బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కరీనా కపూర్, అభిషేక్- ఐశ్వర్యరాయ్ అంతా ఒకేచోట చేరారు.
ముంబైలో తమ పిల్లలు చదువుకుంటున్న ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొని సందడి చేశారు.
ఆరాధ్య కోసం అమితాబ్ బ్చన్, ఐశ్వర్య, అభిషేక్ కలిసి వచ్చారు.
అటు అబ్రమ్ కోసం షారూఖ్ ఖాన్, తైమూర్ కోసం కరీనా కపూర్ వెళ్లారు.
అబ్రమ్తో కలిసి ఆరాధ్య చేసిన స్టేజ్ షో చూసి ఇరువురి పేరెంట్స్ మురిసిపోయారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఆరాధ్య తల్లిలాగే సహజంగా డైలాగులు పలుకుతూ ఆకట్టుకుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.


