ముంబయి: పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఓ పక్క గుజరాత్లో తీవ్ర ఆందోళన జరుగుతుండగా ఆ ఆందోళనకు వ్యతిరేకంగా ఓ తాజా ఉద్యమం మహారాష్ట్రలో మొదలవుతుంది. పటేళ్లు ఇప్పటికే ఉన్నత వర్గానికి చెందినవారని వారికి ఎట్టి పరిస్థితిలో ఓబీసీల్లో చోటు ఇవ్వొద్దని మహారాష్ట్రకు చెందిన ఓబీసీ ఆర్గనైజేషన్ ముందుకు వెళుతోంది. పటేళ్లతోపాటు మరాఠా కమ్యునిటీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీళ్లేదని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఈ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ శ్రవణ్ డియోర్.. బీజేపీ ఎంపీ డాక్టర్ సుభాష్ భామ్రి కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించారు.
తప్పకుండా పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్ల అంశం లేవనెత్తాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని మరాఠా కమ్యునిటీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని జాట్లు, గుజరాత్లోని పటేళ్లు తమను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా, గుజరాత్లో ఈ ఉద్యమం హార్ధిక్ పటేల్ అనే యువకుడి నేతృత్వంలో ఉధృతంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపట్ల మహారాష్ట్ర ఓబీసీ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో మండల్ కమిషన్ కూడా పైన పేర్కొన్న వర్గాలు ఇప్పటికే ఉన్నత వర్గంగా ఉన్నాయని, అధికారం విషయంలోనూ, ఆర్థిక పరమైన అంశాల విషయంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్నందున వారిని ఓబీసీల్లో చేర్చవద్దని చెప్పిందని గుర్తుచేసింది.
Related news
-
ఇద్దరు కుమార్తెలతో తల్లి బలవన్మరణం
సాక్షి, చెన్నై: భర్తతో అభిప్రాయ భేదాలు విడాకుల వరకు వెళ్లడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో పాటు తానూ బలవన్మరణానికి పాల్పడింది. దిండుగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దిండుగల్ జిల్లా తాడి కొంబు పరిధిలోని కామాక్షిపురం శక్తినగర్కు చెందిన శ్రీనివాసన్(42), మేనక (35) దంపతులకు హిందు మహావిని(16), తన్యశ్రీ(11) కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు స్థానికంగా సీబీఎస్ఈ పాఠశాలలో పది, ఆరు తరగతులు చదువుతున్నారు. మహావిని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొద్ది రోజులుగా ఈ దంపతుల మధ్య జరిగిన గొ డవ విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లింది.నందవనం రోడ్డులో తాను నడుపుతున్న టూ వీలర్ సర్వీస్ సెంటర్ లో వాటర్ మోటార్ పనిచేయక పోవడంతో సోమవారం ఇంట్లో ఉన్న మోటారును తీసుకెళ్లేందు కు శ్రీనివాసన్ ప్రయత్నించాడు. దీనిని మేనకతో పాటు పిల్లలు అడ్డుకున్నారు. తమ గొడవలు విడా కుల కోసం కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో శ్రీనివా సన్ చర్యలపై మేనక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాయంత్రం అతడిని పోలీసులు పిలిపించి చీవాట్లు పెట్టారు. రాత్రి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన శ్రీనివాసన్ ఇంట్లో ఉన్న తన బట్టలను తీసుకెళ్లేందుకు వెళ్లాడు.ఇంటి తలుపులు తెరవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో కిటికి తలుపులు పగుల కొట్టి చూశారు. లోపల గది లో తన ఇద్దరు కుమార్తెలతో పాటుగా మేనక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టా నికి తరలించారు. శ్రీనివాసన్ను విచారించగా తాను పొద్దుపోయే వరకు పోలీసు స్టేషన్లోనే ఉన్న ట్లు చెప్పాడు. మనస్తాపంతో ఉన్న మేనక పిల్లలతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పో లీసులు నిర్ధారించారు. -
Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
శివాజీనగర/ బనశంకరి: హాసన్లో మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు రోజురోజుకూ బిగుసుకుంటోంది. సిట్ విచారణ ప్రారంభం కాగా, ఇంతలో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ కేసులో తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ.. రాష్ట్ర డీజీపీ అలోక్మోహన్ను మంగళవారం లేఖ రాశారు. ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు మహిళల సురక్షతకు ప్రమాదకరం, హింసా సంస్కృతిని పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు వెలుగులోకి రాగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దేశం వదిలి వెళ్లారని సమాచారం ఉంది.పారిపోయిన వ్యక్తిని త్వరగా అరెస్ట్ చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేసి బాధ్యులకు శిక్ష విధించాలని లేఖలో కోరారు. అనేక మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన నగ్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మహిళా సమాజం గౌరవానికి భంగం కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు వైరల్ కాకుండా అడ్డుకోవాలని, వ్యాప్తి చేసేవారిపై క్రిమినల్ కేసు పెట్టి విచారణ చేపట్టాలని కోరారు. బెంగళూరు, హుబ్లీలో నిరసనలు హాసన్ లైంగిక దాడి ఘటనలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నగరంలోని మల్లేశ్వరంలో బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. లైంగిక ఘటనల నిందితుడైన ప్రజ్వల్ విదేశాలకు పరారు కావడానికి బీజేపీ సహకరించిందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసుల–కార్యకర్తల మధ్య వాగి్వవాదం నెలకొంది. బెంగళూరు మహారాణి క్లస్టర్ కాలేజీలో ఎన్ఎస్యూఐ నేతృత్వంలో విద్యారి్థనులు ధర్నా చేశారు. మహిళలతో చెలగాటమాడుతున్నారు, చరిత్రలో ఇలాంటి పనులు ఎవరూ చేయలేదు. 65 సంవత్సరాల మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. మహిళలకు భద్రత కల్పించాలి. సమాజంలో ఎవరు చేసినా తప్పు తప్పే. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జేడీఎస్ భేటీ ముట్టడికి యత్నం ఇక హుబ్లీలో కుమారస్వామి ఆధ్వర్యంలో జేడీఎస్ కోర్ కమిటీ సమావేశం జరిగిన హోటల్ వద్దకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వచ్చారు. సమావేశం జరిగే హాల్లోకి చొరబడేందుకు యతి్నంచగా జేడీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.500 మందిపై లైంగిక దాడులు: ఎంపీ ప్రజ్వల్ లైంగిక దాడులకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబమే కారణమని ఎంపీ డీ.కే.సురేశ్ ఆరోపించారు. బెంగళూరులో తన ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ హాసన్ బీజేపీ నాయకుడు దేవరాజేగౌడ ఈ విషయమై ముందే పార్టీ సీనియర్లకు లేఖ ద్వారా తెలిపినా దాచిపెట్టి, ప్రజ్వల్ను అభ్యరి్థగా నిలబెట్టారన్నారు. సుమారు 500 మందికి పైగా మహిళలు లైంగిక దాడులకు గురయ్యారని చెప్పారు. ప్రజ్వల్తో సంబంధం లేదని హెచ్డీ కుమారస్వామి చెప్పడం సమంజసం కాదన్నారు. -
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్లోని సూపర్ మార్కెట్కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
వంట సరిగా చేయలేదని.. భార్యను చంపిన భర్త
నిజాంపేట్: వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నవీన్ దుర్వే, రవీనా దుర్వే(28) నగరానికి వలస వచ్చి బాచుపల్లిలోని వెనుక ఉన్న ప్రగతి కన్స్ట్రక్షన్స్లో కార్మికులుగా పనిచేస్తూ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. సోమవారం రాత్రి వంట విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వంట సరిగా చేయడం లేదని ఆగ్రహానికి లోనైన నవీన్ ఇటుకతో భార్య రవీనా తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నవీన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మసాజ్ పేరుతో అసహజ ప్రవర్తన
సనత్నగర్: థెరపిస్టుల ముసుగులో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తిపై ‘అసహజ’ దాడికి యత్నంచడంతో పాటు అతడిని నగ్నంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెది రింపులకు దిగారు. దీంతో బాధితుడు భయ పడి రూ.20 వేలు ఇచ్చాడు. కానీ.. మరో రూ.30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్టర్ పురేందర్రెడ్డి తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.. సనత్నగర్కు చెందిన ఓ వ్యక్తికి తనకు తానుగా థెరపిస్టుగా చెప్పుకున్న ఓ మహిళ పరిచయమైంది. ఆమె ద్వారా భరత్నగర్కు చెందిన మరో మహిళ ఫోన్ నంబర్ను తీసుకుని మాట్లాడాడు. తాము థెరపిస్టులమని, మసాజ్ చేస్తామంటూ సదరు వ్యక్తితో నమ్మబలికారు. దీంతో అతడు ఆ ఇద్దరు మహిళలు చెప్పిన్నట్లుగా భరత్నగర్లోని వారి ఇంటికి వెళాఉ్లడు. అయితే.. పరిస్థితులపై అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని భావించాడు. అతడు బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే ఇద్దరు మహిళలు బలవంతంగా నిర్బంధించారు. అతడి ఒంటిపై దుస్తులు తీసి లైంగిక దాడికి యత్నంచారు. ఈ క్రమంలోనే నగ్న వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి రూ.20 వేలు ఆన్లైన్ ద్వారా వారికి ఇచ్చాడు. వారి బారి నుంచి బయటపడ్డానని భావిస్తున్న క్రమంలోనే మళ్లీ ఓ మహిళ ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించింది. దీంతో బాధితుడు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Related News by category
-
48 గంటలు నిషేధిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తరు: కేసీఆర్
సాక్షి, మహబూబాబాద్: ‘‘నా మీద ఎలక్షన్ కమిషన్ నిషేధం పెట్టింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయవద్దని నిషేధం విధించింది. అందరికీ మనవి చేస్తున్నా.. రేవంత్రెడ్డి నన్ను ఉద్దేశించి.. నీ పేగులు మెడలో వేసుకుంటా.. నీ గుడ్లు పీకుతానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ నిషేధం పెట్టలేదు. నామీద నిషేధం పెట్టింది. 48 గంటలు నా ప్రచారం నిషేధిస్తే.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు 96 గంటలు అవిశ్రాంతిగా పనిచేస్తరు..’’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం మహబూబాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ ఉన్నదే తెలంగాణ కోసం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నేనేం చేశానో మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లకాలంలో తెలంగాణ ఎలా ఉండేది? కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లో తెలంగాణను ఆగం చేసింది. ఊరుకునే ప్రసక్తే లేదు.. సాగునీరు, తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉన్న తెలంగాణ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త ఆగమైంది. ప్రధాని మోదీ గోదావరి జలాలు తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించారు. ఇంత జరిగినా సీఎం రేవంత్రెడ్డి నోరు మెదపడం లేదు. వారేం చేస్తారో.. రాష్ట్రానికి ఏ నష్టం తీసుకొస్తారో..! ఎంతకాలం చూస్తాం? రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. అరచేతిలో వైకుంఠం చూపించి.. ఎన్నికల సమయంలో ఇది ఇస్తాం.. అది ఇస్తామంటూ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసింది. ఒక్క ఉచిత బస్సు మినహా మరేదైనా వచ్చిందా? రైతుబంధు లేదు. కల్యాణలక్ష్మి లేదు. తులం బంగారం లేదు. రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పండించిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన చొప్ప దొండి రైతు అక్కడ ఇబ్బందులకు తట్టుకోలేక గుండె ఆగి చనిపోయారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది పదేళ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చింది.. కరువు వచ్చింది. సాగు, తాగునీరు లేక రాష్ట్రం ఎడారిగా మారింది. కాళేశ్వరం నీళ్లు ఎందుకు రావడం లేదో ఆలోచించాలి. ఖమ్మం జిల్లాలో మురికి నీరు తాగుతున్నారు. మహ బూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ నియోజకవర్గా ల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన కరెంట్, మిషన్ భగీ రథ నీళ్లు ఎటుపోయాయి? ఆటో కార్మీకుల జీవితాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. వారి కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.గిరిజనులను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్సే..తరతరాలుగా వెనుకబడిన గిరిజనులను అక్కున చేర్చుకుని, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు నిధులు కేటాయించింది. ఏడు దశాబ్దాలుగా ఏ పార్టీ చేయని విధంగా వారి అస్తిత్వానికి నిదర్శనమైన సేవాలాల్ బంజారా భవనం కట్టుకున్నాం. రిజర్వేషన్ పెంచి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించాం. బీఆర్ఎస్కు గిరిజనులు, ఆదివాసీలు అండగా ఉండాలి. ప్రతీ క్షణం, ప్రతీ అడుగు, ప్రతీ మాట ప్రజల కోసమే పనిచేసే బీఆర్ఎస్ను దీవించాలి. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..’’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. -
Draupadi Murmu: అయోధ్యలో రాష్ట్రపతి
అయోధ్య: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం అయోధ్య సందర్శించారు. నూతన మందిరంలో ఇటీవలే కొలువుదీరిన బాలరామున్ని తొలిసారిగా దర్శించుకున్నారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి హారతిచ్చారు. అంతకుముందు సరయూ నది హారతి కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. అంగవస్త్రం ధరించి సంప్రదాయబద్ధంగా హారతిచ్చారు. అనంతరం నదికి పూలమాలలు సమరి్పంచి మొక్కుకున్నారు. తర్వాత ప్రఖ్యాత హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొని ఆంజనేయునికి హారతిచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం రామాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ రాష్ట్రపతికి దగ్గరుండి దర్శనం చేయించారు. రామ్ లల్లా పట్ల ఆమె భక్తిశ్రద్ధలు అపూర్వమని కొనియాడారు. ‘‘స్వామికి రాష్ట్రపతి హారతిచ్చారు. సాష్టాంగం చేసి భక్తిని చాటుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ గొప్ప రామ భక్తులు కావడం నిజంగా గొప్ప విషయం’’ అని సత్యేంద్రదాస్ అన్నారు. అప్పట్లో విపక్షాల రగడ... అయోధ్యలో నూతన రామాలయం నిర్మాణానంతరం రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఆలయం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవడం తెలిసిందే. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులను కార్యక్రమానికి ఆహా్వనించారు. రాష్ట్రపతి మాత్రం అందులో పాల్గొనలేదు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని పూర్తిగా పక్కన పెట్టి సర్వం మోదీమయంగా కార్యక్రమం జరిపించారని కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తదితరులు దుయ్యబట్టారు. ముర్ము ఆదివాసీ కాబట్టే రాష్ట్రపతి అని కూడా చూడకుండా కావాలనే కార్యక్రమానికి దూరంగా ఉంచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బుధవారం ఆమె అయోధ్య వెళ్లి నూతన ఆలయాన్ని, బాలరామున్ని దర్శించుకోవడం విశేషం. -
Lok sabha elections 2024: కమలానికి పెనుసవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న కమల దళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ తదితర కీలక నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు విపక్షం నుంచి ఎదురుదాడి, మిత్రపక్షాల కారణంగా తలెత్తుతున్న చిక్కులు, కొన్ని వర్గాల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి వంటివి బీజేపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా స్థానాల్లో కచి్చతంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక, ఆప్ నేత సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇటీవల వైరల్ చేసిన అమిత్ షా డీప్ఫేక్ వీడియో తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకేనా 400 సీట్లు? మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగంతోపాటు కీలకమైన చట్టాలను మార్చడానికే ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచి్చందని కాంగెరస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, నియంతృత్వ పాలన తీసుకురావడమే ఆ పార్టీ లక్ష్యమని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపైనా ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాల్సి వచి్చంది. సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దిగివచి్చనా రాజ్యాంగాన్ని మార్చలేరని ఆయన పలు సభల్లో చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు అనంతకుమార్ హెగ్డే, అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంకటంగా మారాయి. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని మోదీ పదేపదే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. రాజ్యాంగం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఇంకోవైపు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తమ జనాభా ఉన్న స్థానాల్లోనూ తమ వర్గం వారికి టిక్కెట్లు ఇవ్వలేదని రాజ్పుత్లు బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహాపంచాయతీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో వివాదం కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. -
కేసీఆర్ ప్రచారంపై నిషేధం.. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచన
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు 48 గంటల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మే ఒకటో తేదీ బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని, మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసింది. బస్సు యాత్రలో భాగంగా మానుకోటలో ఉన్న కేసీఆర్కు అధికారులు ఈసీ ఆదేశాలను అందజేశారు. దీంతో మహబూబాబాద్ రోడ్ షోలో రాత్రి 7.45 గంటలలోపు ప్రసంగాన్ని ముగించిన కేసీఆర్.. ఈసీ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈసీ విధించిన గడువు ముగిశాక కేసీఆర్ తిరిగి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో.. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు కేసీఆర్ ఏప్రిల్ 5న ‘పొలం బాట’పేరిట కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. నేత కార్మీకులను ఉద్దేశించి స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్ రూ.500 చొప్పున బోనస్ ఇవ్వకుంటే కాంగ్రెస్ను వేటాడతామంటూ మాట్లాడారు. ఇలా సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్.. ఏప్రిల్ 6న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్పై కేసీఆర్ అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విచారణ జరిపి ఏప్రిల్ 10న నివేదిక సమర్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ నివేదిక ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్కు ఏప్రిల్ 16న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘విలేకరుల సమావేశంలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే కాంగ్రెస్ ప్రత్యేకంగా పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. తెలంగాణ, సిరిసిల్ల ఎన్నికల ఇన్చార్జులుగా పనిచేస్తున్న అధికారులకు తెలంగాణ మాండలికం పూర్తిగా అర్థం కాదు. నేను చేసిన వ్యాఖ్యలను ఇంగ్లిషులోకి తప్పుగా అనువదించడంతోపాటు వక్రీకరించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాలు, పథకాలను మా త్రమే విమర్శించాను’’అని కేసీఆర్ ఈసీకి సమా ధానం ఇచ్చారు. కానీ ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ.. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో, 2023 అక్టోబర్లో బాన్సువాడ సభలో చేసిన వ్యాఖ్యలపైనా హెచ్చరికలు చేశామని గుర్తు చేసింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. సీఎం రేవంత్పై బీఆర్ఎస్ ఫిర్యాదు సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నకిలీ పత్రాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని, ఆయనపై చ ర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్ల మూసివేతకు సంబంధించి గతేడాది మే 12న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లోని అంశాలను వక్రీకరిస్తూ.. నకిలీ సర్క్యులర్ను ఉద్దేశపూర్వకంగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు రేవంత్రెడ్డి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సుయాత్ర రీ షెడ్యూల్పై కసరత్తు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజుల బస్సుయాత్రను కేసీఆర్ చేపట్టారు. మిర్యాలగూడలో మొదలైన యాత్ర వరుసగా 8 రోజుల పాటు సాగి బుధవారం రాత్రి మహబూబాబాద్కు చేరుకుంది. కానీ ఈసీ ఆదేశాలతో రెండు రోజులపాటు బస్సుయాత్రను నిలిపివేశారు. షెడ్యూల్ ప్రకారం.. కేసీఆర్ బుధవా రం రాత్రి వరంగల్లో బస చేసి.. గురువారం జమ్మి కుంట, వీణవంకలలో, శుక్రవారం రామగుండంలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉంది. ఈసీ నిషేధం నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని రీషెడ్యూల్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మార్పులపై గురువారం స్పష్టత ఇస్తామని ప్రకటించింది.తెలంగాణ గొంతుపై నిషేధమా?: కేటీఆర్కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తప్పుపట్టారు. ‘ఎక్స్’వేదికగా తన స్పందనను పోస్ట్ చేశారు.‘‘ఇదెక్కడి అరాచకం? తెలంగాణ గొంతు కేసీఆర్పైనే నిషేధమా? ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్కు కమిషన్కు వినిపించలేదా? వేలాది మంది పౌరులు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు లు చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. రేవంత్ బూతులు ఎన్నికల కమిషన్కు ప్రవచనాల్లా అనిపించాయా? అసభ్య పదజాలం వాడుతున్న తెలంగాణ సీఎం రేవంత్పై ఎలాంటి చర్యలూ ఉండవా? బడే భాయ్.. చోటే భాయ్ కలసి చేసిన కుట్ర కాదా ఇది. కేసీఆర్ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు వణికిపోతున్నాయి? మీ అహంకారానికి, వ్యవస్థల దుర్వి నియోగానికి తెలంగాణ ప్రజలు దీటైన సమాధానం ఇస్తారు’’అని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రశ్నిస్తే ప్రచారం వద్దంటున్నారు: హరీశ్రావు‘‘కాంగ్రెస్, బీజేపీల మీద కేసీఆర్ గట్టిగా కొట్లాడుతున్నారనే రెండు రోజులు ప్ర చారం ఆపారు. మోదీ మత విద్వేషాలు రెచ్చ గొడితే.. రేవంత్ బూతులు మాట్లాడితే ఎన్ని కల కమిషన్కు కనిపించవా? ప్రశ్నించే కేసీఆర్ను మాత్రం ప్రచారం చేయొద్దు అంటు న్నారు. రెండు రోజులు కేసీఆర్ ప్రచారం ఆగినంత మాత్రం జరిగేదేంటి?’’అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో ఉంటారని చెప్పా రు. కేసీఆర్ బస్సుయాత్ర చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ గజగజ వణుకుతున్నాయన్నారు. కేసీఆర్ అంతటి వ్యక్తిని దుర్భాషలు ఆడుతున్న రేవంత్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు జరుగు తున్న 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. సవరించిన సమయం ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని 12 లోక్సభ స్థానాల పరిధిలో పూర్తిగా.. మిగతా 5 లోక్సభ సీట్ల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం పెంపు ఉంటుందని ప్రకటించింది.పోలింగ్ సమయం పెరిగే ఎంపీ స్థానాలివీకరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాలుకొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం పెంచిన స్థానాలివే.. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలోని ఖానాపూర్ (ఎ స్టీ), ఆదిలాబాద్, బోథ్(ఎస్టీ), నిర్మల్, ముథోల్. పెద్దపల్లి లోక్సభ స్థానంలోని ధర్మపురి (ఎస్సీ), రామగుండం, పెద్దపల్లి. వరంగల్ లోక్సభ స్థానంలోని స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట్. మహబూబాబాద్ లోక్సభ స్థానంలోని డోర్నకల్ (ఎస్టీ), మహబూబాబాద్ (ఎస్టీ), నర్సంపేట్. ఖమ్మం లోక్సభ స్థానంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ).
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement