అసంఘటిత కార్మికుల కోసం ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పరిధిని విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో స్వల్ప మార్పులు చేసింది.
న్యూఢిల్లీ: అసంఘటిత కార్మికుల కోసం ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పరిధిని విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో స్వల్ప మార్పులు చేసింది.
ఇప్పటివరకూ చందాదారులు కేవలం నెలవారీ చందా చెల్లించే విధానం మాత్రమే అమల్లో ఉండగా ఇకపై చందాను త్రైమాసిక, అర్ధ వార్షికానికి కూడా చెల్లించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది.