-
నాడు పాక్లో తలదాచుకున్న కుటుంబం.. డాక్టర్ కావాలనుకున్న రషీద్ ఇప్పుడిలా
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్తో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. పదకొండేళ్ల వ్యవధిలో.. వన్డేల్లో పాక్తో తలపడిన 7 సార్లూ అఫ్గాన్కు ఓటమే ఎదురైంది. విజయానికి కొన్నిసార్లు చేరువగా రాగలిగినా.. లక్ష్యాన్ని అందుకోవడం మాత్రం అఫ్గాన్ల వల్ల కాలేదు. కానీ ఈసారి లెక్క మారింది. అప్పటికి ఇంగ్లండ్పై గెలిచిన అఫ్గన్.. మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి పాక్ను చిత్తు చేయడంలో సఫలమైంది. ఈ గెలుపుతో వచ్చిన జోష్లో తర్వాత మరో రెండు మ్యాచ్లు నెగ్గి.. ప్రపంచకప్లో తొలిసారిగా సెమీస్ రేసులోనూ నిలవగలిగింది. ఇక పాకిస్తాన్పై చిరస్మరణీయమైన విజయం తర్వాత కీలక సభ్యుడైన రషీద్ ఖాన్ ఆట పాటతో మైదానంలోనే సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం జట్టుదే కావచ్చు. కానీ రషీద్కు సంబంధించి ఇది మరింత ప్రత్యేకం. ఎందుకంటే అఫ్గానిస్తాన్ ఒక జట్టుగా ఎదగడంలో అతడి పాత్ర కూడా ఎంతో కీలకం. వరుస పరాజయాల నుంచి బయటపడి క్రికెట్ వేదికపై టీమ్గా ఆ జట్టు సత్తా చాటడంలో రషీద్ కూడా ప్రధాన భాగస్వామి. సరిగ్గా చెప్పాలంటే అఫ్గాన్ క్రికెట్తో పాటు సమాంతరంగా అతనూ ఎదిగాడు. అంతకుమించి కూడా వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తమ సొంత దేశంలో యుద్ధ వాతావరణం, మరెన్నో ప్రతికూలతలను అధిగమించి ఈ స్థాయికి చేరిన అతని పట్టుదల, కఠోర సంకల్పం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక దశలో యుద్ధ భయంతో పాకిస్తాన్కు వలస వెళ్లిపోయి అక్కడే దేశవాళీ క్రికెట్లోనూ సత్తా చాటి వెలుగులోకి వచ్చిన రషీద్ ప్రస్థానం అసాధారణం. తొలి గ్లోబల్ సూపర్ స్టార్ అఫ్గానిస్తాన్ దేశం నుంచి వచ్చిన తొలి గ్లోబల్ సూపర్ స్టార్.. ఈ వాక్యం రషీద్ఖాన్కు సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ప్రపంచవ్యాప్తంగా రషీద్ వేర్వేరు టోర్నీలు, లీగ్స్లో ఏకంగా 30 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో తన సొంత దేశం నుంచి పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలు అటు ఆస్ట్రేలియా నుంచి అమెరికా, ఇంగ్లండ్కు చెందిన జట్ల వరకు ఉన్నాయి. అన్నింటా, అంతటా ఎక్కడ ఆడినా అతనికి అన్ని వైపుల నుంచి అభిమానం దక్కింది. క్రికెట్ ప్రేమికులందరూ లెగ్స్పిన్నర్గా రషీద్ ఆటను చూసి చప్పట్లు కొట్టినవారే! ఏదో ఒక దశలో తమవాడిగా సొంతం చేసుకున్నవారే. సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ను అడిగితే చెప్తారు ఐపీఎల్లో అతని విలువేంటో, అతని ప్రభావం ఎలాంటిదో! తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టినప్పుడే 2017 నుంచి ఐదు సీజన్ల పాటు హైదరాబాద్కు ఆడిన అతను గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని గూగ్లీలు ప్రపంచంలో ఎంతటి బ్యాటర్నైనా ఇబ్బంది పెడతాయి. తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టినప్పుడే అతను అసోసియేట్ టీమ్ నుంచి ఈ మెగా లీగ్లో ఆడిన తొలి ఆటగాడిగా కొత్త ఘనతతో బరిలోకి దిగాడు. అదీ ఏకంగా రూ. 4 కోట్ల విలువతో రైజర్స్ అతడిని ఎంచుకుంది. అప్పటి నుంచి అతను ఒక వైపు తన ఫ్రాంచైజీ టీమ్లకు, మరో వైపు జాతీయ జట్టుకు స్టార్గా మారాడు. ఇంకా చెప్పాలంటే అతను రాక ముందు వేళ్ల మీద లెక్కించగలిగే విజయాలు మాత్రమే సాధించిన అఫ్గానిస్తాన్ ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు కారణమైందంటే అందులో రషీద్ పాత్ర ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధ వాతావరణం నుంచి వచ్చి... అఫ్గానిస్తాన్లోని నన్గర్హర్ రాష్ట్రం అతని స్వస్థలం. ఏడుగురు అన్నదమ్ముల్లో అతను ఆరోవాడు. చాలామంది లాగే తన అన్నలు సరదాగా టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతుండటం చూసి అతనికీ ఆసక్తి కలిగింది. అయితే ఆ దేశంలో పరిస్థితులు కనీస స్థాయిలో కూడా లేవు. కాబట్టి ఇంతకంటే మెరుగ్గా క్రికెట్లో ఏమీ చేయలేమనేది అందరి భావన. డాక్టర్ కావాలనుకుంటే విధిరాత మరోలా పెద్దయ్యాక తామేం కావాలో కలలు కనే అందరి పిల్లల్లానే చిన్నప్పుడు రషీద్ కూడా డాక్టర్ కావాలని, కంప్యూటర్స్ నేర్చుకొని పెద్ద స్థాయికి చేరుకోవాలని, మంచి ఇంగ్లిష్ నేర్చుకొని టీచర్ కావాలని.. ఇలా చాలా కలలు కన్నాడు. కానీ అతనికి మరో విధంగా రాసి పెట్టి ఉంది. రషీద్ ఉండే ఊరు బాటి కోట్ పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది. పెషావర్ సమీప నగరం. చిన్న చిన్న క్రికెట్ టోర్నీలు ఆడేందుకు ఇక్కడివారు అక్కడికి, అక్కడివారు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి సమయంలో నజీమ్ అనే మేనేజర్ రషీద్లోని ప్రతిభను గుర్తించాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అర్థం కాని అతని బౌలింగ్ శైలి నజీమ్ను ఆకర్షించింది. తన మాట మీద పెషావర్లోని ఒక కళాశాల కోచింగ్ కార్యక్రమంలో రషీద్ను అక్కడివారు తీసుకున్నారు. పాకిస్తాన్కు వలస వెళ్లి దాంతో రషీద్కు కొత్త తరహా శిక్షణ లభించింది. అప్పటి వరకు ఎలాంటి నాణ్యత లేని సిమెంట్ టర్ఫ్లపై ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన అతనికి అసలైన క్రికెట్ ఏమిటో అర్థమైంది. దాదాపు అదే సమయంలో అఫ్గానిస్తాన్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. కారణాలు ఏమైనా తీవ్రవాదుల హల్చల్, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం పరిస్థితులను ఇబ్బందికరంగా మార్చాయి. దాంతో రషీద్ కుటుంబం మొత్తం పాకిస్తాన్లోని పెషావర్కే వెళ్లి తలదాచుకుంది. అక్కడ అతడిని చాలా మంది ముహాజిర్ (శరణార్థి) అంటూ ఆట పట్టించినా.. తన క్రికెట్తో అతను అన్ని మరచిపోయేవాడు. తిరుగులేని ప్రదర్శనతో... అపార ప్రతిభ ఉండటంతో పాకిస్తాన్లో జరిగే పలు దేశవాళీ టోర్నీల్లో రషీద్ చెలరేగిపోయాడు. అయితే సహజంగానే జాతీయ బోర్డు నిబంధనల కారణంగా అతనికి పాక్ టీమ్లో అవకాశాలైతే రాలేదు. కానీ అప్పటికే మెరికలా మారిన అతను తన సొంత దేశం చేరి ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు. పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ తమ కోచ్గా రావడం రషీద్ కెరీర్ను మలుపు తిప్పింది. ఇంజమామ్ ఒత్తిడి తేవడంతో జింబాబ్వే పర్యటనకు తొలుత.. అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. రషీద్ను తీసుకున్న తర్వాతే మిగతా విషయాలు మాట్లాడదామంటూ ఇంజమామ్ ఒత్తిడి తేవడంతో స్థానం ఖాయమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు చూస్తే అందరికంటే ముందుగా రషీద్ పేరుతోనే టీమ్ షీట్ తయారు కావడం విశేషం. జింబాబ్వే సిరీస్తో అరంగేట్రం చేసిన రషీద్ ఆ తర్వాత అమిత వేగంగా దూసుకుపోయాడు. ఆ తర్వాత లెక్కలేనన్ని ఘనతలు అతడి ఖాతాలో వచ్చి చేరాయి. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా, టి20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్గా పలు ఘనతలు అతడి జాబితాలో చేరాయి. సహాయకార్యక్రమాల్లో ముందుంటూ... భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ మొదలైన రెండు రోజులకు.. అఫ్గానిస్తాన్ జట్టు తమ తొలి మ్యాచ్లో ధర్మశాల మైదానంలో మరికొద్ది సేపట్లో బంగ్లాదేశ్తో తలపడేందుకు సన్నద్ధమైంది. అప్పుడే ఒక విషాద వార్త బయటకు వచ్చింది. అఫ్గానిస్తాన్ దేశాన్ని అతి పెద్ద భూకంపం కుదిపేసింది. మ్యాచ్ ఫీజును విరాళంగా దేశంలో మూడో పెద్ద నగరమైన హిరాట్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎలాగోలా అఫ్గాన్ ఆటగాళ్లు మ్యాచ్ను ముగించేశారు. ఆ వెంటనే జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన తరఫు నుంచి మొత్తం ప్రపంచకప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించేశాడు. ఆపై తగిన సహాయం చేయాలంటూ తన ఫౌండేషన్ ద్వారా కోరాడు. ఒకవైపు టోర్నీలో సత్తా చాటుతూ మరోవైపు తన సన్నిహితుల సహకారంతో అతను అఫ్గానిస్తాన్లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నాడు. నిధులతో పాటు పునరావాస కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. 25 ఏళ్ల రషీద్ ఇలా స్పందించడం మొదటిసారి కాదు. గతంలోనూ తన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగం కావడంతోపాటు తన సొంత డబ్బుతో చిన్నారుల చదువు, పేదలకు సహకారం వంటి పనుల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అక్కడి పరిస్థితులు కూడా తన దేశం కోసం ఏదైనా చేయాలనే ప్రేరణను కలిగిస్తాయని అతను చెబుతుంటాడు. పేద దేశం, టెర్రరిజం మొదలు ఇతర తీవ్రమైన ప్రతికూలతలకు ఎదురొడ్డి తాను ఇప్పుడు ఒక గొప్ప ఆటగాడిగా ఎదగడం వరకు ఎక్కడా తన మూలాలను మర్చిపోలేదు. ప్రపంచంలో ఏ చోట క్రికెట్ ఆడుతున్నా.. సాయం చేసేందుకు ఎప్పుడైనా సిద్ధమని అతను అన్నాడు. అదే అతడిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్
ICC ODI WC 2023- Pakistan Squad: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించిన వెటరన్ స్పిన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీంకు భంగపాటు తప్పలేదు. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలుకానున్న ఈ ఐసీసీ ఈవెంట్కు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఇమాద్.. స్పిన్ దళంలో ఒకడిగా తప్పక టీమ్లోకి వస్తాడని భావించివారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఇమాద్ వసీంను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. అలాంటి వాళ్లనే ఎంపిక చేస్తాం ‘‘చాలా రోజులుగా ఇమాద్ వన్డేలు ఆడటం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో తమను తాము నిరూపించుకోవాల్సిందే. అందుకే అతడికి చోటు లేదు డొమెస్టిక్ క్రికెట్లో ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అదే మెయిన్ క్రైటీరియా’’ అని ఇంజమామ్ ఉల్ హక్ స్పష్టం చేశాడు. కాగా వరల్డ్కప్నకు ప్రకటించిన జట్టులో నసీం షా స్థానంలో హసన్ అలీ రీఎంట్రీ ఇస్తుండగా.. మహ్మద్ వసీం జూనియర్ నాలుగో సీమర్గా చోటు సంపాదించాడు. అనూహ్య రీతిలో ఉస్మా మీర్కు కూడా స్థానం దక్కింది. ఇదిలా ఉంటే.. సీపీఎల్లో జమైకా తల్లావాస్కు ఆడుతున్న ఇమాద్ వసీం 10 మ్యాచ్లలో 14 వికెట్లు తీయడంతో పాటు 268 పరుగులు సాధించాడు. కాగా పాక్ తరఫున ఇప్పటి వరకు 55 వన్డేలు ఆడిన 34 ఏళ్ల ఇమాద్.. 986 పరుగులు చేయడంతో పాటు.. 44 వికెట్లు పడగొట్టాడు. చివరగా 2020లో జింబాబ్వేతో సొంతగడ్డపై వన్డే ఆడాడు. చదవండి: Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే? 🚨 Our squad for the ICC World Cup 2023 🚨#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/pJjOOncm56 — Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023 -
సచిన్, ద్రవిడ్ కాదు.. అతడే ఆసియాలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్: సెహ్వాగ్
ప్రముఖ క్రికెట్ ప్రేజేంటర్ గౌరవ్ కపూర్ హోస్ట్ చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి చేశాడు. ఈ షోలో పాల్గొన్న సెహ్వాగ్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆసియాలో అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరని గౌరవ్ కపూర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా అతడు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కాకుండా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ను ఎంపిక చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. కాగా 2000లలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలతో పోటీపడిన ఆటగాళ్లలో ఇంజమామ్ వుల్ హక్ ఒకడు. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో 498 మ్యాచ్లు ఆడిన ఇంజమామ్.. 20,569 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 25 సెంచరీలు, వన్డేల్లో 10 సెంచరీలు సాధించాడు. అయితే వన్డేల్లో మాత్రం 83 హాఫ్ సెంచరీలు ఇంజమామ్ చేశాడు. "అందరూ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతారు. కానీ ఇంజమామ్-ఉల్-హక్ ఆసియాలో అతిపెద్ద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అయితే సచిన్ పాజీ అందరి కంటే ముందున్నాడు. అతడికి ఎవ్వరితో పోటీ లేదు. కానీ ఆసియాలో మాత్రం అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే.. ఇంజమామ్ను మించిన వారు లేరు. 2003-04 కాలంలో ఇంజమామ్ ఓవర్కి 8 పరుగులు చేసేవాడు. అతను తన బ్యాటింగ్ పార్టనర్కి భయపడొద్దు అని ధైర్యం చేప్పేవాడు. ఓ మ్యాచ్లో ఆఖరి 10 ఓవర్లలో 80 పరుగులు అవసరం. ఇటువంటి సమయంలో ఏ ఆటగాడైనా ఒత్తడికి గురవుతాడు. కానీ ఇంజమామ్ మాత్రం చాలా కూల్గా ఉంటాడు. అదే విధంగా 2005లో ఓ మ్యాచ్లో డానిష్ కనేరియా రౌండ్ది వికెట్ బౌలింగ్ చేసి కాస్త ఇబ్బంది పెట్టాడు. భారీ షాట్లు ఆడకుండా నన్ను ఆపేందుకు కనేరియా ప్రయత్నించాడు. నేను ఒకట్రెండు ఓవర్లు ఢిపెన్స్ ఆడాను. ఆ తర్వాత ఇంజమామ్ వైపు తిరిగి... ‘‘ఇంజీ భాయ్... నా కాళ్లు నొప్పి పెడుతున్నాయ్. ఎంత సేపు డిఫెన్స్ ఆడాలని’’ అని అన్నాను. దానికి అతడు ‘‘నన్నేం చేయమంటావ్’’ అన్నాడు. అందుకు బదులగా "సర్కిల్ లోపలకి లాంగ్ ఆన్ ఫీల్డర్ని తీసుకురా, నేను సిక్స్ కొడతా అని ఇంజీతో చెప్పా. దానికి ఇంజమామ్ నవ్వాడు. ‘‘సరే నేను సిక్సర్ కొట్టపోతే ఆ ఫీల్డర్ని మళ్లీ వెనక్కిపంపించు’’ అని చెప్పాను. అందుకు అతడు అంగీకరించి ఫీల్డర్ని సర్కిల్ లోపలకి పిలిచాడు. కనేరియా గూగ్లీ వేయగా.. నేను చెప్పినట్లగానే బంతిని స్టాండ్స్కు పంపించాను. ఫీల్డింగ్ మార్చినందుకు కనేరియాకు ఒక్క సారిగా కోపం వచ్చింది. వెంటనే కెప్టెన్ దగ్గరికి వెళ్లి ‘ఇంజీ భాయ్, మీరు ఫీల్డర్ను ఎందుకు పైకి తీసుకువచ్చారు? అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా నువ్వు సైలెంట్గా వెళ్లి బౌలింగ్ చెయి, లేదంటే బయటకు వెళ్లిపోతావు అని ఇంజీ భాయ్ అన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. -
52 ఏళ్ల వయసులోనూ ఇంజీ పవర్ఫుల్ సిక్సర్.. ఆశ్చర్యపోయిన ఆఫ్రిది!
Inzamam Ul Haq- Shahid Afridi: విజయవంతమైన కెప్టెన్గా పేరొందిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికి 15 ఏళ్లకు పైనే అవుతోంది. జింబాబ్వేతో 2007లో జరిగిన వన్డే సిరీస్లో భాగంగా పాక్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు ఇంజీ! అయితే, యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులను అలరిస్తున్న ఈ మాజీ సారథి... తాజాగా.. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. అదిరిపోయే షాట్ పాకిస్తాన్లో మెగా స్టార్స్ లీగ్ పేరిట ఆరు జట్ల మధ్య టీ10 లీగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఇంజమామ్.. 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే, క్రీజులో ఉన్నంత సేపు బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు ఇంజీ. ఈ క్రమంలో అతడు కొట్టిన పవర్ఫుల్ సిక్సర్ హైలైట్గా నిలిచింది. 52 ఏళ్ల వయసులోనూ పవర్హిట్టింగ్ చేసిన ఇంజీని అలా చూస్తూ ఉండిపోయారు అభిమానులు. డగౌట్లో కూర్చున్న మరో మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది సైతం ఇంజీ భాయ్ షాట్కు ఆశ్చర్యపోయాడు. సోమవారం నాటి మ్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరుగుల వరద కాగా పాకిస్తాన్ తరఫున ఇంజమామ్ వన్డేల్లో మొత్తంగా 11,701 పరుగులు సాధించాడు. పాక్ తరఫున వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్గా నిలిచాడు. తన కెరీర్లో మొత్తంగా 120 టెస్టులు, 378 వన్డేలు ఆడాడు. 81 వన్డే మ్యాచ్లకు సారథ్యం వహించి 51 గెలిచాడు. చదవండి: Ajinkya Rahane: డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. Babar Azam: ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ.. Inzi Bhai scores 29 of just 16 and becomes the cricketainer of the day.#KingdomValleyMSL2022 #MSL #KingdomValleyMSL#MegaStarsLeague #Cricketainment #KingdomValley#CricketLeague #Cricket #ShahidAfridi #mediasniffers#Pakola #Daikin #Pindi #islamabad #InzimamUlHaq pic.twitter.com/EdkQVg6GmL — Mega Stars League (@megastarsleague) December 19, 2022 -
SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదు! కానీ..
Asia Cup 2022 Winner Sri Lanka- Inzamam Ul Haq Comments: ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకను విజేతగా నిలపడంలో ఆ జట్టు బ్యాటర్ భనుక రాజపక్సదే కీలక పాత్ర. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న వేళ నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. చాంపియన్గా నిలడంలో తన వంతు సాయం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు 30 ఏళ్ల రాజపక్స. తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన స్ట్రైక్రేటుతో భనుక రాజపక్స రాణించి తీరు ప్రశంసనీయం. పాక్తో ఫైనల్లో అతడి స్ట్రైక్రేటు 157.78. రాజపక్స అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. భనుక రాజపక్స ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఎక్కువ బంతులు తీసుకుని రాజపక్స కనుక ఈ డెబ్బై పరుగులు చేసి ఉంటే.. ఆ ఇన్నింగ్స్కు విలువే ఉండేది కాదని వ్యాఖ్యానించాడు. సరైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు. హసరంగ భళా రాజపక్స, హసరంగ! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇంజమామ్ మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘హసరంగ 31 పరుగులు... రాజపక్స 71 పరుగులు చేశాడు. ఈ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్. కఠిన పరిస్థితుల్లో.. ఒత్తిడిని జయించి వారు ఈ స్కోర్లు నమోదు చేశారు. ఒకవేళ ఈ డెబ్బై పరుగులు చేసేందుకు గనుక రాజపక్స ఎక్కువ బంతులు తీసుకుని ఉంటే.. అప్పుడు లంక జట్టు స్కోరు 140 వరకు వచ్చి ఆగిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ సులువుగానే ఆ లక్ష్యాన్ని ఛేదించేది. అప్పుడు రాజపక్స ఇన్నింగ్స్ వృథాగా పోయేది. దానికసలు విలువే ఉండేది కాదు’’ అంటూ టీ20 ఫార్మాట్లో స్ట్రైక్రేటుకు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పుకొచ్చాడు. మా వాళ్లు చాలా తప్పులు చేశారు ఇక తమ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘‘శ్రీలంక పేసర్లంతా కొత్తవాళ్లు. వాళ్లలో ఒక్కరికి కూడా తగినంత అనుభవం లేదు. అయినా.. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగారు. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీలో బాగానే ఆడింది.. కానీ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. చాలా పొరపాట్లు చేశారు. ఒత్తిడిని అధిగమించలేకపోయారు. ఆదిలో శ్రీలంకను 58-5కు కట్టడి చేయగలిగినా ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం’’ అని పాక్ ఆట తీరుపై ఇంజమామ్ ఉల్ హక్ విమర్శలు గుప్పించాడు. కాగా దుబాయ్ వేదికగా పాక్తో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 23 పరుగులతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. మెగా ఈవెంట్లో ఆరోసారి టైటిల్ గెలిచిన జట్టుగా దసున్ షనక బృందం నిలిచింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా శిఖర్ ధావన్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement