జయప్రదకు ఆర్‌ఎల్‌డీ ఎంపీ టిక్కెట్ | rastriya lokdal gives ticket to jayaprada from Bijnore | Sakshi
Sakshi News home page

జయప్రదకు ఆర్‌ఎల్‌డీ ఎంపీ టిక్కెట్

Mar 11 2014 6:09 PM | Updated on Sep 2 2017 4:35 AM

జయప్రదకు ఆర్‌ఎల్‌డీ ఎంపీ టిక్కెట్

జయప్రదకు ఆర్‌ఎల్‌డీ ఎంపీ టిక్కెట్

రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)లో చేరిన సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేతలు అమర్‌సింగ్, జయప్రదలకు లోక్సభ టిక్కెట్లు ఖరారయ్యాయి.

లక్నో: రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)లో చేరిన సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేతలు అమర్‌సింగ్, జయప్రదలకు లోక్సభ టిక్కెట్లు ఖరారయ్యాయి. అమర్‌సింగ్‌కు ఫుతేపుర్ సిక్రీ, జయప్రదకు బిజ్‌నౌర్ స్థానాలు కేటాయించారు. ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్ సింగ్ బాగ్పట్ నుంచి పోటీ చేయనున్నారు. ఆయన తనయుడు జయంత్ చౌదురి మాథూరా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.

కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆర్‌ఎల్‌డీ ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలు దక్కాయి. నటి జయప్రద, అమర్ సింగ్... సమాజ్వాది పార్టీ నుంచి 2010, ఫిబ్రవరిలో బహిష్కృతులయ్యారు. వీరిద్దరూ నిన్న ఆర్‌ఎల్‌డీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement