-
బెంగళూరులో జికా వైరస్ కలకలం
బెంగళూరు: బెంగళూరు సమీపంలో జికా వైరస్ కలకలం రేపింది. ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిక్కబళ్లాపూర్ పరిధిలోని ఓ దోమలో జికా వైరస్ బయటపడినట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. దీంతో తెల్కబెట్టా పరిధిలోని ఐదు కిలోమీటర్ల మేర వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్ జారీ చేసింది. అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించారు. 'రాష్ట్రమంతా కలిపి దాదాపు 100 శాంపిళ్లను పరీక్షలకు పంపాం. చిక్కబళ్లాపూర్ నుంచి వచ్చిన ఆరు కేసుల్లో ఒకటి మాత్రమే పాజిటివ్గా నమోదైంది.' అని జిల్లా ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ ఎస్ మహేశ్ తెలిపారు. అత్యధిక జ్వరం లక్షణాలు ఉన్న ముగ్గుర్ని పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఏడెస్ దోమ కాటు ద్వారా జికా వైరస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికున్గున్యా వంటి ఇన్ఫెక్షన్లకు కూడా కారణమౌతుంది . 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్ను గుర్తించారు. గత డిసెంబర్లో కర్ణాటకాలోని రాయ్చూర్ జిల్లాలో ఐదేళ్ల బాలునికి జికా వైరస్ సోకింది. మహారాష్ట్రాలోనూ మరో వ్యక్తి దీని బారిన పడ్డారు. ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం -
కామ్గా ఉంటే కబళించే దోమ కాటు.. క్యూలెక్స్, ఏడిస్, అనాఫిలిస్తో జరపైలం!
నేరడిగొండ (ఆదిలాబాద్): వర్షాకాలం కావడంతో దోమల సీజన్ మొదలైంది. చిన్నదోమే కదా.. కుడితే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దోమల నివారణ, నియంత్రణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అనారోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల వ్యాప్తితో ప్రమాదం.. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీటి గుంతలు, కంప చెట్లు, పిచ్చిమొక్కలు, నీరు నిల్వ ఉండే ప్రా ంతాల్లో దోమలు నివాసం ఏర్పర్చుకుంటాయి. గు డ్డు, లార్వా, ప్యూపా వృద్ధి చెంది దోమగా మారి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈప్రమాదాన్ని ని వా రించాలంటే నీటిని సక్రమంగా వినియోగించా లి. దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలి. నిర్లక్ష్యం చేస్తే.. క్యూలెక్స్తో దోమ కాటుతో హఠాత్తుగా జ్వరం వస్తుంది. విస్తారమైన నీటి నిల్వలో పెరిగే క్యూలెక్స్ దోమతో ఈవైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈవ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించడం కష్టం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. పంట పొలాలు, పెద్ద పెద్ద స్థలాలు, మైదానాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. ఏడిస్ దోమతో.. 1 ఆకస్మాత్తుగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. తగ్గినట్లుగానే తగ్గి వారం లేదా పది రోజుల్లో మళ్లీ తిరగబెడుతుంది. ఏడిస్ దోమ కాటు కారణంగా ఈవ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాళ్లలో నొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడుతాయి. డెంగీ, చికెన్గున్యా వ్యాధి లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. నెలల తరబడి నొప్పులు బాధిస్తాయి. దీని నివారణ కోసం దోమల పెరుగుదలను అరికట్టాలి. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించాలి. వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకొని తగిన చికిత్స చేయించుకోవాలి. దోమ కాటుకు గురైతే.. అనాఫిలిస్ దోమ కాటుతో మలేరియా, చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. వ్యాధి ప్రారంభంలో సరైన చికిత్స చేయించకపోతే నెలల తరబడి బాధిస్తుంది. గర్భిణులకు, చిన్నారులకు ఈవ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. చలితో జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలి. సకాలంలో మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. -
జికా.. వస్తోంది జర జాగ్రత్త!
భారత్ను హెచ్చరిస్తున్న డబ్ల్యూహెచ్వో డెంగీ, చికెన్గున్యాకు కారణమయ్యే ‘ఏడిస్’ దోమ ద్వారా వైరస్ వ్యాప్తి దేశంలో ఇప్పటికే డెంగీ స్వైరవిహారం 64 ఏళ్ల కిందటే పుణేలో బయటపడ్డ జికా ఆనవాళ్లు నాటి నుంచి భారతీయుల్లో అంతర్లీనంగా వైరస్ వైరస్ జన్యువులో మార్పులతో తాజాగా శక్తివంతం అందుకే అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు యాసీన్ దాదాపు ఏడాదిన్నర కిందట యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. చికిత్సే లేని మహమ్మారిగా మారి ఎన్నో ప్రాణాలను కబళించింది. మానవాళికే పెనుముప్పుగా పరిణమిస్తూ వైద్య రంగానికే కొత్త సవాల్ విసిరింది. వైద్య అత్యయిక పరిస్థితిని, ఎన్నో దేశాల మధ్య రవాణాను స్తంభింపజేసేంతటి ఉపద్రవాన్ని సృష్టించి ఆ తర్వాత కాస్త నెమ్మదించింది.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది! రెండో ఆగమనంలో రెట్టించిన శక్తితో విరుచుకుపడుతోంది. అదే ప్రాణాంతక జికా వైరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజా పరిశోధనల్లో ఈ వైరస్ తీవ్రతను గుర్తించింది. ఇది ఏ క్షణంలోనైనా భారత్లోనూ వ్యాపించొచ్చని హెచ్చరిస్తోంది. పొంచి ఉన్న ముప్పు... భారత్కు ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్వో విశ్వసనీయంగా చెప్పడానికి కారణాలున్నాయి. మన దేశంలోకి వచ్చే పర్యాటకులను డబ్ల్యూహెచ్వో నిశితంగా గమనిస్తోంది. ఏటా లక్షల సంఖ్యలో వచ్చే విదేశీ పర్యాటకుల వల్ల భారతీయులు ఈ వైరస్బారినపడే ప్రమాదం ఉందని చెబుతోంది. ‘ఏడిస్’ అనే దోమ ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగీ, చికన్గున్యా వ్యాప్తికీ ఈ దోమే కారణం. ఇప్పటికే మన దేశంలో ఈ దోమ కుట్టడం వల్ల డెంగీ స్వైరవిహారం చేస్తోంది. ‘ఏడిస్’ విస్తృతి ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ పర్యటకుల వల్ల ఒకవేళ జికా మన దేశానికి ఒకసారి గనక చేరితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనేది డబ్ల్యూహెచ్ఓ అంచనా. అప్పట్లో డేంజర్ కాకపోవచ్చుగానీ ఇప్పుడైతే... ‘‘ఏడిస్ దోమ వ్యాపింపజేసే జికా వైరస్ మొదట్లో ఇంత తీవ్రంగా ఉండేది కాదు. పైగా ఆ వైరస్ సోకినప్పటికీ అప్పట్లో మెదడు కుంచించుకుపోవడం అనే లక్షణం కనిపించేది కాదు. దాదాపు 64 ఏళ్ల క్రితం దీన్ని పుణెలో గుర్తించినప్పుడు అది ప్రమాదకరంకాని విధంగా (బినైన్గా) అంతర్లీనంగా భారతీయుల్లో ఉండేది. 1952లో జపనీస్ ఎన్సెఫలైటిస్ వంటి మెదడువాపు వ్యాధి జాడలను గుర్తించే క్రమంలో జికా వైరస్ను డబ్ల్యూహెచ్వో నిపుణులు కనుగొన్నారు. గతంలో ఉన్న వైరస్లో ‘ఎన్ఎస్1’అనే జన్యువులో వచ్చిన మ్యుటేషన్స్ వల్ల ఇప్పుడు అది మానవుల్లో నరాలను దెబ్బతీసే వ్యాధి (న్యూరోట్రోపిక్)గా మారింది. ఈ ఉత్పరివర్తనం (మ్యూటేషన్) వల్ల రక్త కణాల్లో వైరస్ తన సంఖ్యను పెంచుకొని, వ్యాధి నిరోధక శక్తికి అతీతంగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే భారత్లోని ప్రజలు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం మరింత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం’’ అని అమెరికాలోని హ్యూస్టన్లో ఉన్న బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్కు చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ పీటర్ హోటెజ్ పేర్కొన్నారు. ‘‘ఈ విషయమై భారత్ను వారం నుంచి హెచ్చరిస్తున్నామని, ఈ ముప్పును ఎట్టి పరిస్థితుల్లో అలక్షం చేయొద్దని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సరివియలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ)లకు సూచించారు. ప్రజలు, ప్రభుత్వాలూ అప్రమత్తం కావాలని అయన కోరుతున్నారు. ‘‘తొలుత దీన్ని ఆఫ్రికాలో కనుగొన్నారు. ఆ తర్వాత యూరప్, మధ్యప్రాచ్యాలకు విస్తరించింది. గతేడాది బ్రెజిల్, అమెరికాపై దాడి చేసింది. ఇప్పుడు తూర్పు దేశాల దండెత్తి ప్రపంచమంతటికీ విస్తరించే పనిలో ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్కు ముప్పు ఎందుకంటే... దేశంలో జనసంఖ్య ఎక్కువ. ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అవగాహన ఒకింత తక్కువ. పైగా ఇప్పుడు వర్షాకాలం. దాంతో నీళ్ల చేరికకు అవకాశం పెరిగి దోమలు మరింతగా వృద్ధి చెందే కాలం. ఇప్పుడు సింగపూర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ దీని ఉనికి స్పష్టమైంది. ఇక దీని విస్తృతి ఉన్న దేశాల నుంచి పర్యాటకుల ప్రయాణాలు చాలా ఎక్కువ. అందునా జికాను వ్యాప్తి చేసే దోమ ఏడీస్ వల్లనే కలుగుతున్న డెంగ్యూ కేసులు చాలా ఎక్కువ. వీటన్నింటినీ చూస్తే భారత్లో ఇది విస్తరించడానికి అవసరమైన నేపథ్యం ఉంది. అందుకే హోటెజ్ వంటి వారు మరీ మరీ హెచ్చరిస్తున్నారు. జికాను గుర్తించిందిలా... అది విస్తరించిందిలా... ఉగాండా అడవుల్లోని రిసస్ కోతుల్లో 1947లో మొదటిసారి జికా వైరస్ను గుర్తించారు. ఏడేళ్ల తర్వాత నైజీరియా అడవుల్లోని మానవుల్లోనూ గుర్తించారు. 10 లక్షల ఇన్ఫెక్షన్ల తర్వాత అది మరింత శక్తిని పుంజుకోవడంతో మానవాళి అప్రమత్తమైంది. 2007లో పసిఫిక్ ద్వీపాల్లో వైరస్ కొత్త రూపం (స్టెయిన్స్) కనిపించింది. గతేడాది బ్రెజిల్లో దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మందిలో జికాను గుర్తించారు. ఇది సోకిన గర్భవతులకు కలిగిన సంతానంలో మెదడు సంకోచించి ఉండటాన్ని కనుగొన్నారు. ఇలా మెదడు సంకోచించిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘మైక్రో సెఫాలీ’ అంటారు. తల్లికి వ్యాధి సోకితే పుట్టే పిల్లల తల చాలా చిన్నదిగా ఉంటుంది. మెదడు అభివృద్ధి, వికాసం... ఈ రెండు అంశాలూ చాలా తక్కువ. ఇక ఆ తర్వాత అమెరికా ఖండంలోని 26 దేశాలకు ఇది పాకిందని తెలుసుకున్నారు. అనంతరం ఆఫ్రికాలోని కేప్ వెర్డెలో, సింగపూర్లోనూ జికా కేసులను కనుగొన్నారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలో 200 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయనే అంశం దీని విస్తృతి తీవ్రతను చెబుతుండగా... అదే తీవ్రత ప్రపంచాన్ని వణికిస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తోపాటు అమెరికన్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ చెప్పే లెక్కల ప్రకారం ప్రస్తుతం జికా వైరస్ 58 దేశాల్లో మృత్యుఘంటికలు మోగిస్తోంది. తాజాగా తమ దేశంలో జికాను గుర్తించినట్లు ఫిలిప్పిన్స్ ఈ నెల 5న ప్రకటించింది. ఇవీ లక్షణాలు... - జ్వరం - ఒంటి మీద దద్దుర్లు (ర్యాష్) - కళ్లు ఎర్రబడటం, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి - గర్భవతుల్లో పిండం మెదడు కుంచించుకుపోవచ్చు, మిగతా వారిలో ఒళ్లు చచ్చుబడే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) రావొచ్చు జాగ్రత్తలు... - ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు, పొడవు చేతుల కుర్తాలు ధరించాలి. - దోమలను పారదోలే ‘మస్కిటో రెపెల్లెంట్స్’ ఉపయోగించాలి. - ఈ దోమలు పగలూ కుడతాయి... కాబట్టి పగటి వేళ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాధి గర్భవతులకు ఈ వ్యాధి సోకితే మిగతా వారిలాగే వ్యక్తిగతంగా వారికీ, ప్రసవం తర్వాత తమ బిడ్డలకు మెదడు కుంచించుకుపోయే మెక్రోసెఫాలీతో వారి బిడ్డలకూ ముప్పు కలిగే అవకాశం ఉంది కాబట్టి గర్భవతులు దోమలు కుట్టకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. చికిత్స... - వ్యాధి సోకిన తర్వాత నిర్దిష్ట చికిత్స ప్రక్రియ లేదు. - ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికీ ఇస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement