'అసెంబ్లీలో ఎదురుదాడి తప్ప మరేదీ లేదు' | No way to unless Counterattack in Telangana assembly | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీలో ఎదురుదాడి తప్ప మరేదీ లేదు'

Oct 1 2015 8:22 PM | Updated on Oct 1 2018 2:36 PM

'అసెంబ్లీలో ఎదురుదాడి తప్ప మరేదీ లేదు' - Sakshi

'అసెంబ్లీలో ఎదురుదాడి తప్ప మరేదీ లేదు'

రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ వంటి సమస్యలపై అనుకూలంగా సోమవారం ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ వంటి సమస్యలపై అనుకూలంగా సోమవారం ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. సిద్ధాంత వైరుద్యాలున్నా రైతుల కోసం ప్రతిపక్షాలతో కలిసి పోరాడామని అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నికల హామీలకు బీజేపీ అప్పులు ఇస్తుందా? అని ఎద్దేవా చేశారు.

అధికారం టీఆర్ఎస్ది.. హామీలు నెరవేర్చడం బీజేపీ వంతా? అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఎదురుదాడి తప్ప మరేది లేదని కిషన్ రెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement