జైల్లో కొట్టుకున్న ఖైదీలు, పోలీసు అధికారులు! | Tension after prisoners-police clash, jail official transferred | Sakshi
Sakshi News home page

జైల్లో కొట్టుకున్న ఖైదీలు, పోలీసు అధికారులు!

Aug 10 2014 9:33 PM | Updated on Jul 18 2019 2:02 PM

జైల్లో ఖైదీలు, పోలీసులు అధికారులు కొట్టుకున్న సంఘటన బీహార్ లో టెన్సన్ క్రియేట్ చేసింది.

పాట్నా: జైల్లో ఖైదీలు, పోలీసులు అధికారులు కొట్టుకున్న సంఘటన బీహార్ లో టెన్సన్ క్రియేట్ చేసింది. ఈ ఘటన సీతామార్చి జిల్లాలో జైల్లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ఖైదీలు, ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణకు బీహార్ జైళ్ల విభాగం ఐజీ ప్రేమ్ సింగ్ మీనా ఆదేశించారు. 
 
అంతేకాకుండా బాధ్యతాయుతరాహిత్యంగా ప్రవర్తించిన జైలు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ ను బదిలీ చేశారు. మాజీ మావోయిస్టు సంతోష్ ఝా, సమ్రాట్ చౌదరీ లను జైలు నుంచి తరలించాలని ఖైదీలు ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైదీలు రాళ్లు, పగిలిన అద్దాలు, ఇటుకలతో దాడి చేశారని జిల్లా మేజిస్టేట్ ప్రతిమా ఎస్. వర్మ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement