హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లోని తాజ్ కృష్ణ హోటల్ లో జువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభమైంది.
ప్రముఖ డిజైనర్ సోనియా చావ్లా ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్ లో పలువురు ప్రఖ్యాతిగాంచిన డిజైనర్లతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ విభిన్న రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని సోనియా చావ్లా వెల్లడించారు.


