'నా హృదయం బాధతో నిండిపోయింది' | Sakshi
Sakshi News home page

'నా హృదయం బాధతో నిండిపోయింది'

Published Tue, Dec 30 2014 9:21 PM

'నా హృదయం బాధతో నిండిపోయింది'

కౌలాలంపూర్: తన హృదయం బాధతో నిండిపోయిందని ఎయిర్ ఆసియా విమానయాన సంస్థ సీఈవో, ప్రవాస భారతీయుడు టోనీ ఫెర్నాండెస్ పేర్కొన్నారు. క్యూజెడ్ 8501 విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎయిర్ ఆసియా తరపు సంతాపం ప్రకటించారు. తమ సిబ్బంది కుటుంబ సభ్యులు అందించిన సహకారం స్ఫూర్తిదాయకమని, తనకెంతో బలమిచ్చిందన్నారు.

ప్రమాదానికి గురైన విమానంలో ఉన్న సిబ్బంది, పైలట్ల కుటుంబాలతో తాను మాట్లాడనని చెప్పారు. కేవలం ముగ్గురు కుటుంబాలను కలవడం కుదరలేదన్నారు. తానిప్పుడు కష్టమైన రోజులు ఎదుర్కొంటున్నానని ట్విటర్ లో పేర్కొన్నారు. గల్లంతైన ప్రయాణికుల కుటుంబ సభ్యులతోకూడా మాట్లాడానని వెల్లడించారు. విమానం సుముద్రంలో కూలిపోయిందని తెలియడంతో సురబయకు వెళ్తుతున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement