Amaravati
-
బాబు సర్కార్ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. -
చిన్న వర్షానికే .. మునిగిన అమరావతి
-
భారీ వర్షానికి తడిసి ముద్దైయిన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి
-
రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టడం బాధాకరం
-
మద్యం అమ్మకాల ఆదాయం భారీగా పెంచండి!
విజయవాడ: ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోవడంతో దాన్ని సరిచేసుకునే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి చంద్రబాబు దగ్గర ఉన్న ప్రధానం ఆయుధం మద్యం. ఇప్పుడు దానిపైనే మరోసారి పడ్డారు చంద్రబాబు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం భారీగా పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు చంద్రబాబు.మద్యం ద్వారా అమ్మకాల ద్వారా రూ. 33, 882 కోట్లు ఆదాయం తేవాలని టార్గెట్ నిర్దేశించారు. అదే సమయంలో ఎర్రచందనం అమ్మకంతో కూడా ఆదాయం పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కూడా భారీగా ప్రభుత్వ ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అమ్మాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారలతో కమిటీ వేయాలన్నారు.29 శాతం పెంచాలంటూ..!చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిపోవడంతో కేంద్ర నుండి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గినట్లు అధికారులు అంగీకరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మే 11 వరకూ రూ. 5,500 కోట్ల మైనస్ ఆదాయం ఉందని అధికారులు తెలిపారు. దాంతో ఆదాయాన్ని 29 శాతం ఆదాయం పెంచాలంటూ అధికారులకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు. అయితే 29 శాతం ఆదాయం ఎలా పెంచాలని అధికారులకు తలలు పట్టుకుంటున్నారు. -
సుప్రీంకోర్టులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు ఊరట
ఢిల్లీ: ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా కేసు దర్యాప్తుకు హాజరుకావాలని, అధికారులకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్పై విచారణ
అమరావతి: తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు(శుక్రవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత విషయంలో వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్న కారణంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత పునరుద్దరించేలా వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగ్గా, వైఎస్ జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.‘‘వైఎస్ జగన్కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. జగన్కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. కావాలనే జగన్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే భద్రతకు సంబంధించిన అంశంపై ఒక రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉంది’అని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
పవన్ మర్చిపోవచ్చు.. మోదీ కూడా యూటర్న్!
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్, పవన్లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Janatantram: రాజధాని మతలాబ్
-
చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ పై శైలజానాథ్ మాస్ ర్యాగింగ్
-
వేదనలో రాజ్యం... వేడుకలో రాజధాని!
‘‘ఠండా మతలబ్ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్ టాక్. పది పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్ఠాన్నే లెక్కేసుకుందాం. దానికి పదింతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు ఇరవై రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు, కమీషన్లు తీసేసినా మినిమమ్ నూటా యాభై శాతం లాభాలు కంపెనీ గల్లా పెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ టెక్నిక్ వంటి పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు.ఈ ధోరణి రాజకీయాల్లోకి, ప్రభుత్వ పాలనలోకి కూడా దిగుమతయింది. ఇందులో ఉద్దండులైన ఇద్దరు అగ్ర నాయ కులు నిన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో అమరావతి బ్రాండ్ షూటింగ్ను పునఃపునఃప్రారంభించారు. ప్రధాని సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరితేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్రవేసి అమ్మగల నేర్పరులు వారు. లేకపోతే, ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్ హక్కులున్నాయని ఎలా ప్రకటించు కోగలరు?ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి దీటైనవారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా! మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, సెల్ఫోన్ల మీదా తనకే పేటెంట్ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్ వ్యాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు. ఈ షో జరగడానికి ముందునుంచే అమరావతి ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచబ్యాంకూ, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారు. ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపించాయి.ఇందులో చాలా పనులకు ఏడేళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికీ, ప్రస్తుతానికీ పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్ టవర్ల అంచనాయే నూరు శాతం పెరిగింది. 2018లో సెక్రటేరియట్ నాలుగు టవర్లూ, సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడది 4,688 కోట్లకు ఎగబాకింది. ఏడేళ్లలో నూరు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని మార్కెట్ సమాచారం. అమరావతి బ్రాండ్ బాజా మిరు మిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాల కుల ఉద్దేశం కావచ్చు.అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానం ఎలా ఉన్నదో మచ్చుకు ఒక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్ పాలనలో పలికిన సగటు ధర 24 వేల రూపాయలైతే, ఇప్పుడు 6,500. పత్తికి నాడు 10,500 పలికితే నేటి సగటు ధర 4,900. కందులు నాడు 11 వేలు, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీపండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి... ఇలా ఏ వ్యవసాయిక ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి. ఒకే రకమైన రాజధాని పనులకు ఏడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము నూరు శాతం ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట! జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47 వేల కోట్లు కావాలట! మరో 44 వేల ఎకరాలు సమీకరించాలట! అప్పుడు గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాదట! పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో! గిట్టుబాటు ధర లేకపోవడం ఒక్కటే కాదు. రైతు కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు. అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు. పంటల బీమా లేదు. దేవుడి మీదే భారం. ఇన్పుట్ సబ్సిడీ, కరువు సాయం బకాయీల ఊసెత్తితే ఒట్టు. ఆర్బీకేలు అలంకార ప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప, సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పో యింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహా చలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు.అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చయినా అందులోంచే పెట్టాలి. ఏ అప్పయినా అందులోంచే చెల్లించాలి. లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్ర బాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతే తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానా లేవీ ఇంతవరకు రాలేదు.ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను ‘త్యాగం’ చేసిన 28 వేల మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లయినా దక్కుతాయని చెబు తున్నారు. కానీ, అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎం.ఎస్. ఎం.ఈ. రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకిచ్చిన సమా ధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవ్వాలి? ఎంత విధ్వంసం జరగాలి? ‘‘మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు’’ అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో?శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనే వారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునా దులపై తలెత్తుతున్న సందేహాలు ఇవి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం. రాష్ట్రంలోని మహిళలకు ‘సూపర్ సిక్స్’ పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబి లోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయట పడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమరచి చెప్ప లేకపోయిన మాట కూడా వాస్తవం.రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరా వతిలో ‘పునరపి జననం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు. గౌరవించాలి కూడా! అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి నంగి మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు. బిల్లు మంజూరు చేసే అధి కారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత మూడుసార్లు ‘వందేమాతరం’ అనిపించడం చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగు దేశం పార్టీలో ఈ ఆచారం లేదు.ఆరేళ్ల క్రింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలామందికి ఇంకా గుర్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యకరంగా నిన్నటి సభలో ‘‘టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ’’ అని పొగిడేశారు. ఈ భజన కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశం ఏమిటో గాని ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి–నీళ్లు తెచ్చిన ప్రధాని, ఈసారి పవన్ కల్యాణ్కు మాత్రమే ఒక చాక్లెట్ తీసుకువచ్చారు.ఏదో వ్యూహం ప్రకారమే లోకేశ్తో ఈ సభలో మాట్లాడించి నట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేశ్ ‘నమో నమః’ అంటూ మూడుసార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగి నట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట ‘నమో గారు, నమో గారు’ అంటూనే మాట్లాడారు. ‘‘వంద పాకిస్తాన్లు దండెత్తి వచ్చినా నమో మిస్సైల్ ముందు బలాదూర్’’ అన్నారు. ప్రధాన మంత్రిని లోకేశ్ పొగుడుతున్నంతసేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేశ్ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు. ఇటువంటి సైడ్ లైట్స్ తప్ప ఈ సభ గురించి చెప్పు కోవడానికి ఇంకో విశేషం లేదు. అమరావతికి బ్రాండ్ వ్యాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరా వతి స్థానం సంపాదించుకుంటుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Narayana: అమరావతి సభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు
-
పునఃనిర్మాణ సభతో ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు
-
వరదలు వస్తే చేపలు పట్టుకునే ప్రాంతంలో రాజధానా? శైలజానాథ్ సెటైర్లు
-
అమరావతి నిర్మాణంలో చంద్రబాబు విఫలమయ్యారు
-
‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!
రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
KSR Live Show: అమరావతి కేరాఫ్ అవినీతి
-
Big Question: మన రాజధానికి అడ్డెవరు? ప్రధాని ముందే పచ్చి అబద్దాలు
-
పొగడ్తలేనా.. ప్రయోజనాలు పట్టవా..!
-
దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తాం
సాక్షి, అమరావతి : ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కలిపి పనిచేస్తా. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ యువకుల కలలను నిజం చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమరావతి పునఃప్రారంభంలో భాగంగా రూ.58 వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం ఆనందంగా ఉందన్నారు. ‘దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు. ఏపీ ఆశలకు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాది. ఈ సందర్భంగా వీరభద్రస్వామికి, అమరలింగేశ్వరస్వామికి, తిరుపతి వెంకన్న పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన ప్రధాని మోదీ మధ్యలో కొన్ని తెలుగు వాక్యాలు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పదేళ్లుగా చేయూతనిచ్చాం... ఇంద్రుడి రాజధాని అమరావతి.. ఏపీ రాజధాని అమరావతి. ప్రతి యువకుడి కలలు నిజమయ్యే నగరంగా అమరావతి తయారవుతోంది. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతోంది. 2015లో అమరావతికి శంకుస్థాపన చేశా. ఈ పదేళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చాం. వికసిత్ ఏపీ కోసం నాడు ఎన్టీఆర్ కలగన్నారు. మనందరం కలసి అమరావతి, ఏపీని వికసిత్ భారత్ దేశానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలి. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు.. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు అందిస్తోంది. దీనివల్ల ఏపీలో జిల్లాల మధ్య అనుసంధానం, పక్క రాష్ట్రాలతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు, పర్యాటకం పెరిగేందుకు దోహదం చేస్తుంది. రేణిగుంట నుంచి నాయుడుపేట మధ్య నిర్మిస్తున్న కొత్త హైవే వల్ల తిరుపతి వెంకన్నను తక్కువ సమయంలో దర్శించుకోవచ్చు. రైల్వే బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రానికి రూ.900 కోట్లకు మించి కేటాయింపులుండేవి కావు. ఇప్పుడు విభజిత ఏపీకి రూ.9 వేల కోట్లకు పైగా అందిస్తున్నాం. ఏపీలో వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నాం. 8 సరికొత్త వందేభారత్ రైళ్లు ప్రారంభించాం. 750కిపైగా రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్లు నిర్మించాం. 70కిపైగా రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ కింద అభివృద్ధి చేశాం. నాలుగు స్తంభాలు కేంద్ర బిందువుగా పేదలు, రైతులు, యువత, మహిళాశక్తి.. ఈ నాలుగు స్తంభాలపై వికసిత్ భారత్ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. రైతులపై భారం పడకుండా పదేళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) ద్వారా ఒక్క ఏపీలోనే సుమారు రూ.5,500 కోట్ల బీమా పరిహారం అందించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) ద్వారా రాష్ట్రంలో రైతులకు రూ.17,500 కోట్ల మేర పెట్టుబడి సాయం అందించాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయ సహకారాలు అందిస్తాం. నవదుర్గా మిస్సైల్ లాంచ్ కేంద్రం.. అంతరిక్ష శక్తిగా దేశం అవతరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతీ రాకెట్ కోట్లాది మంది భారతీయులు గర్వించేలా చేస్తుంది. కోట్లాది మంది దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో డీఆర్డీవో నవదుర్గా మిస్సైల్ లాంచింగ్ రేంజ్కు శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం కనక దుర్గమ్మలా దేశ రక్షణకు నిరంతరం శక్తిని ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఏక్తా మాల్స్ నిర్మించబోతున్నాం. ఇందులో ఒకటి విశాఖపట్నంలో నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా హస్తకళాకారుల ఉత్పత్తులు ఒకే చోటకు తెచ్చేందుకు వీలుంటుంది.21న విశాఖలో యోగా దినోత్సవం.. జూన్ 21న విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆరోజు ప్రపంచ ప్రజలంతా ఏపీ వైపు చూసేలా చేయాలి. అందుకోసం ఈ 50 రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ఇంట్లో యోగాకు ప్రాముఖ్యత కల్పించేలా, వరల్డ్ రికార్డు సాధించేలా కృషి చేయాలి. ఏపీలో కలలు గనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. వాటిని నిజం చేసే వారూ తక్కువేమీ లేరు. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి పనులు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఏ స్థాయిలోకి దూసుకెళ్తుందో ఊహించగలను.ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలబెడతాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అమరావతి ఆర్కిటెక్చరల్ జోన్గా, కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాలనలో అమరావతి వరల్డ్ క్లాస్ రాజధానిగా ఎదుగుతుందన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును, ప్రజల ఆకాంక్షలను దివిసీమ ఉప్పెన మాదిరి తుడిచి పెట్టాలని చూసిందని విమర్శించారు. అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో అమరావతిని నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.కక్షతో నిలిపేశారు: మంత్రి లోకేశ్ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతి నిర్మాణాన్ని నిలిపివేశారని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలం గడిపేసిందన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని అపే దమ్ము ఎవరికీ లేదన్నారు. నరేంద్ర మోదీ అనే మిస్సైల్ ఉండగా వందల పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరన్నారు.మూడేళ్లలో నిర్మిస్తాంమోదీ ఆశీస్సులతోనే అమరావతి పనులు పట్టాలెక్కించాం: సీఎం చంద్రబాబు ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుడు మోదీ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం సాక్షి, అమరావతి: అమరావతి పనులను మూడేళ్లలో పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త రాజధానిని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా అమరావతిని నిర్మించి ప్రపంచ పటంలో నిలబెడతామన్నారు. శుక్రవారం ‘అమరావతి పునః ప్రారంభ’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2015లో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారుగత పది నెలల్లో కేంద్ర సహకారం, మోదీ ఆశీస్సులతో అమరావతి పనులను పట్టాలెక్కించామన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీ సిటీగా మారుస్తామన్నారు. కేంద్రం సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఐదు కోట్ల ఆంధ్రులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారన్నారు. మోదీ నాయకత్వంలో మనదేశం ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తోందన్నారు. -
ప్రధాని సభలో భో‘జనం పాట్లు’
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ/ మంగళగిరి: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సమావేశానికి తప్పకుండా రావాల్సిందేనని, లేదంటే రుణాలు, ఇతర పథకాలు మంజూరు కావంటూ భయపెట్టి ప్రజలను తీసుకొచ్చినా.. వారికి కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు. ఇంటింటికీ ఆహ్వానం పలికిన అమరావతి రైతులకు కూడా అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. ఆహ్వాన పత్రిక ఉంటే చాలని చెప్పినా, వారిని ప్రతిచోట పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై రైతులు అసంతృప్తి వెళ్లబుచ్చారు. వాహనాలను మూడు కి.మీ దూరంలోనే నిలిపివేయడంతో మండే ఎండలో అక్కడినుంచి రావడానికి మహిళలు ఇబ్బందిపడ్డారు. వారికి ఇచ్చిన భోజనం ఉదయాన్నే ప్యాక్ చేసినది కావడంతో పాచి వాసన వస్తోందని మహిళలు తినకుండా పక్కన పడేశారు. రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు మినహా పరిసర ప్రాంతాల నుంచి జన సమీకరణను టీడీపీ క్యాడర్ పట్టించుకోలేదు. రెండో దశ పూలింగ్ పేరుతో చంద్రబాబు మీడియాకు లీకులిస్తుండటం.. రాజధాని రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ తమ భూములు ఎక్కడ లాక్కుంటారో అనే ఆందోళనతో ఈ ప్రాంత టీడీపీ క్యాడర్ డుమ్మా కొట్టారు. » పోలీసులు అన్ని మార్గాల నుంచి జనాన్ని వదిలినా సభా ప్రాంగణ పరిసరాల్లో కూడా పెద్ద సంఖ్యలో కనిపించలేదు. » రాజధాని పరిసర ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలు భారీగా తరలిరావాలని హుకుం జారీ చేసినా, అధికారులు ఎంత ప్రయత్నించినా జనం కదలలేదు. » ప్లాస్టిక్ బిర్యానీ డబ్బాలో స్వస్తిక్ కంపెనీకి చెందిన చిన్నపాటి పచ్చడి ప్యాకెట్లు దర్శనమివ్వగా, కొన్నింటిలో ఉడికీ ఉడకని గోంగూర వేసి ఇవ్వడంతో ఆగ్రహంతో మహిళలు, టీడీపీ క్యాడర్ రోడ్ల వెంట పారేశారు. అమరావతి రైతులకు మళ్లీ అవమానం ప్రధాని సభకు ఉత్సాహంగా వెళ్తున్న అమరావతి రైతులు మహిళలకు ఎప్పటిలాగే తీరని అన్యాయం జరిగింది. ఆహ్వాన పత్రమే వీఐపీ పాస్ కంటే ఎక్కువ అంటూ పంచినా, నిన్న మొన్నటివరకు ఇంటింటికీ తిరిగి చెప్పిన నాయకులు, ప్రజాప్రతిని«ధులు వారిని గాలికొదిలేశారు. » అమరావతి రైతులను వీఐపీ మార్గాల్లోకి అనుమతించకుండా పోలీసులు నెట్టివేశారు. మీరు ఇటువైపు కాదు తిరిగి రావాలనడంతో మహిళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి వేలాది ఎకరాల భూములిచ్చిన మాకు సభకు వెళ్ళాలంటే ఇన్ని ఆంక్షలు ఎందుకని పలువురు కంటతడి పెట్టారు. ఆహ్వాన పత్రం చూపించినా నెట్టేయడం చాలా బాధించిందన్నారు. » దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కాజ టోల్గేట్ సమీపంలో దశావతారం దేవాలయం పక్కనే ట్రాన్సిట్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ట్రాన్సిట్ పాయింట్ ముందే కంతేరు అడ్డరోడ్డుకు కొన్ని వాహనాలు తరలించడంతో ప్రజలు భోజనం లేక అవస్థలు పడ్డారు. కనీసం తాగునీరు కూడా అందలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ టోల్గేటు వద్ద నుంచి చినకాకాని వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వందలకొద్దీ బస్సులు ఒకేసారి టోల్గేటు వద్దకు రావడం, ఒకదానివెంట ఒకటి వెళ్లి ఆహార కేంద్రాల వద్ద ఆగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. -
అమరావతిలో మోదీ స్పీచ్
-
SV Mohan: నెత్తిన నీళ్లు.. నోట్లో మట్టి.. అమరావతి 2.0పై సెటైర్లు..
-
అమరావతిలో బాబు స్పీచ్ ఆసక్తిగా వింటున్న జనం
-
అమరావతి సభలో పాచిపోయిన భోజనం కూటమిపై మహిళలు ఫైర్
-
వెలగపూడిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
-
ఏపీలో రూ. 49 వేల కోట్లతో చేపడుతున్న పనులకు మోదీ శంకుస్థాపన
-
పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
PM Narendra Modi AP Tour Updatesవెలగపూడి:02-05, 5.10 PMప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీమీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉందిఏపీకి కేంద్రం సంపూర్ణం సహకారం అందిస్తుందిమౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాంఏపీలో కనెక్టవిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందికనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు లబ్ధిదీంతో రవాణా రంగం అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుందిరైల్వే బడ్జెట్ లో ఏపీ వాటా 10 రెట్లు పెరిగిందికేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందిరూ. 9 వేల కోట్లకు పైగా ఏపీకి కేటాయిస్తున్నాంఏపీలో వందశాతం రైల్వేల విద్యుదీకరణ జరిగిందిమౌలిక సదుపాయాల కల్పనతో ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నాంనిర్మాణ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయిగత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు నిర్మించాంఏపీకి వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాంహైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందిపంట బీమా యోజన కింద రైతులకు ఇప్పటివరకూ రూ. 5,500 కోట్లు ఇచ్చాంఅంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తాంజూన్ 21 యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఏపీకి వస్తానాగాయలంక క్షిపణి కేంద్రంతో దేశ రక్షణకు కొత్త శక్తి వస్తుందియూనిటీ మాల్ తో స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయియూనిటీ మాల్ లో హస్త కళాకారుల ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉంటాయిరైతుల వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోందిపథకాలు, పరిహారం కింద రైతులకు రూ. 17 వేల కోట్లు ఇచ్చాంపీఎం సమ్మాన్ నిధి ద్వారా రైతులకు సాయం చేస్తున్నాం02-05, 4.55 PMపలు ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపనలువేదికపై నుంచి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేసిన మోదీమొత్తం 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలుఅమరావతిలో రూ. 49 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారంరూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపనలురాజధాని సహా రూ. 58 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు02-05, 2:50PMప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ,. ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో వెలగపూడి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెలగపూడి సభా ప్రాంగణానికి బయల్దేరి వెళ్లారు. పలు కేంద్ర ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్ట్ లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారీ భద్రత ఏర్పాట్లు..ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. అమరావతిలోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాలను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్ఎస్జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది. -
KSR: చంద్రబాబు సర్కార్ భూదాహానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా
-
అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి బలవంతంగా ప్రజల తరలింపు
-
ఏపీలో ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్
-
అమరావతి రీలాంచ్.. పరువు కోసం బాబు సర్కార్ పాట్లు
సాక్షి, విజయవాడ: పరువు నిలుపుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పాట్లు పడుతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రజలను బలవంతంగా తరలింపునకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు, ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6500 బస్సులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి ఏడుగురు సభ్యులు తప్పక హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. హాజరుకాని డ్వాక్రా గ్రూపులను ఆన్లైన్లో తొలగిస్తామంటూ హెచ్చరికలిచ్చిన సర్కార్.. సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ ఆదేశాలిచ్చింది. యనిమేటర్ల ఆడియో లీక్తో చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.5 లక్షల మంది తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రభుత్వం.. పి4 బహిరంగ సభ ప్లాప్ కావడంతో ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీగా ప్రజల తరలింపుకు ప్రయత్నాలు చేస్తోది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నిన్నటి నుండి బస్సుల్లో జనం, డ్వాక్రా మహిళలు తరలింపు కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో తరలిస్తున్నారు. -
అమరావతి పేరిట బాబు భూదందా
సాక్షి, అమరావతి: ‘రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూ దందా చేస్తోంది. రూ.లక్షల కోట్ల అప్పులతో రాజధాని నిర్మాణం చేపట్టి, ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మార్చేసింది. ఒక ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని సామాజిక, ఆర్థిక, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వనరులను కేంద్రీకృతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో విపరీత పరిణామాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.అమరావతి నిర్మాణంపై గురువారం ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్బాబు, ప్రజా సంఘాల ఐక్య వేదిక చైర్మన్ జేటీ రామారావు, రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పల్లవోలు వెంకారెడ్డి, ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ పి.అశోక్ కుమార్ తదితరులు మాట్లాడారు. ‘అమరావతి కోసం అంటూ 2015 నుంచే వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతి విస్తరణ పేరిట మరో 44 వేల ఎకరాలు పూలింగ్ చేపట్టడానికి యత్నిస్తుండటం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించడమే.ఒకసారి శంకుస్థాపన చేసి.. కొన్ని కట్టడాలు చేపట్టాక పునఃప్రారంభం అనడం హాస్యాస్పదం. అమరావతిలో, విశాఖలో విలువైన భూములను అస్మదీయ కంపెనీలకు కట్టబెడుతున్నారు. అమరావతి నిర్మాణం రాష్ట్రానికి గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నిర్ణయంలో సామాజిక సమగ్రత, ఆర్థిక నైతికత లేవు. మునిగిపోయే ప్రాంతంలో రూ.వేల కోట్ల ప్రజాధనం తెచ్చి గుమ్మరించడం భావ్యం కాదు. రాజధాని భూ సమీకరణ వెనుక భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇటు అమరావతిలో, అటు విశాఖలో భూములను బినామీలకు కట్టబెడుతున్నారు. సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు’ అంటూ వారు మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టార్గెట్ 5 లక్షలు
సాక్షి నెట్వర్క్: అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దల టార్గెట్ మేరకు జన సమీకరణ చేసేందుకు అధికార యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్రతి జిల్లా నుంచి.. ప్రతి నియోజకవర్గం నుంచి ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సుల్లో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చి తీరాల్సిందేనని, లేదంటే నష్టపోతారంటూ భయపెట్టి.. డ్రాక్రా మహిళలు, ఉపాధి కూలీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆ చివర ఉన్న అనంతపురం మొదలు.. ఈ చివర ఉన్న శ్రీకాకుళం వరకు టీడీపీ నేతలు, అధికారులకు టార్గెట్ నిర్దేశించారు.ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షలకు మించి జనం ఉండేలా చూడాలని ప్రభుత్వ పెద్దలు దిశా నిర్దేశం చేశారు. జన సమీకరణలో ఎవరికీ మినహాయింపు లేదని తెగేసి చెప్పడంతో ఉన్నతాధికారులు, కూటమి నేతలు నేరుగా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. భారీగా వాహనాలు సమకూర్చాల్సి రావడంతో కొన్ని చోట్ల ప్రభుత్వ సిబ్బందిపై ఈ భారం పడుతోంది. వాహనాల ఖర్చును తహసీల్దార్లు, డీఆర్డీఏ పీడీలు ఇతర సిబ్బందిపై రుద్దారు. జన సమీకరణ బాధ్యత డ్వాక్రా సంఘాల లీడర్లపై మోపారు. వారికయ్యే భోజనం, బస్సుల డీజిల్ ఖర్చులు కూడా అధికారులే చూసుకోవాలని కొన్ని చోట్ల ఆదేశించడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అమరావతికి వెళ్లే వాహనాలకు అనుమతులు లేవంటూ ఇబ్బంది పెట్టొద్దని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో స్కూలు, కాలేజీల బస్సులను జన సమీకరణ కోసం కేటాయించారు. యజమానులతో మాట్లాడి ప్రైవేటు వాహనాలను కూడా సభకు పంపించాలని ఒత్తిడి తెచ్చారు. రాజధాని సమీప జిల్లాల నుంచి విద్యార్థులను కూడా తరలించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో అధికారులు ఆ ప్రాంతాల్లోని కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడారు. మొత్తంగా వేలాది ఆర్టీసీ బస్సులను జన సమీకరణకు కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం కూడా ప్రజలకు ఈ ఇబ్బందులు తప్పవు. ఒక్క గుంటూరు జిల్లా నుంచే 1,241 బస్సులు కేటాయించారు. -
నేడు అమరావతికి ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాలొ్గంటారు. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెలగపూడిలోని సభా ప్రాంగణానికి వెళ్తారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.55 గంటలకు గన్నవరం చేరుకొని.. తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. భారీ భద్రత.. ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. అమరావతిలోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాలను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్ఎస్జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రధాని పర్యటన సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ జంక్షన్ నుంచి గుంటూరు వరకు వాహనాలను జాతీయ రహదారిపై అనుమతించరు. కాగా, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం సభా ప్రాంగణంలోని ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. జనంతో వచ్చే ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇన్చార్జిగా పెట్టినట్లు తెలిపారు. ప్రతి 25 బస్సులకు ఒక అధికారిని ప్రత్యేక ఇన్చార్జిగా నియమించామన్నారు. ప్రజలకు బస్సుల్లో అల్పాహారం, తాగునీరు, మధ్యాహ్న భోజనం, సభా ప్రాంగణం వద్ద రాత్రి భోజనం అందించనున్నట్లు చెప్పారు. పార్కింగ్ ప్రదేశాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా, ప్రధాని పర్యటన ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె.విజయానంద్ పరిశీలించారు. -
19 కేసులు: 18 ఎఫ్ఐఆర్లపై ఏపీ హైకోర్టు స్టే
అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగ హరీశ్వరరెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హరీశ్వరరెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన 19 కేసుల్లో భాగంగా 18 ఎఫ్ఐఆర్ లపై హైకోర్టు స్టే విధించింది. ఒక్క ఎఫ్ఐఆర్ మినహా మిగిలిన 18 ఎఫ్ఐఆర్ లపై హైకోర్టు స్టే విధించింది. దాంతో ఒక్క ఎఫ్ఐఆర్ మీద దర్తాప్తునకు హైకోర్టు అనుమతి ఇచ్చినట్లయ్యింది. 18 కేసుల్లో స్టే విధించడంపై ప్రజాస్వామ్య వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అక్రమ కేసులు పెడుతున్న చంద్రబాబు సర్కారుకు ఇది చెంపపెట్టు వంటిదని వారు అంటున్నారు.కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు , మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ హరీశ్వరరెడ్డి హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు గత వారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాలకు మేర తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్లు లోపు శిక్ష పడే కేసుల్లో కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారని, మేజిస్ట్రేట్లు తగిన కారణాలు కూడా వెల్లడించటం లేదన్నారు.ఇది అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించడమే అవుతుందని, హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. లోపు భూయిష్ట ఉత్తర్వులను తమ దృష్టికి తీసుకువస్తే హైకోర్టు చర్యలు తీసుకుంటామందని, అందుకే నిబంధనలు పాటించలేని కొన్ని కేసులను తమ దృష్టికి తీసుకువస్తున్నట్లు హరీశ్వరరెడ్డి ఫిర్యాదులో వెల్లడించారు. -
ఎవరి అక్షయపాత్ర అమరావతి?
'అక్షయపాత్ర అమరావతి" ఎల్లో మీడియా ఈనాడులో ప్రధాన శీర్షిక ఇది. ప్రశ్న ఏమిటంటే.. ఇది ఎవరి అక్షయపాత్ర? పేదలకా? లేక ధనికులు, భూస్వాములు, కాంట్రాక్టర్లకా? బాబు గారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని ఒకరోజు కోసమైనా మళ్లించేందుకు ఇలాంటి శీర్షికలు, కథనాలు ఉపయోగపడతాయేమో కానీ.. అన్నివేళలా మాత్రం కాదు. లేదంటే.. తమ వర్గానికి అనూహ్యస్థాయి లబ్ధి చేకూరుతోందని ఈనాడు యాజమాన్యం సంతోషంతో ఇలాంటి కథనాలు వండి వార్చి ఉండాలి. అయితే... ఈ కథనం వచ్చిన రోజే సాక్షి దినపత్రికలో ఇంకో కథనం వచ్చింది. దీని శీర్షిక 'అవినీతి ఐకానిక్’... అమాంతంగా పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం’’ అని వివరమైన బ్యానర్ కథనం వచ్చింది. నిజానికి పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు. ప్రభుత్వ వ్యవహారాలతోపాటు, అధికారంలో ఉన్నవారు చేస్తున్న వాటిలో మంచి,చెడు విశ్లేషించి రాయాలి. ఎల్లో మీడియా ఆ పని మానేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు, అబద్ధాలు రాయడమే పనిగా పెట్టుకుంది. కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజలను వంచించడానికి కృషి చేస్తోంది. అందుకే ఆరికి అమరావతిలో అంతా అద్భుతంగానే కనిపిస్తోంది.2014-19 మధ్యకాలంలోనూ అమరావతికి విపరీతమైన హైప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అదే బాకా ఊదుతున్నారు. అక్షయపాత్ర అని, ప్రపంచ స్థాయి రాజధాని అని ఊదరగొడుతున్నారు. అయితే వీరి ప్రచార ఆర్భాటానికి మోసపోయి అప్పట్లో భూములు కొన్న వారు ఇప్పటికీ తేరుకోలేదు. మరోసారి మోసపోయేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అన్నది ప్రశ్న. చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసి అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించారు. అంతవరకు ఓకే. కాని ఆ సందర్భంగా మోడీతో మాట్లాడిన విషయాలు అంటూ ఈ అక్షయపాత్రను సృష్టించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దనున్నామని, విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు కల్పించే అక్షయపాత్రలా తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు ప్రధానితో అన్నారని ఈ కథనంలో చెప్పారు.ఇది ఎంత వరకూ వాస్తవరూపం దాలుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రజలందరి నెత్తిన రూ. లక్ష కోట్ల రుణ భారమైతే గ్యారెంటీ. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో గతంలో నొక్కి వక్కాణించినట్లు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ నగరం ఏమాత్రం కాదని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఈ నగర నిర్మాణానికి తెచ్చే అప్పులు ఏదో ఒక రూపంలో కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. లబ్ధి మాత్రం నేతలదవుతుంది. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణ టెండర్లు పిలిచిన తీరు, కావల్సిన వారికి వాటిని కేటాయించుకున్న వైనం, అమాంతం రేట్లు పెంచేసిన పద్దతి ఇవన్ని చూస్తుంటే కాంట్రాక్టర్లకు, కూటమి పెద్దలకు అమరావతి కచ్చితంగా అక్షయపాత్రే కానుందని చెప్పవచ్చు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సిమెంట్, స్టీల్ రేట్లు 2019 నాటికన్నా తగ్గాయని, అయినా అమరావతిలో నిర్మాణాల వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారని విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాల అధిపతుల కార్యాలయాల కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. చదరపు అడుగుకు రూ.8981ల చొప్పున ఖర్చుపెట్టడానికి ఓకే అయింది. మొత్తం రూ.4688 కోట్ల వ్యయం అవుతుంది. 2018లో ఇవే టవర్లకు రూ.2271 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో చదరపు అడుగుకు రూ.4350లే చాలా ఎక్కువ అని అనుకుంటే, ఇప్పుడు దానిని డబుల్ చేశారు.నిజానికి హైదరాబాద్లో భూమి విలువతో లెక్కవేసుకున్నా ఈ స్థాయి ఖర్చు కాదని పలువురు బిల్డర్లు చెబుతున్నారు. అమరావతిలో భూమి ఖర్చు లేదు. ఇసుక ఉచితం. ఇతర నిర్మాణ సామాగ్రీ ధరలు కూడా గతంతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో నిర్మాణ వ్యయం పెరగడం అసాధారణమైన విషయమని చెబుతున్నారు. ఒక ఐకానిక్ టవర్లో 49 అంతస్తులు, మరో మూడు టవర్లు 39 అంతస్తులు చొప్పున నిర్మించబోతున్నారు. మొత్తం ప్రభుత్వంలో పర్మనెంట్ సిబ్బంది రెండువేల లోపు ఉంటే, ఇతరత్రా అంతా కలిపి మరో రెండువేల మంది ఉంటారని అనుకున్నా, ఈ స్థాయిలో భవనాల అవసరం ఏమిటో అర్థః కాదు.ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోనీ దీనికి రెట్టింపు స్థలం అవసరం అనుకుంటే 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపడతారట. నాలుగు టవర్లలో మొత్తం సచివాలం నిర్మిస్తుంటే, ఇన్నివేల ఎకరాల భూమి దేనికో తెలియదు.ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ సచివాలయంతో సహా అన్ని భవనాలు కలిపి కూడా సుమారు 250 ఎకరాలలోపే ఉంటాయని అంటారు. ఇతర రాష్ట్రాల రాజధానులలో సైతం ఎక్కడా రెండు, మూడు వేల ఎకరాలకు మించి కార్యాలయాలకు వాడడం లేదు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన సచివాలయానికి సుమారు వెయ్యికోట్లు అయితే, విభజిత ఏపీలో కేవలం రూ.4688 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందని గ్యారంటీ లేదు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం కోసం వెయ్యి కోట్లకుపైనే వ్యయం చేశారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం, కేంద్ర ప్రభుత్వ శాఖలు అప్పటి చంద్రబాబు పీఏ ఇంటిపై దాడిచేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు దానిని మేనేజ్ చేశారని అంటున్నారు. అందువల్లే అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగు ముందుకు వేయలేదు. అది వేరే సంగతి.ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఖర్చుపెడితే ప్రజలపైనే భారం పడుతుంది కదా! అసెంబ్లీ, తదితర నిర్మాణాలకు ,భూములు ఇచ్చిన రైతులకు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు తదితర అన్ని వసతులు కల్పించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో ఎవరూ చెప్పలేరు. కాంట్రాక్టర్లకు పనుల విలువలో పది శాతం ముందుగానే ప్రభుత్వం చెల్లిస్తుందట. ఇందులో ఎనిమది శాతం వరకు ప్రభుత్వ పెద్దలకు కాంట్రాక్టర్లు ముట్ట చెబుతారని ఇప్పటికే వైసీపీ ఆరోపించింది. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తోందో చెప్పాలి కదా? మొత్తం మీద ఇది పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడే రాజధాని కాదు. పెత్తందార్లకు, కాంట్రాక్టర్లు, బడాబాబులకు మాత్రమే ఉపయోగపడేదని తేలడం లేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డిప్యూటీ సీఎంకు పంగ‘నామం’
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అమరావతి రాజధాని పునహ్వార్మాణ కార్యక్రమం ఆహ్వానపత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ముద్రించకపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడడంతో మళ్లీ ఆయన పేరును చేర్చి ఆహ్వాన పత్రాలు ముద్రించారు. అయితే ఇప్పటికే 90శాతం ఆహ్వాన పత్రాల పంపిణీ జరిగిపోయింది. మోదీ, బాబు పేర్లు మాత్రమే..! ఈ నెల 2న వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణం పేరుతో భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఆర్డీఏ నాలుగు పేజీల ఆహ్వానపత్రాన్ని ముద్రించి అందరికీ పంపిణీ చేసింది. మొదటి పేజీ, చివరి పేజీలో అమరావతి డిజైన్లు, ప్రభుత్వ రాజముద్ర, 2వ పేజీలో ఇంగష్, 3వ పేజీలో తెలుగులో ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ముద్రించారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పేరు లేదు. ఈ ఆహ్వానపత్రికలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీఐపీలు, వీవీఐపీలు, ముఖ్యులకు పంపించారు. ఆహ్వానపత్రికలో పవన్ పేరు లేదని ఆలస్యంగా గుర్తించిన జనసేనపార్టీ మిన్నకుండిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా సర్దుకుపోయారు. అయితే జనసేన శ్రేణులు మాత్రం తీవ్రంగా స్పందించారు. సోషల్మీడియాలో ప్రభుత్వ తీరుపై నిప్పులుచెరిగారు. తమ నేతను కరివేపాకులా తీసి పారేశారంటూ ఆవేదన వెళ్లగక్కారు. తమ పార్టీ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని, తమ నేతకే పంగనామాలు పెడతారా? అంటూ పోస్టులు పెట్టారు. దీనికి టీడీపీ శ్రేణులూ కౌంటర్ ఇచ్చాయి. రెండుపార్టీల మధ్య సోషల్మీడియా వార్ జరుగుతోంది.మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు ఇది చిలికిచిలికి గాలివానలా మారుతోందని గుర్తించిన టీడీపీ పెద్దలు పేరు మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సీఆర్డీఏ అధికారులు ఆహ్వానపత్రంలో మొక్కుబడిగా పవన్ పేరు చేర్చి మళ్లీ ముద్రించి విడుదల చేశారు. అయితే ఇప్పటికే 90శాతం పత్రికల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు తలొగ్గి అన్ని విషయాల్లో బేషరతుగా మద్దతు ఇస్తున్నా ప్రభుత్వంలో ఆయనకు ఏమాత్రం విలువ లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
Amaravati: రాజధాని అవసరాలకు మరో 44,676 ఎకరాల భూసేకరణ!
-
KSR: చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఎల్లో మీడియా భుజాన ఉర్ఫా
-
రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ
సాక్షి, అమరావతి: రాజధానిలో మరిన్ని భూములు సమీకరించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం అని.. దీనికి అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ జరిగినప్పుడు 5 వేల ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారు. కానీ, నాడు ముందుచూపుతో సేకరించినందునే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి ఎకనమిక్ యాక్టివిటీ పెరిగింది. చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి రైతులకు మేలు చేకూరింది’’ అని అన్నారు. అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సోమవారం తన నివాసంలో సమావేశమయ్యారు.రాజధాని అవసరాలకు అదనంగా భూ సేకరణ సహా పలు అంశాలను చర్చించారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సీఎం తెలిపారు. అదనపు భూసేకరణ కారణంగా ఈ ప్రాంతంలో ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దన్నారు. తనకు, రైతులకు మధ్య దూరం ఉండదని చెప్పారు. ‘కృష్ణా నదిపై మరో మూడు నాలుగు వారధులు కూడా వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి. ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించి పెద్దఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి.మీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదు’’ అని సీఎం పేర్కొన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా... శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ పట్టాలేని వారికి పట్టాలివ్వాలని అభ్యరి్థంచగా, దీన్ని కూడా త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ⇒ అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వనించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు అని.. రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య అడుగు అవుతుందని సీఎం చెప్పారు. రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, రైతుల మంచి మనసును ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనుల్లో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను చంద్రబాబు ఆహ్వనించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.బయటపడిన బాబు భూ దాహం రాజధాని అవసరాలకు మరో 44,676 ఎకరాలు సమీకరించనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం లీక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు భూ దాహం రాజధాని రైతులతో నిర్వహించిన సమావేశంలోనే బయటపడింది. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే రాజధాని అవసరాలకు సీఆర్డీఏ చేతిలో 53,749 ఎకరాలున్న విషయం తెలిసిందే. ఇందులో రైతుల నుంచి సమీకరించిన భూమి 34,566 ఎకరాలు ఉంది. ఇంత భూమి ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో మరో 44 వేల ఎకరాలకు పైగా భూములను రైతుల నుంచి తీసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్న తరువాతనే చంద్రబాబు ప్రభుత్వం మీడియాకు లీకు ఇచ్చింది.ఈ విషయం సోమవారం రైతులతో సీఎం నిర్వహించిన సమావేశంలోనే బట్టబయలైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధి లో మరిన్ని గ్రామాలలో భూములు సమీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసేసుకుని.. ఇప్పుడు భూముల విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణం పేరు చెబుతోంది. అవి చేపట్టడానికి అవసరమైన భూములను రైతుల నుంచి తీసుకుంటామని రైతుల సమావేశంలో సీఎం చెప్పడం గమనార్హం. -
AP: మళ్ళీ భూములు సమీకరణకు చంద్రబాబు
విజయవాడ: రాజధాని కోసం అంటూ ఇప్పటికే వేల ఎవరాలు సేకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మళ్లీ భూముల సమీకరణకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్ట్, క్రికెట్ స్టేడియం పేరుతో మళ్లీ భూ సమీకరణ చేపట్టడానికి సిద్ధమైంది చంద్రబాబు సర్కారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల సమావేశంలో చెప్పేశారు. ఎయిర్ పోర్టు, స్టేడియం నిర్మాణంతో భూముల విలువ పెరుగుతుందని మరో కథ చెప్పేశారు చంద్రబాబు. రాజధాని పనులు పునః ప్రారంభ కార్యక్రమానికి రైతులను ఆహ్వనిస్తామన్నారు. రైతులకు రిటర్న్ బుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. త్యాగాలు చేసిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమమూ ఉండదన్నారు చంద్రబాబు. -
‘బాబూ.. సూపర్ సిక్స్కు డబ్బుల్లేవ్.. లక్ష కోట్ల అమరావతి!’
సాక్షి, అనంతపురం: ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంటూ అమరావతిలో మళ్లీ శంకుస్థాపనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి పునర్ నిర్మాణం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు.. మరోవైపు లక్ష కోట్ల రాజధాని ఎలా?. ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కింది. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు 11 మాసాల పాలన విశ్వాసం ఘాతుకానికి నిదర్శనం. మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం నేటికీ అమలు కాలేదు. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా పథకం సాయం లేదు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు పట్టావా?. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ధి పై ప్రధాన మంత్రి స్పష్టత ఇవ్వాలి. పునర్విభజన చట్టం హామీలను అమలు చేయాలి. పోలవరం ఎత్తు తగ్గింపు తగదు. చంద్రబాబు పాలనలో 99 రూపాయలకే మద్యం దొరుకుతోంది. చంద్రబాబు అస్మదీయులకు 99పైసలకే విశాఖలో ఎకరం భూమి దొరుకుతోంది అని ఎద్దేవా చేశారు. -
అవినీతి 'ఐకానిక్'!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. -
ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్ పథకం
-
‘ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో బాబు అమరావతి నిర్మాణాలు !’
సాక్షి, అనంతపురం: అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కానీ, సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయం వేస్తోందని చంద్రబాబు అంటున్నారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అస్మదీయులకు దోచి పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు వేల కోట్లతో అమరావతిలో కట్టడాలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో లక్ష ఎకరాల్లో లక్ష కోట్లతో నిర్మాణం అవివేకం. గన్నవరం ఉండగా అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకు?. 10 మాసాల్లో 1.53 లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆ డబ్బు ఏమైంది?. చంద్రబాబుకు అమరావతి తప్ప.. మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు.అలాగే, రాష్ట్ర విభజన పాఠాలు చంద్రబాబు నేర్చుకోలేదు. అభివృద్ధి-అధికార వికేంద్రీకరణ అవసరం లేదా?. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కేంద్రం నుంచి గ్రాంట్ ఎందుకు సాధించడం లేదు?. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడం లేదు. టీసీఎస్ పేరుతో 29 ఎకరాల భూమిని 29 రూపాయలకే ఇవ్వడం ఏంటి? ఇది అనుమానాస్పదంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
భూములు కారు చౌకగా.. ఎలా కొట్టేయాలో తెలుసా?
-
అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే రూ.31,000 కోట్లు సమకూరాయన్నారు. ఇంకా సుమారు రూ.47,000 కోట్ల అవసరం ఉందని చెప్పారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఆధ్వర్యంలోని బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజనతో ఆదాయ వనరులన్నీ తెలంగాణకు వెళ్లాయని, ఏపీకి ప్రధాన ఆదాయ వనరే లేదన్నారు. జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయ వనరుల శాతం ఏపీలో తక్కువగా ఉందని, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఆస్తుల పంపకం ఇంకా పూర్తవ్వలేదని చెప్పుకొచ్చారు. ‘ఏటా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్కు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కారణంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాం. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫారసులు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని, స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు, పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రత్యేక ప్రజెంటేషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనపై వీడియో ప్రదర్శించారు. విరివిగా గ్రాంట్లు ఇప్పించండి స్వర్ణాంధ్ర–2047 విజన్ కింద ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించి.. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరించేలా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. వికసిత్ భారత్ సాధనలో భాగంగా ఆర్థిక సంఘం వర్టికల్ డివల్యూషన్ వాటా ప్రస్తుతం ఉన్న 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించేటప్పుడు 70 శాతం వెయిటేజీ జనాభాకు, 20 శాతం వెయిటేజీ వ్యవసాయం, అనుబంధ రంగాలకు, 10 శాతం వెయిటేజీ ప్రాంతానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. స్థానిక సంస్థల కోసం రూ.62,516 కోట్ల నిధులు, పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కోసం రూ.19,871 కోట్ల గ్రాంట్లు, 2026–2031 మధ్య ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.16,181 కోట్లు కావాల్సి ఉందన్నారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులు, ఐదు పర్యాటక హబ్లు (అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం), ఐఐటీ తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్, బుద్ధిస్ట్ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ ఎకానమీలో భాగమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్ డెవలప్మెంట్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 100 శాతం అక్షరాస్యత, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, ఇన్ల్యాండ్ వాటర్ వే లు, రహదారులు, రీజనల్ గ్రోత్ సెంటర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విరివిగా గ్రాంట్లు ఇచ్చేలా సిఫారసు చేయాలి’ అని సీఎం కోరారు. కాగా, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్కళ్యాణ్ తెలిపారు. -
రూ.4,689 కోట్లతో సచివాలయానికి ‘టెండర్’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.1,151 కోట్ల వ్యయంతో 2015లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.4,689.82 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడి వద్ద 42.5 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో ఐదు బ్లాక్లలో ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పడు శాశ్వత సచివాలయాన్ని రాయపూడి వద్ద 32 ఎకరాల్లో బీ+జీ+39 పద్ధతిలో నాలుగు టవర్లు, బీ+జీ+49 పద్ధతిలో ఒక టవర్.. మొత్తం ఐదు టవర్లను 4,85,000 చదరపు మీటర్ల (52,20,496 చదరపు అడుగులు)లో చేపట్టనుంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ తాత్కాలిక సచివాలయం.. శాశ్వత సచివాలయం పేరుతో రెండుసార్లు భవనాలు నిర్మించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాశ్వత సచివాలయంలో ఐదు టవర్లను మూడు ప్యాకేజీలుగా విభజించి.. వాటి నిర్మాణానికి బుధవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) లంప్సమ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి 2018లో పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు డిజైన్లు (ఆకృతులు) రూపొందించాయి. ఆ డిజైన్ల మేరకు ఇటీవల శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇప్పుడు శాశ్వత సచివాలయంలో 1, 2 టవర్లను ఒక ప్యాకేజీ కింద.. 3, 4 టవర్లను రెండో ప్యాకేజీ కింద.. జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం) టవర్ను మూడో ప్యాకేజీ కింద విభజించి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను 24 నెలల్లో పూర్తి చేసేలా.. నిర్మాణం పూర్తయ్యాక 36 నెలలపాటు నిర్వహించాలని షరతు పెట్టింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలుకు వచ్చే నెల ఒకటో తేదీని తుది గడువుగా నిర్దేశించింది. అదే రోజున టెక్నికల్ బిడ్ను తెరుస్తారు. టెక్నికల్ బిడ్లో అర్హత సాధించిన సంస్థల ఆర్థిక బిడ్లను మే 3న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు కాంట్రాక్టు పనులు అప్పగించాలని సీఆర్డీఏ అథారిటీకి అధికారులు ప్రతిపాదించనున్నారు. సచివాలయం నిర్మాణం ఇలా.. » రాయపూడి వద్ద పాలవాగుకు ఇరు వైపులా శాశ్వత సచివాలయాన్ని నిర్మించనున్నారు. పాలవాగుకు ఉత్తరాన జీఏడీ టవర్తోపాటు 1, 2 టవర్లు.. దక్షిణాన 3, 4 టవర్లను నిర్మించేలా డిజైన్ను రూపొందించారు. మొత్తంగా 1, 2 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లు. 3, 4 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లు. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లు. ఐదు టవర్లలో ఒక్కో అంతస్తు 47 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. » శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను ఇప్పటి తరహాలోనే మూడు ప్యాకేజీల కింద 2018 ఏప్రిల్ 26న అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. జీఏడీ టవర్ నిర్మాణ పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు.. 1, 2 టవర్ల నిర్మాణ పనులను రూ.932.46 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ సంస్థకు.. 3, 4 టవర్ల నిర్మాణ పనులను 784.62 కోట్లకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. అంటే.. ఐదు టవర్ల నిర్మాణ పనుల విలువ రూ.2,271.14 కోట్లు. » ఈ ఐదు టవర్ల పునాదుల పనులను 2019 నాటికే కాంట్రాక్టు సంస్థలు పూర్తి చేశాయి. మిగిలిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచింది. 2018 ఏప్రిల్ నాటితో పోల్చి చూస్తే.. స్టీలు, సిమెంటు, భవనాల నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఈ టవర్ల నిర్మాణానికి సమీపంలోనే కృష్ణా నదిలో పుష్కలంగా.. అదీ ఉచితంగా ఇసుక లభ్యమవుతోంది. కానీ.. ఈ ఐదు టవర్లలో మిగిలిన పనుల నిర్మాణానికి రూ.4,195.51 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలవడం గమనార్హం. » ఈ లెక్కన అంచనా వ్యయాన్ని రూ.1,924.37 కోట్లు పెంచేసిందన్నది స్పష్టమవుతోంది. యధావిధిగా సిండికేట్ కాంట్రాక్టర్లకు ఈ ఐదు టవర్ల పనులను కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకోవడానికే ప్రభుత్వ ముఖ్యనేత చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది. » ఇక తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను అప్పట్లో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన రూ.1,151 కోట్లు వ్యయం చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు, ఇప్పుడు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన సొమ్మును ఇలా దుబారా చేయడం తగదని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
తాడికొండ: అమరావతిలో మరోసారి భూ సమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూనే అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 30 వేల ఎకరాలు సమీకరిస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అనంతవరంలోని గ్రావెల్ క్వారీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, అమరావతిని కలిపి త్వరలో మెగాసిటీగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని చెప్పారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని, ఇందుకోసం 30 వేల ఎకరాల భూమి సమీకరించాల్సి ఉంటుందన్నారు. ఇందులో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందని తెలిపారు. ఇవన్నీ పోగా ఐదు వేల ఎకరాలు మాత్రమే మిగులుతుందని, అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇంకా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని.. రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ను కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయినా.. భూ సమీకరణా లేదా భూసేకరణా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. -
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి -
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
సాక్షి, గుంటూరు: అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. 44,676 ఎకరాలను సీఆర్డీఏ సమీకరించనుంది. మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వం మళ్ళీ సమీకరించనుంది. ఇప్పటికే 54 వేల ఎకరాలు సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. 54 వేల ఎకరాల్లో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు.గత ఆ భూములు ఉంటుండగానే మళ్లీ 44,676 ఎకరాలు భూముల సమీకరణకు సిద్ధమైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో కొత్తగా భూ సమీకరణ చేయనుంది. 11 గ్రామాల్లో 44,676 ఎకరాలు భూములను ప్రభుత్వం సమీకరించనుంది.కాగా, రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు భూములు కాజేసిన సంగతి తెలిసిందే. ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు.రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్దలైంది. అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. -
బాబు కొత్త రాజభవనం 150 కోట్ల భూమిని 18.75 కోట్లకు కొట్టేశాడు
-
వైఎస్ జగన్కు భద్రతా వైఫల్యం.. కూటమి ప్రభుత్వానికి బొత్స వార్నింగ్
అమరావతి,సాక్షి: కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ తరుణంలో వైఎస్ జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లిన అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ జగన్ భద్రతపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాం. భద్రత విషయంలో కేంద్ర హోమంత్రి అమిత్షాను కలుస్తాం. వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవురామగిరిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. మాజీ సీఎం జగన్కు భద్రత చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్, ఆ సంగతి అధికారులకు తెలుసు. వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఆక్రోశం.ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారు. గేట్లు సరిగా కట్టకపోతే దానికి ప్రకాష్ రెడ్డిదా తప్పు. అధికారం ఎన్నడు శాశ్వతం కాదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ప్రభుత్వ తీరు ఇలానే ఉంటే ప్రజలు తిరగబడతారు. జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రతను గాలికి వదిలేస్తున్నారు.జగన్కు కావలసిన భద్రత కల్పించాలి. జగన్ భద్రత పట్ల మాకు ఆందోళన ఉంది. జగన్ భద్రత కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాము. ప్రధాని మంత్రి దగ్గరకు వెళ్ళి జగన్కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తాము.ఎంపీ కృష్ణదేవరాయలకు వారి తండ్రి సంస్కారం నేర్పలేదా. కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది.కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ వర్గం ప్రజలు కూటమి పాలనలో సంతోషంగా లేరు. 1100 మందితో భద్రత కల్పిస్తే పోలీసులు ఎక్కడ ఉన్నారు.1100 మంది కాదు కదా 110 మంది కూడా లేరు. 1100 మంది పోలీసులు ఉండి ఉంటే అందరూ సివిల్ డ్రెస్లో ఉన్నారా. ఒక సెలబ్రిటీ వస్తేనే పోలీసులు ఎంతో హడావడి చేస్తారు. మాజీ సీఎం పరామర్శకు వెళ్తే భద్రత కల్పించలేరా. గతంలో చంద్రబాబు పోలీసులు గురించి మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి.రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలి.ఈ రోజు మేము అవ్వచ్చు, రేపు మీరు అవ్వొచ్చు. రాజకీయ నాయకులపై మాట్లాడడం పోలీసులకు ఫ్యాషన్ అయింది. మాన్యువల్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటే మళ్ళీ మాట్లాడరు’ అని వ్యాఖ్యానించారు. -
నారా న్యూ ప్యాలెస్.. హైదరాబాద్ ప్యాలెస్ ను తలదన్నేలా..
-
రాయలసీమకు అన్యాయం చేయద్దు!
కడప కేంద్రంగా 2006లో రాయలసీమ, అనంత, పినాకిని గ్రామీణ బ్యాంకుల విలీనంతో ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు’ (ఏపీజీబీ) ప్రారంభమైంది. గత 18 ఏళ్లలో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, కొత్త సాంకేతిక తను స్వీకరిస్తూ, మంచి వ్యాపార ఫలితాలతో 10 జిల్లాల పరిధిలో పనిచేస్తున్నది. రాజకీయ అనిశ్చితులు, మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తన పరిధిలో వెనకబడిన ప్రాంతాల స్థానిక అభివృద్ధికి ఆసరాగా నిలిచింది. ఈ రోజు, దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ‘వన్ స్టేట్, వన్ రూరల్ బ్యాంక్’ విధానంతో రాష్ట్ర స్థాయిలో ఒకే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో... ఏపీజీబీ భవి ష్యత్తు ఏమిటి? దాని ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగితే ఈ ప్రాంతానికి ఎంత మేలు జరుగుతుంది? అమరావతికి తరలిపోతే రూరల్ బ్యాంకింగ్ లక్ష్యాలకు, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లుతుంది అన్న ప్రశ్నలపై లోతైన చర్చ అవసరం.గతంలో పినాకిని (నెల్లూరు), అనంత (అనంత పురం), రాయలసీమ (కడప) గ్రామీణ బ్యాంకులు విలీనమైనప్పుడు, రాయలసీమ బ్యాంకు అతిపెద్దది కావడంతో ప్రధాన కార్యాలయం కడపలో ఏర్పాటైంది. ఈ సంప్రదాయం ఇప్పుడూ కొనసాగాలి. ప్రస్తుతం, ఏపీజీబీలో చిత్తూరు కేంద్రంగా ఉన్న సప్తగిరి,గుంటూరు కేంద్రంగా ఉన్న చైతన్య గోదావరి, వరంగల్ కేంద్రంగా ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులు విలీనం కానున్నాయి. వ్యాపారం, ప్రత్యేకతలు, సామర్థ్యం... ఇలా ఏ కోణంలో చూసినా ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులలో ఏపీజీబీ అగ్రగామి. అందుకే, కొత్త రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యా లయం కడపలోనే ఉండాలి.2024 నవంబర్ 4న కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్.ఆర్.బి. విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, విలీనం తర్వాత ప్రధాన కార్యాలయం అతిపెద్ద బ్యాంకు యొక్క కేంద్రంలోనే ఉండాలి. ఈ మార్గదర్శకాన్ని గౌరవించాలి.అమరావతి వాదన ఎవరి కోసం?రాష్ట్ర రాజధానిలో ప్రధాన కార్యాలయం ఉండా లన్న వాదన ప్రజల మనోభావం కాదు – ఇది స్పాన్సర్ బ్యాంకుల రాజకీయం, పాలకవర్గాల స్వార్థం. అమరా వతిని ముందుకు తెచ్చే ఈ ప్రయత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత అభివృద్ధికి ప్రాతినిధ్యం వహించే సిఫారసులు, కేంద్రం యొక్క విభజన హామీల నిర్లక్ష్యం ఉన్నాయి. ఇది రాజకీయ ఒత్తిడికి లోనైన నిర్ణయమే అవుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ బ్యాంకులు రాజధానుల్లో కానీ, రాష్ట్రం నడిబొడ్డున కానీ లేకుండానే విజయవంతంగా నడుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ (నహర్లగున్), కేరళ (మళప్పురం), మహారాష్ట్ర (ఔరంగాబాద్), పంజాబ్ (కపుర్తలా) గ్రామీణ బ్యాంకులు ఇందుకు ఉదా హరణలు. ఈ వాస్తవాన్ని విస్మరించరాదు. రాయల సీమకు రాష్ట్రావతరణ నుంచీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకును అమరావతికి తరలించి మరో అన్యాయానికి ప్రభుత్వం పాల్పడ కూడదు.ఏపీజీబీ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకు. రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల వ్యాపారంలో 43 శాతం (రూ. 56,056 కోట్లు) దీనిదే. 25.65 శాతం మూలధన సామర్థ్యం, 86.75 లక్షల కస్టమర్లు, 551 శాఖలు,రూ. 1,400 కోట్ల రిజర్వులు– ఇవన్నీ ఏపీజీబీ ఔన్న త్యాన్ని చాటుతాయి. కిసాన్ కార్డులు, ఎమ్ఎస్ఎమ్ ఈలకు రూ. 50 లక్షల రుణాలు, 2,934 ఆర్థిక సాక్షరతా శిబిరాల ఏర్పాటు వంటి సేవలను 2,775 గ్రామాలకు అందించడం ద్వారా... మొత్తం రాయలసీమలోనే కాక, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సైతం ప్రజల జీవనోపాధి పెరగడానికి కారణమయ్యింది. అటువంటి బ్యాంకు అమరావతికి తరలితే, ఈ రూరల్ ఎకోసిస్టమ్ కుప్ప కూలుతుంది.రూరల్ బ్యాంకింగ్ లక్ష్యం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి. కడప ప్రధాన కేంద్రంగా ఏపీజీబీ ఈ లక్ష్యాన్ని నెరవేర్చింది. ‘అమరావతి’ రాజకీయ కేంద్రీ కరణకు ప్రతీక అయితే, ‘కడప’ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. ఇక్కడి పౌర సమాజం, రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాలు అందరూ అమరావతికి ఏపీజీబీ తరలింపును వ్యతిరేకిస్తున్నారు. అధికార పక్షా నికి కడప పట్ల సానుకూలత ఉన్నా, నాయకుడిని కాదని బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. వైసీపీ ఎంపీలు అమరావతికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తారు, కేంద్రానికి లేఖలు రాశారు. కాబట్టి కడపకు అనుకూలంగా ఉన్న ఈ ఏకాభిప్రాయాన్ని కాదనడం అన్యాయం. అవసరమైతే, అమరావతిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ కడపలో కేంద్ర కార్యాలయం ఉంచడం సాధ్యం కాకపోతే ఏపీజీబీ, సప్తగిరి బ్యాంకులను రాష్ట్ర స్థాయి విలీన ప్రక్రియ నుంచి మినహాయించాలి. ఆ రెండు బ్యాంకులను మాత్రమే విలీనం చేసి కడప కేంద్రంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి నడపాలి. ఏపీజీబీ 18 ఏళ్ల అనుభవం, నెట్వర్క్,సాంకేతికత రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆధారం. అందువల్ల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలి. రాయలసీమ ఆర్థిక భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలి!రఘునాథరెడ్డి అలవలపాటి వ్యాసకర్త రాయలసీమ ఆకాంక్షల పౌరవేదిక కోఆర్డినేటర్ ‘ 85238 41285 -
Amaravathi: రైతుల భూముల్లో నారా ప్యాలెస్
-
రైతుల భూముల్లో నారా ప్యాలెస్
-
అమరావతిలో 5 ఎకరాల్లో చంద్రబాబు ఇంద్రభవనం
-
ఈ పాపం.. ఎవరిది పవన్?
పెందుర్తి: వారంతా తన కలను సాకారం చేసుకునేందుకు నిద్రాహారాలు మాని తపించారు. జీవిత లక్ష్యం నెరవేరే రోజు వచ్చింది.. కానీ ఎన్నో ఆశలతో పరీక్షకు సిద్ధమైన ఆ విద్యార్థులకు సోమవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన శాపంగా మారింది. ఉదయం నుంచే కూటమి నేతల కోలాహలం.. కఠినమైన ఆంక్షల కారణంగా ట్రాఫిక్లో చిక్కుకుని 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు దూరమయ్యారు.పవన్కళ్యాణ్ కాన్వాయ్ కోసం ఎన్ఏడీ నుంచి పెందుర్తి వరకు వాహనాలను నిలిపివేయడంతో జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులంతా చిక్కుకుపోయారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పవన్కళ్యాణ్ రాక సందర్భంగా ట్రాఫిక్ను ఆపలేదని.. బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో ఆయన వెళ్లారని.. మిగిలిన సర్విస్ రోడ్లపై ఇతర వాహనాలు యథావిధిగా ముందుకు సాగాయని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అసలేం జరిగింది..! అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎన్ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు ఉదయం నుంచి పోలీసులు ట్రాఫిక్ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. పవన్ ప్రత్యేక విమానంలో ఉదయం 8.15 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకోగా 6.30 నుంచే ట్రాఫిక్ను నియంత్రిస్తూ వచ్చారు. పవన్ కాన్వాయ్కు కేటాయించిన బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయగా.. ఎడమ, కుడి మార్గాల్లోనూ ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్ మందకొడిగా సాగింది. ఈ రోడ్డులో 7.30 నుంచి ట్రాఫిక్ను పూర్తిగా నియంత్రించారు.దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ను కఠినంగా నియంత్రించడం.. జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడంతో బీఆర్టీఎస్ సర్విస్ రోడ్డుపై రద్దీ పెరిగిపోయి విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమైనట్లు స్పష్టమవుతోంది. మరోపక్క పవన్ ఎయిర్పోర్టులో ఉదయం 8.21 గంటలకు బయల్దేరగా వేపగుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా ఉదయం 8.10 గంటలకే ట్రాఫిక్ను నిలిపివేసేలా జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.దీనివల్ల పవన్వెళ్లే వరకు ఆ మార్గంలో వాహనాలు కదల్లేదు. దీంతో వేపగుంట నుంచి చినముషిడివాడ కేంద్రానికి కేవలం 10 నిమిషాల లోపు చేరుకోవాల్సిన విద్యార్థులు ఆలస్యమయ్యారు. మరోవైపు జనసేన పార్టీ నిబంధనల ప్రకారం గజమాలతో అధినేతను గానీ ఇతర నాయకులను గానీ సత్కరించడం నిషిధ్ధం. కానీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గజమాలతో పవన్ను (షెడ్యూల్ ప్రకారం పవన్కళ్యాణ్ ఎక్కడా ఆగే వీలు లేదు) సత్కరించేందుకే ఇంత హడావిడి చేసి విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయేలా చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.పవన్ వెళుతున్న రోడ్డులోనే ఉన్న చినముషిడివాడలోని అయాన్ డిజిటల్ కేంద్రంలో 1,350 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు హజరవుతున్నారని తెలిసి కూడా అధికారులు దానిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చినముషిడివాడ కేంద్రంలో జేఈఈ పరీక్షకు సగటున 50 నుంచి 70 మంది గైర్హాజరు అవుతున్నట్లు సీపీతో పాటు వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వితేజ పేర్కొన్నారు.అలా ఎలా సార్!!సాధారణంగా ఎన్ఏడీ కొత్త రోడ్డు నుంచి బీఆర్టీఎస్ మీదుగా చినముషిడివాడ చేరుకోవడానికి వాహనం / ట్రాఫిక్ పరిస్థితిని బట్టి 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కాన్వాయ్ చినముషిడివాడ అయాన్ డిజిటల్ కేంద్రాన్ని ఉదయం 8.41 గంటలకు (ఎయిర్పోర్టులో బయలుదేరిన సమయం ఉదయం 8.21 గంటలు అని చెబుతున్నారు) దాటిందని చెబుతున్నారు. ఒక వీవీఐపీ వస్తున్నారంటే కనీసం గంట ముందు నుంచే ఇటు పోలీసులు అటు పార్టీ అభిమానులు, నాయకుల హడావుడి ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచే రోడ్లపై వారి హంగామా మొదలైంది.బీఆర్టీఎస్ మధ్య మార్గంలో ఇతర వాహనాలపై నిషేధం విధించడం.. వాటిని సర్విసు రోడ్డులోకి మళ్లించడం.. జనసేనతో పాటు ఇతర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ఓవరాక్షన్ కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని జేఈఈ పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పోలీసులు తప్పుడు వివరణలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఎయిర్పోర్టు నుంచి చినముషిడివాడకు డిప్యూటీ సీఎం కాన్వాయ్ రావడానికి 20 నిమిషాల సుదీర్ఘ సమయం (వీవీఐపీల ప్రయాణ సమయం సుమారుగా 10 నిమిషాలు) పట్టడం మరో ఆశ్చర్యకరమైన విషయం.నా కల చెదిరింది..జేఈఈ రాసి ఉన్నతస్థాయిలో నిలవాలన్నది నా కల. దీని కోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి (కంచరపాలెం) నుంచి చినముషిడివాడకు ఎంత ట్రాఫిక్ ఉన్నా 30–40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఎన్ఏడీ కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడి నుంచి చినముషిడివాడ చేరుకోవడానికి 45–50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా. నా కల చెదిరిపోయింది. – బొడ్డు జశ్వంత్, జేఈఈ అభ్యర్థి, కంచరపాలెంవిచారణ చేపట్టండి: పవన్కళ్యాణ్సాక్షి, అమరావతి: పెందుర్తి ప్రాంతంలో జేఈఈకి కొందరు విద్యార్థులు హాజరుకాలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఆదేశించారు. తన కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ని ఆపేశారు, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ పరిస్థితి, సర్వీసు రోడ్లలో ట్రాఫిక్ను నియంత్రించారా? వంటి అంశాలపై విచారించాలని సూచించారు. రేయింబవళ్లు కష్టపడి.. జేఈఈ పరీక్ష కోసం మా అబ్బాయి రేయింబవళ్లు కష్టపడి చదివాడు. చినముషిడివాడ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ఉదయం 6.30కే ఇంటి నుంచి బయలుదేరాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేయడంతో చిక్కుకుపోయాం. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో లోపలికి అనుమతించలేదు. మా అబ్బాయి మళ్లీ పరీక్ష రాసేలా పవన్కళ్యాణ్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సత్యవతి, కంచరపాలెం, విద్యార్థి తల్లిఏం చేయాలో.. మాది సాధారణ కుటుంబం. జేఈఈపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. తుని నుంచి వేకువజామున బయలుదేరి వచ్చా. ఎన్ఏడీ వచ్చేసరికి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పరీక్షా కేంద్రానికి మరో 10 నిమిషాల్లో చేరుకుంటాననగా ట్రాఫిక్ను ఆపేశారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అనుమతించలేదు. ఇప్పుడు నా భవిష్యత్ ఏమిటో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – ఆళ్ల హేమంత్, తునిమరో అవకాశం ఇవ్వాలి.. బాబు, పవన్ స్పందించాలి ముమ్మాటికి పవన్కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ జామ్ వల్లే మా పిల్లలు పరీక్షకు ఆలస్యం అయ్యారు. లేదంటే నిర్దేశిత సమయానికి చాలా ముందే కేంద్రానికి చేరుకునేవాళ్లు. పరీక్షకు అనుమతించకపోవడంతో పిల్లల భవిష్యత్ పాడవుతుంది. మంగళవారం వరకు పరీక్షలు ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ మరో అవకాశం ఇవ్వాలి. దీనిపై పవన్, చంద్రబాబు ఉన్నత స్థాయిలో మాట్లాడాలి. – అనిల్, విద్యార్థి తండ్రిట్రాఫిక్ వల్లే.. ఎన్ఏడీ నుంచి ట్రాఫిక్లో ఇరుక్కుపోయా. చాలా దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. అయినా ఏదోలా కేంద్రానికి చేరుకున్నా రెండు నిమిషాలు ఆలస్యం అయ్యానని పరీక్షకు అనుమతించలేదు. కేవలం ట్రాఫిక్ వల్లే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయా. – ఆర్యన్రాజ్ -
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
విశాఖ జిల్లా,సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈ విద్యార్థులకు పవన్ కాన్వాయ్ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.పెందుర్తిలో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉదయం 8.30 జరగనుండగా.. పవన్ కాన్వాయ్ కారణంగా పరీక్షా కేంద్రానికి 8.32కి వచ్చారు. ఆ రెండు నిమిషాలు కూడా పవన్ వస్తున్నారని పోలీస్ అధికారులు ట్రాఫిక్ నిలిపివేశారని, లేదంటే పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునే వారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు.పవన్ కళ్యాణ్ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది. పవన్ వస్తున్నారనే కారణంతో ప్రొటోకాల్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. కాబట్టే రెండు నిమిషాల ఆలస్యంతో పరీక్షా కేంద్రానికి వచ్చామని, ఆలస్యమైందని అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని విలపిస్తున్నారు. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకుని ఆ 30 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. -
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
సాక్షి, అమరావతి: ఎంత మంది నిపుణులు కాదన్నా, ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని పర్యావరణ వేత్తలు చెప్పినా.. రాజకీయ పంతంతో చెవికెక్కించుకోని చంద్రబాబు తీరు వల్ల రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. రాజధానిలో వరద ముంపు తగ్గించేందుకు ఏకంగా 1995 ఎకరాల్లో వరద మౌలిక సదుపాయాల పనులు, పునరావాస ప్రణాళిక అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఆర్డీఏ వరద మౌలిక సదుపాయాల పనుల కోసం పునరావాస కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.వరద ముంపు ఉన్న చోటే రాజధాని నిర్మాణం చేపట్టడం, చేయడమే చంద్రబాబు విజనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరద ముంపు నివారణ, పునరావాసం కోసమే వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి వస్తోంది. వరద ప్రమాద తగ్గింపు పనులు చేపట్టేందుకు రూ.2,750.79 కోట్లు వ్యయం చేయనున్నట్లు సీఆర్డీఏ పునరావాస కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఆర్డీఏ ప్రపంచ బ్యాంకుకు అందజేసింది.వరద తగ్గింపు పనులతో సీఆర్డీఏ పరిధిలోని 21 గ్రామాల్లోని 5,288 మందిని తరలించాల్సి ఉందని అందులో స్పష్టం చేసింది. వరద నివారణకు కొండవీటి వాగు, పాల వాగు లోతు పెంచడంతో పాటు వెడల్పు చేయనున్నారు. మూడు జలాశయాలను నిర్మించనున్నారు. వాగులకు గ్రీన్ బఫర్తో ఉండవల్లి వద్ద వరద పంపింగ్ స్టేషన్ను, నీటి శుద్ధి కర్మాగారం నిర్మించడంతోపాటు 15 నీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ పూర్తయితేనే అమరావతిలో వరద ముప్పు తగ్గుతుంది.ప్రపంచ బ్యాంకు విధానాల మేరకే పనులుప్రపంచ బ్యాంకు, ఏడీబీ విధానాలకు అనుగుణంగా వరద తగ్గింపు పనులకు టెండర్లు, భూ సేకరణ ఉంటుందని సీఆర్డీఏ పేర్కొంది. ఈ పనుల వల్ల గ్రామాల్లోని వారిని ఇతర చోట్లకు తరలించాల్సి ఉందని, వారికి పునరావాస ప్లాట్ల కోసం స్థలాలు గుర్తించడమే కాకుండా పునరావాస లే అవుట్ల అభివృద్ధి, రహదారులు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించాల్సి ఉందని తెలిపింది.వరద తగ్గింపు పనుల వల్ల గ్రామాల ఉమ్మడి ఆస్తులైన ఏడు శ్మశాన వాటికలు, ఒక ఆలయ భూమి ప్రభావితం అవుతాయని, వీటి స్థానంలో రాజధాని నగర గ్రామాల అవసరాలను తీర్చడానికి తుళ్లూరు, నవులూరు, మందడంలో మూడు బహుళ–మత అంత్యక్రియల ప్రాంగణాలను నిర్మించాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఇళ్లు కోల్పోతున్న వారికి, అదే గ్రామాల్లో లేదా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో పునరావాసం కల్పించనున్నారు. వరద తగ్గింపు పనులు చేపట్టేందుకు పెనుమాక, ఉండవల్లి, వెలగపూడిలో 12.09 ఎకరాలను 165 మందితో సంప్రదింపులు జరపడం ద్వారా సేకరిస్తున్నారు.ఈ గ్రామాల్లో 70 గృహాలు, రెండు వాణిజ్య సముదాయాలు, 16 ఇతర నిర్మాణాలకు పరిహారం చెల్లించనున్నారు. మరో 100.67 ఎకరాలను 342 మంది రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ స్కీము ద్వారా సేకరిస్తారని సీఆర్డీఏ తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. కాగా, వరద తగ్గింపు పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే రూ.1,742 కోట్లు విడుదల చేసింది. -
జగన్ భవనాలు కట్టిస్తే తప్పు.. అమరావతికి వేలకోట్ల అప్పు కరెక్ట్.. బాబు గారూ మీరు సూపర్
-
Birdflu: బర్డ్ఫ్లూ అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలం.. రంగంలోకి కేంద్రం
పల్నాడు జిల్లా,సాక్షి: బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీంతో బర్డ్ఫ్లూని అరికట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఇటీవల బర్డ్ఫ్లూతో మరణించిన పెండ్యాల గోపి, జ్యోతి దంపతుల కుమార్తె రెండేళ్ల ఆరాధ్య ఇంటిని సందర్శించనుంది.ఇందులో భాగంగా శుక్రవారం కేంద్ర వైద్య బృందం పల్నాడు జిల్లాకు వచ్చింది. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని బాలయ్య నగర్లో ఉన్న చిన్నారి ఆరాధ్య ఇంటి పరిసరాల్ని పరిశీలించనుంది. అనంతరం, జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబుతో భేటీ కానున్నట్లు సమాచారం. బర్డ్ ఫ్లూపై అబద్ధపు ప్రకటనలుబర్డ్ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి మనుషులకు ఆ వ్యాధి సోకడంతో పాటు ఒక మరణం సంభవించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. రాష్ట్రంలో రెండు నెలలుగా ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదంటూ అబద్ధపు ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు సర్కారు.. తాజాగా పచ్చి చికెన్ తినడం వల్లే ఆ బాలికకు బర్డ్ ఫ్లూ వచ్చిందని ప్రకటించింది.గందరగోళంలో ప్రజలుపరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. కొద్ది నెలలుగా రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమలో బర్డ్ఫ్లూ విజృంభిస్తోంది. దానిని అరికట్టడంలో, వైరస్ ప్రబలకుండా చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అలసత్వంతో వ్యవహరించింది. ఈ క్రమంలోనే నరసరావుపేట రావిపాడు రోడ్డులోని బాలయ్య నగర్కు చెందిన పెండ్యాల గోపి, జ్యోతి దంపతుల కుమార్తె రెండేళ్ల ఆరాధ్య మృత్యువాత పడింది.జలుబు, తుమ్ములు, తీవ్రమైన శ్వాసకోశ సమస్య, జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఈ చిన్నారి మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గత నెల 15న మృతి చెందగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘రెండేళ్ల బాలిక జ్వరం, శ్వాసకోశ సమస్యతో మార్చి 4వ తేదీన పిడియాట్రిక్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరింది. ఆ బాలికకు లెప్టోసిరోసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరాధ్య మృతినాసోఫారింజియల్ స్వాబ్ పరీక్ష ద్వారా ఇన్ఫ్లూయింజా ఏ పాజిటివ్గా కూడా నిర్ధారణ అయింది. దీంతో మరో నమూనాను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపాం. వారు ఏవియన్ ఇన్ఫ్లూయింజా (హెచ్5ఎన్1)గా నిర్ధారించారు. అయితే అంతలోనే పాప ఆరోగ్యం క్షీణించడంతో గత నెల 15వ తేదీన మృతి చెందింది. బర్డ్ ఫ్లూపై పచ్చి అబద్ధాలుఎవరైనా సరే జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని ఎయిమ్స్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంత స్పష్టంగా ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సంస్థే రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించగా, ప్రభుత్వం మాత్రం లేనే లేదంటూ పచ్చి అబద్ధాలు చెబుతోంది. రంజాన్ రోజు సాయంత్రం స్థానిక డీఎంహెచ్వోకు ఈ విషయం తెలియడంతో మరుసటి రోజు మంగళవారం ఉదయం నుంచి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లీశ్వరి మంగళవారం నరసరావుపేటకు వచ్చి చిన్నారి కుటుంబాన్ని విచారించారు. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి రక్త పరీక్షలు చేశారు. జాగ్రత్తలు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ వ్యాధి జాడ లేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ.దామోదర నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇదే తొలి కేసురాష్ట్రంలో గతంలో చాలాసార్లు కోళ్లకు బర్డ్ఫ్లూ సోకి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కొద్ది నెలల కింద కూడా బర్డ్ఫ్లూ వైరస్ పెద్ద ఎత్తున విజృంభించింది. ఇలాంటి తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ డ్రామా నడిపింది. బర్డ్ఫ్లూ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించకుండా కేవలం ప్రకటనలతో సరిపెట్టింది. బర్డ్ఫ్లూనూ అరికట్టామంటూనే నరసరావుపేటలో మరణించిన చిన్నారి ఫిబ్రవరిలో పచ్చి కోడి మాంసం తినడం వల్లే వ్యాధిబారిన పడిందని వైద్య శాఖ చెబుతుండగా.. తామసలు రెండు నెలలుగా చికెన్ తినడం లేదని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే వైరస్ను పూర్తిగా అరికట్టేశామని ప్రభుత్వం ఏ విధంగా ప్రకటన చేస్తుంది? ఈ పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి.. బుధవారం పశు సంవర్థక శాఖ డైరెక్టర్ రాష్ట్రంలో బర్డ్ఫ్లూ కేసులు లేనేలేవని ప్రకటన ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. అప్రమత్తంతో మెలగాలి బాలిక మృతి నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చిన్నారి మరణించిన ప్రాంతంలో రెండు వారాల పాటు సర్విలెన్స్ పెట్టారు. దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో కేవలం 4 హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లూయింజా కేసులు (హెచ్5ఎన్1), హెచ్9ఎన్2 కేసులు నమోదయ్యాయి. వీటిలో జూన్ 2019లో మహారాష్ట్ర, జూలై 2021లో హరియాణలో ఒక్కో కేసు, ఏప్రిల్, మే 2024లో పశ్చిమ బెంగాల్లో రెండు కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ మృతి కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.చికెన్ తీసుకురాలేదు రెండు నెలలుగా మా కుటుంబం చికెన్ తీసుకురాలేదు.. వండలేదు. రావిపాడు చర్చిలో ప్రార్థనలకు హాజరైనప్పుడు 40 రోజులపాటు మాంసాహారం తినొద్దని చర్చి పెద్దలు చెప్పటంతో చికెన్ తెచ్చుకోలేదు. ఈ జబ్బు ఏవిధంగా వచ్చిందో మాకు తెలియదు. మా అందరికీ రక్త పరీక్షలు చేశారు. అందరికీ బాగానే ఉందన్నారు. – పెండ్యాల లక్ష్మయ్య (చిన్నారి తాత), రాము (పెదనాన్న) -
AP Secretariat: ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
అమరావతి,సాక్షి: ఏపీ సచివాలయంలో (andhra pradesh secretariat) రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు ఇతర మంత్రులు కార్యకలాపాలు నిర్వహించే రెండవ పేషీ (ap secretariat minister peshi) బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రమాదంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. ఎస్పీఎఫ్ సమాచారంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం సంభవించిన రెండో బ్లాక్లో సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనితల పేషీలు ఉన్నాయి. ఏపీ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. సచివాలయంలోకి మీడియాని అనుమతించకుండా ఆంక్షలు విధించారు. సిబ్బంది ఐడీ కార్డ్ చూసిన తరువాతే వారిని లోపలికి పంపుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నుల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న మీడియాను లోపలికి అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం.. పై అధికారుల నుండి ఆదేశాలు వచ్చిన తర్వాతే లోపలికి మీడియాని అనుమతి ఇస్తామని చెబుతున్నారు. -
అమరావతి ఫర్ సేల్.. మొదలైన టీడీపీ రియల్ దందా!
-
సాయం అందించే చేతులకు వేదిక పీ–4
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ–4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ–పీ–4 విధానంపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ–4లో భాగస్వాములు కావొచ్చన్నారు. పీ–4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరఫున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు. ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. లబ్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబం ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని, గ్రామసభ, వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. పీ–4 కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడండి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం వేసవి ప్రణాళిక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించొద్దన్నారు. ఆపరేషన్ మోడల్లో పోలవరం–బనకచర్ల పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి ఆర్థిక భారం తగ్గించవచ్చన్నారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
చంద్రబాబు కొత్త రాగం.. ఆత్మవంచన ఇంకెంత కాలం?
పూటకో రకంగా మాట్లాడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేక లక్షణం. అసెంబ్లీలో కానీ.. మరో చోట కానీ.. నిన్న చేసిన ప్రసంగానికి, నేటికి అస్సలు సంబంధం ఉండకపోవచ్చు. ఎన్నికల ముందు చేసే ప్రసంగాలు ఒకలా ఉంటే.. ఆ తరువాత ఇంకోలా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాగ్దాన భంగాల గురించి ఆయన ఆచరించే పద్ధతులు ఒక పరిశోధన అంశం అవుతుందేమో!.కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఆయన విజన్-2047 గురించి ప్రసంగించారు. అందులో ఆయన పెట్టిన అంకెలు చూస్తే అది ఎంత పెద్ద గారడీనో అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ‘సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా’ అన్న ఆయన అధికారంలోకి రాగానే సంపద ఎలా సృష్టించాలో చెప్పండని ప్రజలను కోరారు. చెవిలో అయినా చెప్పాలని వ్యాఖ్యానించారు. తాజాగా సంపద సృష్టి నేర్పిస్తాం అంటున్నారు. చంద్రబాబు ఏది చేస్తారో తెలియదు కానీ, ఏపీని అప్పుల కుప్పగా మరుస్తుండటం మాత్రం స్పష్టం. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై ఉన్నట్లు కనిపించదు. ఒక్క అమరావతి కోసమే రూ.ఏభై వేల కోట్లకుపైగా అప్పు తెచ్చి ఖర్చు పెట్డడానికి సిద్దం అవుతున్నారంటే ఈ ప్రభుత్వం సంపన్నులకు, బడా బాబులకు ఉపయోగపడుతున్నదా? లేక పేదలను ఉద్ధరించడానికా? అన్నది తెలిసిపోతుంది.అమరావతిలో భూములు కొన్నవారి ప్రయోజనాల కోసం ఇంత భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు మాత్రం పాతరేసింది. అమరావతిలో ధనికులు బాగుపడితే తామంతా బాగుపడినట్లు పేదలు అనుకోవాలన్నది కూటమి సర్కార్ భావన. కానీ, శాసనసభలో, బయట మాత్రం చంద్రబాబు నాయుడు పేదల కోసమే అంతా చేస్తున్నట్లు చెబుతూ వారిని మభ్యపెట్టేయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ జగన్ విశాఖలోని రుషికొండపై ప్రభుత్వానికి ఉపయోగపడేలా మంచి భవనాలు నిర్మిస్తే, అవేవో ఆయన సొంతమైనట్లు ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేశారు. అదే అమరావతిలో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిల్డింగ్లను మాత్రం ఐకానిక్ భవనాలని ప్రచారం చేసుకుంటున్నారు.అమరావతి గ్రామాలలోనే ఇన్ని వేల కోట్ల వ్యయం చేస్తే అక్కడి వారికి సంపద సృష్టించినట్లు అవుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సంపదవుతుంది?. ప్రభుత్వాన్ని సమతులంగా నడపవలసిన పెద్దలు మిగిలిన ప్రాంతాలను ఎండగట్టి అంతా అమరావతిలోనే ఉందన్న భ్రమ కల్పించే యత్నం చేస్తున్నారు. దానికి తోడు విజన్-2047 అని, పీ-4 అని ఏవో కొత్త డైలాగులు ప్రచారంలోకి తేవడం ద్వారా ప్రజలంతా కూటమి ఇచ్చిన అనేక హామీల ఊసెత్త కూడదన్నది వారి వ్యూహం. ఇది ప్రజస్వామ్య వ్యవస్థను కూడా మోసం చేస్తున్నట్లు అన్న సంగతి గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి తలసరి ఆదాయ లక్ష్యం 18వేల డాలర్లుగా ఉండాలని భావిస్తుంటే ఏపీలో అది 42వేల డాలర్లుగా పెట్టుకున్నారు. అంటే అప్పటికి ఒక డాలర్ విలువ వంద రూపాయలు ఉందనుకుంటే ఏపీ ప్రజలు ఏడాదికి నలభై రెండు లక్షల మేర తలసరి ఆదాయం కలిగి ఉంటారన్నమాట. నిజానికి ఇంకో పాతికేళ్ల తర్వాత డాలర్ విలువ ఇంకా ఎక్కువే కావచ్చు. అది వేరే సంగతి. అంటే ఇలాంటి అంకెల గురించి ప్రజలకు అంత తేలికగా అర్థం కావు. అందువల్ల వారిని భ్రమింప చేయడానికి ఈ అంకెల గందరగోళం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.చంద్రబాబు 2004 వరకు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా విజన్-2020 అంటూ ఒక కథ నడిపించారు. ఆ విజన్ పుస్తకం చదివిన వారంతా ఇవేమి లెక్కలు.. ఇవేమి లక్ష్యాలు.. అంటూ ఆశ్చర్యం చెందారు. అప్పట్లో ఒకసారి ఏపీకి వచ్చిన స్విస్ మంత్రి ఒకరికి జీడీపీపై, రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై ఇలాంటి లెక్కలు చెప్పబోతే, తమ దేశంలో అయితే ఇలా చెబితే వారిని మతి ఉండి మాట్లాడుతున్నారా అని అడుగుతారని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో ఒకట్రెండు పదాలు ఆయన వాడటం చంద్రబాబుకు అప్రతిష్టగా మారడంతో ఆ మాటలపై వివరణ ఇప్పించే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు తన వ్యూహాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. ఏవో లెక్కలు చెబితే ప్రజలు నమ్మకపోతారా అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.సూపర్ సిక్స్ హామీలు కాని, ఎన్నికల ప్రణాళికలోని హామీలు కాని అమలు చేయడం అసాధ్యం వాటికి రూ.లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తాము చేసి చూపిస్తామని అనేవారు. తనకు సంపద సృష్టించడం తెలుసు అని చంద్రబాబు బడాయి కబుర్లు చెబితే, అవునవును అని పవన్ కళ్యాణ్ బాజా వాయించే వారు. అప్పటికే జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందన్న అబద్ధాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. అంకెలతో జనాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మోసం చేశారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి.నారా లోకేష్ అయితే అన్ని స్కీములకు తమ వద్ద లెక్కలు, ప్రణాళికలు ఉన్నాయని, అమలు చేయకపోతే తమ కాలర్ పట్టుకోవచ్చని అన్నారు. ఇప్పుడు కాలర్ ఎవరూ పట్టుకునే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ పేరుతో జనాన్ని భయపెడుతున్నారు. అవసరమైన ప్రజలకు చేపలు అందిస్తారట. ప్రతిరోజూ చేపలు ఇస్తూనే వలవేసి వాటిని ఎలా పట్టుకోవాలో నేర్పుతానని అదే తమ విధానం అని చంద్రబాబు అన్నారు. మరి ఈ మాటే ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? పేదల తక్షణావసరాలు తీర్చడం అంటే ఒక ఏడాదిపాటు ఫ్రీ బస్, తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని లేకుండా చేయడమా?. వలంటీర్లకు నెలకు పది వేలు ఇస్తామని చెప్పి అసలుకు మంగళం పాడడమా? ఇప్పటికీ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవశాలి ఎంతమందికి సంపద సృష్టించారు? ఎంత మందికి నేర్పారు? ఇప్పుడు కొత్తగా నేర్పుతానని అంటే జనం చెవిలో పూలు పెట్టడం కాదా? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట.అలాగే వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం అన్ని స్థాయిలలో పురోగతికి ప్రణాళికలు రూపొందిస్తున్నారట. నియోజకవర్గాల విజన్ ఎజెండా పెట్టి స్వర్ణాంధ్ర సాకారం చేస్తారట. అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా తన నియోజకవర్గంలో ఒక్క పని చేయలేక పోయానని వాపోయారు. పది నెలల పాలన తర్వాత వీధులలో చెత్త ఎత్తడానికి సీఎం, మంత్రులు ఆయా చోట్ల తిరుగుతున్నారు. అలా ఉంటుందన్నమాట విజన్ అంటే!.పరిస్థితి ఇలా ఉంటే స్వర్ణాంధ్ర అని, మరొకటని కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడమేమిటో అర్థం కాదు. అదేమంటే పేదలను ధనికులు దత్తత తీసుకోవాలట. అప్పుడు వారికి సంపద సృష్టించడం నేర్పనక్కర్లేదా!. ఉగాది నాడు ఆ కార్యక్రమం ఆరంభిస్తారట. అది ఎంత చక్కదనంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రతీ కుటుంబానికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తారట. రాజధానిలో పేదలకు గత ప్రభుత్వం స్థలాలు ఇస్తే వాటిని రద్దు చేసిన చంద్రబాబు ఈ మాట చెబితే ఎవరైనా నమ్ముతారా?. వైఎస్ జగన్ టైమ్ లో నిర్మాణంలో ఉన్న పోర్టులను ప్రైవేటు పరం చేస్తూ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాం అని అంటున్నారు. తాను ఒక్కడినే పనిచేస్తే చాలదని, ఎమ్మెల్యేలంతా పని చేయాలని చెబుతున్నారు. అంటే వారిలో చాలా మంది పనిచేయడం లేదని చెప్పడమే అవుతుంది కదా! పనుల సంగతి దేవుడెరుగు! కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని ఎల్లో మీడియాలోనే కథనాలు వస్తున్నాయి.చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన చేతిలో నిధులు ఉంటాయి కనుక, తన నియోజకవర్గంలో ఏదో పని చేసుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే ఇంత విజన్ ఉన్న ఆయన నియోజకవర్గమైన కుప్పంలో సరైన బస్టాండ్ లేదు, కొన్ని వార్డులలో మట్టి రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్పలేం. కుప్పం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలను జగన్ ప్రభుత్వం బాగు చేసింది. ఒక్క గెస్ట్ హౌస్ మాత్రం బాగానే ఉంటుంది. 2004, 2019లలో తనను ఎవరూ ఓడించలేదని, అభివృద్ది చేసే క్రమంలో ఎమ్మెల్యేలను, పార్టీని సమన్వయం చేయలేక పోయినందువల్ల ఓడిపోయామని అంటున్నారు. అంటే ఆయన నిజంగా అభివృద్ది చేసినా ప్రజలు ఓడించారని చెబుతున్నారా? అంతే తప్ప అప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక ఓడిపోయామని అంగీకరించలేక పోతున్నారన్నమాట.జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడిన సంగతిని విస్మరిస్తున్నారు అన్నమాట. ఇది ఆత్మవంచన కాదా! పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అంకెల గారడీ, బురిడీ మాటలు కాకుండా చిత్తశుద్దితో పనిచేసి, ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది. కానీ ఆ దిశలో ఆయన ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ ఉన్నట్లు కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘అమరావతి కేరాఫ్ అవినీతి’
సాక్షి,తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణ పనుల్లో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తోపుతుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తుంగలో తొక్కారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. దీని వలన 40టీఎంసీల నీరు రాయలసీమకు రాకుండా పోయింది. పోలవరాన్ని చివరికి బ్యారేజీగా మార్చేశారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు.పనులు ప్రారంభిస్తే వాటిని కూడా చంద్రబాబు ఆపేయించారు. 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు నీరులేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రాయలసీమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. శ్రీశైలంలో హక్కుగా రావాల్సిన నీటిని వాడుకోవటానికి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు వైఎస్ జగన్ తెచ్చారు. ఆ పనులన్నిటినీ చంద్రబాబు తన పార్టీ వారితో కేసులు వేయించి ఆపారు.రాయలసీమ మీద చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపించటం సరికాదు. శిష్యుడైన రేవంత్రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారు. అందుకే రాయలసీమకు రావాల్సిన నీటిని కూడా తెలంగాణాకు వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ రైతులు ప్రభుత్వంపై ఉద్యమం చేయటానికి రెడీ అవుతున్నారు. అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు లేదు?. అమరావతిలో జరిగే కాంట్రాక్టుల్లోనూ భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ తెచ్చిన పారదర్శకత లేకుండా అడ్డుగోలుగా కాంట్రాక్టులను కట్టబెట్టేస్తున్నారు’అని ఆరోపించారు. -
బాబు చెప్పిన సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఇదేనా ?
-
అంకెల గారడీ చేస్తే ప్రజల ఆదాయం పెరిగిపోతుందా?
-
అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహం
సాక్షి, అమరావతి: ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అమరజీవి స్వగ్రామం పడమటిపల్లిలోని ఆయన నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైసూ్కల్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్ హామ్ కెనాల్పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి నంబర్వన్గా మార్చాలని పనిచేస్తున్నట్టు సీఎం తెలిపారు. నేటితో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లోకి అడుగుపెట్టడంతో వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతి నెలా ఒకటి చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, ప్రతివ్యక్తి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉగాది నుంచి పీ4 విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. -
మరో రూ.11వేల కోట్లు.. అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
సాక్షి,విజయవాడ : కూటమి ప్రభుత్వం అమరావతి కోసం రూ.11 వేల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు మొత్తాన్ని మొత్తం అప్పు అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టనుంది.ఇక,రూ.11 వేల కోట్ల అప్పు కోసం హాడ్కోతో సీఆర్డీఏ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఋణానికి అదనంగా హడ్కో రుణం తీసుకుంది. రూ. 11 వేల కోట్లను అమరావతిలో పనులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది. -
చెప్పిందేమిటి... చేసేదేమిటి?
అమరావతి దేవతల రాజధాని అంటారు. ఆ పేరుతో నిర్మించా లనుకుంటున్న రాజధాని నగరం మాత్రం శాపగ్రస్థ, వివాదాస్థ ప్రదేశంగా మారింది. విభజన చట్టం అమలు హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 2,500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజ్టెక్ట్ అని, దానిపై ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కరలేదని చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసింది. మరో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయడానికి తాజా బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. ఇవి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి రూ. 31 వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుంటోంది.కేంద్రంలోని మోదీ సర్కార్ తమ మద్దతుతోనే మన గలుగుతోంది అంటూ, ఈ 31 వేల కోట్ల రూపాయల రుణంతో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర ప్రభు త్వమే ఆ భారాన్ని మోస్తుందని చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను ఉద్యమం రూపంలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా మార్చి 10వ తేదీన తమ అధికారిక ఎక్స్ ఎక్కౌంట్లో ‘రాజధాని అమరావతికి అప్పులు అంటూ, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు ఏపీ అప్పుల పరిధిలోకి రావని స్పష్టం చేసింది’ అని పేర్కొంది. అబద్ధాలు చెప్పడంలో రాటు దేలిన ఆ పార్టీ ఈ రుణాల బాధ్యత తమది కాదు, కేంద్రానిదే అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రుణాలపై వివరణ ఇస్తూ ‘మల్టీ లేటరల్ లోన్ అసిస్టెన్స్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులను ఆ ప్రభుత్వమే చెల్లించాలని చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మార్చి 10వ తేదీన మాట్లాడుతూ,‘అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్, మెజార్టీ నిధులను సీఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజె క్టును డిజైన్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నాం అంతే. అది కూడా బయటి సంస్థల ద్వారా రుణాల రూపంలో నిధులను సమకూర్చి ఇస్తున్నాం. అమరావతి భూములు అమ్మేసి ఈ అప్పు లన్నీ కట్టేసే విధంగా డిజైన్ చేస్తున్నాం’ అంటూ వివరణ ఇచ్చారు. కేంద్రం అమరావతికి ఏ రూపంలోనూ నిధులు సమకూర్చడం లేదని, దానిపై కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ కూడా లేదనడానికి ఇదే నిదర్శనం.అమరావతి నిర్మాణం, చంద్రబాబు ప్రభుత్వ చిత్త శుద్ధిపైనా సామాన్యులకే కాదు... అమరావతి ప్రాంత రైతులకు కూడా సందేహాలున్నాయి. అందుకే వారు భూ సమీకరణకు సీఆర్డీఏకి సహకరించడం లేదు. 38,581 ఎకరాల్లో రాజధానిని నిర్మించేందుకు 2015 జనవరిలో సీఆర్డీఏ ప్రారభించిన భూ సమీకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనిలో 33 వేల ఎకరాల భూమి సమీకరించాం అంటున్న సీఆర్డీఏ రైతులకు బదులుగా 65 వేల కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకూ 45 వేల ప్లాట్లను మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో పాటు ఇతర కారణాల దృష్ట్యా ఇప్పటికి 20 వేల ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ భూ సమీకరణ పూర్తి కానంత వరకూ రాజధాని విస్తీర్ణం నిర్ణయించడం సాధ్యం కాదు. సీర్డీఏ మరో ఐదు వేల ఎకరాలు రైతుల నుంచి సమీకరించడానికి ఎప్పటి నుంచో విఫలయత్నం చేస్తోంది. అయితే వారు తమ భూములను ఇవ్వడానికి ఏ మాత్రం అంగీకరించడం లేదు. 29 గ్రామాలతో కూడిన ప్రదేశంలో రాజ ధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దానిలో భాగస్వామ్యం కావడానికి రెండు గ్రామాల ప్రజలు ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. అమరావతి భూము లపై ప్రస్తుతం వందలాది కోర్టు కేసులున్నాయి. ఇన్ని అడ్డంకులున్నా ప్రభుత్వం మాత్రం 47 సంçస్థలకు భూములు కేటాయించింది. ఇప్పటికే రూ. 9 వేల కోట్లు అమరావతి నిర్మాణాలపై ఖర్చు చేసి మరో రూ. 48 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. అమరావతిలో భూ సమీకరణ ఒక విఫల ప్రయోగం. భూ సమీకరణ పేరుతో అమాయక రైతులు ఎలా నష్టపోయారో బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ కరోల్ ఉపాధ్యాయ తన ‘అసెంబ్లింగ్ అమరావతి: స్పెక్యు లేటివ్ ఎక్యుమిలేషన్ ఇన్ ఏ న్యూ ఇడియన్ సిటీ’ అధ్యయన గ్రంథంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ సంస్థ ‘అమరావతి’ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించింది. ‘హైటెక్ సిటీ’ పేరుతో హైదరాబాద్లో చంద్ర బాబు నాయుడు ఇన్సైడర్ ట్రేడింగ్కు ఎలా పాల్పడ్డారో ప్యారిస్ యూనివర్సిటీకి చెందిన ‘దలేల్ బెన్బబాలి’ కళ్ళకు కట్టినట్లు వివరించారు. అదే ప్రయోగాన్ని చంద్ర బాబు నాయుడు అమరావతిలో కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమరావతిలో దళితులకు అన్యాయం, బలహీన వర్గాల జీవనోపాధికి భంగం కలుగుతుందన్న వాదనలు ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి అనువైన ప్రదేశం కాదని అభిప్రాయపడిది. ఆ తరుణంలో అమరావతిలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నాయుడికి వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారంటూ అప్పట్లో ‘ఈనాడు’ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ ప్రదేశానికి అమరావతి అని నామకరణం చేసిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు. దీనిని అమలు చేస్తోంది చంద్రబాబు నాయుడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పు లతో నిర్మిస్తున్న అమరావతి అందరి రాజధానిగా ఉంటుందా? కొందరి రాజధానిగా ఉంటుందా? అన్న అనుమానాలు సామాన్యులకు రావడం సహజమే.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్మొబైల్: 89859 41411 -
పోసాని కృష్ణమురళికి మరో ఊరట
అమరావతి, సాక్షి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో మరో ఊరట దక్కింది. కూటమి నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సూర్యారావుపేట పీఎస్లో నమోదైన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టు(AP high Court)లో పోసాని క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం వాదనలు విన్న హైకోర్టు.. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదు అయిన కేసుల్లో తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది. తాజాగా.. ఇవాళ పోసానిని అరెస్ట్ చేయొద్దంటూ విజయవాడ సూర్యారావు పేట పోలీసులను ఆదేశించింది. పోసాని తరఫున ఇవాళ వైఎస్సార్సీపీ లీగల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.హైదరాబాద్ టు కర్నూల్ జైలు.. ఎప్పుడు.. ఏం జరిగిందంటే..ఫిబ్రవరి 24న.. పవన్ కల్యాణ్తో పాటు కూటమి నేతలను పోసాని గతంలో దూషించారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పీఎస్లో కేసు నమోదుఫిబ్రవరి 27న.. హైదరాబాద్లోని తన నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినని పోలీసులు.. అదే రాత్రి తరలింపుఫిబ్రవరి 28న.. ఒబులవారిపల్లి పీఎస్కు తరలింపు.. సుదీర్ఘ విచారణ.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పోసానిఫిబ్రవరి 28న.. రైల్వే కోడూరులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధింపుమార్చి1న.. ప్రిజనర్ ట్రాన్సిట్(PT) వారెంట్ కింద అదుపులోకి తీసుకున్న పల్నాడు నరసరావుపేట టూటౌన్ పోలీసులుమార్చి3న.. నరసరావుపేట కోర్టులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు. పోసానికి జ్యూడీషియల్ రిమాండ్ విధించిన జడ్జిమార్చి3న.. పీటీ వారెంట్ జారీ చేసిన కర్నూల్ జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు. మార్చి4న.. నరసరావుపేట నుంచి ఆదోని పీఎస్కు పోసాని తరలింపు మార్చి 5న.. మెజిస్ట్రేట్ నివాసంలో పోసానిని ప్రవేశపెట్టిన ఆదోని త్రీటౌన్ పోలీసులు.. రిమాండ్ మీద కర్నూల్ జైలుకు తరలించారుమార్చి6న.. ఆదోని కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ విచారణ.. కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్మార్చి7న.. కర్నూలు జస్టిస్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ విచారణకౌంటర్ వేయనున్న ఆదోని పోలీసులుఇవాళ సాయంత్రం కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కర్నూలు కోర్టులో తీర్పు వెలువడే అవకాశం -
GVMC నిధులను అమరావతికి మళ్లిస్తున్న ఏపీ ప్రభుత్వం
-
ఆలీ ‘బాబు’.. అసైన్డ్ దొంగలు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ పెద్దలు మరో భారీ భూదోపిడీకి తెగబడ్డారు. భూసమీకరణ కింద ఇచ్చిన అసైన్డ్ భూములకు గాను ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయించే రిటర్నబుల్ ప్లాట్లను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఆర్డీఏ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఈ దందాను దర్జాగా నడిపిస్తున్నారు. బడుగు రైతుల ప్లాట్లను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే అక్రమంగా కొల్లగొట్టిన 1,300 ఎకరాల అసైన్డ్ భూములకుగాను రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్లాట్లు కబ్జా చేసేందుకు బరితెగించిన ప్రభుత్వ పెద్దలు... తాజాగా పేద రైతుల రిటర్నబుల్ ప్లాట్లను సైతం స్వాహా చేస్తుండటంపై రాజధాని ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఇదీ అసైన్డ్ గూడుపుఠాణి... రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ కింద తమ అసైన్డ్ భూములు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు ప్రతిగా అభివృద్ధి చేసిన వాణిజ్య, నివాస ప్లాట్ల్లను సీఆర్డీఏ కేటాయించాలి. ఆ మేరకు అసైన్డ్ రైతుల పేర్లతో సీఆర్డీఏ వద్ద పెద్ద జాబితా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొన్ని భవన నిర్మాణాలకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తున్నందున టీడీపీ పెద్దల కన్ను ఆ ప్లాట్లపై పడింది. కానీ, రిటర్నబుల్ ప్లాట్లను నేరుగా టీడీపీ పెద్దలు, వారి బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి తమ బెదిరింపులకు తలొగ్గి.. ప్లాట్లు తిరిగి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని సమ్మతించిన అసైన్డ్ రైతులకే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలోనే ఈ భూదోపిడీ పర్వం సాగుతోంది. భూ దోపిడీ పర్వం ఇలా... ముందుగా రాజధాని పరిధిలోని అసైన్డ్ రైతులను తుళ్లూరు డీఎస్పీ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. సీఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ ప్లాట్లను తాము సూచించిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఒకవేళ రాజధానిలో తమ ప్లాట్లను తామే అట్టిపెట్టుకుంటామని చెప్పిన రైతులను బెదిరిస్తున్నారు. ‘ప్లాట్లు పెట్టుకుని ఏం చేస్తారు.. వాటిలో మీరు ఏదైనా నిర్మాణం చేయాలంటే అనుమతులు ఇవ్వరు. తర్వాత మరొకరికి అమ్ముకోవాలన్నా రిజి్రస్టేషన్ చేయరు. పైగా లీగల్ లిటిగేషన్లు పెట్టి మీ ప్లాటుల మీకు ఎప్పటికీ దక్కకుండా చేస్తారు...’ అని హెచ్చరిస్తున్నారు. మేం చెప్పినవారికి వెంటనే అమ్మేస్తామని అంగీకరిస్తే ఇప్పుడు మీ ప్లాట్లు మీ పేరిట సీఆర్డీఏ ద్వారా రిజి్రస్టేషన్ చేయిస్తాం. లేకపోతే సీఆర్డీఏ మీ పేరిట అసలు ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయదు. ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉంచుతుంది’ అని బెదిరిస్తున్నారు. మరోవైపు కిందిస్థాయి పోలీసు అధికారులు, దళారులు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ తాము చెప్పినట్టు చేయకపోతే మొత్తానికే మోసం వస్తుందని భయపెడుతున్నారు. దీంతో పలువురు ఎస్సీ, ఎస్సీ, బీసీ, పేద రైతులు హడలిపోతున్నారు. పోలీసు బెదిరింపులకు లొంగి తమ ప్లాట్లను టీడీపీ పెద్దలు, బినామీలు చెప్పిన నామమాత్రపు రేటుకే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సమ్మతిస్తున్నారు. సీఎంవో పచ్చజెండా ఊపితేనే.. సీఎం చంద్రబాబు కార్యదర్శి ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. తమ ప్లాట్లు ఇచ్చేందుకు సమ్మతించిన రైతుల పేర్లను పోలీసు అధికారులు వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిసింది. వచి్చన జాబితాను పరిశీలించి అంతా తాము అనుకున్నట్టుగా సాగుతోందో లేదో అన్నది పోలీసు అధికారులతో సీఎం కార్యదర్శి మాట్లాడి నిర్ధారించుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాతే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిన జాబితాను సీఆర్డీఏకు పంపుతున్నారు. ఈ చేత్తో ఇచ్చి... ఆ చేత్తో గుంజుకుంటున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదముద్ర వేసిన జాబితాలోని అసైన్డ్ రైతులకే రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ రిజి్రస్టేషన్ చేస్తోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే అసైన్డ్ రైతుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అనంతరం పోలీసు, సీఆర్డీఏ అధికారులు చెప్పినట్టుగా... అసైన్డ్ రైతులు ఆ ప్లాట్లను టీడీపీ పెద్దలు, వారి బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చదరపు గజం భూమి మార్కెట్ ధర రూ.లక్షకు మించి పలుకుతోంది. కానీ సీఎంవో, సీఆర్డీఏ, పోలీసు అధికారులతో బెదిరించి అతి తక్కువ ధరకు కొల్లగొడుతున్నారు. అసైన్డ్ రైతుల నుంచి గజం కేవలం రూ.30వేల నుంచి రూ.40వేల చొప్పునే టీడీపీ పెద్దల బినామీలు, బంధువులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. అంటే ఈ చేత్తో అసైన్డ్ రైతులకు ఫ్లాట్లు ఇచ్చి... ఆ చేత్తో వెంటనే గుంజేసుకుంటున్నారు. 2014–19 మధ్య కాలంలో అమరావతిలో భూదోపిడీ సాగించిన చంద్రబాబు, నారాయణ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులు, బంధువులు, బినామీల పేరిటే ఈ అసైన్డ్ భూముల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఈ విధంగా రాజధాని అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు ప్లాట్లు లేకుండా చేసి మొత్తం రాజధాని తమ సన్నిహితులు, బినామీల గుప్పిట్లోనే ఉండాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. బెదిరించి ప్లాట్లు తీసుకుంటున్నారు అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్లాట్లు ఉండకూడదని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అసైన్డ్ రైతులకు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్లపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. సీఆర్డీఏ కేటాయించే ఫ్లాట్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితుల పేరిట రిజి్రస్టేషన్ చేయాలని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. అందుకు అంగీకరిస్తేనే వారి పేరిట సీఆర్డీఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఆ వెంటనే ఆ ప్లాట్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, బినామీల పేరిట అతి తక్కువ ధరకే రిజి్రస్టేషన్ చేసేసుకుంటున్నారు. సీఎంవో, సీఆర్డీఏ, పోలీసు పెద్దల పర్యవేక్షణలోనే ఇదంతా సాగుతోంది. దాంతో అసైన్డ్ రైతులు భయపడి వారు చెప్పినట్టుగా చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. – సందీప్, అసైన్డ్ రైతు, అమరావతి -
అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి రాజముద్ర!
-
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు ‘రిటర్నబుల్ ప్లాట్లు. సీఆర్డీఏకు చంద్రబాబు సర్కారు ఆదేశం
-
వేల కోట్ల అప్పులతో అమరావతి నిర్మిస్తున్న కూటమి సర్కారు
-
‘అందుకే జీబీఎస్ ఆందోళన ఎక్కువ అయ్యింది’
అమరావతి: మహారాష్ట్రలో ఎక్కువగా జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా ఇక్కడ కూడా ఆందోళన బాగా ఎక్కువగా ఉందన్నారు ఏపీ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు. పుణే మున్సిపల్ కార్పొరేషన్లో నీటి సరఫరా సరిగ్గా లేని కారణంగా డయేరియా మొదలై జీబీఎస్ సోకిందన్నారు.దీంతో జీబీఎస్ పై భయం పెరిగిందన్నారు. అన్ని ఏరియాల నుంచి జీబీఎస్ వస్తోందని, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒకే చోట ఎక్కువ కేసులు నమోదు కాలేదని, న్యూరో ఫిజిషయన్లు ఎక్కువగా ఉన్న చోట ట్రీట్ మెంట్ బాగా జరుగుతుందన్నారు.‘వెంటిలేటర్లు ఇతర ఐసీయూ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నాం.ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికైనా జీబీఎస్ వచ్చే అవకాశం ఉంది.. సాధారణ జాగ్రత్తలు అంటే చేతులు కడుక్కోవడం.. శుభ్రంగా ఉండడం. పాటించాలి. కాళ్ళు తిమ్మిర్లు..చచ్చు బడినట్టు ఉండడం....లక్షణాలు. తినలేకపోవడం..మింగ లేకపోవడం.. శ్వాస అడకపోవడం. కూడా వ్యాధి లక్షణాలు. ప్రజలు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.జీబీఎస్ వచ్చిన 85 శాతం కేసులు ఒక్క రోజులోనే. సెట్ అవుతాయి..వెంటిలేషన్ అవసరం అయితే రికవరీ కష్టం అవుతుంది. మొదట చనిపోయిన చిన్న పిల్లవాడి కేస్ లో ఆసుపత్రి మార్చారు...మొదట శ్రీకాకుళం. తర్వాత విశాఖ కేజీహెచ్. దీంతో ఇబ్బంది వచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవలో చికిత్స అందుబాటులో ఉంది’ అని కృష్ణబాబు తెలిపారు. -
ఇంత మోసమా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రైల్వే ప్రాజెక్టు( Amaravati railway line) భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించ రైల్వే లైన్కు భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. భూ సేకరణ కాకుండా సమీకరణ చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. బలవంతంగా భూసేకరణకు సిద్ధమైతే కోర్టును ఆశ్రయించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.అమరావతి రైల్వే లైన్ కోసం గుంటూరు జిల్లాలో 1,753 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.అమరావతి మండలం కర్లపూడి గ్రామంలోనే 232 ఎకరాలు సేకరించనున్నారు. ఇదే గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 153 ఎకరాలు, ఈ7, ఈ8, ఈ9 రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 900 ఎకరాలు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే లైన్కు భూమి ఇవ్వాలని, దీనికి కేంద్రం ఇచ్చే ప్యాకేజి సరిపోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం కోసం ఎక్కడో ఉన్న గన్నవరంలో భూములిచ్చిన వారికి రాజ«దానిలో 1,450 గజాలు ల్యాండ్పూలింగ్ ప్యాకేజి కింద ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారు?ప్రభుత్వం రైతులతో సమావేశాలు పెట్టినా, వారి అభ్యంతరాలు స్వీకరించకుండానే రైల్వే లైన్ భూసేకరణకు పెగ్మార్కింగ్కు సిద్ధపడుతోంది. ఇలా ఇష్టానుసారం పెగ్ మార్కింగ్కు షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అమరావతి తహసీల్దార్తో జరిగిన సమావేశంలో కర్లపూడి రైతులు ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసు బందోబస్తుతో పెగ్మార్కింగ్కు రావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రాజధాని పరిసర ప్రాంతాల్లోని కంతేరు, కొప్పురావూరు, తాడికొండ, మోతడక గ్రామాల రైతులు రైల్వే లైన్ భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు కూడా చేశారు. రైల్వేలైన్ వల్ల పక్కన ఉన్న భూముల ధరలు కూడా పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పక్కనే 500 మీటర్ల వరకూ భూమిని సేకరించి, రైల్వే లైన్కు రెండువైపులా సర్వీస్రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంత అన్యాయమా?ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూముల ప్రభుత్వ విలువ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని, పరిసర ప్రాంతాల్లో మాత్రం పెంచలేదు. ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రైల్వే లైన్ భూ సేకరణలో తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతునానరు. తమ గ్రామంలో భూమి ప్రభుత్వ విలువ రూ. 16 లక్షలు ఉంటే దాన్ని కేవలం రూ. 4 లక్షలు పెంచి రూ. 20 లక్షలు చేశారని, మిగిలిన చోట్ల అసలు పెంచలేదని కర్లపూడి రైతులు చెబుతున్నారు.బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరా దాదాపు రూ. 4 కోట్లు ఉండగా, ఇప్పుడు రైల్వే నుంచి రూ. 50 లక్షలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైల్వే ప్యాకేజికి అదనంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చే ప్యాకేజిలో 33 శాతం అంటే 410 గజాల స్థలం ఇప్పిస్తామని మంత్రి నారాయణ ఇటీవల రైతులకు సర్దిచెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 650 గజాల వరకు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే దీనికి కూడా రైతులు అంగీకరించడంలేదు. పూర్తిగా పూలింగ్ ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నారు.రాజధాని రైతులకు ఇచ్చినట్లుగా ఫారం.9.14 ఇవ్వాలని, అందులో ఎంత భూమి ఇస్తారు, ఇళ్ల స్థలం ఎంత, వాణిజ్య స్థలం ఎంత? కౌలు ఎన్ని సంవత్సరాలు ఇస్తారన్న విషయాలను స్పష్టం చేయకుండా భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. అసలు రైల్వే లైన్ అలైన్మెంటే తప్పు అని రైతులు అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేసిన గ్రామాల నుంచి కాకుండా బయట నుంచి రైల్వే లైన్ వెళ్లడం వల్ల 4 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని వాదిస్తున్నారు. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్ను కదపకుండా బయట నుంచి అలైన్మెంట్ ఇచ్చామని మంత్రి నారాయణ చెబుతున్నారు. -
దొంగేడుపు బాబు.. బికారి మాటలు
-
అమరావతికి ఏపీఈఆర్సీ
-
మన నగరాల్లో కాలుష్యం తక్కువే
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు/క్యూబిక్ మీటర్), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవత్సరానికి గాను సీఆర్ఈఏ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మడికేరి నగరం చోటు సంపాదించింది. ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణాటకలోని కొప్పల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథపురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్లోని శ్రీగంగానగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది. 226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో తొమ్మిది, బిహార్లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది. గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖపట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్..ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్సీఏపీ (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్మెంట్కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసలు సమస్య ముంపే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించడానికి తొలి దశలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఎత్తిపోతలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించేలా నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్పై నాలుగు చోట్ల పది క్యూసెక్కులను ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసింది. షెడ్యూళ్ల దాఖలుకు ఫిబ్రవరి 14ను తుది గడువుగా నిర్దేశించింది. రాజధానిని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు 2018లో ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై 5 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా రూ.260.48 కోట్లతో ఎత్తిపోతలను పూర్తి చేసింది. దీంతో పాటు ఇప్పుడు శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.10, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.. కొండవీటి వాగు, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా వెడల్పు చేయడం, కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించడానికి నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వే పనులకు రూ.1,404.14 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి.. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు, వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మించాలని ప్రపంచ బ్యాంకు–ఏడీబీ ప్రతినిధులు సూచించారని ప్రభుత్వం చెబుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించే పనుల వ్యయమే తడిసి మోపేడయ్యేలా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.222 మి.మీ వర్షం కురిసినా ముప్పు ఉండకూడదురాజధాని అమరావతి ప్రాంతంలో వందేళ్లలో నమోదైన వర్షపాతం గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది. వందేళ్లలో ఒకసారి అమరావతి ప్రాంతంలో గరిష్టంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ స్థాయిలో వర్షం కురిసినా రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి తప్పించేలా ముంపు నివారణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల ప్రణాళిక మేరకు రాజధాని ముంపు నివారణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ ప్రణాళికలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.» రాజధాని ప్రాంతంలో ప్రవహించే వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి కొండల్లో పేరిచెర్ల వద్ద జన్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 421 చదరపు కిలోమీటర్లు. కొండవీటి కొండల నుంచి ప్రవాహించే ఈ వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత నీరుకొండ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తుంది. » రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. కృష్ణా నది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే.. కృష్ణా వరద కొండవీటి వాగులోకి 23.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంది. ఇది రాజధాని ముంపునకు దారితీస్తుంది. » రాజధానికి కొండవీటి వాగు ముంపు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహ సామర్థ్యాన్ని అనంతవరం నుంచి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు (11.6 కి.మీ నుంచి 23.6 కి.మీ వరకు) 2,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు(4.6 కి.మీ నుంచి 11.6 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలి. కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు (4.6 కి.మీ నుంచి 0 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. » నీరుకొండ వద్ద 0.4, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలి. » ఉండవల్లి వద్ద కొండవీటి వాగు నుంచి 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్లోకి.. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి ఎత్తిపోసేలా ఇప్పటికే ఎత్తిపోతలను నిర్మించారు. దానికి అనుబంధంగా 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల నిర్మించాలి. » పాల వాగు సామర్థ్యాన్ని కృష్ణాయపాలెం నుంచి దొండపాడు వరకు 16.7 కి.మీల పొడవున 8,830 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.» నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.843 కి.మీల పొడవున 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కెనాల్ తవ్వాలి. ఈ కెనాల్పై నాలుగు చోట్ల పది క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలి. ఈ పనులన్నీ తొలి దశలో పూర్తి చేయాలి.» రెండో దశలో రాజధాని అమరావతి ఆవల ప్రాంతం నుంచి కొండవీటి వాగు వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు మళ్లించేలా లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వాలి. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించాలి. కొండవీటి వాగు వరద ప్రవాహం 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల నిర్మించాలి. » రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రిజర్వాయర్లను ఖాళీ చేయాలి. వరద నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
పోలవరం, అమరావతికి నిధులు కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం తరఫున ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బడ్జెట్లో నిధులు కేటాయించండి..ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పోలవరం, అమరావతి నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై చంద్రబాబు చర్చించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రామ్నాథ్ కోవింద్తో భేటీమాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆయన నివాసంలో చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు వెంటకేంద్ర ఉక్కు, పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇండోనేషియా ఆరోగ్య శాఖమంత్రి బుది జి సాదికిన్తో భేటీ అయినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో తెలిపారు. పరిటాల రవి 20 వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించినట్లు కూడా పేర్కొన్నారు. అలాగే.. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ఆడపిల్లల భద్రత, భవిష్యత్తు తమ ప్రధాన ప్రాధాన్యతలని పోస్ట్ చేశారు. త్వరలో దిగ్గజ సంస్థల సీఈవోలు వస్తారు దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులపై జరిగిన చర్చలకు కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు త్వరలో రాష్ట్రానికి వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు.దావోస్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సీఎస్ విజయానంద్, సీఎంవో అధికారులతో తన నివాసంలోనే సమావేశమై దావోస్ పర్యటనపై చర్చించారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చే నాటికి తగిన ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
దావోస్.. అంతా తుస్
సాక్షి,విజయవాడ : పెట్టుబడులు తేకుండానే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని బయలు దేరిన చంద్రబాబు, లోకేష్..కానీ మూడు రోజుల దావోస్ సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు చేసుకున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వంతో మాత్రం ఎంవోయూ కుదుర్చుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఎంవోయూలు లేకుండా పబ్లిసిటీకే చంద్రబాబు దావోస్ పర్యటన పరిమితమైంది.అదే సమయంలో తన దావోస్ పర్యటన కోసం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్లు రూ.3కోట్లకు పైగా ఖర్చు చేసి జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామిక వేత్తలకు నారా లోకేష్ చెడు సందేశం పంపారు. దావోస్ పర్యటనలో లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ భజన చేశారు. బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ పబ్లిసిటీకే పరిమితమైంది. ఏపీలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుకు ఎంవోయూ చేసుకోని మైక్రోసాఫ్ట్. దావోస్ నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఏపీ అధికారులు తిరుగుముఖం పట్టారు. -
అమరావతిపై కపట ప్రేమ చూపిస్తున్న కూటమి నేతలు
-
మూడు ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ రూ.1,404.14 కోట్లుగా నిర్ధారణ
-
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది. -
అమరావతిని అక్రమాలపురంగా మారుస్తున్న కూటమి సర్కార్
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగడుగునా కమీషన్లు... సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో విచ్చలవిడిగా అక్రమాలు
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా?.. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: గుంటూరు పట్టాభిపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాం. అయినా ఎందుకు తలదూరుస్తున్నారు’ అంటూ మండిపడింది. మంగళవారం హైకోర్టులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరి వజ్ర కుమారి, వసంత ఇంటి వ్యవహార కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా.. సివిల్ వ్యవహారంలో పట్టాభిపురం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ వజ్రకుమారి, వసంతల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని చెప్పారు. అనంతరం, తమ ఆదేశాలను ధిక్కరించిన పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
డిప్యూటీ సీఎం పవన్తో దిల్ రాజు భేటీ.. ఈ అంశాలపైనే చర్చ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమరావతిలో భేటీ అయ్యారు. తాను నిర్మించిన 'గేమ్ ఛేంజర్' సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో వారిద్దరి భేటీ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు విజయవాడలో సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమం ఏర్పాటు గురించి పవన్తో దిల్ రాజు చర్చించనున్నారు.తెలంగాణలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో బెనిఫిట్షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ఉండవని ఆయన క్లియర్గా చెప్పేశారు. దీంతో సంక్రాంతి సినిమాలపై భారీగా ప్రభావం పడింది. ఈ క్రమంలో దిల్ రాజు- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్' జనవరి 10న విడుదల కానుంది. తెలంగాణలో ఈ చిత్రానికి ఎలాంటి బెనిఫిట్షోలు, టికెట్ ధరల పెంపు ఉండదు. దీంతో కనీసం ఏపీలో అయినా ఈ సౌలభ్యం పొందాలని చిత్ర యూనిట్ భావించింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఏపీలో టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన్ను కోరనున్నట్లు సమాచారం. జనవరి 4,5 తేదీలలో విజయవాడలో గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేలా చూడాలని పవన్ను కోరనున్నారు. ఈ భేటీ అనంతరం దిల్ రాజు పూర్తి విషయాలు ప్రకటించే అవకాశం ఉంది. -
అమరావతికి అప్పుల వరద.. బాబు సూపర్ షాక్..
-
హ్యాపీనెస్ట్ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: అమరావతిలోని నేలపాడులో నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం అమల్లో ఉన్న సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టెండర్ డాక్యుమెంట్ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. కానీ అప్పటి నుంచి టెండర్లను ఆహ్వానించకుండా.. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా టెండర్లను ఆహ్వానించడం గమనార్హం. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.720 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు పూర్తికి 24 నెలల గడువుఈ ప్రాజెక్టులో భాగంగా జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 అపార్ట్మెంట్ యూనిట్లు నిర్మించాలని టెండర్ డాక్యుమెంట్లో సీఆర్డీఏ పేర్కొంది. షేర్ వాల్ టెక్నాలజీ వినియోగం ద్వారా హ్యాపీనెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. అంతర్గత–బాహ్య విద్యుత్ పనులు, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పనులు, లిఫ్ట్లు, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులు చేపట్టాలని పేర్కొంది. ఓపెన్ టెండర్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. టెండర్ దక్కించుకున్న సమయం నుంచి 24 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్లంబింగ్, శానిటరీ, ల్యాండ్స్కేప్, ఫైర్ ఫైటింగ్, లిఫ్ట్లు, సెక్యూరిటీ వ్యవస్థ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ తదితరాలను అంశాల వారీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పనులు పూర్తి చేసినప్పటి నుంచి మూడేళ్ల సమయాన్ని డిఫెక్ట్ లయబిలిటీగా సీఆర్డీఏ పేర్కొంది.10% మొబిలైజేషన్ అడ్వాన్స్..కాంట్రాక్టు వ్యయంలో 10శాతం మేర మొబిౖలెజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పనులు దక్కించుకున్న సంస్థలకు ముందుగానే పనుల విలువలో పది శాతం మేర మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు టెండర్లో పేర్కొంది. అంచనావ్యయానికి ఐదు శాతంలోపు కోట్ చేసిన టెండర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతకన్నా ఎక్కువ కోట్ చేసిన టెండర్లను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 8 వరకు గడువు ఇచ్చింది. 8వ తేదీ సాయంత్రం సాంకేతిక బిడ్ను తెరవనున్నట్లు ప్రకటించింది. జనవరి 10న ఆర్థిక బిడ్ను తెరవనున్నట్లు తెలిపింది. -
పుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్పాత్పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా?
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి... ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ఆయన ప్రశి్నంచారు. రాజధాని పేరుతో ఉత్తరాం«ధ్ర, రాయలసీమలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైనా పడుతుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలీదు కానీ... అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తిగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపకుండా... పక్కనే నక్కపల్లిలో ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్లరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను స్థాపించేందుకు మొగ్గు చూపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ఉదాసీనత బట్టబయలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించకపోవడం కూడా మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ వ్యవహారంపై మీరు చూపించిన చొరవపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా.. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిది. వెనుకబడిన ప్రాంతాలను విస్మరించి వేల కోట్ల రూపాయలను రాజధానికి ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించాలి..’అని లేఖలో శర్మ పేర్కొన్నారు. -
అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పే
-
అప్పులతోనే అమరావతి.. పెండింగ్ పనులకు 30వేల కోట్లు!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ అప్పులు చేయడంలో ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులతోనే అమరావతిలో నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం బాబు సర్కార్ 30వేల కోట్ల అప్పులు చేస్తోంది.అప్పులతోనే అమరావతి చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుండి రూ.6,800 కోట్ల అప్పు తీసుకునేందుకు నిన్న బోర్డు మీటింగ్లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఏడీబీ ద్వారా అమరావతి కోసం ప్రభుత్వం రూ.6700 కోట్లు అప్పు తెస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ అప్పులు కలుపుకుంటే అమరావతి కోసమే బాబు సర్కార్ రూ.13,500 కోట్లు అప్పులు చేస్తోంది.ఈ నేపథ్యంలో అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పు మాత్రమేనని మరోసారి తేలింది. కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కానీ, కేంద్రం కేవలం.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు మాత్రమే ఇప్పిస్తోంది. ఈ అప్పులన్నింటీనీ కూటమి సర్కార్.. అమరావతి కోసం మళ్లిస్తోంది. మరోవైపు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, కేఎఫ్డబ్ల్యూ ద్వారా 5 వేల కోట్లను బాబు సర్కార్ అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అమరావతి కోసం సుమారు 30 వేల కోట్ల అప్పు చేస్తోంది. అమరావతిలో పెండింగ్ భవనాల కోసం అప్పులు చేస్తూ.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. ప్రస్తుతం అప్పులన్నీ అమరావతికే కేటాయిస్తోంది. -
ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంరాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..ఈ నెల 21 న మన అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాంసోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు. -
అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంతలు తొక్కుతుందని ఎల్లోమీడియాలో కథనాలు
-
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్తో పోలిస్తే నవంబర్లో, నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
‘అమరావతి’కి ఇచ్చేది అప్పే!
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన రూ.15 వేల కోట్లు రుణమని తేలిపోయింది. ఈ మొత్తం కేంద్రం నుంచి గ్రాంట్గా ఇస్తున్నట్లు ఇప్పటికే శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సభలో ధన్యవాదాలు సైతం తెలిపారు. ఇక ప్రకటించిన మొత్తంలో రూ.13,500 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని ఏపీ రాజధాని నిర్మాణానికి గ్రాంట్గా ఇస్తున్నట్లు కూటమి నేతలు ప్రచారం చేశారు. కానీ, ఇవన్నీ అబద్ధమని.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇచ్చేది పూర్తిగా షరతులతో కూడిన రుణమని తాజాగా బహిర్గతమైంది. ఈ మేరకు గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశమైన ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు అధికారులు ‘అమరావతి ఇన్క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’కి 788.8 మిలియన్ డాలర్ల రుణాన్ని (సుమారు రూ.6,694.36 కోట్లు) ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ రుణం మొత్తం థీ121.97 బిలియన్ల జపనీస్ యెన్లో అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తంతో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద వాటాదారులుగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చుచేయాలని సూచించారు. ఈ మొత్తాన్ని ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్) సహకారంతో ప్రోగ్రామ్కు మద్దతు ఉంటుందని ఏడీబీ భారతదేశ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా తెలిపారు. ఇక రుణంగా ఇచ్చే మొత్తానికి వడ్డీ ఉండదని, కానీ 20 ఏళ్ల తర్వాత వాయిదాలుగా ఆనాటికి ఉన్న డాలర్ల విలువకు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, అప్పటికి డాలర్ విలువ 20 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి వచ్చే రూ.15,000 కోట్లలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులు ఇచ్చే రూ.13,500 కోట్ల రుణం కాగా, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. -
నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ
-
నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని తెలిపింది. కేసు విచారణను ముగించాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. చదవండి : ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు! -
అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్న కూటమి సర్కారు
-
న్యాయ సాయం కోరే హక్కు నిందితునికి ఉంది
సాక్షి, అమరావతి : ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్ మీద మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినప్పుడు, అతను పోలీసు లేదా జ్యూడిషియల్ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని మేజిస్ట్రేట్ను కోరవచ్చని హైకోర్టు తెలిపింది. అలా కోరే హక్కు నిందితుడికి ఉందని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్లు నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్కు హైకోర్టు ఈ వెసులుబాటుని ఇచ్చింది. రవికిరణ్కు సంబంధించి వివరాలేమీ పోలీసులు తమకు తెలియజేయడంలేదని, దీంతో న్యాయ సాయం పొందే అవకాశం లేకుండా పోతోందన్న అతని తరఫు న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రవికిరణ్పై నమోదైన కేసుల వివరాలును తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పీటీ వారెంట్ల వివరాలను పోలీసులు నిందితునికి తెలియచేయాల్సిన పని లేదని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. తన భర్త రవికిరణ్పై ఉన్న కేసుల వివరాలు, పీటీ వారెంట్లపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదంటూ ఇంటూరి సుజన హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుజన తరఫున న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి, పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది (హోం) ఎ.జయంతి వాదనలు వినిపించారు. -
మళ్లీ వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పు రూ.4,237 కోట్లు
సాక్షి, అమరావతి : సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడం, అప్పులు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.4,237 కోట్లు అప్పు చేయనుంది. పదేళ్ల వ్యవధిలో రూ.1,237 కోట్లు, 14 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. వచ్చే మంగళవారం సెక్యురిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత మంగళవారమే 7.18 శాతం వడ్డీకి రూ.2000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే.. దీంతో చంద్రబాబు ప్రబుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులు రూ.67,237 కోట్లకు చేరనున్నాయి. -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.పర్శిక టీచర్తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి -
'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకునే వారి కోసం ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో తనపై పెట్టిన కేసులు వాటి సెక్షన్ల వివరాలను పొందుపరిచారు. తాను చేసిన తప్పేంటి..? పోలీసులు నమోదు చేసిన కేసు ఏంటి..? అనేది అందరికీ అర్థం అయ్యేలా తెలుపుతూ.. తన సోషల్ మీడియాలో భారీ ట్వీట్ చేశారు.వర్మ భయపడి పరారీలో ఉన్నారనుకునే వారికి ఆయన పెద్ద షాకిచ్చారని చెప్పవచ్చు. అలాంటి ప్రచారాలతో ఆనందపడి సెలబ్రేట్ చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నారో తెలుపుతూ.. సుమారు 20కి పైగా పాయింట్లతో ఒక ట్వీట చేశారు.వర్మ తన ట్విటర్లో ఇలా షేర్ చేశారు..1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు..?3. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారట.4.ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.5.నాకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు ,నా వాళ్లకు అనుమానం కలిగింది.6. నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్గా ఉంటాను, చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.7. నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.9. BNS 336(4) ఏం చెబుతుందంటే.. ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్టును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. అయితే, నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? 10. BNS 353(2)తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం . అయితే, నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.11. BNS 356. (1)ఎవరైనా మాటల ద్వారా గానీ , రాతల ద్వారా గానీ , సంకేతాల ద్వారా గానీ , చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. ఇలాంటి మీమ్స్లపై పరువు నష్టం కేసులేస్తే రోజుకి లక్ష కేసులు కూడా దాటుతాయి.12. BNS 61(2)ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానంలో చద్దబద్దమైన ఫలితం పొందడం. అయితే, దీనితో నాపై ఉన్న కేసుకు లింక్ కెంటి..?13. BNS 196 వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం.14. SECTION 67 IT act ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించటం. Section 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. అయితే, ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది.. ?15. నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం , భారత రాజ్యాంగం ARTICLE 19(1)a ప్రకారం న్యాయబద్దమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.16. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్గా మాట్లాడగలగడం.. అదే విధంగా ఇతరుల నుంచి ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ ప్రధాన హక్కు, ఈ హక్కు ను నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను,భావాలను, ఉద్దేశాలను, శైలీని,ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లొ ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు… ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి.19. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే.. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసులోపలకి రాలేదు, నన్ను అరెస్టు చేయటానికి వచ్చాం అని కూడా చెప్పలేదు.20. ఇప్పుడూ మీడియాలో వస్తున్న కథనాలు… నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతిసారి మాదిరే హై డ్రామా క్రియేట్ చేసింది.21. నేను నా మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్కి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నామీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తీనీ లేక ఒక గ్రూప్నీ నిందించటం లేదు. కానీ, వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది.22. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను.ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews 1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024 -
'సారీ' చెప్తారా అనే ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిన వర్మ
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి వచ్చిన సమయం నుంచి ఏపీలో పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే, తాజాగా వర్మ పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కేసుల విషయంపై పలు సంచలన విషయాలను వెళ్లడించారు. ఇంతకీ వర్మను అరెస్ట్ చేసేందుకే పోలీసులు ఆయన డెన్కు వెళ్లారా..? కేసుల భయంతో వర్మ తప్పించుకున్నారా..? పారిపోయారా..? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.'సంవత్సర క్రితం నేను చేసిన పోస్ట్కు నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విషయంలో నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాలేదు. వర్మను అరెస్ట్ చేస్తున్నామని వారు కూడా ఇంతవరకు తెలపలేదు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు గేటు బయటే ఎందుకున్నారు. అరెస్ట్ చేయాలనుకున్నవారు లోపలికి రావచ్చు కదా.. కానీ, వాళ్లు రాలేదు. ఈ కేసుల వెనక ఎవరున్నారని తెలుసుకునేందుకే నేను కోర్టుకు వెళ్లాను. నేను బాగానే ఉన్నాను. అయితే, ఎలా ఉన్నానంటూ నా సన్నిహితులు చూపుతున్న సానుభూతి భరించలేకున్నా.' అని తనదైన స్టైల్లో ఆయన చెప్పారు.నేను ఎప్పుడో చేసిన పోస్ట్లపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు. నాపై కేసులు పెట్టిన ఆ తొమ్మిది మంది నా పోస్టులను ఇప్పుడే చూశారట. అందుకే కేసులు పెట్టారట. ఇది నమ్మే విషయమా..? నేను కేసులకు భయపడను ఐ డోంట్ కేర్. న్యాయవ్యవస్థ అంటే నాకు గౌరవం ఉంది.పోలీసుల మీదా నమ్మకం ఉంది. చట్ట ప్రకారం వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తా.' అని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా కేసులు విషయంలో సారీ ఏమైనా చెప్తారా..? అనే ప్రశ్నకు వర్మ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. కేసులు, ఏపీ రాజకీయ అంశాలపై వర్మ చెప్పిన సంచలన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. -
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్వర్మ మరో పిటిషన్
కేసుల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్పై ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనల్లో వర్మ పేర్కొన్నారు. ఒకే విషయంపై ఇన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఇకపై ఇదే పోస్ట్ విషయంలో కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరారు. ఆపై ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషనల్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.ఆంధ్రప్రదేశ్లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. -
నీటిలో తేలియాడే రాజధానా?
వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలు నెరవేరినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు. అలా కాకుంటే ప్రాంతాల మధ్య అసమా నతలు పెరిగిపోతాయి. అంటే పేదరికం, నిరుద్యోగం ప్రబలడం, పెత్తందారులు, బలవంతులు పేట్రేగిపోవడంజరుగు తుంది. దాని ఫలితంగా తీవ్రవాదం వైపు పీడితులు ఆకర్షితులు అవుతారు. అత్యంత వెనుకబడిన 1.59 కోట్ల జనాభా కలిగిన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చి సమా నాభివృద్ధి సాధించామని శాసనసభలో చెప్పడం సరికాదు. విభజన చట్టంలో పొందుపరచిన ఎయిమ్స్, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ,బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, హార్టికల్చర్ హబ్, హైకోర్టు, లా యూనివర్సిటీ, లా అకాడమీ, కియా లాంటి పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం వల్లనే రాయ లసీమ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం తదితర చర్యల ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికీ కృషి చేయాలి.అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఉమ్మడి సంప దను అన్ని ప్రాంతాలవారికీ సమానంగా పంచడం. అది భిక్ష కాదు. అభివృద్ధి ఫలాలు పొందడం ప్రతి పౌరుని హక్కు. ఇప్పటికే ఏడాదికి మూడు పంటలు పండుతూ అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అమరావతి నిర్మాణానికి ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు పెట్ట పూను కోవడం ఏ పాటి వికేంద్రీకరణో, ఎటువంటి న్యాయమో పాలకులే చెప్పాలి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని మేధావులు చెప్పినా వినకుండా ఒక వర్గం, కేవలం 29 గ్రామాల ప్రాంత ప్రయో జనాల కోసమే లక్ష కోట్లు ఖర్చు పెడతామని టీడీపీ ప్రభుత్వం అనడం సమంజసమేనా? 2014 నుండి 2019 వరకు 5,000 కోట్లు తాత్కాలిక నిర్మా ణాల కోసం చేసిన ఖర్చు నీటిపాలు అయ్యింది. నేడు మరలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి 15 వేల కోట్లు, హడ్కో నుంచి 12 వేల కోట్లు, ఇతర సంస్థల నుండి రుణాలు, బాండ్ల ద్వారా 23 వేల కోట్లు... మొత్తం 50 వేల కోట్లు అప్పులు చేసి, ఐదేళ్లలో ఖర్చు పెట్టాలని ప్రభుత్వం పూనుకుంది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు అనగా ఐదు నెలల కాలంలోనే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్లో నిధులు కేటా యించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీతో ఏడీబీ ద్వారా తీసుకుంటున్న 15 వేల కోట్ల రూపాయలలో కేవలం అమరావతి రక్షణ చర్య లకే... అంటే కొండవీటి వాగు, బుడమేరు వంక నీటి మళ్లింపు కాలువలు; కృష్ణా నది కరకట్ట, వివిధ రిజర్వాయర్ల నిర్మాణం, డైవర్షన్, డ్రైనేజీ కెనాల్స్, లిఫ్ట్ స్కీములకే రూ. 8000 కోట్లు ఖర్చు చేయాలని... అప్పు ఇచ్చే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిర్మాణ ప్రాంతాన్ని పడవలలో ప్రయాణం చేసి తనిఖీ చేసిన తర్వాత నిర్ణయించడాన్ని బట్టి అది ‘నేల మీద నిర్మించే రాజధాని కాదు, నీటి మీద నిర్మించే తేలియాడే (ఫ్లోటింగ్) రాజధాని’ అని అర్థమయిపోతుంది. రాష్ట్రంలో సువిశా లమైన భూములు ఉండి కూడా తేలి యాడే రాజధాని నగరాన్ని నిర్మించడం వెర్రితనం.కాబట్టి టెక్నాలజీకి మేమే ఆదిగురువులమని చెప్పుకునే కూటమి నాయకులు శాస్త్రీయ పద్ధతులలో ఆలో చన చేసి అమరావతిలో శాసనసభ,సచి వాలయం నిర్మాణాలకు పరిమిత మైతే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ఉండే విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, అనంతపురం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్ది, ఆదాయ వనరులుగా మార్చుకోవాలి. అప్పుడే సంపద సృష్టికి వీలుంటుంది. లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు చెబుతున్న 2047 విజన్ సాకారం కాక పోగా, రాష్ట్రం అప్పులపాలై తాకట్టు పెట్టే పరిస్థి తులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త!– కె.వి. రమణ ‘ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
AP: అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాయలసీమకు మోసం చేసే పనులు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనూహ్య విజయాలు అందించిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కర్నూలు నుంచి న్యాయవ్యవస్థకు చెందిన పలు కార్యాలయాలు, కడప నుంచి కేంద్ర ప్రబుత్వానికి చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు చర్యలు చేపట్టడం ఆ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. సీమ ప్రజల మనసులను గాయపరిచినట్లే. కర్నూలులో హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టింది. జ్యుడిషియల్ సిటీ నిర్మాణానికి సుమారు 273 ఎకరాల స్థలమూ కేటాయించింది. నేషనల్ లా యూనివర్శిటీ కోసం వంద ఎకరాలు ఇవ్వడమే కాకుండా రూ.వెయ్యి కోట్లు మంజూరు కూడా చేశారు. అయితే ఇప్పుడు వివిధ ఆఫీసులతోపాటు లా యూనివర్శిటీని కూడా తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అన్న సందేహం వస్తోంది. 201419 మధ్యకాలంలోనే అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్ను చంద్రబాబు అండ్ కో మంగళగిరి తరలించింది. తాజాగా పులివెందులలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరైన యాభై ఎంబీబీఎస్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వదులుకుంది. ఇవన్నీ ఆయన రాయలసీమకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నట్లుగానే చూడాలి. రాయలసీమ, ప్రత్యేకంగా కర్నూలు అన్నది ఒక సెంటిమెంట్. మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం అంతా భాగంగా ఉండేది. ఆ రోజులలో తెలుగు వారిని కూడా ఢిల్లీలో మదరాసీలు అనేవారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్షతో కోస్తా ప్రాంత నాయకులు ఇందుకోసం ప్రజలను సమీకరించడం ఆరంభించి పలు చోట్ల సభలను పెట్టేవారు. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని తలపెట్టారు. కానీ అప్పటికే కృష్ణా, గోదావరి నదులపై కొన్ని ప్రాజెక్టులు కోస్తాలో ఉండడం, తద్వారా రైతులు ఆర్థికంగా ముందంజలో ఉండటం తదితర కారణాలను చూపుతూ రాయలసీమ నేతలు పలు సందేహాలను లేవనెత్తారు. ఆ దశలో ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు తన శ్రీబాగ్ నివాసంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశం జరిపి ఒక అవగాహన కుదిరేందుకు కృషి చేశారు. అప్పుడు వివిధ అంశాలతో ఇరుప్రాంత నేతలు చేసుకున్న ఒప్పందమే శ్రీ బాగ్ ఒప్పందం. దాని ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలి. తదుపరి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ఆంధ్ర ఉద్యమం ఉదృతం అయింది. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో జవహర్ లాల్ ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించింది. ఆ సమయంలో ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ మళ్లీ ఏర్పడింది. గుంటూరువిజయవాడతో పాటు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి నగరాలపై ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. అప్పటికే తెలుగు వారంతా ఒక్కటి కావాలన్న భావన ఉండడంతో, భవిష్యత్తులో తెలంగాణతో కూడిన ఉమ్మడి ఏపీ ఏర్పాటైతే హైదరాబాద్ రాజధాని అవుతుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ దశలో సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలని, గుంటూరు వద్ద హైకోర్టు పెట్టాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారం కర్నూలులో శాసనసభను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరులో హైకోర్టు నిర్వహించారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ లోనే స్థాపితమయ్యాయి. అదృష్టమో, దురదృష్టమో అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి సాగుతూ వచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను ఆరంభించారు. దానికి రాజకీయ కారణాల కూడా తోడయ్యాయి.1969లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచింది.తదుపరి 1973 ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడే రాష్ట్రం విడిపోయి ఉంటే ఎలా ఉండేదో కాని, అప్పట్లో ఆరుసూత్రాల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. విశేషం ఏమిటంటే దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆరు జోన్ లు ఏర్పాడడం మినహా, మళ్లీ అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. సెంట్రల్ యూనివర్శిటీతో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ చుట్టూరానే ఏర్పాటయ్యాయి. అంతకుముందు వచ్చిన ఉక్కు ఉద్యమం కారణంగా విశాఖపట్నంలో స్టీల్ ప్యాక్టరీ మాత్రం వచ్చింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ కు వలస వెళ్లడం ఆరంభం అయింది. 2001నుంచి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రకరకాల రూపాలు దాల్చుతూ 2014 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యత వరకు వెళ్లింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల అధిక నష్టం జరిగింది సీమాంధ్ర ప్రాంతానికే అని అంతా అంగీకరిస్తుంటారు. అప్పుడు మళ్లీ రాజధాని సమస్య మొదటికి వచ్చింది. ఉమ్మడి హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉండాల్సి ఉన్నా, ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబు ప్రభుత్వం ఆకస్మికంగా ఏపీకి తరలివెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీబాగ్ ఒడంబడిక అంశం తిరిగి తెరపైకి వచ్చింది. విజయవాడగుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. అయినా అప్పట్లో ప్రభుత్వం అంగీకరించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేయడం, అక్కడే అన్ని ఆఫీస్ లు నెలకొల్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ,కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి గుర్తింపు తేవచ్చని అప్పటి ముఖ్యమంత్రి జగన్ భావించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. ఆ విషయంలో చట్టం కూడా చేయడానికి సంకల్పించినా తెలుగుదేశం పార్టీ పలు చిక్కులు కల్పించగలిగింది. దాంతో ఆ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, 2024 ఎన్నికల తర్వాత ఆ ప్రణాళిక అమలు చేయవచ్చని భావించింది. కానీ వైఎస్సార్సీపీ ఓటమిపాలై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విశాఖలో కార్యనిర్వవహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మంగళం పలికినట్లయింది. అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలకు పైగా సేకరించాలని తలపెట్టడం, తదితర అంశాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తొలుత వ్యతిరేకించినా, ఆ తర్వాత కాలంలో అవి తమ వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ అయితే రాయలసీమలో హైకోర్టుతోపాటు, సచివాలయం కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేక డిక్లరేషన్ కూడా ప్రకటించి, తదుపరి ప్లేట్ మార్చేసింది. జగన్ మాత్రం కర్నూలులో న్యాయ రాజధానిలో భాగంగా లోకాయుక్త, హెచ్ఆర్సీ, సీబై కోర్టు, లా యూనివర్శిటీ వంటివి కొన్నింటిని స్థాపించే ప్రయత్నం చేశారు. అమరావతిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఆఫీసుల ఏర్పాటుపై టీడీపీతోపాటు ఈనాడు, జ్యోతి వంటి మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే అమరావతితోపాటు విశాఖ, కర్నూలు లకు జగన్ ప్రాధాన్యత ఇస్తే, మూడు ప్రాంతాలలో వైఎస్సార్సీపీ పరాజయం చవిచూసింది. ఈవీఎంల మహిమో, ప్రజల ఓట్లో కారణం తెలియదు కాని టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, కర్నూలు నుంచి వివిధ ఆఫీసులకు రంగం సిద్ధమవుతూండటం జరిగిపోయింది. ఇప్పుడు రాయలసీమ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు దీనిపై బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నా, వారికి భయం పట్టుకుంటుంది. వైఎస్సార్సీపీ నేతలైతే కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆఫీసుల తరలింపుపై మండి పడుతున్నారు. లాయర్లు కూడా తమకు అన్యాయం జరుగుతోందని ప్రకటించి వారం రోజుల పాటు కోర్టుల బహిష్కరణ పాటించారు కూడా. ఈ ఆందోళనలు కాస్తా ఉద్యమరూపం దాల్చితే, మళ్లీ ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ స్టీల్ను రక్షిస్తామని చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే ఒకసారి విశాఖ నుంచి ఒక రైల్వే ఆఫీస్ ను విజయవాడకు తరలించాలని ప్రతిపాదనలు వస్తే ఆ ప్రాంత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. దాంతో అది ఆగింది. మరి ఇప్పుడు కర్నూలు నుంచి ఆఫీస్ లను తరలిస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో స్పందిస్తారో అప్పుడే చెప్పలేం. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి కేంద్రం రూ.250 కోట్లతో మంజూరు చేసిన కార్యాలయాన్ని కూడా తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇది కూడా రాయలసీమ వ్యతిరేక సెంటిమెంట్ కు దారి తీయవచ్చు. జగన్ కొప్పర్తి వద్ద పారిశ్రామికవాడను అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దానికి విఘాతం కలుగుతుందా అన్నది కొందరి అనుమానం. అమరావతిలో కొత్త సంస్థలను తీసుకు రాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలను అక్కడకు తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కూడా ఉంది. హైదరాబాద్ లో మాదిరి అన్నీ అమరావతిలోనే కేంద్రీకరిస్తే నష్టం జరుగుతుందేమోనన్న భయం కూడా లేకపోలేదు. అయినప్పటికి టీడీపీ ప్రభుత్వం కేంద్రీకరణవైపే మొగ్గు చూపుతోంది. పేరుకు విశాఖను ఆర్థిక రాజధానిని చేస్తామని అంటున్నా అదెలాగో ప్రభుత్వం వివరించలేకపోతోంది.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా, ఈలోగా లోకాయుక్త తదితర ఆఫీసులను తీసుకుపోవడం ఏమిటన్నది పలువురి ప్రశ్నగా ఉంది. అసాధారణ మాండేట్ వచ్చినందున తాము ఏమి చేసినా ఎదురు ఉండదని, రాయలసీమ ప్రజలు ఆందోళనలకు సిద్దమయ్యే పరిస్థితి లేదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. అలా ఆ ప్రాంత ప్రజలు ఎదిరించకపోతే కూటమికి ఇబ్బంది ఉండదు. కాని రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత చేతులు కాల్చుకోవడం కన్నా, ముందుగానే చంద్రబాబు నాయుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకుని దీనిపై నిర్ణయం చేస్తే మంచిదని చెప్పాలి. లేకుంటే ప్రాంతీయ విద్వేషాలు రాజుకునే ప్రమాదం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజయవాడ : ఉల్లాసంగా.. ఉత్సాహంగా..7వ అమరావతి బాలోత్సవం (ఫొటోలు)
-
Big Question: ఏపీకి శాపంగా అమరావతి.. కోస్తా, రాయలసీమకు ద్రోహం
-
అంతులేని.. అన్యాయం..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. చట్టసవరణ చేసి కర్నూలు నుంచి తరలించనున్నట్లు హైకోర్టుకు నివేదించి రాయలసీమకు మరోసారి అన్యాయం తలపెట్టింది. ఏడు దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పెద్దమనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.అందులో భాగంగానే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ కల సాకారం అవుతోందని అంతా భావించారు. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీబాగ్ ఒప్పందం బుట్టదాఖలు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం తర్వాత ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావం సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ కుదిరింది. దీని ప్రకారం పరిపాలన రాజధాని, హైకోర్టు ఏర్పాటులో ‘సీమ’కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన రాజధాని హైదరాబాద్లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉండగా ఒప్పందాన్ని వీడి అది కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను న్యాయవాదులు తిరస్కరించారు. లా వర్సిటీపై సందిగ్ధం.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. వైజాగ్లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నట్లు సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీని నిలిపివేస్తారా? లేదా రెండు చోట్లా నిరి్మస్తారా? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అమరావతి తెరపైకి వచి్చనందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కార్డు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. సీమ టీడీపీ నేతల మౌనవ్రతం.. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన కూటమి పారీ్టలకు చెందిన ప్రజాప్రతినిధులు సీమకు పదేపదే జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు సర్కారు తేల్చి చెప్పినా ఏ ఒక్క టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. అందరూ హైకోర్టు కావాలన్నవారేకర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమ’లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు వంద రోజులకుపైగా రిలే దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. ‘సీమ’ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ‘రాయలసీమ గర్జన’ పేరుతో కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమించారు.కొప్పర్తి కడుపుకొట్టి..వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచి్చంది. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొప్పర్తిలోని మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు సెపె్టంబర్లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక, అధికార వర్గాల సూచనను పెడచెవిన పెట్టింది.న్యాయ రాజధాని దిశగా వైఎస్ జగన్ అడుగులు2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘సీమ’కు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఇందులో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా ఏపీ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), రైల్వే అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యేవి. ఇందుకోసం కర్నూలులోజగన్నాథగట్టుపై జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం కేటాయించింది. ఇందులో 100 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో ‘సీమ’ వాసుల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. -
బాబు మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!. విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ.. ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటాలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ... ఆదాయాలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 13, 2024 -
బడ్జెట్లో మహిళలకు షాకిచ్చిన బాబు ప్రభుత్వం
అమరావతి, సాక్షి: మహిళకు బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇవాళ ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహాశక్తి పథకం కానరాకుండాపోయింది. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజాగా బాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు ఏడాదికి రూ. 18,000 ఆర్థిక సాయం ఉసేత్తకపోవటం గమనార్హం.తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేవలం రూ.2,491 కోట్లు కేటాయించారు. సూపర్ సిక్స్ హామీల్లో.. స్కూల్కి వెళ్లిన ప్రతి పిల్లాడికి రూ.15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రు. 10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నా.. కేవలం రూ.2,491 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. ఇక.. ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు జరిగింది. ప్రతి ఏటా రూ. 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు గత వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. అమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!చదవండి: ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు -
AP Budget 2024: కోతల బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్
AP Assembly Budget Sessions 2024మోసం.. దారుణ మోసంసూపర్ 6 తొలి హామీ కి నిధులు కేటాయించని చంద్రబాబు ప్రభుత్వంనిరుద్యోగులకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన ప్రభుత్వంబడ్జెట్ లో ప్రస్తావన లేని రూ. 3 వేలు నిరుద్యోగ భృతి20 లక్షల ఉద్యోగాలు లేదంటే ప్రతీ నిరుద్యోగికి 3 వేలు భృతి ఇస్తానని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన చంద్రబాబుబడ్జెట్ లో కానరాని మహిళలకు ఉచిత బస్ హామీఎన్నికల్లో గెలవగానే మహిళలకు ఉచిత బస్ హామీ అమలు చేస్తామన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ కోతల బడ్జెట్ఇటు వార్షిక, అటు వ్యవసాయ బడ్జెట్లో అన్నీ కోతలేవైఎస్ జగన్ హయాంలో అన్ని రంగాలకు ప్రోత్సాహం ఇప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మోసంబడ్జెట్ ప్రసంగాల్లోనూ వైఎస్సార్సీపీ పాలనపై అక్కసు వెల్లగక్కిన మంత్రులుఎన్నికల హామీల అమలు పేరుతో భారీగా లబ్ధిదారులకు కోత పెట్టే ప్రయత్నంఅందుకే పలు రంగాలకు సగం కంటే తక్కువ కేటాయింపులు!బడ్జెట్లో రైతులు, ఆడపడుచులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్ లో తల్లికి వందనం కి కేవలం 2,491 కోట్లు కేటాయింపుసూపర్ సిక్స్ హామీల్లో స్కూల్ కి వెళ్లిన ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తాం అన్న చంద్రబాబు10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్న..2,491 కోట్లు మాత్రమే కేటాయింపుఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే!గతంలో వై ఎస్ జగన్ ప్రభుత్వం లో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలుప్రతి ఏటా 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు జమ చేసిన వై ఎస్ జగన్ ప్రభుత్వంఅమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా స్పష్టత ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం మహిళకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంబడ్జెట్ లో కానరాని మహాశక్తి పథకం19 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో హామీప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబుబడ్జెట్ లో మహిళల కు ఏడాదికి 18,000 ఆర్థిక సాయం ఉసేత్తని ప్రభుత్వంఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలాప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ..ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు..అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు.వ్యవసాయ మార్కెటింగ్కు రూ.314.88 కోట్లు..పంటల బీమాకు రూ.1023 కోట్లు. -మంత్రి అచ్చెన్నాయుడు.ఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలారాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లుభూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు. ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లురైతులకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన ప్రభుత్వంరైతుల పెట్టుబడి సహాయం హామిపై చంద్రబాబు ప్రభుత్వం పల్టీలుకేంద్రం ఇచ్చే 6 వేలు తో కలిపి ఇస్తామంటూ మెలికటీడీపీ మేనిఫెస్టోలో రైతులకు 20 వేలు చొప్పున ఇస్తామని ప్రకటనకేవలం 4,500 కోట్లు మాత్రమే అన్నదాత సుఖీభవ కి కేటాయించిన ప్రభుత్వంఏపీలో పెట్టుబడి సహాయం కి 52 లక్షల మంది 10 వేల కోట్లకు పైగా అవసరంకేవలం 4,500 కోట్లు మాత్రమే కేటాయించి షాక్ ఇచ్చిన ప్రభుత్వంభారీగా లబ్ధిదారులకు కోత పెట్టనున్న ప్రభుత్వం👉 వ్యవసాయ బడ్జెట్ పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండిఅచ్చెన్న నోట అబద్ధాలువ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడురూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్జగన్ హయాంలో సాఫీగా సాగిన రైతు బీమాబడ్జెట్ టైంలో అచ్చెన్న నోట అబద్ధాలుగత ప్రభుత్వం రైతుల పంటలకు బీమా అందించలేదు: అచ్చెన్నవడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తాం: అచ్చెన్నమిగతా వాటిల్లో..ఏపీ రహదారులు రంగానికి రూ.9,554 కోట్ల కేటాయింపుపర్యాటక రంగానికి 322 కోట్ల కేటాయింపుపవన్ శాఖలకు భారీగా..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులుపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ 16.739 కోట్లుఅటవీ పర్యావరణ శాఖకు 687 కోట్లు👉: ఏపీ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండిబడ్జెట్లో అప్పు ఇలా..ఈ ఏడాది 91,443 కోట్లు ప్రజా అప్పులు చెయ్యాలని నిర్ణయంబడ్జెట్ లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం2 లక్షల 1 వెయ్యి కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా24,498 కోట్లు అప్పులు చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వంఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లుజలవనరులు రూ.16,705 కోట్లు..ఉన్నత విద్య రూ.2326 కోట్లు..పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..ఇంధన రంగం రూ.8,207 కోట్లు..పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.ఊహించినట్లే సాగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలువార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్2, 94, 427 కోట్ల తో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్రెవెన్యూ లోటు 34,743 కోట్లుద్రవ్య లోటు 68,742 కోట్లుగత ప్రభుత్వంపై ఆరోపణలతోనే ప్రసంగం మొదలుపెట్టిన పయ్యావులపతనం అంచున ఆర్థిక వ్యవస్థ : మంత్రి పయ్యావులవిభజన నాటి విషయాల ప్రస్తావన కూడాసమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలి : మంత్రి పయ్యావులశాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగింది : మంత్రి పయ్యావులరాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది : మంత్రి పయ్యావులగత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది.. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదు : మంత్రి పయ్యావులగత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసింది.. తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగింది: మంత్రి పయ్యావులరాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది : మంత్రి పయ్యావుల93 శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగింది : మంత్రి పయ్యావుల 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు10 నుంచి 15 రోజులపాటు సమావేశాలు సాగించే యోచనలో కూటమి ప్రభుత్వంసమావేశాలకు దూరంగా వైఎస్సార్సీపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రఅసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేది మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేది మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ -
ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు..
సాక్షి, విజయవాడ: ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్ బదిలీ కాగా.. వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి. హరిత బదిలీ అయ్యారు.తాజాగా బదిలీల ప్రకారం..ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్.పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలుస్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డికార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడువ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత -
ఏపీ రాజధాని అమరావతికి తప్పని వరద ముప్పు
-
రాజధాని అమరావతికి ముంపు తప్పదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. విస్తుపోతున్న అధికారులు, నిపుణులువరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. ⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. -
20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు 20 మంది పేర్లతో కూడిన బదిలీల ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమల రావు పేరిట శుక్రవారం విడుదలయ్యింది. బదిలీ అయిన ప్రాంతాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని ఆ డీఎస్పీలను ఆర్డర్ కాపీల్లో ఆదేశించారు.ఇదీ చదవండి: విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఓవరాక్షన్ -
చంద్రబాబూ.. ఇది మీరిచ్చిన వాగ్దానమే: వైఎస్ జగన్
అమరావతి: ఏపీలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక విద్యుత్ చార్జీలు పెంచడమేనా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లు కరెంట్ చార్జీలు పెంచమంటూ ఎన్నిలక ముందు ఇచ్చిన హామీ ఏమైందంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ‘ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా’ అంటూ చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియోను వైఎస్ జగన్ షేర్ చేశారు.తాము అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు. ఇదే విషయంపై నిన్న(ఆదివారం) చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ జగన్.. తాజాగా వీడియోను పోస్ట్ చేసి మరీ చంద్రబాబు మోసపూరిత విధానాన్ని బయటపెట్టారు. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా @ncbn pic.twitter.com/CriUf6Or4L— YS Jagan Mohan Reddy (@ysjagan) October 28, 2024కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా?: వైఎస్ జగన్ -
అమరావతి రైల్వే లైన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మాణం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమరావతి రైల్వేలైన్కు కేంద్రం ఆమోదం..
-
అమరావతి రైల్వేలైన్కు కేంద్రం ఆమోదం
సాక్షి, ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కృష్ణానదిపై 3.2 కిమీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రూ. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది. రాజధాని అమరావతికి హైదరాబాద్, చైన్నె, కోల్కోత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయనున్నారు.ఐదేళ్లలో రైల్వే లైన్ పూర్తిచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6798 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ల నిర్మాణం చేయనుంది. నర్కతీయ గంజ్-రాక్సౌల్-సీతా మరి-దర్భంగా-సీతా మరి-ముజఫర్పూర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేపట్టనున్నారు.ఇదీ చదవండి: బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా? -
29లోగా రఘురామను అరెస్టు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి దళితులను అవమానించడంతోపాటు ఎస్సీలను దూషించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదు చేసి ఈ నెల 29లోగా అరెస్ట్ చేయాలని మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయకపోతే ఈ నెల 30న రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లి రాజే‹Ù తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్బుక్’ పడగ -
అమరావతి మునగలేదన్నారు..! మరి వరద సాయమేంటి బాబూ?
సాక్షి, అమరావతి: ‘ప్రపంచంలో అద్భుతమైన రాజధాని అమరావతి వరదల్లో మునగలేదు. ఒక్క ఇల్లూ దెబ్బతినలేదు. గిట్టనివారు దు్రష్పచారం చేస్తున్నారు. రాజధాని మునిగిందని ఎవరైనా ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని ఇటీవల ఓ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన బహిరంగ ప్రకటన. కానీ, ఇదే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో ఏకంగా 1,039 మందికి రూ. 80.88 లక్షల పరిహారం అందించింది. మరి ఇదేమిటి? రాజధాని మునగలేదన్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ ప్రాంతంలోని వారికి సాయం చేయడమంటే మునిగిందనేది సుస్పష్టం. దాచుకున్నా దాగని పచ్చి నిజం. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు ఇళ్లు రెండు రోజులకు పైగా నీట మునిగాయని, ప్రజలు దుస్తులు, గృహోపకరణాలు కోల్పోయారని చెబుతూ ఈ ప్రాంత ప్రజలకు ఇటీవల ప్రభుత్వం పరిహారం అందించింది. వరద పరిహారం అందుకున్న గ్రామాల్లో ప్రస్తుతం శాసన సభ, సచివాలయం ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రకటించిన రాయపూడి కూడా ఉన్నాయి. తుళ్లూరు మండలంలో వరద నష్టాన్ని బట్టి ఒకొక్కరి ఖాతాలో రూ.5 వేల నుంచి రూ.19 వేల వరకు జమచేశారు. దాంతోపాటు బియ్యం, నిత్యావసరాలను కూడా అందించారు. వెలగపూడి, రాయపూడిల్లో తీవ్ర వరద నష్టం ఆగస్టు నెల చివరి వారం, సెపె్టంబర్లో కురిసిన వరుస వర్షాలు రాష్టంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయడంతో వరద అంతా విజయవాడ నగరంపై పడింది. దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పది రోజులకు పైగా ఇళ్లు నీటిలోనే ఉండిపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాలు కూడా మునిగిపోయినట్టు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం అసెంబ్లీ ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన రాయపూడి గ్రామాలు సైతం ఉన్నాయి. అమరావతిలో కీలకమైన ప్రాంతాలైన వెలగపూడి, రాయపూడి గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, 219 మంది నిరాశ్రయులయ్యారని అధికారులే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వీటితోపాటు మందడం, పెదపరిమి, తుళ్లూరు, మల్కాపురం, వెంకటాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, ఉద్దరాయనిపాలెం తదితర 11 గ్రామాలూ ఉన్నాయని చెప్పారు. ఆ గ్రామాల్లో పక్కా ఇళ్లు, కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్లు రెండు రోజులకు మించి నీటిలోనే మునిగిపోయాయని నివేదికలో పేర్కొన్నారు. చుట్టూ నీరు చేరడంతో ప్రజల జీవనోపాధి సైతం కోల్పోయారని నివేదికలో వివరించారు. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం రాజధానికి అసలు వరదే రాలేదని చెప్పారు. లంక ప్రజలకు అందని వరద సాయం తుళ్లూరు మండలంలో బుడమేరు, కృష్ణానదిని ఆనుకుని కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్దండరాయునిపాలెం లంక, రాయపూడి పెదలంక, హరిశ్చంద్రాపురం, బోరుపాలెంలోని కొన్ని నివాసాలు, లింగాయపాలెం, తాళ్లాయపాలెంలోనూ లంక గ్రామాలు ఉన్నాయి. వరద ఎక్కువగా రావడంతో ఈ లంకల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కానీ పరిహారం మాత్రం చాలా తక్కువ మందికి ఇచ్చారు. అమరావతికి మధ్యలో ఉన్న వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, మందడం, మల్కాపురం, వెంకటాయపాలెం పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక్కడి ప్రజల వార్షిక ఆదాయం రూ.10 వేలు, అంతకంటే తక్కువని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం లంక గ్రామాలను పక్కనపెట్టి, రాజధాని ప్రాంతం మధ్యలో ఉన్న గ్రామాల్లోని ప్రజల ఖాతాల్లో వరద నష్ట పరిహారం సొమ్ము జమ చేసింది. దుస్తులు, ఇంట్లో సామగ్రి పాడైపోయినందుకు రూ.5 వేలు, 10 రోజులు ఉపాధి కోల్పోయినందుకు రోజుకు రూ.300 చొప్పున ఇంట్లో ఇద్దరికి కలిపి రూ.6 వేలు, ఇల్లు నీటిలో మునిగిపోయినందుకు నష్ట తీవ్రతను బట్టి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించారు. విడ్డూరం ఏంటంటే పరిహారం పొందిన వారిలో ఏడేళ్ల పిల్లలు, దశాబ్దం క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయినవారు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నవారు సైతం ఉన్నారు. -
నాడు ఇంటింటికీ వలంటీర్లు.. నేడు పేదల బతుకులు నడిరోడ్డు పాలు
గత ఐదేళ్లు ఏ విపత్తు వచ్చినా... బాధితులు కాలు బయట పెట్టకుండానే ప్రభుత్వ సాయం అందింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ... వలంటీర్లు వెంటనే వచ్చి భరోసా కల్పించేవారు. కానీ... నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘రెడ్బుక్’ పాలనలో కనీసం బాధితుల నుంచి అర్జీలు కూడా స్వీకరించే నాథుడే కరువయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు వరద బాధితులు పరిహారం కోసం వార్డు సచివాలయం... తహసీల్దార్ కార్యాలయం... కలెక్టరేట్ చుట్టూ మండుటెండలో కాళ్లరిగేలా తిరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. చివరికి గురువారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతించలేదు. ఏకంగా కలెక్టరేట్ గేట్లు మూసేశారు. గేటు బయటే బాధితుల నుంచి సిబ్బంది, పోలీసులు అర్జీలు స్వీకరించారు. వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలతో వచి్చన బాధితులు విధిలేక మురుగు కాలువల పక్కన, ఫుట్పాత్లపైన కూర్చుని నరకయాతన అనుభవించారు. పనులు మానుకుని పరిహారం కోసం తిరుగుతున్నాం.. దయచేసి మా గోడు వినండి.. అంటూ బాధితులు వాపోతున్నారు. గత ఐదేళ్లు కాలు కదపకుండానే వలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ... కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు. – గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) -
దెందులూరు కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం కొల్లేరు లంక గ్రామం పైడి చింత పాడులో పెన్షన్ పంపిణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.జనసేన గ్రామ సర్పంచ్ ముంగర తిమోతిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గ్రామ సర్పంచిని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలు లేదంటూ సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గ్రామంలో తాము చెప్పింది జరగాలంటూ జనసేన సర్పంచిని బండబూతులు తిడుతూ పిడిగుద్దులు గుద్దారు. ఇరు పార్టీల నేతలు బాహబాహికి దిగటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొత్తులో ఉంటూ తమపై దాడి చేయడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అమరావతి రైతులకు ప్లాట్లు ఎలా?
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతుల నుంచి తీసుకున్న భూములకు తిరిగి వారికి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్లాట్ల అభివృద్ధికి రూ. వేల కోట్ల నిధులు అవసరం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో హామీ అమలుపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రాజధాని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 29 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలకు పైగా భూములు సేకరించారు. తీసుకున్న ఎకరాకు 1,450 గజాల చొప్పున ప్లాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ఇస్తామని గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఒప్పంద పత్రాలు ఇచ్చి0ది. ప్రస్తుతం మరో 4 వేల ఎకరాలు సేకరించాలన్న ఆలోచనతో రైతుల నుంచి సీఆర్డీఏ భూములు తీసుకుంటోంది. ఇటీవల అమరావతి పరిధిలోని 29 వేల ఎకరాల్లో రూ. 34 కోట్లతో సీఆర్డీఏ కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టింది. అయితే, ఈ పనులు పూర్తయ్యాక ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధికి దాదాపు రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని గతంలోనే అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు ఇంత మొత్తం నిధులు ఎలా సేకరించాలో.. పనులు ఎలా చేపట్టాలోనని సీఆర్డీఏ ఆందోళన చెందుతోంది. సీఆర్డీఏ అభివృద్ధి చేసే ప్లాట్లలో నివాస, కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. మాస్టర్ప్లాన్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఎస్టీపీలు, తాగునీరు సదుపాయాలు వంటివి కల్పించాలి. ప్లాట్లు పొందే రైతులకు ఇచ్చిన హామీ మేరకు వీటిని కల్పించాకే రైతులకు అప్పగించాలి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక అవసరం.మునిగే ప్లాట్లు రైతులు తీసుకుంటారా? ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ వర్షం, వరద నీరు ఈప్రాంతంలో నిలిచిపోయింది. ఇప్పుడున్నట్టుగా ప్లాట్లు వేస్తే భవిష్యత్లో ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ప్లాట్లన్నీ నీట మునగడం ఖాయం. ఇలా చేసినట్టయితే వాటిని రైతులు తీసుకునే పరిస్థితి లేదు. ఆయా ప్లాట్ల ప్రాంతాలను పూర్తిగా మట్టితో ఎత్తు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులన్నీ చేయడం ఇప్పుట్లో సాధ్యమయ్యే పని కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గతంలో సీఆర్డీఏ వేసిన అంచనా వ్యయమే రూ. 12 వేల కోట్లు దాటుతుండగా, ప్లాట్లు నీట మునగకుండా ఎత్తు చేయాలంటే రెట్టింపు నిధులు ఖర్చు చేయాల్సిందే. కానీ ప్రభుత్వం అంత మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. -
ఏపీలో 16 మంది ఐపీఎస్ల బదిలీ
విజయవాడ, సాక్షి: 16 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్పీ&ఎల్ ఐజీగా రవిప్రకాష్ఇంటిలిజెన్స్ ఐజీగా పీహెచ్.డి.రామకృష్ణఇంటిలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్పఅడ్మినిస్ట్రేషన్ డీఐజీగా అమ్మిరెడ్డిరోడ్ సేఫ్టీ డీఐజీగా సీహెచ్.విజయరావుడీజీపీ ఆఫీస్ ఏఐజీగా సిద్ధార్ధ్ కౌశల్విశాఖ సిటీ డీసీపీగా మేరీ ప్రశాంతిఅనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాకాకినాడ మూడవ బెటాలియన్ కమాండెంట్గా ఎం.దీపికఒంగోలు పీటీసీ ప్రిన్సిపల్గా జి.ఆర్.రాధికఇంటిలిజెన్స్ సెక్యూరిటీ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్పీటీవో ఎస్పీగా కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డివిజయవాడ క్రైమ్ డీసీపీగా తిరుమలేశ్వర్ రెడ్డిడీజీపీ హెడ్ క్వార్టర్స్ కు అట్టాడ బాపూజీ ,కె.వి.శ్రీనివాసరావు అటాచ్ మెంట్👉చదవండి : 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్ -
వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరోమారు కక్ష సాధింపు
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరో మారు కక్షసాధింపుకు దిగారు. జిల్లాలోని కొప్పర్తి సెజ్లో కేంద్రం కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి తీసుకెళ్లారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొప్పర్తి నార్త్ బ్లాక్లో 19.5 ఎకరాల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ప్రభుత్వం మారగానే కొప్పర్తికి మంజూరైన టెక్నాలజీ సెంటర్ను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకెళ్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. టెక్నాలజీ పార్క్ వల్ల యువతకు స్కిల్ ట్రైనింగ్, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాలు అందాల్సి ఉంది. కానీ చంద్రబాబు కడప యువత అవకాశాలను దెబ్బతీస్తూ జీవో నంబర్ 56ను విడుదల చేశారు. చదవండి : తిరుమల లడ్డు వివాదం : సిట్తో నిజాలు నిగ్గు తేల్చలేం -
100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన అంతా మోసమేనని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదంటూ విమర్శించారు వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయన్నారు. గోరు ముద్దు గాలికి ఎగిరిపోయిందని, ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకూ వసతి దీవెన, విద్యా దీవెను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడరని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. శుక్రవారం( సెప్టెంబర్ 20) తాడేపల్లిలో ప్రెస్మీట్ నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబు 100 రోజుల పాలనను తూర్పారబట్టారు. ఇదీ చదవండి : చంద్రబాబు ‘లడ్డూ’ పాలిటిక్స్పై .. వైఎస్ జగన్ రియాక్షన్ప్రెస్మీట్లో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. స్టిక్కర్లు వేస్తారట! ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలు, ఆ తర్వాత చేసిన మోసం. తన 100 రోజుల పరిపాలన మీద తనది మంచి ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.ప్రతి ఇంటికి సచివాలయాల సిబ్బంది వెళ్లి ఆ స్టిక్కర్లు అతికించాలంట.సూపర్ సిక్స్ లేదు. సెవెన్ లేదు నిజానికి ఈ 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ అబద్ధాల మూటలు. దీంతో ఆయన ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు.ఎన్నికల ముందు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఎలా ప్రచారం చేశారు? ఇంటింటికి వెళ్లి పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, మహిళలు కనిపిస్తే నీకు ఏటా రూ.18 వేలు అని, రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అంటూ.. ప్రతి ఇంటికి వెళ్లి, దుర్మార్గంగా ప్రచారం చేసి నమ్మించారు.ఈ 100 రోజుల్లో చంద్రబాబు చేసింది ఏమిటంటే.. మోసం మోసం.మొత్తం తిరోగమనం ఒకవైపున దారుణ పరిపాలన. మరోవైపు అన్ని రంగాల్లో తిరోగమనం. పిల్లలకు మూడు క్వార్టర్ల నుంచి విద్యాదీవెన అందడం లేదు. వసతి దీవెన కూడా లేదు.పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నారు. వారికి కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు.బడులన్నీ నిర్వీర్యం అయ్యాయి. గోరుముద్ద పోయింది. టోఫెల్ శిక్షణ లేదు. ఇంగ్లిష్ మీడియమ్నూ నీరు గారుస్తున్నారు.వైద్య రంగం కూడా నాశనమై పోతోంది. ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి 108, 104 సర్వీసుల సిబ్బందికి జీతాలు లేవు.ప్రభుత్వం కడుతున్న కొత్త మెడికల్ కాలేజీలను, స్కామ్లు చేస్తూ, ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి.చంద్రబాబు హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తానని మోసం చేశాడు. చివరకు మా హయాంలో ఇచ్చిన రూ.13,500 కూడా లేకుండా పోయాయి.ఉచిత పంటల బీమా లేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయింది. ఎరువులు, విత్తనాల కోసం రైతుల క్యూలు కనిపిస్తున్నాయి.ఏ రంగం చూసినా తిరోగమనమే.మా హయాంలో అన్నీ డోర్ డెలివరీ. ఇప్పుడన్నీ పోయాయి. ఎక్కడా పారదర్శకత లేదు.జన్మభూమి కమిటీలు వస్తున్నాయి. పెన్షన్ కోసం కూడా వారి ఇంటికే వెళ్లాలట.రెడ్ బుక్ పాలన. శాంతి భద్రతలు క్షీణించాయి.న్యాయానికి పాతర వేశారు. ధర్మానికి రక్షణ లేదు. ఆస్తులకు రక్షణ లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. వేధిస్తున్నారు.అన్నింటా ౖడైవర్షన్ పాలిటిక్స్రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన మీద మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, అదే రోజు మదనపల్లెలో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే, దాన్ని సెన్సేషన్ చేసి, ఉన్నతాధికారులను ఛాపర్లో పంపించారు. ఆ ఘటన వెనక మా కుట్ర ఉందని దుష్ప్రచారం చేశారు.స్కూళ్లు, కాలేజీలు, గురుకుల విద్యా సంస్థల్లో ఆహారం బాగాలేదని విద్యార్థులు ఆందోళనకు దిగితే.. దాన్ని డైవర్ట్ చేసే విధంగా చంద్రబాబు తొలిసారి సీఎం అయి, 30 ఏళ్లు అయిందంటూ వేడుకలు.స్కిల్ స్కామ్లో తనను అరెస్టు చేశారని, తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఉన్న ఈనాడు గ్రూప్వాళ్ల, మార్గదర్శి నేరాలు బయట పెట్టడంతో.. ముంబై సినీ నటి జత్వానీని తీసుకొచ్చారు.ఆమెతో తప్పుడు ఫిర్యాదు చేయించి, అధికారులను వేధిస్తున్నారు.ఇక విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని, తుపాన్ వస్తుందని తెలిసినా, బుడమేరు గేట్లు ఎత్తుతారని ముందుగా తెలిసినా, కనీసం రివ్యూ చేయలేదు. ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయలేదు. కానీ చంద్రబాబు అవేవీ చేయకపోవడం వల్ల విజయవాడ మునిగింది. అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు కాల్వ కూడా వరద కూడా గ్రామాలను ముంచెత్తింది.ఇలా అన్నింటా చంద్రబాబు ఫెయిల్ కావడంతో, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చాలని కుట్ర చేసినట్లు ఆరోపణలు, దారుణ విమర్శలు చేశారు.నిజానికి ఆ బోట్లు చంద్రబాబు పార్టీ వారివి. నది నుంచి ఇసుక అక్రమంగా తరలించడం కోసం ఏర్పాటు చేసినవి. అవి వరదకు కొట్టుకొచ్చాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే చర్యలు ముమ్మరం కావడంతో, డైవర్షన్ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు.మరో దారుణ డైవర్షన్ కుట్ర..కోట్లాది భక్తుల మనోభావాలతో ఆటఇప్పుడు చంద్రబాబు 100 రోజుల పాలన. వైఫల్యం అన్నీ వెలుగులోకి రావడంతో.. మరో డైవర్షన్.తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారంటూ, మాపై ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు.ప్రజలు సూçపర్సిక్స్ హామీలపై నిలదీస్తారన్న భయంతో, దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. రాజకీయాల కోసం చివరకు దేవుణ్ని కూడా చంద్రబాబు వదలడం లేదు.చంద్రబాబు ఎంత దారుణ విమర్శ చేశారంటే.. తిరుపతి లడ్డూ తయారీలో నాసి రకం నెయ్యి, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారని అన్నారు.సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది మనో భావాలతో ఆడుకోవడం ధర్మమేనా?నెయ్యి, సరుకుల సేకరణలో పక్కా వ్యవస్థనిజానికి నెయ్యి సేకరణ ఎలా జరుగుతుంది? దాని విధివిధానాలు ఏమిటి? అందరూ తెలుసుకోవాలి.తిరుమలలో నెయ్యి సేకరణ రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి ఆరు నెలలకు టెండర్లు పిలుస్తారు. కంపెనీలు కోట్ చేస్తాయి. ఎల్–1గా ఎవరు ఉంటే, బోర్డు దాన్ని ఆమోదిస్తుంది.ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. కొత్తగా నియమాలు ఎవరూ మార్చలేదు.ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూకి ఎంత ప్రాశస్త్యం ఉందో అందరికీ తెలుసు. దాని కోసం వస్తువుల సేకరణ ఎప్పుడూ రొటీన్గా, పక్కా పద్ధతిలో జరుగుతుంది.మెటేరియల్ ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు, వారు ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్) సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి.అలా దాంతో వచ్చిన ట్యాంకర్ నుంచి మూడు శాంపిల్స్ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే, ఆ ఇంగ్రేడియంట్స్ కానీ, నెయ్యిని కానీ వాడడానికి ఆ ట్యాంకర్ను, వాహనాన్ని ముందుకు పంపిస్తారు. మూడు శాంపిల్స్లో పక్కాగా క్వాలిటీ తేలితేనే వాడుతారు. లేకపోతే వెనక్కు పంపిస్తారు.మరి అలాంటప్పుడు కల్తీ నెయ్యి వాడారని, నాసి రకం సరుకులు వాడారని చెప్పడం అబద్ధం కాదా? అది ధర్మమేనా? న్యాయమేనా?టీటీడీలో మూడు టెస్టులునెయ్యి, ఇతర సరుకులు సరఫరా చేసేవాళ్లు ఎన్ఏబీఎల్ నుంచి సర్టిఫికెట్ తేవడంతో పాటు, టీటీడీలో చేసే మూడు టెస్టులు పాస్ అయితేనే.. వాటిని టీటీడీ వాడుతుంది.ఇది కొత్తగా వచ్చిన నియమం కాదు.2014–19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు ఇలా నెయ్యి, ఇతర సరుకులను వెనక్కు పంపారు.ఆ తర్వాత 2019–24 మధ్య కూడా 18 సార్లు ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఎందుకంటే క్వాలిటీ టెస్టులో మంచి రిపోర్టు రాలేదు.అంటే తిరుమలలో ఇలా ఒక గొప్ప వ్యవస్థ, పద్ధతి, సంప్రదాయం ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, ఇలా పచ్చి అబద్ధాలు చెప్పడం దారుణం.అంత పచ్చిగా మాట్లాడడం ధర్మమేనా?తిరుమలలో కల్తీ నెయ్యి వాడారని, దాంతో లడ్డూలు తయారు చేశారని, ఆ లడ్డూలు ప్రజలు తిన్నారని చెప్పడం ఎంత దారుణం.ఈ రిపోర్టులు ఎవరి హయాంలోనివి?ఇక్కడ మరో విషయం చెప్పాలి.ఇప్పుడు రిపోర్టు వచ్చిన శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? చంద్రబాబు సీఎంగా జూన్ 12న ప్రమాణస్వీకారం చేస్తే.. ఒక ట్యాంకర్ వస్తే, జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు.మూడు టెస్టుల తర్వాత, రిపోర్టులు బాగా రాలేదు కాబట్టి, ఆ శాంపిల్స్ను జూలై 17న ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)కి పంపిస్తే.. వారు జూలై 23న నివేదిక ఇచ్చారు.ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?మరి ఆరోజు నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు? 2 నెలల నుంచి ఏం చేశారు? ఆ నివేదిక ఎందుకు దాచి పెట్టారు?.చంద్రబాబు 100 రోజుల పాలన తర్వాత, సూపర్సిక్స్ గురించి ప్రజలు నిలదీస్తుండడంతో, ప్రజల దృష్టి మరల్చేందుకు, రెండు నెలల తర్వాత, ఆ రిపోర్టులోని అంశాలు ప్రస్తావించి.. దాన్ని వక్రభాష్యం చేస్తూ.. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. ఇది ధర్మమేనా?ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..– ఈ రిపోర్టులో ఏం కనిపిస్తోంది? స్టాండర్డ్ (ఎస్) వాల్యూ ఉండాలి. కానీ డీవియేషన్ ఉంది. అలా ఉంటే శాంపిల్ కంటెయిన్ ఫారిన్ ఫ్యాట్.. అంటే ఏమేం ఉండే వీలుందన్న అవకాశాలతో ఉన్న నివేదికను చదివి వినిపించారు.– ఏదైనా కానీ, ఒక రొబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉన్నందుకు గర్వపడాలి. అక్కడి ప్రాక్టీసెస్ ఎంత గొప్పవో చెప్పాలి. అందరికీ వివరించాలి.– కానీ, మనం ఏం చేస్తున్నాం? అక్కడ పక్కాగా ఒక వ్యవస్థ ఉన్నా.. ఇలా పచ్చిగా అబద్ధాలు చెప్పడం దారుణం.స్వామివారిని అభాసు పాల్జేస్తున్నారు– నెయ్యిలో నాణ్యత ఉంటేనే ట్యాంకర్ను అనుమతించే ఒక పక్కా వ్యవస్థ ఉన్నప్పుడు, మనమేం చేస్తున్నాం.. అబద్ధాలకు రెక్కలు కడుతున్నాం.కల్తీ నెయ్యి వాడారు. లడ్డూలు తయారు చేశారు. భక్తులకు ఇచ్చారు. వారు వాటిని తిన్నారని ప్రచారం చేస్తున్నారు.– అంటే మన గుడి, మన వెంకటేశ్వరస్వామిని అభాసుపాలు చేస్తున్నారు.– ఇంతకంటే దారుణ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ప్రజలు ఆలోచించాలి.మరి వారెందుకు ఇవ్వలేదు?– వారు చేస్తున్న మరో ఆరోపణ. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కెఎంఎఫ్)కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఇవ్వలేదంటున్నారు.– ఎవరైనా టెండర్ వేయొచ్చు. ఎల్–1 కు కాంట్రాక్ట్ ఇస్తారు. ఇది పద్ధతి.– సరే, మరి ఇప్పుడు ఆ బ్రాండ్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు కదా.. మరి వారి పాలనలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్కు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు?టీడీపీ ఆఫీస్లో ఎలా రిలీజ్ చేస్తారు?– మరో ఆశ్చర్యకరమైన విషయం. ఎన్డీడీబీ రిపోర్టును టీటీడీ ఆఫీస్లో ఎలా రిలీజ్ చేస్తారు. – అది కూడా చంద్రబాబు 100 రోజుల పాలన మంచి అంటూ ప్రకటనలు ఇచ్చిన రోజున. ఈ పద్ధతి ఎక్కడైనా ఉందా?నిజానికి మా ప్రభుత్వ హయాంలో టీటీడీలో చాలా మార్పులు తీసుకొచ్చాం.– టీటీడీలో ఉన్న ల్యాబ్ను సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్సి్టట్యూట్) సహకారంతో ఆధునీకరించాం. అక్కడి నుంచి నిపుణులను కూడా తీసుకొచ్చాం.– మాకు మంత్రివర్గం కూర్పు చాలా ఈజీ. కానీ టీటీడీ బోర్డులో పదవి కోసం కేంద్ర మంత్రులు మొదలు, పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా సిఫార్సు చేస్తారు. ఆ స్థాయిలో ప్రసిద్ధులను బోర్డులో నియమిస్తారు.– అలాంటి వారు ఈ కాంట్రాక్ట్లను ఆమోదిస్తారు.– అంత మంచి విధానం, వ్యవస్థ, దేవుడికి సేవ చేయాలన్న తపన ఉన్న వాళ్లు బోర్డులో ఉంటారు.– బోర్డు ఛైర్మన్గా పని చేసిన వారి గురించి చెప్పాలంటే.. వైవీ సుబ్బారెడ్డిగారు ఏకంగా 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్నారు. అంత భక్తి ఆయనది.– అదే విధంగా కరుణాకర్రెడ్డిగారు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా విలువలు ఉన్న వారు.– తిరుపతి తిరుమలలో అంత మంచి వ్యవస్థ ఉంటే.. అక్కడా బురద చల్లుతూ దేవుణ్ని కూడా రాజకీయం చేయడం కేవలం చంద్రబాబుకే సాధ్యం.– అది మన దౌర్భాగ్యం.మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో అనేక మంచి కార్యక్రమాలు, పనులు జరిగాయి.– నవనీత సేవలు మొదలుపెట్టాం. అంటే కొండమీద గోశాల ఏర్పాటు చేసి, సొంతంగా పాలు, వెన్న తయారీ మొదలుపెట్టాం.– ప్రసాదాలు తయారు చేసే పోటులో కార్మికుల సర్వీస్ క్రమబద్థీకరించాం. వారి జీతాలు రెట్టింపు చేశాం.– దేశవ్యాప్తంగా అనేకచోట్ల జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించాం.– హైదరాబాద్తో సహా, దేశంలోని పలు చోట్ల, చివరకు అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయాలు కట్టింది వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.– టీటీడీలో 9 వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా మా ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబు తన పాలనలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు.– మఠాధిపతులతో మూడు విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మా హయాంలోనే. రెండుసార్లు నాన్నగారి హయాంలో జరిగితే, ఒకసారి మా హయాంలో నిర్వహించాం.– టీటీడీలో ఏదైనా మంచి జరిగింది అంటే.. ఆనాడు వైయస్సార్గారి హయాంలో, ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలోనే. ఇది వాస్తవం.ప్రధానికి, సీజేఐకి లేఖలు రాస్తాం– మన రాష్ట్ర పరువును, శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయ పరువును బజారుకీడుస్తున్న చంద్రబాబు వైఖరిని అందరూ గుర్తించాలి.– చంద్రబాబు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం, దురుద్దేశంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం ధర్మమేనా?– అందుకే దానికి చంద్రబాబుకు అక్షింతలు వేయాలని చెప్పి.. ప్రధానమంత్రితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కూడా లేఖలు రాస్తాను.నిజమా? కాదా? బేరీజు వేసుకొండి– ఎంత దారుణం. మంచి చేసి ప్రజల మన్ననలు పొందాలి.– కానీ ఇదెంత వరకు ధర్మం?. ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్దాన్ని అమ్మడం. ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద చల్లడం? ఎంత వరకు న్యాయం?.– నేను ఇప్పటి వరకు చెప్పినవి నిజమా? అబద్ధమా? అని మీరే వెరిఫై చేసుకొండి. – నా ప్రతి మాట నిజం. వాస్తవం. ప్రతిదీ లాజిక్గా చెబుతున్నాను. ఇవన్నీ నేను చెప్పక ముందు, వారు చేసిన దుష్ప్రచారం. చెప్పిన అబద్ధాలు.. అన్నీ బేరీజు వేసుకొండి. తేడా మీరే గమనించండి.– రాజకీయాల కోసం ఇంతగా దిగజారడం ధర్మమేనా? న్యాయమేనా? రాజకీయాలు చేయాలంటే నేరుగా చేద్దాం.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం– మెడికల్ కాలేజీలపై ఇప్పటికే రూ.2400 కోట్లకు పైగా ఖర్చు చేశాం. 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 5 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభమై ఉండేది. మనం కట్టిన బిల్డింగ్లు వారికి చూపెడితే సరిపోయేది.– అన్ని పనులు జరిగిన కాలేజీలను ఏకంగా ప్రైవేటుపరం చేయాలనుకోవడం ఎంత వరకు సబబు? అది ధర్మమేనా? న్యాయమేనా?– ఒక మెడికల్ కాలేజీ వస్తే, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా వస్తుంది. దాని వల్ల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి.– అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ సేవలు అందుబాటులోకి వస్తే, పోటీ తత్వం ఏర్పడి, ప్రైవేటు ఆస్పత్రులు కూడా రేట్లు తగ్గిస్తాయి.– మరోవైపు మెడికల్ సీట్లు పెరుగుతాయి. పిల్లలు ఇచ్చే ఫీజు, అక్కడే ఖర్చు చేస్తారు.బీజేపీ కూడా గుర్తించాలి– మన ఖర్మ ఏమిటంటే.. బీజేపీ నాయకులకు పూర్తి సమాచారం లేకపోవచ్చు. వాస్తవాలు తెలియకపోవచ్చు.– చంద్రబాబు పచ్చి అబద్ధాలు, మోసాల వ్యక్తి.– టీటీడీ బోర్డులో బీజేపీకి చెందిన వారు కూడా ఉన్నారు కదా? వారిని ఈ ప్రొసీజర్ గురించి తెలుసుకోమనండి. అప్పుడు వారు చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టాలి. – వారిలో సిన్సియారిటీ ఉంటే, చంద్రబాబుకు అక్షింతలు వేయాలి. ఇది ధర్మమేనా? అని అడగాలి.భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు– విషయం తెలియని వారికి భావోద్వేగాలు పెరుగుతాయి. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.– భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? మీరే చెప్పండి.– చంద్రబాబు అనే వ్యక్తికి దేవుడి మీద భక్తి ఉండదు. దేవుణ్ని కూడా రాజకీయాల కోసం వినియోగించుకునే అత్యంత హీనమైన మనసున్న వ్యక్తి. – ఆ మనిషికి ఏనాడూ భక్తి ఉండదు. ఎక్కడైనా చెడు జరిగితే, కేవలం ఆయన హయాంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేదు. -
రాజధాని ఏర్పాటుపై బాబు వ్యూహాత్మకంగా లింకులు
-
శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా .. చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సవాల్
-
రాజధాని ఏర్పాటుపై బాబు వ్యూహాత్మకంగా లింకులు
-
మంత్రి, మాజీ ఐఏఎస్, ప్రపంచ బ్యాంకులకూ బుద్ధీ జ్ఞానం లేవా బాబూ?
‘అమరావతి మునిగిపోతోందని చెబుతున్న వాళ్లు బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆగ్రహంతో రగిలిపోతూ అన్నమాటలివి. చంద్రబాబు మనసులో తాను వైఎస్సార్సీపీని విమర్శిస్తున్నానని అనుకుని ఉంటారేమోగానీ.. వాస్తవానికి ఈ విమర్శ నేరుగా తగిలేది ఆయన మంత్రివర్గ సహచరుడు పి.నారాయణకే. ఎందుకంటే.. వరదొస్తే అమరావతి మునిగిపోతుందని, రాజధాని నగర నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది ఈ నారాయణ గారే. ఈ విషయాన్ని బుద్ధీ, జ్ఞానం లేకుండా మంత్రి బయటపట్టేశాడన్న కోపం బాబుకు ఉండి ఉండవచ్చు. కానీ నారాయణతో తనకున్న ఆర్థిక సంబంధాలు, ఇతర కారణాల రీత్యా నేరుగా ఏమీ అనలేక నెపాన్ని వైఎస్సార్సీపీపైకి నెట్టినట్టు కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి పాపం చంద్రబాబు బాధ అర్థం చేసుకోదగ్గదే. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్గా రాజధాని నిర్మాణాన్ని మార్చేసి తన వారికి మేలు చేయాలన్న ‘విజన్’కు గండి పడేలా ఎవరు మాట్లాడినా కోపం రాకపోతుందా మరి! వరదలొస్తే అమరావతి ప్రాంతం మొత్తం నీట మునుగుతుందన్నది బాబు ఆత్మకూ తెలిసిన విషయమే. కానీ మనసు చెప్పినట్లు నడుచుకునే నైజం బాబుది కాదు కాబట్టి... అమరావతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒంటికాలిపై లేస్తూంటారు. ‘‘నాలుకలు కత్తిరించాలి’’ అనబోయి తమాయించుకుని తాళాలు వేయాలని సెలవిచ్చారు. అయితే నోళ్లకు తాళాలు వేయాలన్నది నానుడి. నాలుకలకు కాదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసన భారీ వర్షాలకు అమరావతిలోని అనేక ప్రాంతాలు మునిగిపోయినట్లు స్పష్టంగా ఫొటోలూ, కథనాలు వచ్చాయి. అంతెందుకు.. చంద్రబాబు కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీరు వచ్చిన సంగతి ఆయనకు తెలియకుండానైతే ఉండదు. కరకట్ట నివాసానికి దగ్గర్లోనే ఉండే ప్రకృతి చికిత్స కేంద్రంలోకి పెద్ద ఎత్తున కృష్ణా నది వరద నీరు చేరడం కూడా అందరి కళ్లెదుట జరిగిన ఘటనే. బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు అకస్మాత్తుగా ఎత్తేసి నీరంతా వదిలేయడంతో విజయవాడ మునిగింది కానీ లేదంటే బుడమేరు వరద నీరు మొత్తం కృష్ణలోకి చేరి అమరావతి ప్రాంతంలో వరదనీటి మట్టం మరింత ఎక్కువగా ఉండేది. అయినా... ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని విస్పష్టంగా చెప్పినా... వాళ్లక్కూడా బుద్ధీ, జ్ఞానం లేదని చంద్రబాబు చెప్పదలిచారా? 201419 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణ రావు వంటి ఐఏఎస్ అధికారి కూడా ఒక ఇంటర్వ్యూలో అమరావతిలోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయని స్పష్టంగా చెప్పారు. ఎగువన భారీ వర్షాలు కురవలేదు కనుక గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు, ఇతర వాగుల నుంచి వరద ఎక్కువగా లేదని, కృష్ణకు వచ్చిన 11 లక్షల క్యూసెక్కుల వరదకు తోడు కొండవీటి వాగుకూ వరద వచ్చి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆయన వివరించారు కూడా. నిజంగా అలాంటి పరిస్థితే వచ్చి ఉంటే వరదను కృష్ణా నదిలోకి మళ్లించడమూ సాధ్యమయ్యేది కాదని.. ఫలితంగా అమరావతి ప్రాంతం మరింత జలమయమయ్యేదని కృష్ణారావు ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి అన్న విషయంపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరముందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అమరావతి ప్రాంతంలో సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని యోచించిన భూమికి కూడా వరద ముప్పు ఉందని ఆయన తెలిపారు. ఇలా చెప్పినందుకు ఐవైఆర్ కృష్ణారావుకు కూడా బుద్ది లేదని అంటే ధర్మంగా ఉంటుందా? అమరావతిపై అనేక కోణాలలో అవగాహన కలిగిన కృష్ణారావు వంటివారు ఏపీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడతారే తప్ప రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ఆశించి కాదని అందరికి తెలుసు. ‘‘తా వలచింది రంభ.. తా మునిగింది గంగ’’ అన్నట్లు, చంద్రబాబుకు ఇష్టమైనది కనుక అమరావతి గురించి అంతా ఆహా, ఓహో అని పొగడాలని ఆయన కోరుకుంటు ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నోళ్లకు తాళాలు వేయడం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు. ‘‘నీళ్లు కిందకు ప్రవహిస్తాయని ఆకాశంలో కట్టుకుంటామా!’’ అని బాబు వ్యాఖ్యానించడమే కాకుండా... ఏ మహా నగరం మునగలేదో చెప్పాలని విచిత్ర, వితండ వాదానికి దిగడం ఆయనకే చెల్లింది. అమరావతికి మల్లే కర్నూలు, బెంగళూరు, ముంబై వంటి నగరాలను లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టలేదు. కాలక్రమంలో అవి ఎదుగుతూ మహా నగరాలయ్యాయి. కొన్ని సమస్యలూ వచ్చి ఉండవచ్చు. కాదనలేము. కానీ లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ముంపు ప్రాంతంలో రాజధానిని కట్టాలన్న బాబు మంకుపట్టుతోనే వస్తోంది సమస్య మొత్తం! మూడు పంటలు పండే ప్రదేశాన్ని ధ్వంసం చేయవద్దని గతంలోనే శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పినా వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది చంద్రబాబు కాదా? పోనీ నాగార్జున యూనివర్శిటి సమీపంలో జాతీయ రహాదారికి రెండో వైపులా అందుబాటులో ఉన్న రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించినా ఈ రచ్చ ఈ స్థాయికి చేరేది కాదు. అమరావతి సంక్షోభానికి చంద్రబాబే కారణం కనుక, ఆ విషయం బయటపడకుండా ఎదుటివారిపై ,ముఖ్యంగా వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ డబాయిస్తుంటారు. తెలుగుదేశంతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలు అమరావతి మునగలేదని అబద్దపు ప్రచారం చేసినా, ప్రజలకు అక్కడ ఏమి జరిగిందో సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాలు మునిగాయి కనుక అమరావతి మునిగినా ఫర్వాలేదని ముఖ్యమంత్రి స్థాయిలోని వారు చెప్పవచ్చా? అక్కడ భూమి స్వతహాగా భారీ నిర్మాణాలకు అనువు కాదని 201419 హయాంలోనే తెలిసినా మొండిగా ముందుకు వెళ్లడం వల్ల ఏపీకి ఎంత ప్రయోజనమో తెలియదు. ఒక వైపు తాము ఇచ్చిన హామీల అమలుకు అసలు డబ్బులు లేవని, ఖజానా ఖాళీగా ఉందని చెబుతూ, మరో వైపు వేల కోట్లు అమరావతిలో వెచ్చిస్తామని అనడంలో తర్కమూ కనిపించదు. తొలి దశలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు. అంత డబ్బు ఎలా సమకూరుతుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అసలు ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని, పైసా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయవలసిన అవసరం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక చిన్న ప్రాంతంలో ఖర్చు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా రూ.10 15 వేల కోట్ల అప్పు ఆర్ధిక సంస్థల ద్వారా సమకూర్చడానికి కేంద్రం అంగీకరించింది. కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ భిన్నమైన నివేదికను ఇచ్చింది. అయినా ఎక్కడో చోట మేనేజ్ చేసి అప్పులు తెస్తారేమో తెలియదు. దీనివల్ల రాష్ట్రంలో మళ్లీ అసమానతలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు. అనేక విద్యా సంస్థలను అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని, లక్ష మంది విద్యార్ధులు చదివే అవకాశం ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడిందట. వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలియడంలా? వాటిలో ఎన్ని వస్తాయో, రావో కాని, నిజంగా వస్తే వికేంద్రీకకరించకుండా అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామనడం అన్యాయం అవుతుంది. కర్నూలులో ఏర్పాటు కావల్సిన లా యూనివర్శిటీని కూడా అమరావతిలోనే నెలకొల్పుతారట. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. కృష్ణా నది వరదలలో కొట్టుకు వచ్చి ప్రకాశం బారేజీని ఢికొట్టిన ఉదంతంలో వైఎస్సార్సీపీ కుట్ర ఉందని చంద్రబాబు ముందుగా డిటెక్టివ్ మాదిరి కనిపెట్టి ప్రకటించారు. దాంతో టీడీపీ మంత్రులు కూడా అదే పల్లవి అందుకుని ప్రచారం చేశారు. ఇంత నీచంగా టీడీపీ నేతలు ఇలా కుట్ర స్కీమ్ అమలు చేస్తున్నారేమిటా అని ఆలోచిస్తే అసలు విషయం బోదపడింది. కృష్ణానది వెంబడి ప్రకాశం బారేజీ ఎగువన భారీ గోడ నిర్మిస్తామని, తద్వారా అమరావతి వైపు వరద రాకుండా పరిరక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అదన్నమాట అసలు సంగతి. నేరుగా ఆ గోడ కడతామని అంటే నది వరద జోన్ లో కరకట్టలోపల ఉన్న చంద్రబాబు, మరికొందరు ప్రముఖుల భవనాలు నీట మునగకుండా ఈ రిటైనింగ్ వాల్ కట్టబోతున్నారని ప్రజలు భావించి విమర్శించవచ్చు. దానికి ముందుగా ఈ బోట్ల కుట్ర ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ ఏదో చేసిందన్న తప్పుడు వాదనలు వినిపించాక ఈ గోడ ప్రతిపాదన తెస్తే పెద్దగా వ్యతిరేకత రాదని అనుకుని ఉండవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం బారేజీకి దిగువన ఉన్న విజయవాడలోని కృష్ణలంక తదితర ప్రాంతాలు మునగకుండా భారీ వాల్ నిర్మించారు. దాంతో గత వరదలలో అనూహ్యమైన రీతిలో నీటి ప్రవాహం ఉన్నా ఈ ప్రాంతం సేఫ్ అయింది. కాని ప్రకాశం బారేజీ ఎగువన ఇలా గోడ కట్టడం శాస్త్రీయంగా కరెక్టా, కాదా?అన్నది ప్రభుత్వం పరిశీలించాలి.తొందరపడి, తమ ఇళ్లు కాపాడుకోవడానికి ఇలాంటి నిర్మాణం చేస్తే ప్రవాహ వేగం పెరిగి ,అప్పుడు నిజంగానే బారేజీకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అధ్యయనం చేసిన తర్వాతే సరైన నిర్ణయం చేయాలని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అమరావతో, భ్రమరావతో,గ్రాఫిక్స్ మోజులో పడి చంద్రబాబు అక్కడ ముంపే లేదని,ముప్పు లేదని తనను తాను సంతృప్తి పరచుకునే యత్నం చేసుకుంటే,ఆత్మ వంచనే అవుతుంది. అది ఆయననే కాదు ..రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని చంద్రబాబు హేతుబద్దంగా వ్యవహరించాలి.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Big Question: అమరావతితో యాపారం... నోరు జారి చంద్రబాబును ఇరికించిన నారాయణ
-
జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబుకు ప్రస్టేషన్: కాకాణి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయనందున చంద్రబాబును గాడిదల మీద ఊరేగించాలని అన్నారు. అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రస్టేషన్ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అమరావతి మునగదని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు.జనం నోళ్లకు తాళం వేయటం కాదని, వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలని చురకలంటించారు. వర్షాలు కురవకుండా ఆకాశానికి తాళం వేయాలని సెటైర్లు వేశారు. జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబు ప్రస్టేషన్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. అమరావతిలోకి నీళ్లు వస్తున్నాయంటే కోపం ఎందుకని ప్రశ్నించారు.‘మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయటంతో విద్యార్థులకు తీరని అన్యాయం. రైతులు అల్లాడిపోతున్నా పట్టింపులేదు. విద్యారంగం పూర్తిగా తిరోగమనం పట్టింది. ఇంగ్లీషు మీడియం రద్దు చేశారు. టోఫెల్, ఐబీ, సీబిఎస్ఈలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ప్రజారోగ్యానికి ఉరి వేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు మంగళం పాడారు. విలేజ్ క్లినిక్ లకు గ్రహణం పట్టించారు’అని కాకాని మండిపడ్డారు. -
అమరావతిపై వాస్తవాల్ని తట్టుకోలేకపోతున్న సీఎం చంద్రబాబు
-
మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
-
ప్రపంచ బ్యాంక్ వద్దన్నది.. అయినా అమరావతే రాజధాని
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిరి్మస్తాం. నవంబర్లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిరి్మస్తాం. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణసాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని, అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని, నవంబర్లో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా 2,017 చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు. మంత్రి సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, గుంటూరు జిల్లా తాడికొండలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందన్నారు. 2014–19 మధ్య 30 వేల మంది అమరావతిలో పనిచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కృష్ణానది, బుడమేరు వరదలు విజయవాడలోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాలను ముంచేసినా అమరావతికి ఏమీ కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసిందని, కానీ కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షా కాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ను విస్తరిస్తామని తెలిపారు. అమరావతి సేఫ్ జోన్లో ఉందని, రాజధాని డిజైన్ సమయంలోనే వరద సమస్య లేకుండా కాల్వలు, రిజర్వాయర్లకు ప్రతిపాదనలు చేశామని అన్నారు.