క్రికెట్ ప్రపంచంలో ప్రతీ శకంలో ఒక క్రికెటర్ తన ఆటతీరుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించడం సహజమే. కానీ తన దృష్టిలో మాత్రం ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరి శకంలో వారు తమ స్టైలీష్ ఆటతీరుతో క్రికెట్ గతినే మార్చేశారంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ యూ ట్యూబ్ ఇంటర్యూలో పేర్కొన్నాడు. మరి ఇంజమామ్ చెప్పిన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా.. సర్ వివి రిచర్డ్స్, సనత్ జయసూర్య, ఎబి డివిలియర్స్.ఇంజమామ్ మాట్లాడుతూ.. 'మొదటి శకంలో వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్మెన్ సర్ వివి రిచర్డ్స్ తన ఆటతీరుతో క్రికెట్ అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చాడు. అది ఎలా అంటే అరవీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ ఫుట్వర్క్ ఆధారం చేసుకొని రిచర్డ్స్ ఆడే షాట్లు ముచ్చట గొలిపేవి.
'ఆ ముగ్గురు క్రికెట్ గతిని మార్చారు'
Feb 18 2020 9:11 PM | Updated on Mar 22 2024 10:50 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement