దేశంలోనే తొలి ఏసీ డెము రైలు ప్రారంభం | India's first air-conditioned DEMU train launched in Kochi | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి ఏసీ డెము రైలు ప్రారంభం

Jun 22 2015 4:24 AM | Updated on Sep 3 2017 4:08 AM

దేశంలోనే తొలి ఏసీ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్(డీఈఎంయు) రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదివారం కేరళలో..

కొచ్చి: దేశంలోనే తొలి ఏసీ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్(డీఈఎంయు) రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదివారం కేరళలో ప్రారంభించారు. అంగమలై-ఎర్నాకుళం-త్రిపునితుర-పిరవోం మార్గంలో నడిచే ఈ రైలులో ఏసీ సౌకర్యం కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు సౌకర్యం ద్వారా పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రైళ్లను మరిన్నింటిని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఏసీ కోచ్‌లో 75 మంది కూర్చునే విధంగా సీట్లు అమర్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement