ఎలెన్ జాన్సన్‌కు నేడు ఇందిర శాంతి బహుమతి | Indira Gandhi Prize for Nobel laureate Ellen Johnson Sirleaf | Sakshi
Sakshi News home page

ఎలెన్ జాన్సన్‌కు నేడు ఇందిర శాంతి బహుమతి

Sep 12 2013 3:57 AM | Updated on Sep 1 2017 10:37 PM

లైబీరియా అధ్యక్షురాలు, నోబెల్ బహుమతి విజేత ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ గురువారం ప్రతిష్టాత్మక ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి’ని అందుకోనున్నారు.

న్యూఢిల్లీ: లైబీరియా అధ్యక్షురాలు, నోబెల్ బహుమతి విజేత ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ గురువారం ప్రతిష్టాత్మక ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి’ని అందుకోనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జాన్సన్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహుమతి ప్రదానం చేయనున్నారు. ఆఫ్రికాలో ఓ దేశానికి అధ్యక్షురాలిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి మహిళగా 74 ఏళ్ల ఎలెన్ చరిత్ర సృష్టించారు. ఎలెన్ ప్రస్తుతం భారత పర్యటనలోనే ఉన్నారు. ఆర్థికవేత్త కూడా అయిన ఆమె మహిళల హక్కుల కోసం, శాంతి కోసం విశేష కృషిచేశారు. 2011లో లేమా జిబోవీ, తవకెల్ కర్మాన్‌లతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement