సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో ఘోర బస్సు దుర్ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డికి సంబంధించి ట్రావెల్స్పై కేసు నమోదుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. 45 మంది మృతికి కారణమైన ఆ బస్సు దివాకర్ రోడ్ లైన్స్కు చెందినట్టుగా రవాణాశాఖ రికార్డుల్లో ఉన్నందున దానిపై కేసు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ బస్సును రెండేళ్ల కిందటే జబ్బార్ ట్రావెల్స్కు విక్రయించామని, ఆ బస్సుతో తమకు సంబంధం లేదని జేసీ దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి మీడియాకు స్పష్టంచేసినా... రికార్డుల్లో ఎక్కడా జబ్బార్ ట్రావెల్స్ ప్రస్తావన లేదు. ఈ అమ్మకాలు, లీజు వ్యవహారాలను పట్టించుకోమని గురువారం రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పష్టం చేశారు. రికార్డుల్లో యజమాని పేరు ఎవరిది ఉందో వారిపైనే నిబంధనల ప్రకారం కేసు పెట్టాల్సి ఉంటుందని, ఆ నిబంధనలనే ఈ ప్రమాదం విషయంలోనూ అనుసరిస్తామని పేర్కొన్నారు.
ఆ బస్సును జబ్బార్ ట్రావెల్స్కు అమ్మినందున దానితో తమకు సంబంధం లేదని జేసీ ప్రభాకర్రెడ్డి చెబుతున్న నేపథ్యంలో కర్ణాటక ఆర్టీఏ పరిధిలో ఉన్న డాక్యుమెంట్లను ఇక్కడి అధికారులు తెప్పించుకున్నారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ బస్సు దివాకర్ రోడ్ లైన్స్ పేరుతోనే ఉన్నట్లు అధికారికంగా ధ్రువీకరించుకున్నారు. ప్రమాద సమయంలో రెండో డ్రైవర్ లేకపోవడం, సామర్థ్యానికి మించి బస్సులో ప్రయాణికులు ఉండడం, బస్సు నడిపిన డ్రైవర్కు సరైన శిక్షణ లేకపోవడం.. తదితర కారణాల నేపథ్యంలో దివాకర్ ట్రావెల్స్పై తీవ్రమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు కర్ణాటక రవాణా శాఖ అధికారులు కూడా గురువారం హైదరాబాద్ చేరుకొని ఈ ప్రమాదంలో వారి వైపు నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు.
నెపం రోడ్డుపై నెట్టే యత్నం: ప్రభుత్వ ఆదేశం ప్రకారం ప్రస్తుతం ఘటనపై ప్రాథమిక విచారణ జరుగుతోంది. ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ విచారణ ప్రారంభించారు. ఇక్కడే జేసీ అనుచరులు రంగప్రవేశం చేశారు. ఈ విచారణ వీలైనంత వరకు ఇతర అంశాలపై ఫోకస్ కావటం ద్వారా దివాకర్ రోడ్ లైన్స్ అంశం పైకి రాకుండా చూడాలనేది వారి ఉద్దేశం. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినా, ప్రమాదం జరిగినచోట రోడ్డూ లోపభూయిష్టంగా ఉన్నందున ప్రధాన కారణం రోడ్డేనని తేల్చేలా చూస్తున్నారు. బస్సులో వాస్తవానికి రెండో డ్రైవర్ లేనప్పటికీ.. ఉన్నాడని, మార్గమధ్యంలో అతడు దిగిపోయాడని నివేదికలో చేర్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక రవాణా శాఖ నిబంధనల్లో ఉన్న లొసుగుల ఆధారంగా బస్సు యాజమాన్యం విషయంలోనూ ఏమార్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. అయితే నిబంధనల మేరకు పక్కాగా విచారణ జరిపి ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక ఇస్తానని విచారణాధికారి ప్రసాదరావు ‘సాక్షి’తో చెప్పారు.
జేసీ ట్రావెల్స్పై కేసుకు రంగం సిద్ధం
Published Fri, Nov 1 2013 6:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement