డల్లాస్లో కాల్పులు జరిపింది ఇతడే | US military veteran believed to be lone gunman in Dallas police ambush | Sakshi
Sakshi News home page

డల్లాస్లో కాల్పులు జరిపింది ఇతడే

Jul 9 2016 11:25 AM | Updated on Aug 24 2018 4:57 PM

డల్లాస్లో కాల్పులు జరిపింది ఇతడే - Sakshi

డల్లాస్లో కాల్పులు జరిపింది ఇతడే

అమెరికాలోని డల్లాస్లో నల్లజాతీయుల నిరసన ర్యాలీ సందర్భంగా పోలీసులపై కాల్పులు జరిపిందే ఒకడేనని పోలీసులు భావిస్తున్నారు.

డల్లాస్: అమెరికాలోని డల్లాస్లో నల్లజాతీయుల నిరసన ర్యాలీ సందర్భంగా పోలీసులపై కాల్పులు జరిపిందే ఒకడేనని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని జేవియర్ జాన్సన్గా డల్లాస్ పోలీసులు గుర్తించారు. అతను గతంలో అమెరికా సైనిక బలగాల్లో పనిచేసినట్టు చెప్పారు.

డల్లాస్ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు పోలీసులతో పాటు ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితుడు జాన్సన్ను హతమార్చారు. రొబోకు పేలుడు పదార్థాలు అమర్చి అతని దగ్గరకు పంపి పేల్చివేశారు. ఈ వారంలో లూసియానా, మిన్నోసోటా పోలీసు కాల్పుల్లో ఇద్దరు నల్లజాతీయుల మృతికి నిరసనగా చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.

కాల్పులు జరిపిన జాన్సన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జాన్సన్ ఇంట్లో బాంబులు తయారు చేసే వస్తువులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కాగా గతంలో జాన్సన్కు ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఇటీవల నల్లజాతీయులను చంపినందుకు ప్రతీకారంగా తెల్లజాతి అధికారులను చంపాలనుకున్నట్టు కాల్పుల ఘటన సమయంలో జాన్సన్ పోలీసులతో చర్చల సందర్భంగా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement