వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గన్మెన్పై దాడి | ysrcp mla gun men attacked by tdp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గన్మెన్పై దాడి

Jul 12 2015 3:46 PM | Updated on Aug 10 2018 8:13 PM

తుని నియోజకవర్గం డీ పోలవరంలో తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడ్డారు.

కాకినాడ: తుని నియోజకవర్గం డీ పోలవరంలో తెలుగు తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడ్డారు. తాండవనది ఒడ్డున రైతుల భూముల్లో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడటమే కాకుండా ఇద్దరు రైతులకుపై దాడికి చేశారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా వారి అన్యాయాన్ని అడ్డుకున్నారు. వారు చేస్తున్న తప్పుపట్ల నిలదీశారు. ఇసుకను తరలించేందుకు వచ్చిన 20 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే గన్మెన్పై తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు. దీంతో గన్మెన్కు గాయాలయ్యాయి.

 

ఎమ్మెల్యేకు రక్షణగా వెళ్లిన సమయంలోనే గన్ మ్యాన్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పాటుతన వద్దనున్న తుపాకీ కూడా లాక్కునేందుకు యత్నించినట్లు దాడిశెట్టి రాజా తెలిపారు.తనపై దాడికి యనమల రామకృష్ణుడు,ఆయన సోదరుడు బాధ్యత వహించాలని రాజా పేర్కొన్నారు.ఇసుకు అక్రమ తవ్వకాల వెనుక వారి హస్తం ఉన్నట్లు రాజా ఆరోపించారు. తాండవ నదిలో ఇసుక తవ్వకూడదని కోర్టు స్టే ఇచ్చిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement