
భారీ వర్షంతో మహా నగరం చిగురుటాకులా వణికింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో శుక్రవారం సిటీ విలవిలలాడింది. వరద నీటితో రహదారులు నీట మునిగాయి.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాంతో వాహన చోదకులు నరకయాతన అనుభవించారు.

అర కిలోమీటర్ దూరానికి గంటల కొద్దీ సమయం పట్టింది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బస్తీల వాసులు ఇబ్బందుల పాలయ్యారు.

రాత్రి 9 గంటల వరకు బోయినపల్లిలో 11.5 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.














