
సన్రైజర్స్ హైదారాబాద్ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతోంది.

ప్యాట్ కమిన్స్ కెకెప్టెన్సీలో ఆరెంజ్ ఆర్మీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది.

అవాంతరాలన్నీ దాటి ఫైనల్ చేరి.. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఇక సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత ఆట తీరుతో రాణిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ను ఓ బ్యూటీ కలిశారు.

వారితో కలిసి హైదరాబాద్లో బిర్యానీ ఎంజాయ్ చేశారు.

ఆమె మరెవరో కాదు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్ కుమార్తె గ్రేస్ హెడెన్.

కంటెంట్ క్రియేటర్గా ఉన్న 21 ఏళ్ల గ్రేస్ స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా హైదరాబాద్కు విచ్చేశారు.

భాగ్యనగరంలోని ప్రఖ్యాత రెస్టారెంట్లో బిర్యానీ రుచి చూసి గ్రేస్ ఫిదా అయ్యారు.

