సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్ను సమర్థవంతంగా అమలుచేసేందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు పెట్రోల్, డీజిల్, టెలికం సర్వీసుల వంటివాటిపై సెస్ వసూలు చేయాలని నీతి ఆయోగ్ పరిధిలో ఏర్పాటైన స్వచ్ఛభారత్ మిషన్ సబ్గ్రూప్ కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను సబ్ గ్రూప్ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ్రంతి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి సమర్పించారు. సిఫారసులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వచ్ఛ్భారత్ పని కష్టమైనదైనప్పటికీ అసాధ్యమేమీ కాదని మోదీ ఈ సందర్భంగా అన్నారు.
నివేదికలోని ప్రధాన సిఫారసులు
* ప్రజల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై సానుకూల అలవాట్లను ప్రోత్సహించాలి. ఇందుకు వీలుగా మిషన్లో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్(ఐఈసీ) అనే అంశం కింద నిధులను కేటాయించాలి.
* పరిశుభ్రతపై పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యప్రణాళికలు ఉండాలి. విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచాలి.
* ఈ మిషన్ కింద కేంద్ర, రాష్ట్రాల వాటా 75ః25 నిష్పత్తిలో ఉండాలి. ఆర్థిక వనరుల సమీకరణకు బాండ్లను జారీ చేయాలి.
* ఆర్థిక వనరుల కోసం పెట్రోల్, డీజిల్, టెలికం సర్వీసులపై, ఖనిజ వ్యర్థాలను వెలువరించే ప్రాజెక్టులపై సెస్ వేయాలి. రసాయన ఎరువులపై సబ్సిడీ తగ్గించాలి. సేంద్రియ ఎరువులపై సబ్సిడీ పెంచాలి.
* ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని(పీపీపీ) ఆకర్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలి.
* పంచాయతీలు, మండలాలు, బ్లాకుల మధ్య పోటీతత్వం పెరిగేందుకు ఆర్థిక ప్రోత్సహకాలు ఇవ్వాలి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న సాయాన్ని రూ. 15,000 లకు పెంచాలి.
బాబును కలిసిన కేజ్రీవాల్
స్వచ్ఛభారత్ మిషన్ నివేదిక సిఫార్సులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఏపీభవన్లో ఆయన చంద్రబాబును కలిశారు. నవంబరు 22న ఢిల్లీలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.
స్వచ్ఛభారత్ కోసం పన్నులు!
Published Thu, Oct 15 2015 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement