేటర్లను ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించింది. తొలిదశలో చెన్నై కార్పొరేషన్ పరిధిలో మండలానికి ఒకటి చొప్పున 15 మండలాల్లో థియేటర్ల నిర్మాణానికి 2014-15 బడ్జెట్లో పొందుపరిచారు. కార్పొరేషన్ స్వాధీనంలో నిరుపయోగంగా ఉన్న భవనాలు, ఖాళీ స్థలాలను అమ్మ థియేటర్ల నిర్మాణానికి ఎంపిక చేశామని. ఇందుకు సంబంధించిన ప్రాథమిక పనులు చురుగ్గా సాగుతున్నాయని మేయర్ సైదై దొరస్వామి గురువారం ప్రకటించారు. ఏసీ వసతి, డిజిటల్ టెక్నాలజీతో కూడిన థియేటర్లను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. టికెట్టు ధర రూ.25లకు లోపునే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అమ్మ థియేటర్లలో ‘యు’ సర్టిఫికేట్ పొందిన చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తారు. థియేటర్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలిచి ఈ ఏడాది డిసెంబరులోగా ప్రేక్షకులకు సినిమాలను అందుబాటులోకి తేనున్నట్లు మేయర్ తెలిపారు. నుంగంబాక్కం, రాయపురం, మింట్, అన్నానగర్, హార్బర్, మధురవాయల్, పెరుంగుడి తదితర 15 ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ‘అమ్మ’ పేరున మరిన్ని సేవలు ః అమ్మ పేరున మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. మహిళా రైతుల శిక్షణ కోసం ‘అమ్మ ఫామ్’, నాణ్యమైన విత్తనాల సరఫరాకు ‘అమ్మ సీడ్స్’ ప్రవేశపెడుతున్నట్లు గురువారం నాటి అసెంబ్లీ సమావేశంలో సీఎం జయలలిత ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపు, మహిళా రైతులకు ప్రోత్సాహం కల్పించే విధంగా రూ.113 కోట్లతో అమ్మ ఫామ్లు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది 770 మహిళా స్వయం సహాయక రైతుల సంఘాలను ఏర్పాటు చేసి రుణాలను మంజూరు చేయనున్నారు. తమిళనాడు సీడ్స్లో ఉత్పత్తి పెంపు లక్ష్యంగా రూ.156కోట్లను ప్రకటించారు. అమ్మ సీడ్స్ పేరిట రైతులకు నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అమ్మ సేవా కేంద్రాలను ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆమె చెప్పారు. అలాగే 50 చోట్ల రూ.75కోట్లతో వ్యవసాయ కేంద్రాలు, 345 చోట్ల రూ.126కోట్లతో వ్యవసాయ పరికరాలు అద్దెకిచ్చే కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. రాష్ట ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న అనాథ, వృద్ధుల శరణాలయాలకు ‘అమ్మ అన్బగం’ అనే పేరును ప్రతిపాదించినట్లు మంత్రి వలర్మతి గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. కొత్తగా 128 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నారు. వీటిల్లో ఏడు భవనాలను సంచారజాతులకు కేటాయించారు. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ ఁఅమ్మ అన్బగంరూ. పేరు పెట్టాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కోరుతున్నట్లుగా వలర్మతి తెలిపారు. పేరు మార్పుపై ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేస్తుందని ఆమె అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు హోసూరులో పోలీస్, రవాణా, రెవెన్యూ, అటవీ, వాణిజ్య, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి రూ.120 కోట్లతో కంబైన్డ్ చెక్పోస్టు నెలకొల్పుతున్నట్లు తెలిపారు. చెన్నైలోని వాణిజ్య పన్నుల కమిషనర్ కారాలయాన్ని రూ.6 కోట్లతో ఆధునీకరించనున్నట్లు చెప్పారు. పురాతన అద్దె భవనాల్లోని రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలకు పక్కా భవనాలను ప్రకటించారు. తిరుపూరు, సేలం, కంచి, చెన్నై, తంజావూరులలో 10 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలతో కూడిన ఐదు కంబైన్డ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, 25 వేర్వేరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయ భవనాలను నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. చెన్నైలోని 70 వాణిజ్య పన్నుల కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే విధంగా రూ.60 కోట్లతో రెండు భవనాలను నిర్మించనున్నారు.