హైదరాబాద్లో ఏర్పా టు చేస్తున్న ఐఐటీ(ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కోసం జపాన్ రూ. 1,336 కోట్ల రుణాన్ని అందజేయనుంది.
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఏర్పా టు చేస్తున్న ఐఐటీ(ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కోసం జపాన్ రూ. 1,336 కోట్ల రుణాన్ని అందజేయనుంది. భవనాల నిర్మాణం, పరిశోధన సామగ్రికి జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) ఈ రుణాన్ని ఇస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం జేఐసీఏ ప్రతినిధి షినియా ఎజిమా, కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజేష్ ఖుల్లర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. 2018 లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.