'విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదు' | Sheena murder: Police custody of accused extended | Sakshi
Sakshi News home page

'విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదు'

Sep 5 2015 4:32 PM | Updated on Aug 21 2018 7:17 PM

'విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదు' - Sakshi

'విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదు'

షీనా బోరా హత్య కేసులో నిందితులకు ఈ నెల 7 వరకు పోలీస్ కస్టడీ పొడగించారు.

ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితులకు ఈ నెల 7 వరకు పోలీస్ కస్టడీ పొడగించారు. ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ నిందితులుగా ఉన్నారు.

శనివారం వీరిని కోర్టులో ప్రవేశపెట్టారు.  షీనా హత్య కేసులో ఇంద్రాణి సహకరించడంలేదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు విచారణ కోసం నిందితులకు రిమాండ్ పొడగించాలని పోలీసులు కోర్టును కోరారు. కోర్టు నిందితులకు కస్టడీ పొడగించడంతో పోలీసులు వారిని ఖర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇంద్రాణి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో కన్న కూతురు షీనాను హత్య చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement