జైలులోని కుమారున్ని చూడలేక కన్నీటితో శ్రీలంక వెలుతున్నానని మురుగన్ తల్లి చోమని అమ్మాల్ వాపోయారు.
అయితే జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె బయటకు వచ్చి విలేకరులతో కన్నీటి పర్వంతమవుతూ మాట్లాడారు. తాను ఒక నెల పర్యాటక విసాపై వచ్చానని గత వారంలో జైలు వద్దకు వెలితే తనను లోనికి అనుమతించలేదన్నారు. మురుగన్ను చూడాలని ధరఖాస్తు చేసుకుంటే రెండు గంటల అనంతరం వచ్చి మురుగన్ జైలులో సెల్ఫోన్ ఉపయోగించిన కారణంగా మూడు నెలల వరకు ఎవరిని కలవకూడదని నిషేదించినట్లు తెలిపారన్నారు. అదే విధంగా తన కోడలు నళిని చూసేందుకు కూడా అనుమతించలేదని తెలిపారు. అనంతరం జైలులో ఉన్న శాంతన్ను చూసి మాట్లాడనని, తమిళనాడు ప్రభుత్వం తమను విడుదల చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని తనతో చెప్పాడని తెలిపారు.