బెంగళూరు : పెద్దనోట్ల రద్దు, ఏటీఎంల్లో నగదు కొరతపై జనతాదళ్ నాయకులు కర్ణాటకలో వినూత్నంగా నిరసనకు దిగారు. ఒకవైపు జనతా దళ్ యునైటెడ్ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ కు పరోక్షంగా మద్దతుఅందిస్తోంటే, జేడీ (యు) లోమద్దతుదారులు ఇందుకు విరుద్ధంగా స్పందించారు. జేడీయూ కార్యకర్తలు, స్థానికులు సమీపంలోని ఒక ఏటీఎం మెషీన్ కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మైసూర్ బ్యాంక్ సర్కిల్ లోని క్యాష్ లెస్ ఏటీఎం వద్ద ఈ ఆందోళన చేపట్టారు
ఒక నెల తరువాత కృత్రిమ శ్వాస పరికరాన్ని తొలగించడంతో ఏటీఎం తుదిశ్వాసం విడించిందనీ, అందుకే సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాల్ని నిర్వహిస్తున్నామని సామాజిక కార్యకర్త కుమార్ జాగీర్దార్ వ్యాఖ్యానించారు. ఏటీఎం ఆత్మకుశాంతి కలగాలని కోరుకుంటున్నామంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
తమ సమస్యలు ప్రభుత్వానికి తెలుసు, మా డబ్బులు మేం తీసుకోవడానికే మా కు సాధ్యం కావడంలేదని కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎంలలో నగదు లేదు. ఏ ఏటీఎం పనిచేయడంతో లేదు. తమ కనీస అవసరా తీర్చుకోవడానికి కూడా డబ్బుల్లేవు. పెద్ద నోట్ల రద్దు మానవహక్కుల ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. అందుకే నగదు లేని ఏంటీఎం కు అంత్యక్రియలు నిర్వహించి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రసాదం( స్వీట్స్) పంపించినట్టు చెప్పారు.
మరోవైపు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే, కానీ సాధారణ ప్రజలు, రైతులు బాధల మాట ఏమిటి అని స్థానిక నేత సయ్యద్ మెహబూబ్ వ్యాఖ్యానించారు. గత 30 రోజులగా రోజువారీ అవసరాలకోసం ప్రజలు డబ్బు కోసం క్యూలు కడుతూనే వున్నారన్నారు. సుమారు 90 శాతం ఏటీఎంలు పనిచేయడంలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఎపుడని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది జెడి (యు) కర్ణాటక ప్రతిపాదన అన్నారాయన.
అంత్యక్రియలు: మోదీ, జైట్లీకి స్వీట్స్
Published Sat, Dec 10 2016 11:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement