-
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..
తొలిసారిగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్న సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ బలమైన స్థానం నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్ వచ్చే నెలలో ఎన్నికలలో మైన్పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పార్టీ వర్గాల అందించిన ఈ సమాచారాన్ని అతని మామ రాజ్యసభ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఈ రోజు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఆయన మేనల్లుడు మెజార్టీ ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే 1993 నుంచి కర్హాల్ వాసులు ప్రతి ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. కానీ బీజేపి 2002 ఎన్నికలలో ఆ స్థానాన్ని గెలిచినప్పటికీ, 2007లో మళ్లీ సమాజ్వాదీ పార్టీ కర్హాల్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ప్రస్తుతం కర్హాల్ సోబరన్ యాదవ్ ఆధ్వర్యంలో ఉంది. అంతేకాదు అఖిలేశ్ తండ్రి సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఐదుసార్లు లోక్సభకు ఎన్నికైన ఐదు అసెంబ్లీ స్థానాల్లో మైన్పురి లోక్సభ సీటు ఒకటి కావడం విశేషం. పైగా యూదవ్ స్వగ్రామమైన సైఫాయ్కి 5 కి.మీ దూరంలోనే కర్హాల్ ఉంది. అధికార పార్టీని గద్దె దింపేందకు ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్న అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్నారు. అయితే ఆయన గతేడాది నవంబర్ నెలలో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనని చెప్పారు. కాగా, బీజేపీ యోగి ఆదిత్యనాథ్ను గోరఖ్పూర్ నుంచి పోటీకి దిగనుండటంతో అఖిలేశ్ యాదవ్ సైతం ఒత్తిడిని అధిగమించేందుకు పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అఖిలేశ్ ప్రస్తుతం యూపీలోని అజంగఢ్ నుండి లోక్సభ ఎంపీగా ఉన్నా సంగతి తెలిసిందే. కాగా, అఖిలేశ్ యాదవ్ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2012లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎంఎల్సీ హోదాలోనే ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అలాగే ఆదిత్యనాథ్ కూడా బలమైన స్థానం నుంచే పోటీచేస్తున్నారు. గోరఖ్పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి.. ఆ నియోజకవర్గంలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు. (చదవండి: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!) కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’ -
యూపీలో నేరగాళ్ల ఇష్టారాజ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న పోలీసుల నివేదికను తప్పుపట్టిన ఆమె.. యూపీలో నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర గణాంకాలను తారుమారు చేసిన పోలీసులు నేరాల సంఖ్య తగ్గిందంటూ చెబుతున్నారని అఖిలేశ్ విమర్శించారు. శనివారం ప్రియాంక ట్విట్టర్లో..ఉత్తరప్రదేశ్లో నేరగాళ్లు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. నేర ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. నేరగాళ్లకు సర్కారు లొంగిపోయిందా?’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతోపాటు రాష్ట్రంలో నేరాలపై పలు నివేదికలను జత చేశారు. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ స్పందించారు. ‘మా ప్రభుత్వం నేరగాళ్ల నెట్వర్క్ను నిర్వీర్యం చేసింది. నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలు తగ్గాయి’ అని పేర్కొన్నారు. -
ఈ108 మంది చావుకు ఎవరు బాధ్యులు!?
సాక్షి, న్యూఢిల్లీ : ‘అవును! ఇంతటి విషాధానికి ఆదిత్యనాథ్ యోగియే బాధ్యత వహించాలి. ఇది గత ప్రభుత్వం హయాంలో జరిగి ఉంటే అది సమాజ్వాది పార్టీ బాధ్యతగా మేము కచ్చితంగా భావించేవాళ్లం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు? వారి ప్రభుత్వం ఆధ్వర్యంలోనేగదా, పోలీసు వ్యవస్థ ఉన్నది. పైగా ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక పోలీసులకు స్వేచ్ఛ పెరిగింది. పోలీసుల అండదండలతోనే గదా! ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య కల్తీ మద్యం ఏరులై పారుతోంది’ అని కల్తీ మద్యం కారణంగా ధరమ్ పాల్ అనే 51 ఏళ్ల సోదరుడిని, సోను అనే 30 ఏళ్ల మేనల్లుడిని కోల్పోయిన శివపూర్ రైతు సుధీర్ కుమార్ మీడియాతో వ్యాఖ్యానించారు. చెవిటి, మూగ అయిన సోను దినసరి కూలి అని, మతిస్థిమితం లేని ఆయన తల్లిదండ్రులు ఆయనపైనే ఆధారపడి బతుకుతున్నారని స్థానికులు తెలిపారు. ‘అక్రమ మద్యం వ్యాపారులను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి విషాధ సంఘటనలకు తెరపడదు. పలానా, పలానా ముఠాలు కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నాయని నేను స్వయంగా మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఈ విషయం కల్తీ వ్యాపారులకు తెలిసి పోయింది. వారు పలుసార్లు నాకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించారు. అప్పటి నుంచి నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా మానేశాను’ అని సహ్రాన్పూర్లో మద్యం ‘డీఅడిక్షన్’ కేంద్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త మమత ఆరోపించారు. మంగళవారం ఉదయం ధన్పాల్ సింగ్ మరణంతో కల్తీ మద్యం దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 108కి చేరుకుంది. 48 ఏళ్ల ధన్పాల్ సింగ్ దినసరి కూలి. ఆయన శవానికి సహరాన్పూర్లోని సేత్ బల్దేవ్ దాస్ బజోరియా జిల్లా ఆస్పత్రిలో అటాప్సీ నిర్వహించిన తర్వాత ఆస్పత్రి వర్గాల నుంచి ఆయన శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా ఆయన బంధువులు పోలీసులను ప్రాధేయపడ్డారు. ‘మీ ఒక్క శవమే కాదు, బోలెడు శవాలు ఉన్నాయి. అప్పగించడానికి ముందు బోలెడంతా తతంగం ఉంటుంది’ అని పోలీసు అధికారులు బంధువులపై విసుక్కున్నారు. ధన్పాల్ శవాన్ని పోలీసు వ్యాన్ ఎక్కించారు. ‘నా అన్న చావుకు పోలీసులు, అధికార యంత్రాంగం కారణం కాకపోతే, ఎవరు కారణం?’ అంటూ ధన్పాల్ సింగ్ తమ్ముడు రాకేశ్ సింగ్ అడిగిన ప్రశ్న ఒక్క మీడియా తప్పించి ఎవరు వినిపించుకోలేదు. ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలోని బలుపూర్ గ్రామంలో ఈ ఫిబ్రవరి ఏడవ తేదీన ఓ ఇంటిలో జరిగిన 13వ రోజు కర్మ సందర్భంగా గ్రామస్థులు, బంధువులు కల్తీ మద్యం సేవించారు. కల్లు తిరగడం, కడుపునొప్పి, వాంతులతో వారంతా బాధపడ్డారు. వారిలో సకాలంలో ఆస్పత్రిలో చేరి బతికిన వాళ్లు తక్కువ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవానాన్ని అడ్డుకోలేక పోయింది. ఢిల్లీ, గుజరాత్ తరహాలో కల్తీ మద్యం వ్యాపారులకు మరణ శిక్ష విధించేలా ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2017, డిసెంబర్లో ఓ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. అయినా ఫలితం లేదు. 2018, జనవరి బారబంకిలో కల్తీ మద్యానికి 11 మంది మరణించారు. గత మే నెలలో కాన్పూర్లో కల్తీ మద్యానికి పది మంది మరణించిన నేపథ్యంలో వినయ్ సింగ్ అనే వ్యక్తి గిడ్డంగి మీద పోలీసులు దాడిచేయగా, కల్తీ మద్యం సరకులు దొరికాయి. ఆయన సమాజ్వాది పార్టీకి చెందిన మాజీ మంత్రి రామ్ స్వరూప్ సింగ్ గౌర్కు మనవడని తేలింది. వినయ్ సింగ్ సోదరుడు నీరజ్ 2017లో అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా కల్తీ మద్యం సరఫరా చేసే ముఠాలు మారుతాయి తప్ప మద్యం అక్రమ వ్యాపారం ఆగిన దాఖలాలు లేవని ప్రజలు చెబుతున్నారు. -
‘పేరు’ గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017లో ఆదిత్యనాథ్ యోగిని ఎంపిక చేసినప్పుడు ‘కరడుగట్టిన హిందూత్వ’ వాదిని ఎంపిక చేయడానికి తామేమి వెనకాడమని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. అప్పటికీ గోరఖ్పూర్ ఆలయానికి పీఠాధిపతిగా కొనసాగుతున్న ఆయనపై పలు దొమ్మి కేసులతోపాటు మత ఘర్షణలు, హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారంటూ పలు కేసులు ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చాన తనపై ఉన్న అన్ని కేసులను తానే స్వయంగా కొట్టివేసుకున్నారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ను పాకిస్తాన్ టెర్రరిస్టుగా అభివర్ణించి, మసీదుల్లో హిందూ విగ్రహాలను ప్రతిష్టిస్తానంటూ ఆదిలోనే వివాదాస్పదుడిగా ముద్ర పడిన యోగి ఆదిత్యనాథ్ యూపీలోని అన్ని ముస్లిం ప్రాంతాల పేర్లను తొలగించి వాటి స్థానంలో హిందూ పేర్లను ప్రవేశ పెడుతూ పోతున్నారు. గోరఖ్పూర్లోని భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయానికి మహాయోగి గోరఖ్నాథ్ పేరును పెట్టారు. ముఘల్సరాయ్ రైల్వేస్టేషన్కు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ అని, మొఘల్ చక్రవర్తి అక్బర్ కనుగొన్న అలహాబాద్ నగరం పేరు మార్చి ప్రయాగ్రాజ్ పేరు పెట్టారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్లు దీపావళి వేడుకల్లో ఆదిత్యనాథ్ ప్రకటించారు. గతంలోనే ఉర్దూ బజార్ను హిందీ బజార్గా, హుమాయున్ నగర్ను హనుమాన్ నగర్గా మార్చారు. తాజ్ మహల్ పేరును కూడా మార్చి రామ్ మహల్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రామ రాజ్యాన్ని స్థాపిస్తానని ముఖ్యమంత్రయిన కొత్తలో ప్రకటించిన ఆయన పేర్ల ఆలోచనలో పడి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయినట్లున్నారు. ఒక్క భారత్లోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేద ప్రాంతంగా, పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన రాష్ట్రంగా యూపీ ఇప్పుడు గుర్తింపు పొందింది. సబ్ సహారా ఆఫ్రికాలో పుట్టడం కన్నా యూపీలో ఓ శిశువు జన్మిస్తే నెల లోపల ఆ శిశువు మరణించే అవకాశాలు రెండింతలు ఉన్నాయని ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్ తాజా సంచికలో వెల్లడించింది. పొరుగునున్న నేపాల్కన్నా యూపీలో మనిషి ఆయుషు ప్రామాణం తక్కువ. నైజీరియా, బంగ్లాదేశ్లకన్నా సరాసరి రాష్ట్ర జీడీపీ రేటు తక్కువ. యూపీలోని కాన్పూర్ నగరాన్ని ప్రపంచంలోనే అతి కాలుష్యనగరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలనే ప్రకటించింది. ఇక మానవ అభివృద్ధి సూచికలో పాకిస్థాన్ కన్నా వెనకబడి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై యోగి దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
ఆదిత్యనాథ్ ఎత్తులు, జిత్తులు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లను దక్కించుకునేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చి హిందుత్వ ఎజెండాను ముందుకు నెట్టారు. రాష్ట్రంలోని చిన్నా, చితక పార్టీలను చేరదీసి ప్రధాన ప్రతిపక్షాలైన సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలను, ముఖ్యంగా సమాజ్వాది పార్టీని దెబ్బతీసేందుకు పెద్ద వ్యూహమే పన్నారు. సమాజ్వాది పార్టీ నుంచి విడిపోయి ఇటీవల ‘సమాజ్వాది సెక్యులర్ మోర్చా’ను ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ బాబాయి)కు మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఖాళీ చేసిన ప్రభుత్వ బంగ్లాను ఆదిత్యనాథ్ కేటాయించారు. రాజాభయ్యాగా పేరు పొందిన స్వతంత్య్ర శాసన సభ్యుడు రఘురాజ్ ప్రతాప్ సింగ్ను చేరదీసి సమాజ్వాది పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖాళీ చేసిన ప్రభుత్వ బంగ్లాను కేటాయించారు. అఖిలేష్ యాదవ్తో పడక శివపాల్ యాదవ్ బయటకు వచ్చి బీజేపీలో చేరాలని అనుకోవడం, ఆయన తరఫున ఎస్పీ మాజీ నాయకుడు అమర్ సింగ్ మంతనాలు కూడా జరపడం తెల్సిందే. అయితే పార్టీలో చేరే బదులు కొత్త పార్టీని ఏర్పాటు చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాది ఓట్లను చీల్చాలని, అందుకు ప్రతిఫలం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఆయన్ని ఒప్పించిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. బీజేపీ సూచనల మేరకు శివపాల్ యాదవ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయడంతో అందుకు నజరానాగానే విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాను ఇప్పుడు కేటాయించారు. సమాజ్వాది సెక్యులర్ మోర్చాకు రాష్ట్రంలోని 30 జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు. సమాజ్వాది పార్టీకి మొదటి నుంచి బలం ఉన్న ఈ 30 జిల్లాలో ఇప్పుడు యాదవ్లు, ముస్లింలు సెక్యులర్ మోర్చా వైపు వెళ్లే అవకాశం ఉందని అటు మోర్చా అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ఇటు బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాల్లో ఎస్పీ విజయావకాశాలను మోర్చా దిబ్బతీస్తుందని, తద్వారా తాము విజయం సాధించవచ్చన్నది బీజేపీ, ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అంచనా. ఎస్పీలో తనకు అన్నుదన్నుగా నిలిచిన నాయకులంతా ఎన్నికల నాటికి తన మోర్చాలో చేరుతారని, అందుకు అవసరమైతే ధన సహాయం కూడా బీజేపీ చేస్తుందని శివపాల్ యాదవ్ నమ్ముతున్నారు. ఇక ‘కుండా’ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆరుసార్లు స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఇటీవల జనసత్తా పార్టీని ఏర్పాటు చేశారు. ఆదిత్యయోగి ప్రోద్బలంతోనే ఆయన ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఠాకూర్ల సమాజంలో మంచి బలమే ఉంది. ప్రతాప్గఢ్ లోక్సభ నియోజకవర్గాన్ని ఆయన ప్రభావితం చేయగలరు. కొత్త పార్టీని ఏర్పాటు చేసినందుకు నజరానాగానే ఆయనకు కూడా ప్రభుత్వం నివాసం దక్కిందని భావించవచ్చు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వరుసగా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతూ రావడంతో ఈ కొత్త వ్యూహాలకు ఆదిత్యయోగి శ్రీకారం చుట్టారని గ్రహించవచ్చు. వ్యూహాలు ఫలిస్తాయా? శివపాల్ యాదవ్ కొత్త పార్టీ ప్రభావం అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్వాది పార్టీపై కొంత ప్రభావం చూపించవచ్చేమోగానీ, విజయావకాశాలను దెబ్బతీసేంతగా ఉండదని, అందుకు కారణం ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు పూర్తిగా కుమారుడి పక్షాన నిలబడడమేనని కాన్పూర్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఏకే వర్మ అభిప్రాయపడ్డారు. గతంలో పార్టీలోని శివపాల్ యాదవ్ అసమ్మతి వర్గానికే ములాయం సింగ్ యాదవ్ మద్దతిచ్చిన విషయం తెల్సిందే. పైగా మాస్ జనాల్లో శివపాల్ యాదవ్కు ఆదరణ లేదని ఆయన చెప్పారు. ప్రతాప్ సింగ్ ప్రభావం కూడా ఒక్క నియోజకవర్గానికే పరిమితం అని తెలిపారు. ఇక్కడ ఓటర్ల మన స్థత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఓటర్లు సాధారణంగా విజయం సాధిస్తుందనుకున్న పార్టీకే ఓటు వేస్తారని, ఇలాంటి చిన్నా, చితక పార్టీలకు ఓటు వేసి ఓటును వృధా చేసుకోవాలని కోరుకోరని ఆయన చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement