హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమూహ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హైదరాబాద్ సమీపంలో ఆదిభట్ల వద్ద ఏర్పాటు చేసిన సమూహ ఏరోస్పేస్ పార్కుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో ప్రపంచంతో పోటీపడి సత్తా చాటిన కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని ఆయన కితాబిచ్చారు. ఆదిభట్ల ప్రాంతాన్ని స్పేస్ సిటీగా నామకరణం చేస్తామన్నారు. వచ్చే 15 ఏళ్లలో భారత్లో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో 500 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారావకాశాలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు అవినాష్ చందర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అవకాశాలు 10-15 రెట్లు ఉంటాయని చెప్పారు. ఆఫ్సెట్ పాలసీ కింద భారతీయ కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయని వివరించారు. కాగా, పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మందికి ఉపాధి లభించనుంది.
బలంగా ఎదిగాం..
ఐదేళ్లలో సమూహ ఇంజనీరింగ్ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుందని ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జయేష్ రంజన్ తెలిపారు. చిన్న కంపెనీలు క ్లస్టర్గా ఏర్పాటయ్యేదుకు ఏపీఐఐసీ సాయపడుతుందని అన్నారు. టర్నోవర్ తక్కువగా ఉండడంతో పూర్తి అవకాశాలు దక్కడం లేదని సమూహ ఇంజనీరింగ్ చైర్మన్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ చైర్మన్ రవీంద్రా రెడ్డి అన్నారు. ప్రస్తుతం 27 కంపెనీలతో బలమైన కంపెనీగా సమూహ ఏర్పడిందని తెలిపారు. మరింతమంది సభ్యులతో మరో పార్కును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరో 100 కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇందుకు అదనంగా స్థలం కేటాయించాలని ఏపీఐఐసీని కోరినట్టు సమూహ ఈడీ శ్రీరామ్ ఎంఎం వెల్లడించారు. సమూహ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ మాట్లాడుతూ పీఎస్ఎల్వీ-సీ25 తయారీలో సమూహ కంపెనీల పాత్ర కూడా ఉందన్నారు.
గీతలు గీసుకుంటున్నాం..
సమైక్యవాదాన్ని వినిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్ని వేదికలనూ సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఉంది. ‘ఒకపక్క మన రాష్ట్రం నుంచి (నెల్లూరు జిల్లా శ్రీహరికోట) రాకెట్లు నింగికి దూసుకెళ్తున్నాయి. మరోపక్క మనం గీతలు గీసుకుంటున్నాం’ అని అన్నారు. పరోక్షంగా రాష్ట్ర విభజన వద్దని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆదిభట్ల ఇక స్పేస్ సిటీ!
Published Tue, Nov 5 2013 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement