18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ కు దీటుగా జవాబు చెప్పేందుకు భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలోనే ఆ దేశం మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. యూరి సెక్టర్లో దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. చిన్నస్థాయి ఆయుధాలతో భారత ఆర్మీ పోస్టు లక్ష్యంగా 20 రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో భారత సైన్యం దీటుగా బదులు ఇచ్చింది.
కాగా, యూరి సెక్టర్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. లాచిపుర ప్రాంతంలో దాడులకు దిగిన ఉగ్రవాదులను భారత సైన్యం ఏరిపారేసింది. ఈ ఎన్కౌంటర్లో పదిమంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
యూరి ఉగ్రవాద దాడితో రగిలిపోతున్న భారత్.. 26/11 ముంబై దాడుల అనంతరం పాకిస్థాన్ను ఏవిధంగా అయితే అంతర్జాతీయంగా ఇరకాటంలో పెట్టిందో ఇప్పుడు కూడా అదేవిధంగా పాక్ ను ఏకాకిని చేయాలని నిశ్చయించింది. దౌత్యపరంగా, ఆర్థికంగా, సైనికంగా పాక్ కు దీటుగా బదులు చెప్పేందుకు వ్యూహం రచించాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించింది. భారత భూభాగంలో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో సరిహద్దుల్లో మళ్లీ పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం గమనార్హం.
యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మళ్లీ యూరిలో బరితెగించిన పాకిస్థాన్!
Published Tue, Sep 20 2016 5:07 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
లోక్సభ పోరు నేడే
మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
పోటెత్తాలి మన ఓటు!
Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
నేడే పోలింగ్.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
తోడు దొంగలు
Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
వన్స్ మోర్.. 22 జాతీయ మీడియా సర్వేల్లోనూ ‘ఫ్యాన్’కే పట్టం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- పోలింగ్ సందర్భంగా హింసకు టీడీపీ కుట్ర
Advertisement