* 3 గంటలు వేచి చూసినా నాడి పట్టి చూడని వైద్యులు
* మృత్యువుతో పోరాడి ఓడిన కేన్సర్ బాధితురాలు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన బి.గంగు(62) తరచూ తలనొప్పి వస్తుండటంతో 45 రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుంది. వైద్యులు బ్రెయిన్ కేన్సర్గా నిర్ధారించారు. గత జూలై 27న ఆమె ఆస్పత్రిలో చేరింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు‘రోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది.. మా వల్ల కాదు..
గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ వైద్యులు బంధువులకు సూచించారు. కుమారుడు ఆంజనేయులు అచేతనస్థితిలో ఉన్న తల్లి దుస్థితిని చూసి తల్లడిల్లిపోయాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని తల్లిని అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించాడు. ఉదయం 7.30 గంటలకు అత్యవసర విభాగానికి చేరుకున్నాడు. ఇక్కడ కేన్సర్ విభాగం లేదని.. ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. ఆలస్యం చేయకుండా అదే అంబులెన్స్లో ఉదయం 8.30 గంటలకు ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఓపీ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతే అడ్మిట్ చేస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. మృత్యువుతో పోరాడుతున్న తల్లిని అంబులెన్స్ డ్రైవర్కు అప్పగించి ఆంజనేయులు ఓపీకి చేరుకున్నాడు. వెంటిలేటర్ లేకపోవడంతో డ్రైవర్ నెబులైజర్ పంప్ ద్వారా ఆమెకు కృత్రిమ శ్వాస అందిస్తున్నాడు. ఓపీ వద్ద భారీ క్యూ ఉంది. ఎమర్జెన్సీ అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. క్యూలో నిలబడి చీటి రాయించుకునే సరికి సమయం 11.10 గంటలైంది. ఆంజనేయులు అంబులెన్స్ వద్దకు చేరుకునేలోపే తల్లి కన్నుమూసింది.
అప్పటికీ ఒక్క వైద్యుడు కూడా అటు వైపు రాలేదు. ఇలా ఒక్క గంగూ మాత్రమే కాదు కేన్సర్తో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రికి చేరుకుంటున్న వందల మంది నిరుపేద రోగులది ఇదే దుస్థితి. బోలెడు ఆశతో ఆస్పత్రిలో అడుగు పెట్టిన కేన్సర్ బాధితులు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందుతున్నారు. ఇలా వారానికి సగటున ముగ్గురు రోగులు విగత జీవులవుతున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
కనిపించని క్యాజువాల్టీ...
ప్రతిష్టాత్మక కేన్సర్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు క్యాజువాల్టీ లేకపోవడం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపుతూ చేతులు దులుపుకుంటున్నారు. అదేమంటే కేన్సర్ ఎమర్జెన్సీ వైద్యం కాదు కదా! అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుతుండటం కొసమెరుపు.
‘కేన్సర్ నొప్పి కంటే వైద్యులు, సిబ్బంది వ్యవహార శైలే మమ్మల్ని ఎక్కువ బాధిస్తోంది. ఇక్కడ పని చేస్తున్న వైద్యులు కనీసం రోగి నాడి పట్టి చూసిన పాపాన పోవడం లేదు’అని ఖమ్మం జిల్లాకు చెందిన కేన్సర్ బాధితుడు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.‘వైద్యులు రాసిన మందుల చీటి తీసుకుని ఫార్మసీకి వెళ్తే మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రి ఎదురుగా ఉన్న మెడికల్ షాపులో దొరుకుతాయి కొనుక్కో’అంటూ ఫార్మసిస్టులు ఉచిత సలహా ఇస్తున్నారని మియాపూర్కు చెందిన కేన్సర్ బాధితురాలు సురేనా ఆరోపించారు.
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
Published Tue, Sep 1 2015 2:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement