
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.

ఈ సినిమాలో కల్యాణ్రామ్ తల్లి పాత్రలో విజయశాంతి నటించారు.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా నేడు (ఏప్రిల్ 10న) ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.











