
హైదరాబాద్: ఒకరిని మించి మరొకరు.. ఒకరి తర్వాత మరొకరు.. రెజ్లింగ్ బాహుబలుల సమరంతో స్టేడియం దద్దరిల్లింది. నగరంలో తొలిసారి జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) ఫైట్కు అద్భుత స్పందన లభించింది.

కిక్కిరిసిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రఖ్యాత రెజ్లర్లు తలపడిన ఈవెంట్ సూపర్హిట్ అనిపించుకుంది

ఆరేళ్ల తర్వాత భారత్లో ఈ ఫైట్ జరగడంతో నగరానికి చెందినవారితో పాటు ముంబై, ఢిల్లీలనుంచి కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు.

ముఖ్యంగా జాన్ సినా కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు అతని ఫైటింగ్ భాగ్యం దక్కింది. ఆ సమయంలో స్టేడియం మొత్తం ఊగిపోయింది. భారత గడ్డపై తొలిసారి సినా సత్తా ప్రదర్శించాడు
















