ఎడారిలో ఇసుక మనిషి..?
హాలిడే ట్రిప్ లో భాగంగా ఎడారికి వెళ్లిన 23 ఏళ్ల యువతి.. ఇసుకమనిషిని గుర్తించి సంచలనానికి కారకురాలైంది..
వింటూక్: హాలిడే ట్రిప్ లో భాగంగా ఎడారికి వెళ్లిన 23 ఏళ్ల యువతి.. ఇసుకమనిషి(శాండ్ మ్యాన్)ని గుర్తించి సంచలనానికి కారకురాలైంది. మొనాకో(యూరప్) కు చెందిన ఆ యువతి కుటుంబం ఇటీవలే నైరుతి ఆఫ్రికాలోని నమీబియాలో పర్యటించింది. 8 కోట్ల సంవత్సరాల కిందటే ఏర్పడి, ప్రస్తుతం భూగోళంమీది ఎడారుల్లో పాతదిగా భావించే నైజీరియా ఎడారిలో ఈ దృశ్యాన్ని ఆమె ఎలా గుర్తించిందంటే..
హెలికాప్టర్ అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా నమీబియా ఎడారిపై చక్కర్లు కొట్టిన ఆ యువతి.. పర్యటన ముగిసన తర్వాత తండ్రి తీసిన ఫొటోలను పరిశీలిస్తుండగా ఒక చోట ఇసుకతెన్నెలు అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉండటం గమనించింది. వెంటనే ‘ఎడారిలో ఇసుకమనిషి’ని చూడానంటూ సోషల్ మీడియాలో ఫొటోను పోస్ట్ చేసింది. అదికాస్తా వైరల్ అయి, వార్తగా మారింది. ‘అమేజింగ స్పైడర మ్యాన్’లాంటి సినిమాల్లో తప్ప గగుర్పాటుకు గురిచేసే ఇసుకమనుషులు లేరన్న సంగతి మనకు తెలియదాఏంటి?
