సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య! | Rebuked for using mobile phones, two girls commit suicide | Sakshi
Sakshi News home page

సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!

Sep 13 2014 4:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

అగర్తలా: సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. త్రిపుర పట్టణంలోని హాస్టల్లో ఉంటూ 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు యువతలు తరచు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ ఉండటంతో వార్డెన్ వారిని మందలించాడు. హాస్టల్లో మొబైల్ ఫోన్లు వాడకకూడదని వాళ్లకు సూచించాడు.  అయినా వారిద్దరూ ఆ మాటలను పెడచెవిన పెట్టడంతో వార్డెన్ ఆ విషయాన్ని ఆ అమ్మాయిల తల్లిదండ్రులకు తెలిపాడు.

 

ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసిందన్న కారణంతో వారు గురువారం హాస్టల్ నుంచి  పారిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ అధికారి ప్రదీప్ దేయ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement