breaking news
Aaron George
-
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
-
వైభవ్ సూర్యవంశీతో ఆడటం మంచి కిక్
‘జీవితంలో ఏదీ ఈజీ కాదు. దేనినైనా కఠోర శ్రమతోనే సాధించగలం. నేను కూడా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగినట్లు కష్టపడ్డా. స్కూల్కు వెళ్తూనే రెగ్యులర్గా ప్రాక్టీస్ కొనసాగించా’ అని చెప్పాడు అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఓపెనర్, నగర యువకుడు అరోన్ జార్జి. జింబాబ్వే–నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి–20 ప్రపంచ కప్ను గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న జార్జిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ప్రపంచకప్ వరకు తన ప్రయాణం, ఆ మెగా టోర్నీలో అనుభవాలను పంచుకున్నాడు. ప్రాక్టీస్కు తోడు నిత్యం తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకుసాగానని తెలిపాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని, జీవిత లక్ష్యం టీమ్ఇండియాకు ఆడటమేనని వివరించాడు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజాలు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. లక్ష్మణ్ మెంటార్షిప్ తనకు ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నాడు. అరోన్ జార్జి ఇంకా ఏమన్నాడో అతడి మాటల్లోనే...! సచిన్ టెండూల్కర్ ప్రేరణతోనే క్రికెటర్ను కావాలని నిర్ణయించుకున్నా. నాలుగో ఏట నుంచే బ్యాట్ పట్టా. ప్లాస్టిక్ బ్యాట్తో ప్రాక్టీస్ మొదలుపెట్టా.. నా బ్యాటింగ్ స్టైల్ చూసి మా నాన్న క్రికెట్ వైపు మళ్లించాడు. ప్రాక్టీస్, మ్యాచ్లకు వెళ్లే సపమయంలో తెల్లవారు జామున మూడున్నరకే అమ్మ నిద్ర లేచి అన్నీ సిద్ధం చేసేది. నాన్న ఈసో వర్గీస్ విశ్రాంతి పోలీస్ అధికారి. అమ్మ ప్రీతి గృహిణి. అక్క నల్సార్లో లా చదువుతోంది. ఈ ముగ్గురూ నాకోసం చాలా కష్టపడ్డారు. అతడితో ఓపెనింగ్ మంచి అనుభవం 14 ఏళ్ల బిహార్ కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం మంచి కిక్ ఇచ్చింది. అతడు మంచి హిట్టర్. ఇద్దరం సమన్వయంతో ఆడాం. సాలిడ్ షాట్స్ కొట్టాం. రన్ రేట్ పడిపోకుండా చూశాం. అండర్–19 ప్రపంచ కప్ జట్టులో అనేక రాష్ట్రాల వారున్నా.. క్రీడా స్ఫూర్తితో.. భారత జట్టుగా మందుకుసాగాం.నైపుణ్యం పెంచుకోవడమే అతిపెద్ద సవాలు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవడమే అతిపెద్ద సవాలు. నాకు నేనే కొత్త సవాళ్లను పెట్టుకునేవాడిని. అందుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేసి వాటిని అధిగమించేవాడిని. భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం నాలో మరింత ఉత్సాహం పెంచింది. టీమ్ ఇండియాకు ఆడాలన్న జీవిత లక్ష్యానికి దగ్గరయ్యాననే ఆనందం కలిగింది. చిన్న ప్రాంతమైన మల్లాపూర్ నుంచి ప్రపంచ కప్నకు చేరుకోవడం అంతా కలగా ఉంది. గత ఏడాది నా కెప్టెన్సీలోనే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీని నెగ్గింది. ఇదే టోర్నిలో అంతకుముందు రెండు సీజన్లు 300 పైగా పరుగులు చేయడం నా కెరీర్ను మలుపు తిప్పింది.నాన్న స్నేహితుడే.. తొలి శిక్షకుడు నాకు నాలుగేళ్ల వయసు ఉండగా.. చాలా చిన్నగా ఉండేవాడిని. ఎక్కడకు వెళ్లినా చిన్న పిల్లవాడివంటూ ఎవరూ తీసుకోలేదు. నా ఆట తీరును చూసి.. ప్రతిభ ఉందని నాన్న స్నేహితుడు సుభాష్ చందర్ గుర్తించారు. నాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నా తొలి గురువు ఆయనే. వర్షం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్కు డుమ్మా కొట్టలేదు. లెక్కకు మించి గాయాలు అయ్యాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, పట్టుదలతో ముందుకుసాగాను. తార్నాక వీజే క్రికెట్ అకాడమీ కోచ్ విజు నాయర్ మెళకువలు నేర్పారు. నన్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత అంతర్జాతీయ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాను.పిల్లలూ చదువును మరువొద్దు.. ఇప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు క్రికెట్ అకాడమీలలో చేరుతున్నారు. ఇది మంచిదే. కానీ, క్రికెట్తో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పైస్థాయికి వెళ్లినప్పుడు, ఇంటర్వ్యూల సమయంలో విద్య మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది. -
అండర్–19 క్రికెట్ ప్రపంచకప్ గెలుపులో నగర కుర్రోడు
మల్లాపూర్/కాప్రా: హైదరాబాద్ బ్యాట్స్మెన్కు ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో పరుగులు సాధించి.. భారత జట్టు అండర్ 19 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నగరానికి చెందిన కుర్రాడు అరోన్ జార్జి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా డ్రైవ్లు కొడుతూ.. అంతకుమించిన స్ట్రోక్ ప్లేతో అలరిస్తూ.. టైమింగ్లో మైమరిపిస్తూ.. ఫ్లిక్లతో కట్టిపడేస్తూ.. హైదరాబాద్ క్రికెట్ స్టయిల్ను ప్రపంచానికి చాటాడు. బిహార్కు చెందిన మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి టీమ్ఇండియా జగజ్జేతగా నిలవడంలో తనవంతు బాధ్యత నెరవేర్చాడు. బంతిని అడ్డంగా బాదేసే ఈ టి20ల కాలంలో.. క్లాస్ బ్యాటింగ్తో అరోన్ అదరహో అనిపించాడు. మన మల్లాపూర్ వాడే.. అరుదైన రికార్డు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్లో నివసిస్తోంది అరోన్ జార్జి కుటుంబం. తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతీ వర్గీస్. కేరళకు చెందినవారైనా హైదరాబాద్లో స్థిరపడ్డారు. అరోన్ అండర్–19 హైదరాబాద్ జట్టు కెప్టెన్ కూడా. ప్రపంచ కప్లో అఫ్ఘానిస్థాన్తో జరిగిన సెమీఫైనల్లో క్లిష్ట పరిస్థితుల్లో అరోన్ సెంచరీ (115) బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా (118)పైనా సెంచరీ కొట్టాడు. స్కాట్లాండ్పై 61 పరుగుల చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. నగరం నుంచి అంబటి రాయుడు, తిలక్ వర్మ వంటి మేటి బ్యాటర్లు అండర్–19 క్రికెట్లో సెంచరీలు కొట్టినా.. ప్రపంచకప్లో మాత్రం ఆ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు అరోన్ ఏకంగా రెండు సెంచరీలు కొట్టి.. టి20 ప్రపంచకప్లో సెంచరీలు బాదిన తొలి హైదరాబాదీగా రికార్డులకెక్కాడు. అరోన్ ప్రస్తుతం సైనిక్పురి భవన్స్ కాలేజీలో బీకాం (ఫైనాన్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో 2014–17 వరకు ఉచిత శిక్షణ పొందాడు. తార్నాకలోని అకాడమీలో ఆ తర్వాత మూడేళ్లు శిక్షణ తీసుకున్నాడు. సంగీత్ చౌరస్తాలోని అకాడమీలో గత ఏడాది వరకు ప్రాక్టీస్ చేశాడు. టీమ్ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ పర్యవేక్షణలో కోచింగ్ తీసుకున్నాడు. ‘సాక్షి’తో తల్లిదండ్రుల సంతోషం తండ్రి ఈసో వర్గీస్ రిటైర్డ్ పోలీస్ అధికారి. తల్లి ప్రీతి.. తమ కుమారుడు సాధించిన ఘనతను ‘సాక్షి’తో పంచుకున్నారు. అఫ్ఘాన్పై తమ కుమారుడి సెంచరీని చూసి అంతులేని సంతోషం కలిగిందని తెలిపారు. భవిష్యత్లో జాతీయ జట్టుకు ఆడాలనేది అరోన్ లక్ష్యంగా వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం శంషాబాద్ రానున్న అరోన్కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలకనున్నారు. -
భారత్ను పదోసారి ఫైనల్కు చేర్చిన ఈ 'ఆరోన్ జార్జ్' ఎవరు..?
అండర్ 19 ప్రపంచకప్లో భారత్ పదోసారి ఫైనల్కు చేరింది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ ఇన్ని సార్లు ఫైనల్స్కు చేరలేదు. ఇందులో టీమిండియా ఐదు సార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్గా నిలిచి, నాలుగు సందర్భాల్లో (2006, 2016, 2020, 2024) రన్నరప్గా నిలిచింది. ఏ జట్టూ ఇన్ని సార్లు ఛాంపియన్గా, రన్నరప్గానూ నిలవలేదు. యంగ్ ఇండియా మరోసారి ఫైనల్కు చేరి అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో తిరుగులేని జట్టుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.నిన్న జరిగిన 2026 ఎడిషన్ రెండో సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుత శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి భారత్ను ఒంటిచేత్తో గెలిపించాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరోన్ ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్ను ఆరంభించాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో (33 బంతుల్లో 68; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి తొలి వికెట్కు 90 పరుగులు, వన్డౌన్ బ్యాటర్ ఆయుశ్ మాత్రేతో (59 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్కు 114 పరుగులు, ఆతర్వాత వేదాంత్ మల్హోత్రాతో (47 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి 96 పరుగులు జోడించి, భారత్ గెలుపు ఖరారయ్యాక మూడో వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా ఆరోన్ వన్మ్యాన్ షో కారణంగా భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అత్యుత్తమ ఛేదనఈ ఛేదన అండర్ 19 వరల్డ్కప్ చరిత్రలోనే అత్యధికం, అత్యుత్తమం. గతంలో ఏ జట్టూ ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2006 ఎడిషన్లో ఐర్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించింది.ఆఫ్ఘన్ ఆటగాళ్లు శతకాలు వృధాఅంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 310 పరుగులు సాధించింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. ఆరోన్ అద్భుత సెంచరీతో భారత్ను గెలిపించడంతో ఫైజల్, ఉజైరుల్లా శతకాలు వృధా అయ్యాయి.ఇంగ్లండ్తో అమీతుమీతొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 6) జరిగే ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్ను ఫైనల్కు చేర్చిన ఈ ఆరోన్ జార్జ్ ఎవరు..?ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన సెమీఫైనల్లో సూపర్ సెంచరీతో భారత్ను ఫైనల్స్కు చేర్చిన ఆరోన్ జార్జ్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజా సెంచరీ తర్వాత చాలామంది ఆరోన్ గురించిన సమాచారం కోసం గూగుల్ చేస్తున్నారు.మన హైదరాబాదీనే..!19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినా.. జానియర్ స్దాయిలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్కు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డర్ ఆటగాడికి పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా ఉంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉందంటే అందరి చూపు జార్జ్పైనే ఉంటుంది.సంజూ శాంసన్లా..!అతడి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పోలి ఉంటుంది. అదేవిధంగా అతడికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్గా హైదరాబాద్కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ(2022-23)లో బీహార్పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పరుగుల వరదగత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.అప్పడు పాక్పై..ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే జార్జ్ను ప్రత్నమ్నాయంగా తీసుకునే అవకాశముంది. -
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
భారత అండర్-19 క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్ వరల్డ్కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్ను పూర్తి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్కప్-2026 టోర్నీ రెండో సెమీ ఫైనల్లో భారత్.. అఫ్గనిస్తాన్తో తలపడింది. హరారేలో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు సాధించింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాల వల్ల ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.కొండంత లక్ష్యం కొండంత లక్ష్యం ముందున్నా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యువ భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ శతక్కొట్టగా (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్లు).. వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే కూడా హాఫ్ సెంచరీ (59 బంతుల్లో 62) సాధించాడు.ఇదే అత్యధిక లక్ష్య ఛేదనవీరికి తోడు విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్ విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం 41.1 ఓవర్లలోనే యువ భారత్ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆరోన్కు లభించింది. కాగా అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఇంతకుముందు 2006లో న్యూజిలాండ్ ఐర్లాండ్ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయగా.. 2022లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ ఇచ్చిన 294 పరుగుల టార్గెట్ను ఫినిష్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి పదహారు ఎడిషన్లు పూర్తి కాగా.. భారత్ ఫైనల్ చేరడం ఇది పదోసారి కావడం విశేషం.ఇంగ్లండ్ వర్సెస్ భారత్మరో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం జరిగే వరల్డ్కప్ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.Highest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | #INDvENG | FRI, 6th FEB, 1 PM #ENGvIND pic.twitter.com/LMRhFgBzST— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
WC 2026: వరల్డ్కప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ టోర్నీ-2026లో భారత యువ జట్టు ఫైనల్కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే వేదికగా జనవరి 15న ప్రపంచకప్ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే.ఆది నుంచి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న భారత జట్టు.. సూపర్ సిక్స్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్లు గెలిచి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో బుధవారం అఫ్గన్ జట్టుతో తలపడింది.ఇద్దరు శతకాలు బాదిహరారేలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. అయితే, వికెట్లు తీయలేక భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. అఫ్గన్ బ్యాటర్లలో ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగి.. అఫ్గన్ను పటిష్ట స్థితిలో నిలిపారు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరల్డ్కప్ తాజా ఎడిషన్లో ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే సేన ఆది నుంచే దూకుడుగా ఆడింది. శతక్కొట్టిన హైదరాబాదీ బ్యాటర్ఓపెనర్లలో వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) ధనాధన్ దంచికొట్టగా... హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్లు)తో సత్తా చాటాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే 59 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు.మిగతా వారిలో విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్ గెలుపును ఖరారు చేశారు. టాపార్డర్ దంచికొట్టడంతో అఫ్గన్ విధించిన లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఊదేసింది. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 311 పరుగులు సాధించి.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరల్డ్కప్ ఫైనల్కు దూసుకువెళ్లింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో నూరిస్తాని ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. వహీదుల్లా జద్రాన్కు ఒక వికెట్ దక్కింది. కాగా తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం ఫైనల్ జరుగనుంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారుHighest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | IND 🆚 ENG | FRI, 6th FEB, 1 PM pic.twitter.com/Pzay5mAdoI— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ-2026లో భారత జట్టు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో భాగంగా యూఏఈపై రెండు పరుగులే చేసి విఫలమైన ఈ లెఫ్టాండర్.. ఆ తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచ్ (72)తో ఫామ్లోకి వచ్చాడు.తొలుత బ్యాటింగ్చివరగా న్యూజిలాండ్పై 23 బంతుల్లో 40 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. తాజాగా జింబాబ్వేపై ప్రతాపం చూపాడు. బులవాయో వేదికగా మంగళవారం నాటి వన్డేలో టాస్ ఓడిన భారత్... ఆతిథ్య జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.వైభవ్ ధనాధన్ఈ క్రమంలో భారత ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే, ఆరోన్ 16 బంతుల్లో 23 పరుగులు చేసి జోరు మీదున్న వేళ జింబాబ్వే పేసర్ పనాషే మజాయ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో షాట్ బాదే క్రమంలో ఆరోన్.. సింబరెషెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.దీంతో వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను వైభవ్ సూర్యవంశీ తీసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో.. కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ పద్నాలుగేళ్ల బ్యాటర్. 52 పరుగులు చేసిమొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 52 పరుగులు చేసి నిష్క్రమించాడు. టటెండ చిముగొరొ బౌలింగ్లో సింబరెషెకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్గా వెనుదిరిగాడు. కాగా ఆయుశ్ మాత్రే (21) రూపంలో జింబాబ్వే రెండో వికెట్ దక్కించుకుంది. కాగా ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్లలో విజయాలు సాధించిన భారత్కు.. సూపర్ సిక్స్ దశలో ఇదే తొలి మ్యాచ్. తుదిజట్లుభారత్ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, కనిష్క్ చౌహాన్, ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, ఉద్ధవ్ మోహన్.జింబాబ్వేనథానియల్ హ్లబంగానా (వికెట్ కీపర్), టకుడ్జ్వా మకోని, కియాన్ బ్లిగ్నాట్, వెబ్స్టర్ మధిధి, ధ్రువ్ పటేల్, లీరోయ్ చివౌలా, సింబరెషె మడ్జెంగెరెరే (కెప్టెన్), బ్రాండన్ సెంజెర్, మైఖేల్ బ్లిగ్నాట్, టాటెండ చిముగోరో, పనాషే మజాయ్.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్!𝙒𝙞𝙙𝙩𝙝 𝙤𝙣 𝙤𝙛𝙛𝙚𝙧, & Vaibhav Sooryavanshi accepted it with interest! 🤌Team India are off to a flying start💥#ICCMensU19WC | #INDvZIM 👉 LIVE NOW ➡️ https://t.co/ty11gF03Wh pic.twitter.com/tEXWCDWeuA— Star Sports (@StarSportsIndia) January 27, 2026 -
IND vs SA: కెప్టెన్ వైభవ్ సూపర్ హిట్.. సిరీస్ క్లీన్స్వీప్
భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్గా అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. అతడి సారథ్యంలోని యువ భారత్ సౌతాఫ్రికాను తమ స్వదేశంలోనే మట్టికరిపించింది. మూడు యూత్ వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసి సఫారీ గడ్డపై జయభేరి మోగించింది.తొలిసారి సారథిగాబెనోని వేదికగా మూడో యూత్ వన్డేలో ఏకంగా 233 పరుగుల తేడాతో సౌతాఫ్రికా అండర్-19 జట్టును చిత్తు చేసి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) గైర్హాజరీ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తొలిసారి భారత యువ జట్టు పగ్గాలు చేపట్టాడు.సౌతాఫ్రికాతో యూత్ వన్డే సిరీస్లో భాగంగా బ్యాటర్గా, సారథిగా వైభవ్ రాణించాడు. తొలి రెండు వన్డేల్లో గెలిచి ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేలోనూ అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వైభవ్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 393 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఆరోన్, వైభవ్ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (106 బంతుల్లో 118), వైభవ్ సూర్యవంశీ (74 బంతుల్లో 127) శతక్కొట్టగా.. మిగిలిన వారు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక 63 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల తొమ్మిది నెలలు) ఈ ఘనత సాధించిన కెప్టెన్గా చరిత్రకెక్కాడు.కిషన్ కుమార్ సింగ్ దెబ్బకుసౌతాఫ్రికా బౌలర్లలో టాండో సోనీ మూడు వికెట్లు తీయగా.. జేసన్ రోవెల్స్ రెండు, మైకేల్ క్రుయిస్కాంప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటిస్ యువ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ పేసర్ కిషన్ కుమార్ సింగ్ దెబ్బకు టాపార్డర్ కకావికలమైంది.ఓపెనర్లు జెరిచ్ వాన్ షాల్విక్ (1), అద్నాన్ లగడెయిన్ (9) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్డౌన్లో వచ్చిన లెతాబో ఫహ్లమ్హొలక డకౌట్ అయ్యాడు. ఈ ముగ్గురిని అవుట్ చేసి కిషన్ శుభారంభం అందించగా.. మిగతా బౌలర్లు దానిని కొనసాగించారు.వైభవ్ సూర్యవంశీ బౌలింగ్లోఇక ప్రొటిస్ బ్యాటర్లలో కెప్టెన్ ముహమద్ బుల్బులియా (4) కూడా తీవ్రంగా నిరాశపరచగా.. జేసన్ రోవెల్స్ 19 పరుగులు చేయగలిగాడు. డేనియల్ బోస్మాన్ (40), పాల్ జేమ్స్ (41), కోర్నె బోతా (36 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. మిగిలిన వారిలో మైకేల్ (1), జేజే బాసన్ (1) తేలిపోగా.. వైభవ్ సూర్యవంశీ బౌలింగ్లో ఆఖరి వికెట్గా టాండో సోనీ (6) వెనుదిరగడంతో భారత్ గెలుపు ఖరారైంది.భారత బౌలర్లలో కిషన్ కుమార్ మూడు, మొహమెద్ ఇనాన్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, ఉద్ధవ్ మోహన్, ఆర్ఎస్ అంబరీశ్, లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగల వైభవ్ సూర్యవంశీ తలా ఒక వికెట్ తీశారు. బ్యాటర్గా, కెప్టెన్గా రాణించిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు
భారత అండర్-19 స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి శతక్కొట్టాడు. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో బుధవారం నాటి మూడో యూత్ వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇరవై నాలుగు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు.ప్రపంచ రికార్డుకేవలం 63 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు.127 పరుగులుబెనోనీ వేదికగా ఈ మ్యాచ్లో మొత్తంగా 74 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. తొమ్మిది ఫోర్లు, పది సిక్స్లు బాది 127 పరుగులు సాధించాడు. టాండో సోని బౌలింగ్లో జేసన్ రోవెల్స్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ సైతం దుమ్ములేపాడు.227 పరుగుల భాగస్వామ్యంఆరోన్తో కలిసి వైభవ్.. తొలి వికెట్కు ఏకంగా 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మరోవైపు.. ఆరోన్ సైతం శతక్కొట్టాడు. 106 బంతుల్లో 16 ఫోర్లు బాది 118 పరుగులు సాధించి జేసన్ రోవెల్స్ బౌలింగ్లో నిష్క్రమించాడు. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ వేదాంత్ త్రివేది 34, అభిజ్ఞాన్ కుందు 21 పరుగులు చేయగా.. మొహమద్ ఎనాన్ 28, హెనిల్ పటేల్ 19 పరుగులతో అజేయంగా నిలిచారు. హర్వన్ష్ పంగాలియా (2), ఆర్ఎస్ అంబరిష్ (8), కనిష్క్ చౌహాన్ (10) విఫలమయ్యారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది.కెప్టెన్గా మొదటిసారే..కాగా ఆయుశ్ మాత్రే గైర్హాజరీలో సౌతాఫ్రికా పర్యటనలో వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా భారత జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. బ్యాటర్గా, కెప్టెన్గా రాణిస్తూ ఇప్పటికే తొలి రెండు యూత్ వన్డేల్లో గెలిచి.. సారథి హోదాలో తొలి సిరీస్ను సొంతం చేసుకున్నాడు వైభవ్. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చదవండి: బంగ్లాదేశ్కు భారీ షాక్ -
IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేలవ బ్యాటింగ్తో నిరాశపరిచాడు. భారీ అంచనాల నడుమ సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. గతేడాది ఐపీఎల్లో సంచలన సెంచరీతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)... ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు.సెంచరీల మోతఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో సెంచరీల మోత మోగించాడు. ఇటీవల ఆసియా అండర్-19 వన్డే కప్లోనూ రాణించిన వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుత ప్రదర్శనలకు గానూ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నాడు. ఇక అంతకు ముందే విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలో బిహార్ తరఫున వైస్ కెప్టెన్ హోదాలో భారీ శతకం బాదాడు.తాత్కాలిక కెప్టెన్గాఅనంతరం సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో (IND U19 Vs SA U19) యూత్ వన్డేలతో వైభవ్ సూర్యవంశీ బిజీ అయ్యాడు. కొత్త ఏడాదిలోని ఈ తొలి టూర్లో భాగంగా భారత అండర్-19 జట్టు సౌతాఫ్రికా యువ జట్టుతో మూడు యూత్ వన్డేలు ఆడనుంది. తొలి మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే దూరం కాగా.. వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.బెనోని వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత యువ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఇటీవలి కాలంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతూ ఫామ్లో ఉన్న ఆరోన్ జార్జ్ (5) ఓపెనర్గా వచ్చి విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో.. తన దూకుడైన శైలికి భిన్నంగా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.11 పరుగులు చేసిఅయితే, 12 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసిన వైభవ్.. జేజే బాసన్ బౌలింగ్లో లెథాబోకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఇలా వైభవ్ విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి వన్డౌన్లో వచ్చిన వేదాంత్ త్రివేది (21), వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (21) కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలో 15 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులే చేసి కష్టాల్లో కూరుకుపోయింది.చదవండి: టీ20 ప్రపంచకప్-2026: అభిషేక్ శర్మపై కూడా వేటు వేస్తారా? -
వరల్డ్కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు.. ఎవరీ ఆరోన్ జార్జ్?
అండర్-19 ప్రపంచకప్ 2026కు భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు ఆయుశ్ మాత్రే సారథ్యం వహించనుండగా... విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్కు ముందు భారత యువ జట్టు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యాడు. దీంతో మాత్రే స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టు బాధ్యతలను చేపట్టనున్నాడు.కాగా వరల్డ్కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్కు చోటు దక్కింది. ఆసియాకప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ప్రపంచకప్ జట్టులోనూ సెలక్టర్లు కొనసాగించారు. సౌతాఫ్రికా పర్యటనలో సూర్యవంశీకి డిప్యూటీగా జార్జ్ వ్యవహరించాడు. దీంతో జార్జ్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.ఎవరీ ఆరోన్ జార్జ్..?19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినప్పటికీ.. జానియర్ స్దాయి క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్కు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డర్ ఆటగాడికి పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా ఉంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉందంటే అందరి చూపు జార్జ్పైనే ఉంటుంది.అతడి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పోలి ఉంటుంది. అదేవిధంగా అతడికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్గా హైదరాబాద్కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ( 2022-23)లో బీహార్పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని జార్జ్ ఆకర్షించాడు. గత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్గా కూడా అతడు వ్యవహరించాడు.ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే జార్జ్ను ప్రత్నమ్నాయంగా తీసుకునే అవకాశముంది. సీఎస్కే తరపున దుమ్ములేపుతున్న మాత్రే కూడా అలా వచ్చినవాడే.అండర్–19 వరల్డ్కప్నకు భారత జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వర్దన్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్. దక్షిణాఫ్రికా సిరీస్కు భారత అండర్–19 జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెపె్టన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెపె్టన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు, హర్వర్దన్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్. -
మరోసారి మెగా ఫైనల్లో భారత్ X పాకిస్తాన్
మరోసారి మెగా ఫైనల్లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఏసీసీ మెన్స్ ఆసియా కప్-2025 టోర్నీ టైటిల్ పోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. పవర్ప్లేలో 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంకను కాసేపు కెప్టెన్ విమత్ దిన్సార (32; 4 ఫోర్లు), చమిక హీనతిగల (42; 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఇద్దరు తర్వాతి 6 ఓవర్ల పాటు వికెట్ పడనీయకుండా నాలుగో వికెట్కు 45 పరుగులు జతచేశారు.ఆఖర్లో సేత్మిక సేనెవిరత్నే (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో లంక 130 పైచిలుకు స్కోరు చేయగలిగింది. యువ భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (7), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 9)లు విఫలమయ్యారు. 25/2 స్కోరు వద్ద లంక పండగ చేసుకుంది.విహాన్ మల్హోత్ర, ఆరోన్ జార్జ్ ధనాధన్అయితే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకాలతో లంకేయుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరు జట్టును గెలిపించేదాకా క్రీజును అట్టిపెట్టుకోవడంతో లంక బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.అబేధ్యమైన మూడో వికెట్కు విహాన్, ఆరోన్ 114 పరుగులు జోడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ విహాన్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా వర్షం వల్ల ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు.పదకొండేళ్ల తర్వాతఇక మరో సెమీఫైనల్లో దుబాయ్లోని ది సెవెన్స్ స్టేడియంలో పాకిస్తాన్ కూడా 8 వికెట్ల తేడాతోనే బంగ్లాదేశ్పై గెలుపొందింది. వర్షం కారణంగా 27 ఓవర్లకు మ్యాచ్ కుదించగా.. బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 16.3 ఓవర్లలోనే పాకిస్తాన్ కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్కు అర్హత సాధించింది.కాగా పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ (అండర్–19లో) ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. చివరిసారిగా 2014లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్ను ఓడించిన యువ భారత్ టైటిల్ సాధించింది. కాగా తాజా ఆసియా కప్ లీగ్ దశ మ్యాచ్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.వేదిక, టైమింగ్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటేభారత్- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్కు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు మ్యాచ్ మొదలు అవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), సోనీ లివ్ (డిజిటల్) యాప్లో ప్రత్యక్ష ప్రసారం.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
ఆరోన్ జార్జికు చోటు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో 12 నుంచి 21 వరకు దుబాయ్ వేదికగా జరిగే అండర్–19 ఆసియా కప్ టోరీ్నలో పోటీపడే భారత జట్టును ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన ఆరోన్ జార్జికు ఈ జట్టులో స్థానం లభించింది. ఆరోన్ జార్జి సారథ్యంలో ఇటీవలే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీలో తొలిసారి విజేతగా నిలిచింది. 15 మంది సభ్యులతో కూడిన భారత అండర్–19 జట్టుకు ముంబైకు చెందిన ఆయుశ్ మాత్రే సారథిగా వ్యవహరిస్తాడు. విహాన్ మల్హోత్రా వైస్కెపె్టన్గా ఎంపికయ్యాడు. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ టోరీ్నలో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లపై అందరి దృష్టి నిలవనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జింబాబ్వే, నమీబియా వేదికగా అండర్–19 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నమెంట్ భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇటీవల రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో 32 బంతుల్లోనే సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ... ఈ టోరీ్నలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది ఆసక్తికరం. టోరీ్నలో భాగంగా డిసెంబర్ 12న భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రత్యర్థి ఇంకా తేలలేదు. రెండో మ్యాచ్లో 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. డిసెంబర్ 16న మూడో లీగ్ మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 19న సెమీఫైనల్స్, 21న ఫైనల్ జరగనున్నాయి. భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్, హర్వన్‡్ష, యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్, నమన్, దీపేశ్, హెనిల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జి. స్టాండ్బై ప్లేయర్లు: రాహుల్, హెమ్చుడెశన్, కిషోర్, ఆదిత్య రావత్. -
యువరాజ్ ఒంటరి పోరాటం.. భారత్ను చిత్తు చేసిన అఫ్గాన్
అఫ్గానిస్తాన్, భారత్-ఎ అండర్-19 మక్కోణపు వన్డే టోర్నీలో భారత్-బి జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్-బి జట్టును 71 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కేవలం 169 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్-బి జట్టు చతికలపడింది. అఫ్గాన్ బౌలర్ల దాటికి భారత్ 29.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది.యువరాజ్ ఒంటరి పోరాటంఓపెనర్ యువరాజ్ గోహిల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. యువరాజ్ 80 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి ఇతరల నుంచి కనీస సపోర్ట్ లభించలేదు. అఫ్గాన్ పేసర్ అబ్దుల్ అజీజ్ 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.తన 10 ఓవర్ల కోటాలో కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. అతడితో పాటు సలీం ఖాన్, జద్రాన్ తలా రెండు వికెట్లు సాధించారు.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ యువ జట్టు ఇండియా బౌలర్లు చెలరేగడంతో 45.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో ఫైసల్ షినోజాడా(58) టాప్ స్కోరర్గా నిలవగా.. అజీజుల్లా మియాఖిల్(42) ఫర్వాలేదన్పించారు.మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఇండియా-ఎతో జరిగిన మ్యాచ్లో కూడా జార్జ్ సారథ్యంలోని భారత్ ఓటమి పాలైంది.చదవండి: IPL 2026: ‘పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?’ -
భారత జట్టు కెప్టెన్గా హైదరాబాద్ కుర్రాడు
అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్కు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లు అఫ్గానిస్తాన్తో తలపడనున్నాయి. ఇండియా-ఎ జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహించనుండగా.. బి జట్టు కెప్టెన్గా హైదరాబాదీ ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ఆరోన్ ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ టోర్నీ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.ఆరోన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో గత మూడేళ్లుగా ఆరోన్ జార్జ్ టాప్ స్కోరర్గా నిలుస్తూ వచ్చాడు. ఈ సీజన్లో అతను 2 సెంచరీలు సహా 373 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. స్కూల్ క్రికెట్లో మంచి ప్రదర్శనతో మూడేళ్ల క్రితం హైదరాబాద్ అండర్–16 టీమ్లోకి వచ్చిన అతను విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. ఇక 2022–23 సీజన్లో ఒక ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించడంతో ఆరోన్కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అతను భవాన్స్ కాలేజీలో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. భారత్కు ఆడటమే లక్ష్యం‘ఏ స్థాయిలోనైనా భారత జట్టు తరఫున ఆడాలనేది నా కల. ప్రస్తుత నా ప్రదర్శన, లభిస్తున్న అవకాశాలు ఆ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నా. అండర్–19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని కేరళ మూలాలు ఉన్న ఆరోన్ పేర్కొన్నాడు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆరోన్ జార్జి వీలు చిక్కినపుడల్లా కొట్టాయంలో ఉంటున్న తన తాత, బామ్మ ఇళ్లకు వెళ్లి వస్తుంటాడు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది. అండర్-19 స్థాయిలోని ‘ఎ’, ‘బి’ జట్లు సొంతగడ్డపై అఫ్గన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నవంబర్ 17 నుంచి 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా తమ అండర్-19 జట్టు భారత్- ‘ఎ’, ‘బి’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు ఇటీవలే అఫ్గనిస్తాన్ బోర్డు ప్రకటించింది. ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉంటుందని పేర్కొంది.ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటుఈ నేపథ్యంలో అఫ్గన్తో సిరీస్కు తాజా తమ జట్లను ప్రకటించిన భారత్.. అనూహ్యంగా ఈ టీమ్ నుంచి సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), కెప్టెన్ ఆయుశ్ మాత్రేలను తప్పించింది. కాగా పద్నాలుగేళ్ల వైభవ్ గత కొంతకాలంగా భారత్ తరఫున సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ అండర్-19 జట్టులో భాగమైన ఈ బిహారీ పిల్లాడు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చాడు.ఈ క్రమంలో అఫ్గనిస్తాన్తో ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ భాగం కావడం లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ సిరీస్ ఆడే రెండు భారత జట్లలోనూ వైభవ్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే విధంగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రేను కూడా సిరీస్కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అందుకే వైభవ్ను ఎంపిక చేయలేదుఇందుకు గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ‘‘వైభవ్ సూర్యవంశీ పేరును ఈ సిరీస్కు పరిశీలించలేదు. అతడు ఇండియా- ‘ఎ’ తరఫున ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యాడు కాబట్టి.. ఈ సిరీస్ నుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.ఇక ముంబై తరఫున ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న కారణంగా ఆయుశ్ మాత్రేను కూడా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. అఫ్గన్ అండర్-19తో తలపడే భారత ‘బి’ టీమ్లో వికెట్ కీపర్గా టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్కు చోటు దక్కడం విశేషం.అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో తలపడే భారత అండర్-19 ‘ఎ’ జట్టు ఇదేవిహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, A. రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మొహమ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహిదా, ఆదిత్య రావత్, మొహమ్మద్ మాలిక్.భారత్ అండర్-19 ‘బి’ జట్టుఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, మౌల్యరాజాసిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీశ్, బీకే కిషోర్, నమన్ పుష్పక్, హేముచుందేషన్ జె, ఉద్ధవ్ మోహన్, ఇషాన్ సూద్, డి దీపేశ్, రోహిత్ కుమార్ దాస్.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, యుద్ద్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ. చదవండి: శభాష్ షహబాజ్


